పెట్టుబడుల క్లియరెన్స్ ప్రధాని మోడి చేతుల్లోకి

‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ద్వారా భారత దేశంలోకి విరివిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కలలు గంటున్న ప్రధాన మంత్రి మోడి ఆ వైపుగా అడుగులు వేగంగా వేస్తున్నారు. మన్మోహన్ హయాంలో యు.పి.ఏ 2 పాలన చివరి రోజుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ-స్వదేశీ ప్రైవేటు పెట్టుబడుల క్లియరెన్స్ కు ఏర్పాటు చేసిన ‘ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్’ (పి.ఎం.జి) ను ప్రధాని మోడి తన చేతుల్లోకి తీసుకున్నారని పేరు చెప్పని అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా…

రోదసీలోకి భారతీయుడు: మార్క్ 3 ద్వారా ముందడుగు

రోదసీ ప్రపంచంలోకి భారతీయుడు ప్రవేశించే దూరం దగ్గరలోనే ఉన్నదని నేడు ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి – మార్క్ III ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా రుజువయింది. రాకెట్ ద్వారా మనుషులు కూర్చుని ఉండే మాడ్యూల్ ను రోదసీలోకి ప్రయోగించిన అనంతరం సదరు మాడ్యూల్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే ప్రయోగాన్ని LVM3/CARE ప్రయోగం ద్వారా భారతీయ శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించి చూశారు. మాడ్యూల్ సురక్షితంగా భూవాతావరణంలోకి ప్రవేశించడమే కాకుండా అనుకున్న చోటనే బంగాళాఖాతంలో దిగడంతో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు…

విదేశాల్లో నల్లడబ్బు: మూడో స్ధానంలో ఇండియా

భారతీయుల నల్ల డబ్బు తమ వద్ద లేదని స్విట్జర్లాండ్, తదితర నల్ల డబ్బు స్వర్గాలు నమ్మబలుకుతుండగా అందులో నిజం లేదని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. రష్యా, చైనాల తర్వాత దేశీయ డబ్బును విదేశాలకు తరలిపోతున్న దేశాలలో ఇండియాయేదే తదుపరి స్ధానం అని ఒక అంతర్జాతీయ సర్వే సంస్ధ నిర్ధారించింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ (జి.ఎఫ్.ఐ) అనే సంస్ధ నల్ల డబ్బు వివరాలను వెల్లడి చేసింది. జి.ఎఫ్.ఐ నివేదిక ప్రకారం ఒక్క 2012 లోనే 94.76 బిలియన్ డాలర్ల డబ్బు…

ఇండియాలో పుటిన్: చమురు, అణు ఒప్పందాలతో సందడి

రష్యా అధ్యక్షుడు పుటిన్ ఒక రోజు ఇండియా సందర్శన రష్యాకు ఫలప్రదంగా ముగిసింది. డజను అణు రియాక్టర్ల నిర్మాణం, చమురు సరఫరా ఒప్పందం, మిలట్రీ సరఫరా ఒప్పందాలతో పుటిన్ కడుపు నింపుకుని సంతృప్తిగా వెళ్లారు. అమెరికా తన షేల్ గ్యాస్, చమురు ఉత్పత్తిని తీవ్రం చేయడం ద్వారా అంతర్జాతీయ రేట్లను కిందికి నెట్టడంతో రష్యా ఆర్ధిక వ్యవస్ధ కష్టాల్లో పడిన సందర్భంలో ఇండియాతో చేసుకున్న ఒప్పందాలు రష్యాకు మేలు చేస్తాయి. ఇండియాకు మాత్రం అనుత్పాదక వ్యయాన్ని పెంచుకోవడం…

వేల కోట్ల నౌకా విధ్వంసక వ్యాపారం -ఫోటోలు

ఎంత భారీ నిర్మాణానికయినా ఏదో ఒక నాడు కాలం తీరిపోక తప్పదు. రాబట్టుకోదగిన విలువను అంతటినీ రాబట్టుకున్నాక గాని పెద్ద పెద్ద నిర్మాణాలను మనుషులు వదిలి పెట్టరు. ఇలా కాలం తీరిపోయిన భారీ నౌకలు, భవనాలు, కర్మాగారాలు.. మొదలయిన మౌలిక నిర్మాణాలను ఏం చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం రీ సైక్లింగ్! పర్యావరణం గురించిన స్పృహ పెరిగాక వాడిన వస్తువులను రీ సైక్లింగ్ చేసి మరో కొత్త వస్తువు తయారు చేయడం మనిషి పారంభించాడు. రీ సైక్లింగ్…

నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్

కొత్త రాజధాని పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న హడావుడి చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి. భూ సమీకరణకు సంబంధించి విధాన ప్రకటన ఇంతవరకు చేయలేదు. లక్ష ఎకరాల భూమి సేకరించేది ఏ ప్రయోజనాల కోసమో తెలీదు.భూములు ఇవ్వబోయే రైతులకు నష్టపరిహారం ఎంతో తెలీదు. భూములు లేక భూములు గలవారిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు బ్రతుకు తెరువు ఏమిటో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. భూములు ఇచ్చేందుకు ఎందరు…

నీటి దౌత్యం: మాల్దీవులకు ఇండియా, శ్రీలంకకు చైనా

అమెరికా తలపెట్టిన ఆసియా-పివోట్ వ్యూహం పుణ్యమాని దక్షిణాసియాలో ఇండియా-చైనాల మధ్య పోటీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇండియా తన నౌకా, వాయు బలగాలను వినియోగించి మాల్దీవులకు భారీ మొత్తంలో మంచి నీటిని సరఫరా చేసిన మూడో రోజుకే శ్రీలంకలో భారీ నీటి ప్రాజెక్టును చైనా ఆవిష్కరించింది. 230 మిలియన్ డాలర్ల ఖర్చుతో శ్రీలంకలో అతి పెద్ద నీటి సరఫరా ప్రాజెక్టుకు చైనా కంపెనీ ఒకటి శ్రీకారం చుడుతోందని జిన్ హువా వార్తా సంస్ధ ద్వారా తెలుస్తోంది. చైనా…

ఇండియా-చైనా-బంగ్లా-బర్మా కారిడార్ రూపకల్పన

ఇండియా, చైనా, బంగ్లాదేశ్, మియాన్మార్ దేశాలను కలుపుతూ ఆర్ధిక కారిడార్ రూపకల్పనకు పధక రచన జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సార్క్ శిఖరాగ్ర సమావేశాల్లో ఈ అంశంపై కూడా చర్చ జరిగిందని త్రిపురలో విడిది చేసిన బంగ్లాదేశ్ అధికారుల ద్వారా తెలిసింది. బంగ్లాదేశ్ సహకారంతో త్రిపురలో నిర్మించిన 726 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి బంగ్లాదేశ్ మంత్రి, అధికారులు అతిధులుగా హాజరుకానున్నారు. సోమవారం (డిసెంబర్ 1) నాటి…

ప్రతిష్టంభనను కరిగించిన సార్క్ హ్యాండ్ షేక్ -కార్టూన్

ఇటీవల జరిగిన సార్క్ సమావేశాలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసిపోయాయి. ప్రాంతీయ సమగ్రత, ఐక్యతల కోసం అని చెబుతూ ఏర్పాటు చేసిన సార్క్ కూటమి సభ్య దేశాలు నిరంతరం ఒకరినొకరు తిట్టిపోసుకోవడంతోనే కాలం గడిపాయి తప్ప లక్ష్యం వైపు ప్రయాణిస్తున్నట్లు ఏనాడూ కనిపించలేదు. తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల సారధులను ఆహ్వానించి ఆశలను చిగురింపజేసిన నరేంద్ర మోడి తీరా అసలు సార్క్ సమావేశాలకు వచ్చేసరికి తుస్సు మానిపించారు. సార్క్ లో ఇండియా, పాకిస్తాన్ లే అతి…

మోడి ఎక్స్ ప్రెస్ టు అమెరికా, వయా ఆస్ట్రేలియా -2

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం యురేనియం సరఫరా అన్నది సమాన స్ధాయి వ్యాపార సంబంధాల్లో భాగంగా జరిగినది కాదు. భారత దేశం అమెరికా, దాని మిత్ర దేశాలతో వాణిజ్య, రాజకీయ, ఆర్ధిక సంబంధాలను మరింత దృఢతరం చేసుకుని, అమెరికా శిబిరానికి మరింత దగ్గర అయ్యే భౌగోళిక రాజకీయ అవసరం రీత్యానే యురేనియం సరఫరా అవుతుంది. అనగా యురేనియం ఇంధనాన్ని ఇచ్చి ఇండియా నుండి చైనా-రష్యా శిబిరంపై వ్యతిరేకతను అమెరికా సంపాదిస్తోంది. ఇది దళారీ పాలకుల లక్షణాల్లో ఒకటి.…

