మార్స్ ఆర్బిటర్ నుండి మొదటి ఫోటో

మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు తలపెట్టిన అంగారక ప్రయాణంలో మొట్టమొదటి చిగురు బీజాన్ని చీల్చుకుని తొంగి చూసింది. ప్రస్తుతం భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ఉపగ్రహం భూగ్రహాన్ని ఫోటో తీసి పంపింది. భారత దేశం, దాని చుట్టుపక్కల ఉన్న భూ, సముద్ర భాగాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఉపగ్రహాలు భూమి ఫోటోలు తీసి పంపడం కొత్తేమీ కాదు. ఆ పనిని ఇస్రో ఇప్పటికే ప్రయోగించిన అనేక ఉపగ్రహాలు రోజూ చేసే పనే. అయితే…

ఊహకు అందని ఆర్కిటెక్చర్ అద్భుతాలివి! -ఫోటోలు

ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో నివాసం ఉండిన ఆదిమ మానవుడి జీవన ప్రయాణం ఆ స్ధితిలో కొన్ని వందల వేల యేళ్ళు కొనసాగించాడని మానవ పరిణామ శాస్త్రం చెబుతుంది. అనేక మేటి శాస్త్రబద్ధ ఆవిష్కరణల ద్వారా సుసాధ్యం అయిన ఈనాటి మహా నిర్మాణాలతో పోలిస్తే ఆదిమ మానవుడి జీవనం ఎలా సాగిందా అన్న అనుమానం రాకమానదు. శాస్త్రం అభివృద్ధి చెందుతూ, మరింత అభివృద్ధి కోసం అనేక విభాగాలుగా చీలిపోయాక ఇక మానవుడి మేధస్సు యొక్క సృజనాత్మకతకు…

క్లుప్తంగా… 21.11.2013

అమెరికా-ఆఫ్ఘన్ ఒప్పందం కుదిరింది ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ను దారికి తెచ్చుకోడంలో అమెరికా సఫలం అయింది. 2024 వరకు అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ఒక అంగీకారం కుదిరిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించాడు. గత 24 గంటల్లో జాన్ కెర్రీ రెండు సార్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ కు ఫోన్ చేశారని, కర్జాయ్ అనుమానాలను కెర్రీ నివృత్తి చేసిన ఫలితంగా ఒప్పందం సాధ్యమయిందని తెలుస్తోంది. అమెరికా…

పోల్: భారత రత్నకు సచిన్ అర్హుడేనా?

సచిన్ టెండూల్కర్ ఒక క్రీడాకారుడు. క్రికెట్ అంటే ఆయనకు ప్రాణం. 40 యేళ్ళ జీవితంలో 30 యేళ్ళ నుండి క్రికెట్ ఆడుతున్న వ్యక్తి. పిన్న వయసులోనే జాతీయ జట్టులో స్ధానం సంపాదించి అద్భుతమైన టెక్నిక్ తో చేయి తిరిగిన బౌలర్లకు కూడా కొరకరాని కొయ్యగా మారిన బ్యాట్స్ మేన్. క్రికెట్ జీనియస్ గా భావించే డాన్ బ్రాడ్ మన్ చేత కూడా ప్రశంసలు అందుకున్న వ్యక్తి. అన్నింటికన్నా మిన్నగా అనేక క్రికెట్ రికార్డులు ఆయన సొంతం. అత్యధిక…

రాజకీయ నాయకులు ఇడియట్స్ -కత్తిరింపు

భారత రత్న అవార్డు పొందిన రసాయన శాస్త్రవేత్త ‘చింతామణి నాగేశ రామచంద్ర రావు (సి.ఎన్.ఆర్.రావు) తనకు అవార్డు ఇచ్చారన్న మొహమాటం కూడా లేకుండా రాజకీయనాయకుల గుణగణాలను ఒక్క మాటతో కడిగిపారేశారు. దేశంలో సైన్స్ అభివృద్ధికి ప్రభుత్వాలు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్న చేదు నిజాన్ని సి.ఎన్.ఆర్ రావు విప్పి చెప్పారు. అసలు విద్యారంగం అంటేనే రాజకీయ నాయకులకు శ్రద్ధ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాన్ని కూడా సి.ఎన్.ఆర్ రావు వదల్లేదు. కాస్త డబ్బులు ఎక్కువ…

