యురేనియంను ఇండియాకు అమ్మితే మాకూ అమ్మాలి, ఆస్ట్రేలియాతో పాకిస్ధాన్ -2

రష్యా, ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధానులు వచ్చి అణు రియాక్టర్ల వ్యాపారం విషయమై ఇండియా తో చర్చించి వెళ్ళారు గానీ అమెరికా నుండి అణు రియాక్టర్ల అమ్మకానికి సంబంధించి ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దానికి కారణం కూడా ఇండియాపైనే మోపుతోంది. అణు రియాక్టర్లు, అణు పదార్ధాలు సరఫరా చేసే అమెరికా కంపెనీలు (జనరల్ ఎలక్ట్రిక్, తోషిబా, వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్) నాసిరకం పరికరాలు సరఫరా చేసినందువలన గానీ, లోపాలతో కూడిన రియాక్టర్లు…

గ్రీన్ టెక్న్లాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం?

పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన వాణిజ్యంలో అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. చైనాకు చెందిన పర్యావరణ సాంకేతిక ఉత్పత్తులు అమెరికా కంపెనీల ఉత్పత్తులకు హానికరంగా పరిణమించాయని భావిస్తూ ‘అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్’ విచారణ చేయడానికి నిర్ణయించడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. అమెరికా చర్యలు వాణిజ్యంలో ‘రక్షణాత్మక విధానాలతో’ (ప్రొటెక్షనిజం) సమానమని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర దేశాలనుండి వచ్చే దిగుమతులతో పోటీ పడలేక అటువంటి దిగుమతులపైన పెద్ద…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయం సస్పెన్షన్ తాత్కాలికమే

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేయడం తాత్కాలిక చర్య మాత్రమేనని కేంద్ర ప్రభుత్వంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. “ఇవి కేవలం భారతీయ రాజకీయాలు మాత్రమే” అని ఆ అధికారి అన్నట్లుగా రాయిటర్స్ తెలిపింది. “నమ్మదగని భారత ప్రభుత్వం (ఫికిల్ ఇండియా గవర్నమెంట్) విదేశీ సూపర్ మార్కెట్ల నిర్ణయాన్ని పక్కనబెట్టింది” అన్న హెడ్డింగ్ తో  రాయిటర్స్ వార్తా సంస్ధ ఓ…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని కేంద్రం సస్పెండ్ చేసింది -మమత

రిటైల్ రంగంలో ‘విదేశీ పెట్టుబడుల’ నిర్ణయం శనివారం అనూహ్యంగా మలుపు తిరిగింది. సూపర్ మార్కెట్లలో 51 శాతం మేరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని శనివారం బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించింది. కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు ఆ విషయం తెలిపినట్లుగా మమతా బెనర్జీ విలేఖరులకు తెలిపింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండీ ఇప్పటివరకూ ఎటువంటి చర్చా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజూ…

ఎన్.డి.ఎ వంద శాతం ఎఫ్.డి.ఐ రిటైల్ రంగంలో రావాలని ప్రతిపాదించింది కదా -మంత్రి

ఎన్.డి.ఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు రిటైల్ రంగంలోకి వంద శాతం పెట్టుబడుల రావాలని ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గుర్తు చేశాడు. యు.పి.ఎ ప్రభుత్వం అప్పటినుండి అనేక చర్చోప చర్చలు సాగించి కేవలం 51 శాతం మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రిటైల్ రంగంలోకి అనుమతించాలని ఖుర్షీద్ తెలిపాడు. “రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించే నిర్ణయం తీసుకునే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. ఎన్.డి.ఎ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటినుండీ అనేక విధాలుగా ఈ విషయమై…

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా వ్యాపారస్ధుల బంద్

గురువారం భారత దేశ వ్యాపితంగా వ్యాపారస్ధులు బంద్ పాటించారు. రిటైల్ అమ్మకాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు వ్యాపార వర్గాలు పిలుపునిచ్చాయి. న్యూఢిల్లీతో పాటు దేశ వ్యాపితంగా బంద్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ఈ బంద్ లో పాల్గొంది. అనేక చోట్ల ప్రదర్శనలు నిర్వహించింది. బి.జె.పి శ్రేణులు ప్రధాన మంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసాయి. రాజధాని ఢిల్లీలో కనీసం ఇరవై…

చిల్లర దుకాణాల కడుపు కొట్టడానికి సర్వం సిద్ధం

చిన్నపాటి రిటైల్ దుకాణదారుల కడుపు పైన కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. భారత దేశ వ్యాపితంగా పల్లెల్లో, పట్నాల్లో ప్రతి వీధి చివరా, సెంటర్లలో రోజూ మనకు కనిపించే రిటైల్ దుకాణాలు రానున్న రోజుల్లో కనిపించక పోవచ్చు. కొన్ని కోట్లమంది దుకాణదారులు, వారి కుటుంబాలను రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇంతవరకూ మల్టిబ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం సింగిల్ బ్రాండ్ లోనే విదేశీ పెట్టుబడులను…

