పండగ కాలం ఇది, ఇండియా వెళ్లకండి -ఐదు దేశాల సలహా

పండగల కాలం అయినందున ఇండియా ప్రయాణం క్షేమకరం కాదనీ, అందువలన ఇండియా వెళ్లవద్దనీ తమ తమ దేశస్ధులకు ఐదు దేశాలు సలహా ఇచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రభుత్వాలు ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేశాయి. పండగల కాలంలో ఇండియాలో టెర్రరిస్టు దాడులు జరిగే అవకాశం ఉందని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ సలహా పట్ల భారత ప్రభుత్వం అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఈ సలహాతో తమ టూరిజం వ్యాపారం దెబ్బతింటుందని భారత అధికారులు…

లిబియా ‘ఆయిల్ కేక్’ పంపకాలకు పశ్చిమ రాజ్యాలు సిద్ధం -కార్టూన్

లిబియా ఆయిల్ వనరుల్ని పంచుకోవడానికి పశ్చిమ రాజ్యాల ఆయిల్ కంపెనీలు ఇప్పుడు లిబియాలో చర్చల్లో మునిగితేలుతున్నాయి. తిరుగుబాటు ప్రారంభమైందని ప్రపంచానికి పూర్తిగా తెలియక ముందే తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించిన ఫ్రాన్సుకు పెద్ద భాగం లభించింది. 34 శాతం ఆయిల్, గ్యాస్ వనరుల్ని ఫ్రెంచి కంపెనీ టోటల్ కి అప్పగిస్తున్నట్లుగా లిబియా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ప్రకటించింది. ఇంకా అమెరికా (ఎక్సాన్ మొబిల్), ఇటలీ (ఇ.ఎన్.ఐ), రష్యా (గాజ్‌ప్రోమ్), బ్రిటన్ (బిపి), హాలండ్ (రాయల్ డచ్ షెల్), స్పెయిన్…

జగన్ అరెస్టు కావొచ్చు, ఆస్తులూ పోవచ్చు -న్యాయ నిపుణులు

దేవుడి పాలనలో ఒక వెలుగు వెలిగిన దైవ కుమారుడికి కష్టాలు వచ్చిపడ్డాయి. న్యాయ వ్యవస్ధ క్రియాశీలంగా మారడం వల్లనో లేదా అది తను నిజానికీ చేయవలసిన పని నిజాయితీగా చేస్తున్నందునో దొంగ దేవుళ్ళ పాపాల సామ్రాజ్యాలు కూలుతున్న  శబ్దాలు వినపడుతున్నాయి. అవి పాపాల రాయుళ్ళకు కర్ణ కఠోరంగా ఉంటే, ఆ పాపాలలో సమిధలయిన సామాన్య మానవునికి వీనులవిందుగా తోస్తోంది. న్యాయ నిపుణులు ‘ముందుంది మొసళ్ల పండగ’ అంటున్నారు. జగన్‌ పాల్పడ్డాడంటున్న నేరాలను బట్టి చూస్తే భవిష్యత్తులో జగన్…

సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని బళ్ళారి మైనింగ్ మాఫియా, ఖనిజం సీజ్

మాఫియాకి తీర్పులు, ఆదేశాలు ఒక అడ్డా? కోర్టుల తీర్పులు, ప్రభుత్వాల ఆదేశాలే దానికి అడ్డయితే అది మాఫియా కాదేమో! గత గురువారం బళ్ళారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను, రవాణాను సస్పెండ్ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ బళ్ళారి నుండి 49 ట్రక్కులతో ఇనుప ఖనిజం రావాణా చేస్తూ బళ్ళారి వద్ద దొరికిపోయారు. బళ్ళారి శివార్లలో ఉన్న ఆలిఘర్ వద్ద ఇనుప ఖనిజాన్ని చట్ట విరుద్ధంగా రవాణా చేస్తుండగా జిల్లా…

బళ్లారి ఇనుప ఖనిజ తవ్వకాలతో పర్యావరణ హాని, తవ్వకాలను సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

ఇనుప ఖనిజాన్ని విచక్షణా రహితంగా తవ్వి తీస్తుండడం వలన పర్యావరణానికి తీవ్ర హాని సంభవిస్తున్నదని సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక సపర్పించడంతో బళ్లారిలో ఇనుప ఖనిజ తవ్వకాలను సస్పెండ్ చేస్తున్నట్లుగా సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. “తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకూ బళ్లారిలో ఇనుప ఖనిజం తవ్వకాలను నిలిపివేయాలని ఈ కోర్టు భావిస్తునది” అని ఛీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ అవసరాలు తీర్చడానికి…