ఆస్ట్రేలియా మీదుగా అమెరికా వెళ్ళు మోడి రైలు -1

భారత ప్రధాని నరేంద్ర మోడి నవంబరు 11 నుండి 20 వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్ళి వచ్చారు. మియాన్మార్ పర్యటనలో ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సభకు హాజరయిన మోడి ఆస్ట్రేలియా పర్యటనలో జి-20 గ్రూపు సమావేశాలకు హాజరయ్యాడు. ఈ పర్యటనలో మోడియే ప్రధాన ఆకర్షణ అని చెప్పుకుని భారత పత్రికలు మురిసిపోయాయి. వామపక్ష భావాలు కలిగి ఉన్నట్లు భావించే ది హిందు పత్రిక సైతం ఈ పత్రికల్లో ఒకటిగా ఉండడం గమనార్హం. అంటరాని నేతగా దాదాపు ప్రపంచం…

2జి కేసుకు దూరంగా ఉండండి -సుప్రీం కోర్టు

భారత దేశంలో హై ప్రొఫైల్ కేసులను విచారించే హై ప్రొఫైల్ విచారణాధికారులు సైతం విచారణకు ఎలా తూట్లు పొడుస్తారో తెలిపే ఉదంతాలు ఇప్పటికే అనేకం వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2జి కేసులోనే ఇలాంటి ఉదాంతాలు నాలుగైదు వెలుగులోకి రాగా సి.బి.ఐ అధిపతి రంజిత్ సిన్హా ఉదంతం మరొకటిగా వచ్చి చేరింది. 2జి కేసు విచారణ నుండి దూరంగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు (నవంబర్ 20) సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను ఆదేశించింది. చీఫ్…

మోడి హయాం: జాత్యహంకార ఇజ్రాయెల్ తో వాణిజ్య వృద్ధి

భారత ప్రభుత్వం పగ్గాలను ఎన్.డి.ఏ నేత నరేంద్ర మోడి చేపట్టిననాటి నుండి జాత్యహంకార ఇజ్రాయెల్ తో మన వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఇజ్రాయెల్ తో సన్నిహిత సంబంధాలు పెంచుకుని వాణిజ్య స్నేహాలను ఏర్పాటు చేసుకున్నా నరేంద్ర మోడి, ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాక తన పలుకుబడిని మరింతగా విస్తరించారు. ఫలితంగా ఇజ్రాయెల్-ఇండియాల మధ్య త్వరలోనే స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదరవచ్చని వాణిజ్య విశ్లేషకులు, అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్…

పట్టాలపై వాణిజ్య వసతీకరణ -ది హిందు ఎడిట్

-The Hindu Editorial dated November 18, 2014 (ప్రపంచ వాణిజ్యంలో) వివాదాస్పద అంశం ‘ఆహార భద్రత కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం నిలువ చేసుకునే’ విషయంలో ఇండియా, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ వాణిజ్య చర్చలను తిరిగి పట్టాల మీదికి తేవాల్సి ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్ధ చరిత్రలో టి.ఎఫ్.ఏ గణనీయమైన అడుగు అనదగ్గ బహుళపక్ష “వాణిజ్య వసతీకరణ ఒప్పందం” (Trade Facilitation Agreement -TFA) ను కాపాడేందుకు ఈ ద్వైపాక్షిక సర్దుబాటు/రాజీ అత్యవసరమైన…

అచ్చే దిన్: అడ్డదారిలో గ్యాస్ ధర పెంపు

బి.జె.పి నేత నరేంద్ర మోడి హామీ ఇచ్చిన ‘మంచి రోజులు’ ప్రజల ముందుకు ఒక్కొక్కటి వచ్చి వాలుతోంది. 4.5 కోట్ల కుటుంబాలకు ఉపాధి ఇచ్చే చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ లు అనుమతించేది లేదన్నారు. ఆన్-లైన్ రిటైల్ మార్కెటింగ్ గేట్లను బార్లా తెరిచేశారు. ‘శ్రమయేవ జయతే’ అంటూ కార్మికుడిని ‘శ్రమ యోగి’ అని నెత్తిన పెట్టుకున్నామన్నారు. కార్మికుల హక్కులను నేల రాస్తూ కంపెనీలకు చిత్తానుసారం ‘హైర్ అండ్ ఫైర్’ చేసే హక్కును దఖలు పరిచారు. తాజాగా గ్యాస్ సిలిండర్…