క్రీమీ లేయర్: కొండ నాలుకకు మందేస్తే…

సుప్రీం కోర్టు నియమించిన 7గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 4గురు సభ్యులు తమకు అప్పగించని పనిని నిర్వర్తించారు. ఒకరైతే ఏకంగా ఏ భగవద్గీత అయితే భారత ప్రజలను నాలుగు వర్ణాలుగా విభజించి పంచముల గురించి అసలు మాట్లాడలేదో అదే భగవద్గీతను తన తీర్పు సందర్భంగా ఉటంకించటానికి వెనకాడ లేదు. అసలు భగవద్గీత శ్లోకాలను తమ తీర్పులలో ఈ మధ్య తరచుగా తెస్తున్న న్యాయమూర్తులకు మన దేశానికి ఒక రాజ్యాంగం, శిక్షా స్మృతి ఉన్నాయనీ, కోర్టులు వాటిని మాత్రమే…

ఎస్.సి వర్గీకరణకు సుప్రీం కోర్టు ఆమోదం

ఆగస్టు 1 తేదీన భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టు, ఎస్.సి కులాల జాబితాను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయవచ్చని తీర్పు ప్రకటించింది. గతంలో ఇ.వి.చిన్నయ్య తీర్పులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును 7 గురు జడ్జిలతో కూడిన సుప్రీం కోర్టు బెంచి తప్పు పట్టింది. వివిధ కులాల అబివృద్ధి మరియు సామాజిక స్థాయిల గురించి వివరాలను క్రమ పద్ధతిలో సేకరించి, అలా సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా మాత్రమే ఎస్.సి…

కులం వికృత రూపాన్ని చూడండి!

సో-కాల్డ్ అగ్ర కులాల్లో పుట్టిన వాళ్ళకి దళితులు కుల అణచివేత గురించి మాట్లాడటం అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు మీకేం తక్కువయిందట అని ప్రశ్నిస్తుంటారు. ‘నువ్వు కడ జాతి వాడివి’ అని చెప్పకుండానే చూపుల్తో చెప్పేసే చూపులని భరించడం ఎంత కష్టమో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు. చిన్న కులాల పట్ల వాళ్ళ తేలిక భావాల్ని పెద్ద విషయం కాదన్నట్లు తేలికగా తేల్చేస్తారు. మీరు ప్రభుత్వానికి దత్త పుత్రులు అంటూ ఒక వ్యంగ్యాన్ని మొఖం మీద విసిరి కొడతారు.…

కన్వర్ యాత్రలో మత ఘర్షణలకు ఏర్పాట్లు?

బి‌జే‌పి ప్రభుత్వాల మతతత్వ పూరిత ఆదేశాలు నానాటికి శృతి మించుతున్నాయి. ఏదో విధంగా ముస్లింలపై వ్యతిరేకతను సృష్టించి తగవులు పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారే ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు గుప్పించినప్పటికీ లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలం కాలేక పోయాడు. ఐనప్పటికీ బి‌జే‌పి నేతృత్వం లోని ఉత్తరాది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో తమ…

జ్ఞాన యోధుడు: సన్నాఫ్ జోగిని చిన్నూబాయి

—–రచన: డాక్టర్ కోయి కోటేశ్వరరావు జోగినికి పుట్టిన బిడ్డ అంటూ లోకం అతనిని అవమానించింది. తండ్రి ఎవరో తెలియని అనామకుడని సభ్య సమాజం తిరస్కరించింది. అంటరాని అభాగ్యుడని ఊరు ‘బాకున కుమ్మినట్లు’ బాధించింది. కుల భూతం విషం చిమ్మింది. పేదరికం వెక్కిరించింది. చుట్టుముట్టిన లెక్కలేని అవమానాలను ధిక్కరించి, కఠోర శ్రమతో అచంచల కార్యదీక్షతో ధీరోచితంగా అతను ముందడుగు వేశాడు. దారి కడ్డంగా పరుచుకున్న రాళ్ల గుట్టలను దాటుకుంటూ, ముళ్ళ తుప్పలను తొక్కుకుంటూ నెత్తుటి పాదాలతోనే నడక సాగించి…

శంకర నారాయణ డిక్షనరి కథ

కింద ప్రచురిస్తున్న పాఠ్యం నేను రాసింది కాదు. నాకు ఒక మిత్రుడు ఒకడు వాట్సప్ మెసేజ్ చేశాడు. చదవగానే మరింత మందికి పంచితే బాగుండు అనుకున్నాను. కానీ నాకు వాట్సప్ లో మెసేజ్ లు ఫార్వర్డ్ చెయ్యడం అలవాటు లేదు. మెసేజ్ లో ఉండే అంశం నిజమా కాదా అని తెలుసుకోకుండానే చాలా మంది మెసేజ్ లను కుప్పలు తెప్పలుగా ఫార్వర్డ్ చేస్తుంటారు. మరీ ఘోరం ఏమిటంటే అదే మెసేజ్ ని మరో ఇద్దరు ముగ్గురు అదే…

పశ్చిమ దేశాల పంచ ముఖ ముట్టడికి రష్యా జవాబు ఇచ్చేనా!?

