ఎఎపి జనతా దర్బార్

ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు తన మొట్ట మొదటి జనతా దర్బార్ నిర్వహించింది. ఢిల్లీ సెక్రటేరియట్ ఎదురుగా రోడ్డుపైనే కూర్చుని దర్బార్ నిర్వహించగా జనం పోటెత్తారు. జనం భారీగా తరలి రావడంతో వారిని కట్టడి చేయడం పోలీసుల వల్ల కాలేదు. సమస్యలతో కూడిన విజ్ఞాపనలు ఇవ్వడానికి ప్రజలు తోసుకోవడంతో ముఖ్యమంత్రి అరవింద్ ఒక దశలో వేదికను వదిలి వేళ్లిపోవాల్సి వచ్చింది. తగిన ఏర్పాట్లు చేశామని చెప్పినప్పటికీ ఆ ఏర్పాట్లు కూడా…

లైంగిక వేధింపులు: జస్టిస్ గంగూలీ రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు నిజం అయ్యాయి. రాజీనామాపై తాను ఇంకా నిర్ణయించుకోలేదని ఈ రోజు ఉదయం పత్రికలకు చెప్పిన జస్టిస్ గంగూలీ సాయంత్రానికి రాజీనామా ఇచ్చేశారు. తనకు మద్దతుగా సుప్రీం కోర్టులో దాఖలయిన ‘ప్రజా ప్రయోజనా వ్యాజ్యం’తో తనకు సంబంధం లేదని కూడా గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం…

ఉత్తర కొరియా: కొన్ని వాస్తవాలు

ఉత్తర కొరియా గురించి విషం చిమ్మని పశ్చిమ పత్రిక అంటూ కనపడదు. అక్కడికి విదేశీ విలేఖరులను రానివ్వరని, ఉక్కు తెరల మధ్య ప్రజలు అష్టకష్టాలు పడతారని, రోడ్డు మీద అసలు జనమే కనిపించరనీ… ఇలా రాస్తుంటాయి. ఈ ప్రచారం నిజం కాదని చెప్పడానికి ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రత్యేకంగా విలేఖరులను ఆహ్వానించి టూర్లకు తిప్పుతుంది. ఈ టూర్లకు వెళ్ళినవాళ్లు ఫోటోలు తీసుకుని కూడా తమ కోసం ప్రత్యేకంగా జనాన్ని ఏర్పాటు చేశారని పశ్చిమ విలేఖరులు రాయడం కద్దు.…

దేవయాని: ప్రాసిక్యూషన్ కే అమెరికా నిర్ణయం

దేవయాని కేసు విషయంలో తెరవెనుక చర్చలు విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇంటి పని మనిషికి వేతనం చెల్లింపులో మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన అమెరికా, దేవయాని ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకుందని తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. అరెస్టు అయ్యే సమయానికి దేవయాని ఐరాస తాత్కాలిక సలహాదారుగా పూర్తి స్ధాయి రాయబార రక్షణ కలిగి ఉన్నారని భారత ఐ.ఎఫ్.ఎస్ అధికారులు కనుగొన్నప్పటికీ అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అసలు కేసు పెట్టడానికి తగిన పునాది లేదని దేవయాని…

ఉచిత నీరు వాగ్దానం నెరవేర్చిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల వాగ్దానాల్లో ఒక ముఖ్యమైనదాన్ని నెరవేర్చారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా రోజుకు 700 లీటర్ల త్రాగు నీరు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేరుస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఢిల్లీ జల్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మీటర్ ఉన్న ప్రతి ఇంటికీ ఇంటి వాడకం నిమిత్తం 667 లీటర్ల నీరు ఉచితంగా అందిస్తారు. ఘజియాబాద్ లోని కౌసాంబి లోని తన…

అరవింద్ వాహనం నేటి వ్యవస్ధలో ఇమిడేనా? -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి. అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి…

మోడి రాతలపై బాధితుల ఆగ్రహం

జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు. గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం…

కోర్టుల పాత్రలో మీడియా!

(ఈ ఆర్టికల్ రాసి మూడు వారాలయింది. దిన పత్రిక కోసం ఇక్కడ ప్రచురించకుండా ఆపాను. ఇక ఆ సందర్భం దాటిపోయింది. అందువలన ప్రచురిస్తున్నాను.) కేసు ప్రస్తుతం ఫలానా కోర్టులో ఉంది అని చెప్పుకునే బదులు ‘మీడియా కోర్టులో ఉంది’ అని చెప్పుకునే రోజుల్లో ఉన్నామని అనేకమంది ఈ మధ్య తరచుగా వాపోతున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించిన కేసుల్లో న్యాయమూర్తులు నిస్పక్షపాతంగా తీర్పు చెప్పలేని పరిస్ధితి వస్తోందన్నది విమర్శకుల అభిప్రాయం. న్యాయమూర్తి మీడియా ప్రభావం నుండి ఎంత దూరంగా ఉన్నా,…

