‘సైబర్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -2

– ‘నటాంజ్’ లో అండర్ గ్రౌండ్ లో శత్రు దుర్బేధ్యంగా నిర్మించబడిన ఇరాన్ అణు శుద్ధి కేంద్రంలోని కంప్యూటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ‘సైబర్ ఆయుధం’ లక్ష్యం. నటాంజ్ కర్మాగారంలో పారిశ్రామిక కంప్యూటర్ కంట్రోల్స్ లోకి జొరబడగలిగితే అణు శుద్ధి కార్యకలాపాలను విధ్వంసం చేయవచ్చన్నది పధకమని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. అలా జొరబడాలంటే ఇంటర్నెట్ నుండి నటాంజ్ ప్లాంటును వేరు చేసే ఎలక్ట్రానిక్ కందకాన్ని దాటాల్సి ఉంటుంది. టైమ్స్ సమాచారం ప్రకారం నటాంజ్ ప్లాంటును బైటి ప్రపంచం నుండి…

స్టక్స్ నెట్, ఫ్లేమ్: ‘ఇంటర్నెట్ హై వే’ పై బట్టలిప్పి గెంతుతున్న అమెరికా -1

‘నూనం-మానం, సిగ్గు-లజ్జ, చీము-నెత్తురు, నీతి-నియమం’ ఇలాంటివేవీ తాము ఎరగమని అమెరికా పాలక వ్యవస్ధ మరోసారి చాటుకుంది. ‘అమెరికా ఎంతకైనా తెగిస్తుంది’ అని చాటుకోవడంలో అమెరికా అధ్యక్షులు మినహాయింపు కాదని అమెరికా పత్రికలే నిర్ద్వంద్వంగా ఇంకోసారి తేల్చి చెప్పాయి. ఇరాన్ దేశ కంప్యూటర్లపై దాడి కోసం ‘కంప్యూటర్ వైరస్’ లను సృష్టించి, దుర్మార్గమైన ‘సైబర్ వార్’ కి తెర తీయడం వెనుక అమెరికా అధ్యక్షుడు ‘బారక్ ఒబామా’ ప్రత్యక్ష అనుమతి ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడి చేసింది.…

ప్రధాని పై సి.బి.ఐ విచారణ వృధా -అన్నా బృందం

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంత్రిత్వంలో చోటు చేసుకున్న ‘బొగ్గు గనుల కుంభకోణం’ పై సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తే అది వృధా ప్రయాసేనని అన్నా బృందం కొట్టిపారేసింది. విచారణ సి.బి.ఐ కి అప్పగిస్తే ప్రధానికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం ఖాయమని పేర్కొంది. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అయిన సి.బి.ఐ ప్రధాని పై విచారణ ఎలా చేస్తుందని ప్రశ్నించింది. కాంగ్రెస్ రాజకీయ మిత్రులయిన ములాయం, మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ లపై సంవత్సరాల తరబడి విచారణ చేస్తున్నా…

అమెరికా అభ్యంతరాలు పక్కకు నెట్టి ‘నార్త్-సౌత్ కారిడార్’ ముందడుగు

అమెరికా అభ్యంతరాలను పక్కకు నెడుతూ ‘ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్’ శరవేగంతో ముందుకు సాగుతోంది. ఉత్తర, దక్షిణార్ధ గోళాలను కలుపుతూ సాగే ఈ వాణిజ్య మార్గం చారిత్రాత్మక ‘సిల్క్ రోడ్’ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఇండియా, రష్యా, మధ్య ఆసియా ల మధ్య నెలపాటు ప్రయాణాన్ని తగ్గిస్తుందని భావిస్తున్న కారిడార్ లో ఇరాన్ ది కీలక పాత్ర కావడంతో అమెరికాకి అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది. కారిడార్ రూపకల్పనలో ఇండియా, ఇరాన్, రష్యాలు కీలక భాగస్వామ్యం…

ఇరాన్ ఆయిల్: ఇండియాపై దుష్ప్రచారం తగదు -నిరుపమ

ఇరాన్ క్రూడాయిల్ దిగుమతుల విషయంలో ఇండియా పై జరుగుతున్న ప్రతికూల ప్రచారం పనికి రాదని అమెరికాలో భారత రాయబారి నిరుపమా రావు అభ్యంతరం తెలిపారు. 120 కోట్ల మంది ప్రజల ఎనర్జీ అవసరాలను తీర్చవలసిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్న సంగతి గ్రహించాలని ఆమె అమెరికాకి పరోక్షంగా సూచించింది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను తు.చ తప్పకుండా పాటిస్తున్నామనీ, అమెరికా ఆంక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులనూ తగ్గించామనీ ఆమె వివరించారు. ఇరాన్ క్రూడాయిల్ పట్ల…