అందరికీ సచిన్ జ్వరం, భారత రత్నకు కూడా

సచిన్ క్రికెట్ క్రీడా జీవితం నేటితో ముగిసింది. 40 యేళ్ళ సచిన్ టెండూల్కర్ నెలరోజులు ముందుగానే తన రిటైర్మెంట్ ప్రకటించడంతో అప్పటినుండీ దేశంలో క్రికెట్ జ్వరం అవధులు దాటి పెరిగిపోయింది. సచిన్ రిటైర్కెంట్ కోసమే అన్నట్లుగా వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ను బి.సి.సి.ఐ ఏర్పాటు చేయడంతో అనేకమంది కలలు గనే ఒక అందమైన క్రీడా జీవితానికి అందమైన ముగింపు పలికినట్లయింది. రెండు మ్యాచ్ లు ఇన్నింగ్స్ తేడాతో గెలవడం ద్వారా జట్టు సహచరులు సచిన్…

శనిగ్రహ ఫోటోలు: 2.2 మి కి.మీ దూరం నుండి…

ఒక అద్భుతమైన అంతరిక్ష దృశ్యాన్ని నాసా (National Aeronautic Space Agency) మన ముందు ఉంచింది. అంతరిక్షంలో శనిగ్రహానికి దాదాపు 2.2 మిలియన్ల కి.మీ దూరం నుండి తీసిన శనిగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఇటాలియన్ స్పేస్ ఏజన్సీలు సంయుక్తంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కాసిని ఉపగ్రహంలో అమర్చిన శక్తివంతమైన కెమెరా ఈ దృశ్యాలను బంధించింది. కాసిని-హుజీన్స్ అంతరిక్ష ఓడ 1997 నుండి అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. 2004 నుండి శనిగ్రహం చుట్టూ…

అత్యాచారాలు: సి.బి.ఐ బాస్ కువ్యాఖ్యలు, ఆనక సారీ

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే ఇంకేదో అన్నాట్ట వెనకటికొకరు. క్రికెట్ బెట్టింగ్ అరికట్టడం గురించి చర్చలో పాల్గొనమని పిలిస్తే మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించి అసంబద్ధంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు సి.బి.ఐ బాస్ రంజిత్ సిన్హా! లైంగిక అత్యాచారాలను ఆయన జూదంతో పోల్చారు. జూదం అరికట్టలేని పరిస్ధితుల్లో బెట్టింగ్ లాంటి జూదాలను చట్టబద్ధం చేయడమే మంచిదని సలహా ఇచ్చేశారు. ‘అరికట్టలేని బెట్టింగ్ లను చట్టబద్ధం చేయాలన్న సలహాలాగే అత్యాచారాన్ని నివారించలేకపోతే ఎంజాయ్ చేయడమే బెటర్ అని…

ఈ ‘క్రికెట్ పిచ్చోడి’కి రిటైర్మెంట్ లేదు

ఇతని పేరు చాలామందికి తెలియదు గానీ, ఇతన్ని చూసినవారు మాత్రం బహుశా కోట్లమందే ఉండవచ్చు. బీహార్ నివాసి అయిన ఇతని పేరు సుధీర్ కుమార్ గౌతం. ఇతని జీవితం అంతా క్రికెటర్లు, క్రికెట్ స్టేడియంల చుట్టూ గడిచిపోతోంది. భారత క్రికెట్ దేవుడిగా కొలుపులు అందుకుంటున్న సచిన్ టెండూల్కర్ మరి కొద్ది రోజుల్లో రిటైర్ అవబోతున్నా, తన క్రికెట్ పిచ్చికి మాత్రం రిటైర్మెంట్ లేదని గౌతం స్పష్టం చేస్తున్నాడు. వంటినిండా జాతీయ పతాకాన్ని, సచిన్ పేరును పెయింటింగ్ వేసుకుని…

లియు బోలిన్: మాయం (అయ్యే) కళలో నిష్ణాతుడు -ఫోటోలు

కళలు 64 రకాలని తెలుగు పెద్దలు చెబుతారు గానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం తెరిస్తే కళల సంఖ్యకు అసలు పరిమితంటూ ఉండదని తెలిసొస్తుంది. మాయం అయ్యే కళ గిన్నిస్ బుక్ లోకి ఎక్కిందో లేదో తెలియదు గానీ, లియు బోలిన్ అనే చైనా కళాకారుడు ఈ కళలో ఆరితేరాడు. మనం రోజూ చూసే దృశ్యాలలో కలిసిపోయి తానక్కడ లేనట్లు భ్రమ కల్పించడం లియు ప్రదర్శించే కళ. అందుకోసం ఆయన ఎంచుకున్న మార్గం తన శరీరాన్నే…

