వాళ్ళని ఓడించేందుకే ప్రియుడి శవాన్ని పెళ్లి చేసుకున్నాను -సాహస ప్రేమిక

తమిళనాడులో కుల పెద్దల ఆధిపత్యానికి లొంగిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు ఇలవరసన్ తో నివసించేది లేదని కోర్టు మెట్లపై నిలబడి ప్రకటించి భర్తను ఆత్మహత్య వైపుకి నెట్టిన యువతి పిరికితనాన్ని చూశాం. మిర్యాలగూడ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్ ని తన తండ్రే కిరాయి గూండాలతో కిరాతకంగా హత్య చేయించాక పుట్టింటితో తెగతెంపులు చేసుకుని భర్త కుటుంబంతోనే జీవితం గడుపుతున్న అమృత ప్రేమ ధైర్యాన్ని చూస్తున్నాం. మహారాష్ట్ర, నాందేడ్ లో తన ప్రేమికుడిని…

జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో మెరిట్ వాదన గల్లంతు!

NRI Quota Vs. Caste Quota సేవ్ మెరిట్, సేవ్ ఇండియా అంటూ అగ్ర కులాల విద్యార్ధులు 1980, 1990 దశాబ్దాల్లో ఉద్యమాలు నిర్వహించారు. రిజర్వేషన్ల వల్ల దేశం వెనుకబడి పోతున్నదంటూ ఆక్రోశించారు. అగ్ర కులాల విద్యార్ధులకు ఇంజనీరింగ్, మెడిసిన్ మొ.న కాలేజీలలో సీట్లు రాకపోయినా, లేక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపిక కాకపోయినా అందుకు ప్రధమ, ఏకైక కారణం రిజర్వేషన్లే కారణం అని వారు వాదించారు. వీళ్ళు కేవలం తమకు విద్య, ఉద్యోగాలలో సీట్లు రాకపోవడం ఒక్కటే…

ఉపాధి పొందే హక్కు ప్రతి ముస్లిం సొంతం -ఆర్ఎస్ఎస్ చీఫ్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ అయిన మోహన్ భగవత్ ముస్లింల పట్ల దయ తలిచారు. హిందువులు, ముస్లింలు అన్న తేడా కూడదనీ, వాళ్ళిద్దరూ ఇప్పటికే ఒక్కటయ్యారని తేల్చి చెప్పారు. భారత దేశంలో ఉపాధి పొందే హక్కు ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తికీ ఉన్నదని కూడా చాటారు. ఆర్ఎస్ఎస్ సంస్థ రెండవ గురువు, సిద్ధాంత కర్తగా పేర్కొనే గురు గోల్వాల్కర్ గారు ముస్లిం లకు అలాంటి స్వేచ్ఛ ఉందన్న సంగతి నిరాకరించారు. ముస్లిం మతావలంబకులు…

నిరంతర పరిశోధనల ఫలితమే ఆలోపతి వైద్యం!

– ——–డా. కాలేషా భాషా, జులై 15, 20253840 (ఇది వాట్సప్ ద్వారా నాకు అందిన మెసేజ్. సైంటిఫిక్ టెంపర్ ని పౌరుల్లో ప్రోత్సహించి పెంపొందించాలని మన రాజ్యాంగం ప్రభోదిస్తుంది. ఈ మెసేజ్ అందులో భాగమే అని భావిస్తూ… -విశేఖర్) “అల్లోపతి వైద్యంలో ప్రివెస్షన్ (వ్యాధినివారణ) లేదు..అంతా ఇన్వెస్టిగేషన్లూ, ట్రీట్మెంట్లే… యోగా అంటేనే శారీరక శ్రమ, అది కీళ్లజబ్బులూ, శ్వాస జబ్బులూ, బీపీ, షుగరూ, మానసిక జబ్బులూ, వెన్నుపూస జబ్బులూ …ఇంకా చాలా జబ్బులను నివారిస్తుంది…అల్లోపతికి చాలా…

చద్దన్నం తినటం వొంటికి ఆరోగ్యమేనా?