ఇరాన్ ఆయిల్ కొనుగోళ్ళు పెంచిన దక్షిణ కొరియా

ఓ వైపు ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను ఇండియా తగ్గించుకుంటుండగా ఇతర ఆసియా దేశాలు మాత్రం పెంచుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను దక్షిణ కొరియా 42 శాతం పెంచినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆంక్షలను చైనాతో పాటు అమెరికా మిత్ర దేశం దక్షిణ కొరియా కూడా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోంది. కొరియా ప్రభుత్వ సంస్ధ ‘కొరియా నేషనల్ ఆయిల్ కార్పొరేషన్’ మంగళవారం వెల్లడించిన గణాంకాలను ప్రెస్…

రష్యా విమానం కూల్చివేత అమెరికా పనే -రష్యా

రష్యాకు చెందిన ‘సుఖోయ్ సూపర్ జెట్ 100’ విమానం మే నెల మొదటి వారంలో ఇండోనేషియా కొండల్లో కూలి పోవడం వెనుక అమెరికా హస్తం ఉందని రష్యా మిలట్రీ గూఢచారి సంస్ధ జి.ఆర్.యు ఆరోపించిందని ప్రెస్ టి.వి తెలిపింది. విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడే చనిపోయారు. విమానానికి గ్రౌండ్ సిబ్బందికి ఉన్న సంబంధాన్ని అమెరికా గూఢచర్య సంస్ధలు తెంపేయడంతో విమానం ప్రమాదానికి గురయ్యిందని రష్యా తెలిపింది. “ఒక ఎయిర్ క్రాఫ్ట్ కీ గ్రౌండ్ సిబ్బందికీ మధ్య జరిగే…

క్లుప్తంగా… 13.05.2012

జాతీయం డబ్ల్యూ.టి.ఒ లో ఇండియా పై అమెరికా ఫిర్యాదు ప్రపంచ వాణిజ్య సంస్ధలో ఇండియాపై అమెరికా ఫిర్యాదు చేసింది. అమెరికా నుండి దిగుమతి అయ్యే కోడి మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఇండియా విధించిన నిబంధనలు ‘వివక్ష’తో కూడి ఉన్నాయని అమెరికా ఫిర్యాదు చేసింది. ‘సానిటరీ అండ్ ఫైటో సానిటరీ’ (ఎస్.పి.ఎస్) ఒప్పందం ప్రకారం మానవుల ఆరోగ్యంతో పాటు, జంతువులు మొక్కలను కూడా కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకునే హక్కు డబ్ల్యూ.టి.ఒ సభ్య…

ఈసారీ సకాలంలోనే ఋతుపవనాలు -ఐ.ఎం.డి

ఈ సంవత్సరం కూడా సకాలంలోనే జూన్ 1, 2012 తేదీనే ఋతుపవనాలు దేశంలో ప్రవేశించనున్నాయని ‘ఇండియన్ మీటియోరోలాజికల్ డిపార్ట్ మెంట్’ మంగళవారం ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఋతుపవనాలు ప్రవేశించడం దాదాపు ఖాయమయిందనీ తెలిపింది. ప్రతి యేటా మే 20 న దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించే నైరుతి ఋతుపవనాలు అనంతరం జూన్ 1 తేదీన కేరళ తీరాన్ని తాకడం ద్వారా దేశంలోని ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి. రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా వర్షాలపై ఆధారపడే భారత…

క్లుప్తంగా… 09.05.2012

జాతీయం పరువు హత్యలకు యు.పి డి.ఐ.జి మద్దతు తన కూతురు ఇంటి నుండి పారిపోయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందనీ, అబ్బాయిపై చర్య తీసుకోవాలనీ ఫిర్యాదు చేసిన వ్యక్తికి కూతురిని చంపెయ్యమని అత్యున్నత పోలీసు అధికారి సలహా ఇవ్వడం సంచలనం రేపింది. తండ్రి స్ధానంలో తానున్నట్లయితే కూతురిని చంపేయ్యడమో లేదా తానే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవాడినని సలహా ఇస్తుండగా సంభాషణను కేమెరాలు బంధించడంతో డి.ఐ.జి ఎస్.కె.మాధుర్ వ్యవహారం లోకానికి వెల్లడయింది. రెగ్యులర్ చెకింగ్ కోసం ఓ పోలీసు…