“రిలయన్స్ ఇండస్ట్రీస్”లో 30 శాతం షేర్లు “బ్రిటిష్ పెట్రోలియం” కు అమ్మడానికి కేంద్రం ఆమోదం

మొదట దేశంలోని విలువైన సహజ వనరులను స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారులకు అప్పగించడం, ఆ అర్వాత స్వదేశీ పెట్టుబడుదారులను తమ కంపెనీలో గణనీయమొత్తంలో షేర్లను విదేశీ బహుళజాతి సంస్ధలకు అమ్ముకోవడానికి ఆమోద ముద్ర వేయడం, తద్వారా భారత దేశ ఆయిల్, గ్యాస్ తవ్వకాల రంగంలోని దేశీయ మార్కెట్లను విదేశీ మార్కెట్ల ప్రవేశానికి గేట్లు బార్లా తెరవాలన్న పశ్చిమ దేశాల డిమాండ్లను నెరవేర్చడం భారత ప్రభుత్వం ఒక ఎత్తుగడగా అభివృద్ధి చేసినట్లు కనిపిస్తోంది. కాకుంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద…

ఒక సి.ఎం, 8 నేతలు, 500 అధికారులు, రు.1827 కోట్లు.. ఇదీ మైనింగ్ కుంభకోణం!

ఇది కుంభకోణాల యుగం. నిజానికి నల్లదొరల పాలన అంతా కుంభకోణాల మయమే. తెల్ల దొరలు పోయి నల్ల దొరలు వచ్చారు తప్ప స్వాతంత్ర్యం వలన భారత ప్రజా కోటికి ఒరిగిందేమీ లేదన్నది నిష్టర సత్యంగా నానాటికీ రుజువౌతోంది. ఎవరూ గట్టి ప్రయత్నం చేయకుండానే రాజకీయ నాయకులు తమ మధ్య రగిలే కుమ్ములాటలవలన, రాజకీయ విభేధాల వలన తమ అవినీతి కార్యకలాపాలను బయట పెట్టుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్ధుల అలవిగాని సంపదల గుట్టుమట్టులని బైట పెట్టడం అనేది ఎన్నికల రాజకీయాల్లో…

కర్ణాటక ముఖ్యమంత్రి, మంత్రులు, గనుల యజమానులే గనుల మాఫియా సృష్టికర్తలు -లోకాయుక్త

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, అధికారులు, గనుల యజమానులు అంతాకలిసి బళ్లారి ఇనుప గనుల్లో మాఫియా లాంటి వ్యవస్ధను సృష్టించారని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డె వెల్లడించారు. సుప్రీం కోర్టులో మాజీ న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులతో పాటు గనుల యజమానులు అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1800 కోట్ల రూపాయల నష్టం కలగజేశారని వెల్లడించారు. మార్చి 2009 మే 2010 వరకూ 14 నెలల…

జనారణ్యంలోకి చొరబడ్డ చిరుతతో ఫారెస్టు గార్డుల ఘర్షణ -ఫోటోలు

ప్రకృతిపై మనిషి సాగించిన పోరాటంలో మనిషిదే అంతిమ విజయం. విజయంతో సంతృప్తి చెందిన మనిషి ధన ధాహంతో ప్రకృతి వినాశనానికి పూనుకుంటున్నాడు. దానితో జనారణ్యం సహజారణ్యంలోకి చొచ్చుకెళ్తోంది. ఫలితంగా జంతువులకు తమ సహజ నివాసంలో జాగా లేక జనారణ్యంలోకి రాక తప్పడం లేదు. రియల్ ఎస్టేట్ రంగ కాసుల దాహం కావచ్చు, అడవుల్లో దొరికే సహజ ఖనిజ వనరులపై బిలియనీర్ల కన్నుపడటం వలన కావచ్చు, అడవుల్లో జంతుజాలానికి నిలవ నీడ లేకుండా పోయింది. ఖనిజాల కోసం, గనుల…

భారత అణుప్రమాద పరిహార చట్టం ఐ.ఎ.ఇ.ఎ నిబంధనలకు లోబడాలి, అమెరికా కొత్త మెలిక

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్, అమెరికాల పౌర అణు ఒప్పందంతో పాటు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం అమలు దిశలో మలి దశగా ఈ పర్యటనను పత్రికలు గత కొన్ని రోజులుగా పేర్కొంటూ వచ్చాయి. అమెరికా, భారత్‌కు అణు రియాక్టర్‌లు, అణు పదార్ధం (శుద్ధి చేయబడిన యురేనియం) సరఫరా చేయడానికి అమెరికా తాజాగా మరొక మెలిక పెట్టింది. భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు ప్రమాద పరిహార…