మానవ జాతి నాగరికత మరియు అభివృద్ధి, పరస్పర సహకారం మరియు సౌభ్రాతృత్వం, సమస్త మానవుల ప్రజాస్వామ్యం-సమానత్వం ఇవి మానవ సమాజం సాధించిన మహోన్నత విలువలు. ఈ విలువలతో పోల్చితే అమెరికా, పశ్చిమ దేశాలు తాము ఎంత అనాగరిక పాశవిక దశలో ఉన్నామో స్పష్టంగా తమ నోటి తోనే ప్రకటించుకుంటున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వారికి ఆ అవకాశం ఇచ్చింది. రష్యాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని పాటిస్తున్న…

‘బ్లాగింగ్’ మరియు ‘హ్యూమన్ సివిలైజేషన్’!

బ్లాగింగ్ అన్నది అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఒక సాధనం. పత్రికలు, ఛానెళ్లు కొద్ది మంది వ్యక్తిగత, వృత్తిగత జర్నలిస్టులకి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో ఉద్యోగం సంపాదించి అభిప్రాయాలు అనేకమందితో పంచుకోవడం, చెప్పడం అందరికీ సాధ్యం కాదు. జర్నలిజంలో ప్రవేశం లేకుండానే, జర్నలిజం చదవకుండానే అనేకమంది వివిధ అంశాలను చర్చించగల సామర్ధ్యం కలిగి ఉంటారు. అలాంటివారికి తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి బ్లాగింగ్ మంచి సాధనం. బ్లాగింగ్ అయినా, మరే సామాజిక…

సల్లీ డీల్స్ కేసులో మొదటి అరెస్టు

బాధితులు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ కేసులో మొదటి అరెస్టు జరిగింది. ఈ అరెస్టును ఆదివారం ఢిల్లీ పోలీసులు చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం నుండి ‘ఓంకారేశ్వర్ ఠాకూర్’ ని అరెస్ట్ చేశామనీ, అతనే సల్లీ డీల్స్ ఆప్ సృష్టికర్త అనీ ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ముంబై పోలీసులు ‘బుల్లీ బాయ్’ కేసులో వరుసగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. జులై…

బుల్లి బాయ్: ఢిల్లీ పోలీసుల చేతుల్లో ప్రధాన కుట్రదారు

బుల్లి బాయ్ ఆప్ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారు ఎవరో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అస్సాంలో అతని జాడ కనుగొన్నామని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసు బృందం అస్సాం వెల్లిందని ఈ రోజు సాయంత్రం 3 లేదా 4 గంటల సమయానికి నిందితుడిని ఢిల్లీకి తెస్తారని ఢిల్లీ సైబర్ సెల్ డి‌సి‌పి కే‌పి‌ఎస్ మల్హోత్రా చెప్పారు (ఇండియన్ ఎక్స్^ప్రెస్, 06/01/2022). “ప్రధాన కుట్రదారుని మేము అరెస్ట్ చేశాము. అతనే వెబ్ సైట్ తయారీలో ప్రధాన ముద్దాయి.…

Bulli Bai ఆప్: నిర్ఘాంతపోయే నిజాలు!

ముంబై పోలీసుల పుణ్యమాని బుల్లి బాయ్ ఆప్ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సల్లీ డీల్స్ ఆప్ కేసులో గత జులై నెలలో బాధితులు, ఢిల్లీ వుమెన్ కమిషన్, విలేఖరులు వెంటపడి వేడుకున్నా నిందితులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది చొరవతో ముంబై పోలీసులు కేసును వేగంగా ఛేదిస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే కేసు వివరాలు కొన్నింటిని విలేఖరులకు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు…

హిందూత్వ ముఠాలు ఉపరాష్ట్రపతి మాటలు వినాలి!

ఇటీవల కాలంలో క్రైస్తవ మతం అనుసరిస్తున్న ప్రజలపై దాడులు పెరిగాయి. హిందూ మతం పేరు చెప్పుకుని వివిధ రౌడీ మూకలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. తమ దాడులకు న్యాయ బద్ధత, నైతిక సమర్థత కల్పించుకునేందుకు మత మార్పిడి జరుగుతోందని, దాన్ని అడ్డుకుంటున్నామని సాకు చెబుతున్నారు. కొన్నిసార్లయితే బహిరంగంగానే పర మత విద్వేషం చాటుకుంటున్నారు. మధ్య యుగాల నాటి శైవ, వైష్ణవ ఊచకోతలు, ఆసియా-ఐరోపాల్లోని క్రైస్తవ క్రూసేడ్లను తలపిస్తూ ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. కర్ణాటక బి‌జే‌పి ఎం‌పి…

మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…

హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…