కరెంటు వైరూ, చిరుగు బేనరూ … కాదేదీ గీతకనర్హం

అగ్గి పుల్లా కుక్క పిల్లా సబ్బు బిళ్ళ కాదేదీ కవితకనర్హం కవితామయమేనోయ్ అన్నీ…  అన్నారు మహాకవి శ్రీ శ్రీ శ్రీ శ్రీ అన్నది కవిత్వం గురించి. కవిత్వం అల్లడానికి అందమైన స్త్రీ మూర్తి మాత్రమే అర్హురాలని భావిస్తున్న రోజుల్లో, రచనా స్ఫూర్తి కోసం కావ్య ప్రబంధాలను బట్టీయం వేయాల్సిందేనని భావించే రోజుల్లో, మనో భావాలను అక్షరీకరించడానికి ఛందోబద్ధ సంకెళ్ళను విధించిన యుగంలో శ్రీ శ్రీ రాసిన ఈ కవిత ఒక పెద్ద సంచలనం! జన తత్వం వంటబట్టాలే…

ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

అవినీతి ఫైళ్ళు తగలబెడుతున్న ఢిల్లీ అధికారులు!

అరవింద్ కేజ్రివాల్ ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. ఆయనింకా అధికార పీఠంపై కూర్చోనేలేదు. అప్పుడే ఢిల్లీ బ్యూరోక్రాట్ అధికారులకు చెమటలు కారిపోతున్నట్లున్నాయి. అవినీతి జరిగిన దాఖలాలను రుజువు చేసే ఫైళ్లను వారు తగలబెడుతున్నారని ఇండియా టుడే/ఆజ్ తక్ పత్రికా సంస్ధలు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బైటపడింది. మరి కొందరు అధికారులు బదిలీ చేయించుకోడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి రోజుకు 700 లీటర్ల మంచి నీరు ఉచితంగా సరఫరా చేస్తామన్న కేజ్రీవాల్…

మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.…

రెండు వాగ్దానాలు నెరవేర్చిన అరవింద్?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తాను ఇచ్చిన వాగ్దానాల్లో రెండింటిని అరవింద్ కేజ్రివాల్ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. కోట్లాది కళ్ల పహారా మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అరవింద్ తనకు వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపేశారు. తద్వారా వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలిస్తామన్న వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నాంది పలికారు. అలాగే ప్రభుత్వ భవనంలోకి తన నివాసం మార్చుకోవడానికి కూడా ఆయన తిరస్కరించారని పత్రికలు తెలిపాయి. తాను గానీ, తన ఎమ్మేల్యేలు…

ఎడారికి కూడా ఇంత అందమా? -ఫోటోలు

ఎడారి అంటే మనకి చులకన. అక్కడ ఏమీ పండదనీ, ఇసుక తప్ప మరేమీ కనపడదనీ, అక్కడ మనుషులు బ్రతకడం దుర్లభం అనీను. ఇవన్నీ కొంతవరకు నిజమే అయినా ఎడారి దేశాల్లోనూ నాగరికతలు విలసిల్లిన వాస్తవాన్ని చరిత్ర రికార్డు చేసింది. నీరు దొరకని ఎడారుల్లో ప్రయాణించడానికి ప్రకృతి మనకి ప్రసాదించిన వరం ‘ఎడారి ఓడ.’ ఒయాసిస్సులు ఎడారి దేశాలకు ఆభరణాలై వర్ధిల్లగా నాగరికతలు మాత్రం ఎందుకు వర్ధిల్లవు? ఈ ఫోటోలు ఈజిప్టు ఎడారి సహారాకు చెందినవి. పశ్చిమ ఈజిప్టులో…

జనం, స్ధలం, ప్రకృతి -ఫోటో పోటీలు

కళాకారుడికి ముఖ్యంగా చిత్రకారుడికి తాను చూసే దృశ్యాల పట్ల వివక్ష చూపకూడదని ఒక సూత్రం. అనగా గొప్ప దృశ్యం, పనికిమాలిన దృశ్యం అంటూ అతని దృష్టిలో ఏమీ ఉండకూడదని అర్ధం. ఆయన చేయాల్సిందల్లా ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించడమే. బహుశా ఫోటోగ్రాఫర్ కి కూడా ఈ సూత్రం వర్తిస్తుందేమో. కాకపోతే ఫోటోగ్రాఫర్ కి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. ఆ పరిజ్ఞానం సహాయంతో ఫోటోగ్రాఫర్ సాధారణ కంటికి పెద్దగా ఆకర్షణీయంగా కనపడని దృశ్యాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరించగల శక్తిని…