మన తండ్రులు తాతలు ఉదయాన్నే లేచి చద్దన్నం తినేవాళ్ళు. మన చేత కూడా తినిపించే వాళ్ళు. పట్టణాల్లో కాదు గానీ పల్లెల్లో వ్యవసాయ కూలీల కుటుంబాల్లో, పేద-మధ్య తరగతి రైతు కుటుంబాల్లో ఇది ఎక్కువగా జరిగేది. బహుశా పట్టణాల్లో ఫ్యాక్టరీల కార్మికుల కుటుంబాల్లో కూడా ఇది జరిగి ఉండవచ్చు. మా అమ్మ నాన్న ఇద్దరూ టీచర్స్. అయినా రాత్రి వండిన అన్నం మిగిలి పోతే ఉదయాన్నే మా చేత చద్దన్నం తినిపించే వాళ్ళు. ముఖ్యంగా వేసవి కాలం…

యోగాను సైన్స్ ఎందుకు అంగీకరించదు?

———-రచన: డాక్టర్ దేవరాజు మహారాజు (ప్రముఖ సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త) కొన్నేళ్ళ క్రితం వరకూ శారీరక శ్రమకు చాలా విలువ ఉండేది. పొలాలకు వెళ్ళడం, మోట కొట్టడం, నాగలి దున్నడం, పశువులు మేపడం వంటి ఏ పని తీసుకున్నా అది శారీరక శ్రమతో కూడుకున్నదే! గృహిణులు ఇంటి పనులే కాకుండా వ్యవసాయపు పనులు కూడా చేసేవారు. వడ్లు దంచడం, పిండి విసరడం వంటివన్నీ శారీరక శ్రమలే! అవన్నీ జీవన శైలిలో అంతర్భాగంగా ఉండేవి. ప్రత్యేకంగా వ్యాయామం చేయడం…

విమానం తోలటానికి నువ్వు పనికి రావు, వెళ్లి చెప్పులు కుట్టుకో ఫో!

చాతుర్వర్ణాల హైందవ నాగు భారత దేశ సామాజిక వ్యవస్థను తన విష కౌగిలిలో బంధించి ఉంచడం కొనసాగుతున్నదన్న సంగతిని దేశంలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న ఘటనలు చాచి కొట్టినట్లు చెబుతూనే ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన 35 యేళ్ల వ్యక్తి పైలట్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండిగో ఎయిర్ లైన్స్ లో పైలట్ డ్యూటీలో చేరేందుకు గురుగ్రాంలో ఉన్న కార్పొరేట్ ఆఫీసుకి వెళ్ళడం తోనే మరే ఇతర కొత్త పైలట్ కు ఎదురు కాని కష్టాలు మొదలయ్యాయి.…

డా|| ఎంఎంఎస్: హోమ్ శాఖ ఆంగ్ల పాండిత్యమా ఇది?

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో కేంద్ర ప్రజా సమాచార కార్యాలయం నుండి వెలువడిన లేఖ ఒకటి ట్విట్టర్ లేదా ఎక్స్ లో చక్కర్లు కొడుతోంది. సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ లో జాయింట్ సెక్రటరీ అయిన జి.పార్ధ సారధి సంతకంతో వెలువడిన ఈ లేఖలో ఆంగ్ల భాషకు సంబంధించి దొర్లిన తప్పులు భారత కేంద్ర మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న ఉన్నతశ్రేణి అధికారుల భాషా పరిజ్ఞానంపై అనుమానాలు కలుగ జేస్తున్నాయి. ఈ లేఖ, ఎవరైనా ఆర్.టి.ఐ దరఖాస్తు…

ఓ అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం!

ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు బాబాలు సైన్స్ బోధిస్తారు ఇతిహాసకులు చరిత్రను రాస్తారు సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెబుతారు నేరగాళ్ళు విలువలను బోధిస్తారు రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు – పై పాఠ్యం వాట్సప్ మెసేజ్ గా నా మిత్రుడొకరు పంపారు. పాఠ్యాన్ని ప్రముఖ…

లడ్డు వివాదం: సి.బి.ఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్

తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీం కోర్టు స్వతంత్ర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేత దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. లడ్డు వివాదం పైన ఎలాంటి కమిటీ వేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకొమ్మని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గత హియరింగ్ సందర్భంగా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం, కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 4 తేదీన (ఈ రోజు) ధర్మాసనం తిరిగి విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం…

లడ్డు: భక్తుల మనోభావాలతో ప్రభుత్వమే ఆడుకుంది -సుప్రీం కోర్టు

తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిన వివాదం సుప్రీం కోర్టును చేరింది. తన ముందుకు వచ్చిన పత్రాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, ప్రాధమిక ఆధారాల ప్రకారం లడ్డులో కల్తీ జరిగిందని చెప్పటం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రపంచ వ్యాపితంగా ఉన్న భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని స్పష్టం చేసింది. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రికి ఇది తగదు అని గడ్డి పెట్టింది. అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు…

సనాతన ధర్మం అంటే?

అప్పుడప్పుడూ వాట్సప్ లో అర్ధవంతమైన మెసేజ్ లు వస్తుంటాయి. ఎవరు రాశారో తెలియదు గానీ కింది పాఠ్యం కూడా నాకు వాట్సప్ లో మేసేజ్ గా వచ్చింది. క్రింద కవిత రూపంలో ఉన్న భాగం లేదా ప్రశ్న జవాబు రూపంలో ఉన్న భాగం వరకు మెసేజ్ గా వచ్చింది. సనాతన ధర్మం చాలా గొప్పదని చెబుతూ గత కొన్నేళ్లుగా మధ్య యుగాల నాటి అసమాన, అమానవీయ, మహిళా వ్యతిరేక, కులాల కాలకూట విషంతో నిండిన, సమాజాన్ని పునరిద్ధరించాలని…

లడ్డు గొడవ జగన్ అరెస్టు కోసమా?

తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపిన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. ‘గాలివానగా మారిపోయింది’ అని కూడా అనవచ్చునేమో? ఒక సాధారణ తినుబండారానికి దైవత్వం ఆపాదించి భగవంతుడు స్వయంగా ఆశీర్వదించి ప్రసాదించిన ప్రసాదంగా మార్చివేశాక, ఆ తినుబండారం కేంద్రంగా ఇక ఎన్ని రాజకీయాలు చేయవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. సెప్టెంబర్ 18 తేదీన అధికారానికి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా…

ఆడవారికి రక్షణ లేని కర్మభూమి!

ఒక్క ఆగస్టు 17, 18 తేదీలలో మాత్రమే ఎన్.డి.టి.వి అనే ఒక వార్తా పత్రిక దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆడవాళ్లపై జరిగిన ఆరు అత్యాచారాల గురించి రిపోర్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కాంగ్రెస్ పరిపాలిస్తుంటే మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను బిజెపి పరిపాలిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ప్రభుత్వ వైఫల్యం గురించి బిజెపి నేతలు విమర్శిస్తున్నారు, ఆడ పిల్లల రక్షణ గురించి ఆందోళన ప్రకటిస్తున్నారు. బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్…

నేను ఛండాలుడ్ని ఎట్లా అయ్యాను?

ఈ వీడియో నాకు వాట్సప్ మేసెజ్ గా వచ్చింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యం అని వీడియో చివర తనే చెప్పారు. ఆయన తాను రాసిన కవితను ఈ వీడియోలో చదివి వినిపించారు. కవిత అద్భుతంగా ఉన్నది. సహజంగానే కవిత నచ్చని వారు ఉండవచ్చు. వారికి నా వైపు నుండి ఒక విజ్ఞప్తి ఏమిటంటే కవిత ఎందుకు నచ్చలేదో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (ఆఫ్ కోర్స్, కామెంట్ ద్వారా నన్ను కూడా ప్రశ్నించవచ్చు.) సత్యం గారు…