ఎయిర్ ఇండియాకు బోయింగ్ విమానాలు అమ్మకుండా యు.ఎస్ ఎయిర్ లైన్స్ అడ్డుపుల్ల

వ్యాపార పోటీని అడ్డదారిలో అడ్డు తప్పించుకోవడం అమెరికా కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. చైనాతో గల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి వ్యాపార, వాణిజ్యాల్లో పోటిపడడం చేతగాని అమెరికా, చైనా తన కరెన్సీని అసహజంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని ఆరోపిస్తూ యువాన్ విలువను పెంచేలా ఒత్తిడి తెచ్చి, చైనా నుండి వస్తున్న దిగుమతులను తగ్గించుకుని, తన వాణిజ్య లోటును తగ్గించుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తున్నది. ఇప్పుడు బోయింగ్ విమానాలను ఇండియా కొనుగోలు చేయడానికి వీలుగా ఇండియా కంపెనీలకు, అమెరికాకి…

త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా

దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైన దృష్టి పెట్టకపోతే త్వరలో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు, ఆయిల్ దిగుమతుల బిల్లుని మించిపోవడం ఖాయమని భారత ప్రభుత్వ ఐ.టి సలహాదారు శ్యాం పిట్రోడా హెచ్చరించారు. ఎలక్ట్రానికిక్ మాన్యుఫాక్చరింగ్ లో పునాదిని విస్తృతపరుచుకోవడం కోసం ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలని పిట్రోడా తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతున్నదని కాని ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆ డిమాండ్ తట్టుకోవడానికి దిగుమతులపై…

డజను భారత సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తివేసిన పాకిస్ధాన్

త్వరలో భారత్ కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదా ఇవ్వడానికి వీలుగా ప్రక్రియ ప్రారంభించడానికి అనుమతినిస్తూ పాకిస్ధాన్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే పాక్ ప్రభుత్వం, భారత్ నుండి వచ్చే 12 రకాల సరుకుల దిగుమతులపై నిబంధనలు ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాటల వరకే కాదని నిరూపించుకుంది. పాకిస్ధాన్ శనివారం ఈ విషయం తెలిపింది. పాకిస్ధాన్ లో ‘ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ’ (ఇసిసి),…

అబ్బే, ఇండియాకి ఆ హోదాం మేం ఇవ్వలేదు -పాక్ ప్రధాని గిలాని

భారత్ అధికారుల అనుమానం నిజం అయ్యింది. ఇండియాకి తామింకా “అత్యంత అనుకూలమైన దేశం’ (మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎఫ్) హోదా ఇవ్వలేదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలాని స్పష్టం చేశాడు. ఆ హోదా ఇవ్వడానికి చర్చలు జరిపడానికి ముందుకు కదలాల్సిందిగా ‘వాణిజ్య మంత్రిత్వ శాఖ’ కు ఆదేశాలివ్వడం మాత్రమే జరిగిందని ఆయన శనివారం వెల్లడించాడు. “ఈ అంశంలో ముందడుగు వెయ్యాలని వాణిజ్య శాఖకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇండియాతో వాణిజ్యం విషయంలో చురుకుగా ఉన్న…

ఇండియాకు ‘అత్యంత అనుకూల దేశం’ హోదా ఇవ్వడానికి పాకిస్ధాన్ వెనకడుగు?

ఈ వారం ప్రారంభంలో ఇండియాకు, పాకిస్ధాన్ ప్రకటించిన ‘అత్యంత అనుకూల దేశం’ (మోస్ట ఫేవర్డ్ నేషన్ -ఎం.ఎఫ్.ఎన్) హోదా ను మళ్ళీ చిక్కులో పడింది. దేశీయంగా తలెత్తిన అభ్యంతరాలతో ఇండియాకు ఎమ్.ఎఫ్.ఎఫ్ హోదా ఇవ్వకుండా వెనక్కి తీసుకుంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఈ అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ శుక్రవారం తెలిపింది. ఎం.ఎఫ్.ఎన్ హోదా ఉన్నట్లయితే కొన్ని వ్యాపార సంభంధిత ప్రయోజనాలను ఇండియా పొందగలుగుతుంది. ఇండియా, పాకిస్ధాన్ కు ఎన్నడో…

కూడూ, నీడా, చదువూ లేని ఫార్ములా 1 రేసు రోడ్డు నిర్మాతలు

ఢిల్లీకి సమీపంలో భారత దేశ సంపన్నులకు సంతోషం చేకూర్చే ఫార్ములా 1 రేసు మొట్ట మొదటి గ్రాండ్ ప్రిక్స్ పోటీలు ఆదివారం జరగనున్నాయి. భారత దేశ ధనికుల విలాసాలను పట్టి చూపే ఫార్ములా 1 రేసు ఓవైపు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆ రేసు కోసం రోడ్డును అందంగా పటిష్టంగా నిర్మించి పెట్టిన కూలీలకు ఇంతవరకూ కూలి డబ్బులు దక్కని దయనీయ పరిష్దితి నెలకొని ఉంది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ తాను సాధించిన అభివృద్ధికి మురిపెంగా చూపుకునే సాక్ష్యాలలో…