‘గూగుల్,’ ‘స్కైప్’ సర్వీసులను పర్యవేక్షించే అవకాశం మా గూఢచాలకు ఇవ్వాలి -భారత ప్రభుత్వం

‘గూగుల్ ఇంక్,’ ‘స్కైప్ లిమిటెడ్’ లతో పాటు ఇతర ఇంటర్నెట్ సంస్ధలు, వినియోగదారులకు అందించే సేవలను పర్యవేక్షించే అవకాశం దేశ భద్రతా ఏజెన్సీలకు ఉండాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఆయా కంపెనీలు తాము అందజేసే సర్వీసుల ద్వారా మార్పిడి చేసే సమాచారాన్ని ముందుగానే చదివే అవకాశం భారత దేశ భధ్రతా బలగాలు, గూఢచార సంస్ధలకు ఉండాలనీ, భారత దేశ భద్రత రీత్యా అది అవసరమనీ సంబంధిత కేంద్ర మంత్రి బుధవారం, పరిశ్రమల సమావేశాల సందర్భంగా కోరాడు.…

బహుళజాతి కంపెనీలకు మద్దతుగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన ప్రధాని

భారత ప్రధాని రెండో సారి తన మంత్రివర్గంలో మార్పులు తలపెట్టారు. ఈ సారి మార్పుల్లో ప్రధానంగా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లుగా కనిపిస్తోంది. బహుళజాతి కంపెనీల ప్రవేశానికి అడ్డంకిగా ఉన్నారని భావిస్తున్న మంత్రులను వారి శాఖలనుండి తొలగించారు. పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయని భావించినప్పటికీ అలాంటిదేమీ జరగలేదు. ప్రధాన విధానాల అమలుతో ముడిపడి ఉన్న మంత్రిత్వ శాఖలను పెద్దగా కదిలించలేదు. మిత్ర పార్టీల శాఖలను కూడా పెద్దగా మార్చలేదు. డి.ఎం.కె మంత్రి దయానిధిమారన్ రాజీనామా చేసిన స్ధానాన్ని…

చైనాలో మరింత క్షీణించిన వ్యాపార వృద్ధి, రికార్డు స్ధాయిలో వాణిజ్య మిగులు

చైనాలో జూన్ నెలలో వ్యాపార కార్యకలాపాలు మరింత నెమ్మదించాయని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. మే నెలలో కంటే జున్ నెలలో కూడా దిగుమతులు పడిపోయాయి. దానితో చైనాకు వాణిజ్య మిగులులో మరింత పెరుగుదల రికార్డయ్యింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ కలిగిన చైనా, ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య మిగులు 22.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. మే నెలలో దిగుమతుల వృద్ధి రేటు 28.4 శాతం ఉండగా, జూన్ నెలలో అది…

రిలయన్స్ కంపెనీకి నేను మేలు చేయలేదు -కపిల్ సిబాల్ తొండాట

తనపై సుప్రీం కోర్టులో ఒక ఎన్.జి.ఒ సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన మరుసటి రోజు కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబాల్ స్పందించాడు. పత్రికా సమావేశం నిర్వహించి ఇచ్చిన వివరణలో కపిల్ సిబాల్ “ఆకుకూ అందక, పోకకూ పొందక” అన్నట్లు సమాధానాలిచ్చి తొండాట ఆడటానికి ప్రయత్నించాడు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ వినియోగదారులకు చెప్పకుండా నిర్ధిష్ట సేవలను ఆపేసినందుకుగాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అధికారులు ఆ కంపెనీపై సర్కిల్ కి రు.50 కోట్ల చొప్పున మొత్తం…

మార్కెట్ హెవీ వెయిట్ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ రేటింగ్ తగ్గింపు

భారత షేర్ మార్కెట్‌కు హెవీ వెయిట్ గా పేరుపొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను వాల్‌స్ట్రీట్ స్ట్రీట్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తగ్గించేసింది. పెట్టుబడి ఎక్కువ చేసి చూపిందని ఆరోపణ ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చుట్టూ ఇటీవల అనేక ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్న కెజి బేసిన్ లో అనుకున్నంత స్ధాయిలో నిల్వలు లేవన్న అనుమానాలు తలెత్తాయి. సమీప భవిష్యత్తులో రిలయన్స్ ఇండస్ట్రీట్ కంపెనీకి అనుకూలంగా పనిచేసే పరిణామాలేవి సంభవించవని మోర్గాన్ స్టాన్లీ ఇన్‌వెస్ట్‌మెంట్…