క్లుప్తంగా… 08.05.202

జాతీయం జ్యువెలర్స్ పన్ను ఉపసంహరించిన ప్రణబ్ నగల వ్యాపారుల ఒత్తిడికి ఆర్ధిక మంత్రి తలొగ్గాడు. జ్యువెలర్స్ వ్యాపారుల తరపున తీవ్ర స్ధాయిలో జరిగిన లాబీయింగ్ ముందు చేతులెత్తేశాడు. బ్రాండెడ్ మరియు అన్ బ్రాండెడ్ నగల దిగుమతులపై పెంచిన 1 శాతం పన్ను ఉపసంహరించుకున్నాడు. పన్ను ఉపసంహరణతో పాటు పన్ను పెంపు ప్రతిపాదిస్తూ చేసిన అనేక చర్యలను సరళీకరించాడని పత్రికలు తెలిపాయి. జ్యూవెలరీ రంగంలో విదేశీ పెట్టుబడుల ఆహ్వానాన్ని మరో సంవత్సరం పాటు వాయిదా వేసుకున్నట్లు కూడా తెలుస్తోంది.…

‘సాక్షి’ కి ప్రకటనలు ఇవ్వొద్దు -ఎ.పి ప్రభుత్వం ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి స్ధాపించిన దిన పత్రిక ‘సాక్షి’ కి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరాదని ప్రభుత్వం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. వై.ఎస్.ఆర్ స్ధాపించిన ‘ఇందిర’ టి.వి కి కూడా ప్రకటనలు ఇవ్వడం ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప ఎం.పి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ‘అక్రమ ఆస్తుల’ కేసు విచారణకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇరు సంస్ధలకు చెందిన బ్యాంకు ఖాతాలను సి.బి.ఐ స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత…

ఇరాన్ ఆయిల్ కొనుగోలు పెంచిన టర్కీ

ఇరాన్ నుండి కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ మొత్తాన్ని టర్కీ అధికం చేసింది. ఇరాన్ తయారు చేయని అణు బాంబు ప్రపంచ శాంతికి ప్రమాదం అని చెబుతూ ఆదేశానికి వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ చట్టం చేసి తమ చట్టాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్న అమెరికాకి టర్కీ ఈ విధంగా సమాధానం చెప్పింది. ఫిబ్రవరి తో పోలిస్తే మార్చి నెలలో ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ దాదాపు మూడు రెట్లు పెరిగిందని…

2జి: కేంద్రం U-టర్న్ (గ్రాఫిక్)

2జి స్పెక్ట్రం కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది. ప్రవేటు టెలికం కంపెనీలు అక్రమంగా పొందిన లైసెన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు తీర్పు పై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను ఉపసంహరించు కోవాలని నిర్ణయించింది. ప్రవేటు కంపెనీలు పొందిన 122 అక్రమ లైసెన్సులను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012 తేదీన ఇచ్చిన తీర్పులో రద్దు చేసింది. దేశ సహజ వనరుల విషయంలో మొదట వచ్చినవారికి మొదట లైసెన్సు లు కేటాయించే పద్ధతి…

ఇరాన్ ఆయిల్: అమెరికా ఒత్తిడికి ఇండియా ప్రతిఘటన

ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులను మరింతగా తగ్గించాలని అమెరికా తెస్తున్న ఒత్తిడిని భారత ప్రభుత్వం ప్రతిఘటిస్తున్నట్లుగా విదేశాంగ మంత్రి ప్రకటన సూచిస్తోంది. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలను భారత దేశం అమలు చేయాలంటే గల్ఫ్ ప్రాంతంలో నివశిస్తున్న భారతీయుల భద్రత కూడా పరిగణించాలని హిల్లరీ క్లింటన్ కి చెప్పినట్లు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ పత్రికలకు తెలిపాడు. గల్ఫ్ ప్రాంతంలో భారత దేశానికి కీలకమైన భద్రతా ప్రయోజనలు ఉన్నాయని ఆయన అమెరికా అతిధికి గుర్తు చేశాడు.…