ఎన్నికల హామీ: అంగారకుడిపై ఉచిత భూములు -కార్టూన్

– “నాకనుమానం లేదు. ఇక అంగారకుడిపైన నీరు, ఉచిత భూమి ఇస్తామని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాగ్దానాలు కురిపిస్తారు.” *         *          * భారత రాజకీయ పార్టీల హామీల వరదకు ఆనకట్ట వేయగల మొనగాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరని ఇట్టే చెప్పొచ్చు. ప్రజల్ని బిచ్చగాళ్లను చేసి పగ్గం గడుపుకోని పార్లమెంటరీ రాజకీయ పార్టీ కూడా ఇండియాలో కనపడదు. ఇందిరాగాంధి కాలంలో ఎస్.సి, ఎస్.టి ల గుడిసెలకు ఉచితంగా బొంగులు, తాటాకులు ఇవ్వడం…

అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతం

భారత దేశ మొట్టమొదటి అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతంగా పూర్తయింది. శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి – సి25 ఉపగ్రహ వాహక నౌక, అంగారకుడి చుట్టూ పరిభ్రమించడానికి ఉద్దేశించిన ఉపగ్రహాన్ని మొదటి దశలో భూమి చుట్టూ తిరిగే కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ తమ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రధాని, రాష్ట్రపతిలు కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం భూమి చుట్టూ…

న్యూయార్క్ లో బ్యాంక్సీ వీధి చిత్రాల జాతర

చాలా కాలంగా బ్యాంక్సీ వీధి చిత్రాల సందడి కళా ప్రియులకు కరువైపోయింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ II సింహాసనం అధిష్టించి 60 యేళ్ళు పూర్తయిన సందర్భంగా బాల కార్మికుడు బ్రిటిష్ పతాకాన్ని మిషన్ పై కుడుతున్న బొమ్మను గీసిన తర్వాత మళ్ళీ బ్యాంక్సీ జాడ లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు “Better Out Than In” శీర్షికతో అక్టోబర్ నెల అంతా న్యూయార్క్ నగరంలోని పలు చోట్ల వీధి చిత్రాలు గీసి పలువురు కళా ప్రియులకు విస్మయానందాలను పంచి…

బంగారం తవ్వకాలు: స్వామీజీ కల కలే -కార్టూన్

ఉత్తర ప్రదేశ్ స్వామీజీ శోభన్ సర్కార్ వారి 1000 టన్నుల బంగారం కల చివరికి ‘కలే’ అని తేలిపోయింది. ఉన్నావ్ తవ్వకాల్లో మట్టి తప్ప మరొకటి లేదని చెబుతూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ) వారు తవ్వకాలు నిలిపివేసి వెళ్ళిపోయారు. కొన్ని చారిత్రక పదార్ధాలు బైటపడినప్పటికి అవన్నీ 18 వ శతాబ్దం నాటివేననీ, అంతకు ముందువి ఏమీ లేవనీ ఎ.ఎస్.ఐ తేల్చేసింది. ఆ విధంగా ఎ.ఎస్.ఐ తన ఒకటిన్నర శతాబ్దాల ఘన చరిత్రను ఒక స్వామీజీ…

కేరళ సినీ నటి పట్ల కాంగ్రెస్ ఎం.పి అసభ్య వర్తన

ఆయన పేరు ఎన్ పీతాంబర కురుప్. వయసు 73 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్ద మనిషి. మళయాళంలో కురుప్ అంటే అర్ధం ఏమిటో తెలియదు గానీ తెలుగు అర్ధానికి తగినట్లుగా వ్యవహరించి వార్తలకెక్కాడు. అవడానికి పార్లమెంటు సభ్యుడే అయినా తాను నైతికంగా కురూపినే అని ఆయన నిరూపించుకున్నాడు. సినీ నటి శ్వేతా మీనన్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అసభ్య కూతలు కూసి భారత పార్లమెంటు సభ్యులు కొందరు ఏ…