చైనా కంపెనీలతో దేశ భద్రతకి ప్రమాదం, అమెరికా కమిటీ హెచ్చరిక

చైనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీలతో జాతీయ భద్రతకి ప్రమాదం కలగవచ్చని అమెరికా కమిటీ ఒకటి హెచ్చరించింది. ముఖ్యంగా ప్రఖ్యాత టెలీ కంపెనీలయిన హువి, జెడ్.టి.ఇ కంపెనీల వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అమెరికా కాంగ్రెస్ కమిటీ హెచ్చరించింది. అమెరికా కంపెనీల స్వాధీనం, విలీనాల నుండి ఈ రెండు కంపెనీలను నిషేధించాలని సిఫారసు చేసింది. కాగా, తమ సిఫారసుకు కమిటీ చూపిన కారణం అత్యంత హాస్యాస్పదంగా ఉంది. చైనా ప్రభుత్వంతోనూ, మిలటరీతోనూ తమకు సంబంధం లేదని రుజువు…

అణు శక్తి లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీరతాయి -అధ్యయనం

అణు విద్యుత్ తో పని లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. బెంగుళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐ.ఐ.ఎస్.సి) కి చెందిన ప్రొఫెసర్లు తయారు చేసిన అధ్యయన నివేదిక ఈ సంగతి ప్రకటించింది. సౌర విద్యుత్తుతో పాటు ఇతర సాంప్రదేయేతర విద్యుత్ వనరుల ద్వారా భారత దేశం యొక్క పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ‘కరెంట్ సైన్స్’ అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అణు విద్యుత్…

వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ…

భారత విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ తీర్చేనా? -కార్టూన్

విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు భారత దేశం చేసే ప్రయాణంలో అణు విద్యుత్ కర్మాగారాలు సహాయపడతాయా?  లేక ఆటంకం కలిగిస్తాయా? ‘ది హిందూ’ కార్టూనిస్టు ‘కేశవ్’ కాసిన్ని గీతలు గీసి, మరి కాసిన్ని రంగులు అద్ది వివరించారు. అమెరికన్ అణు పరిశ్రమ వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికే భారత్-అమెరికాల మధ్య ‘అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామని అణు నియంత్రణ సంస్ధ ఎ.ఇ.ఆర్.బి మాజీ అధిపతి గోపాల కృష్ణన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టాడు. గతంలో అణు…

చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి

అమెరికన్ కంపెనీలకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. దేశంలో ఇరవై కోట్లమందికి ఉపాధి నిస్తున్న చిల్లర వర్తకాన్ని తీసుకెళ్లి వాల్ మార్ట్ చేతుల్లో పెట్టింది. చిల్లర కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్న ఐదు కోట్ల కుటుంబాలను వీధి పాలు చేస్తూ రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా పత్రికలకు చెప్పలేదు. పేరు చెప్పవద్దని కోరుతూ ఒక…

పన్నులు ఎగవేయడానికి పౌరసత్వం త్యజించనున్న ఫ్రాన్సు సంపన్నుడు!

బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఫ్రాన్సులో అత్యంత సంపన్నుడు. 41 బిలియన్ యూరోల (52.33 బిలియన్ డాలర్లు, 2.9 లక్షల కోట్ల రూపాయలు) ఆస్తులతో ప్రపంచంలోనే నాలుగో స్ధానంలో ఉన్న కుబేరుడు. ఈయనకి అర్జెంటుగా ఓ సమస్య వచ్చి పడింది. ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హాలండే, సూపర్ ధనవంతుల ఆదాయాలపైన 75 శాతం పన్ను వేయనున్నట్లు ప్రకటించడమే ఈయన సమస్య. అధ్యక్షుడు హాలండే, సంవత్సరానికి 1 మిలియన్ యూరోల కు మించి ఆదాయం పొందుతున్నవారిపై 75 శాతం పన్ను వేస్తానని…

‘బేచులర్ పార్టీ’ సినిమా నెట్ లో చూసినందుకు 1010 మందిపై కేసులు

కేరళ పోలీసులకు చెందిన యాంటీ-పైరసీ విభాగం ఏకంగా 1010 మంది నెట్ వినియోగదారులపై కేసులు పెట్టింది. ‘బేచులర్ పార్టీ’ అనే మళయాళం సినిమాని ఇంటర్నెట్ లో అప్ లోడ్ గానీ, డౌన్ లోడ్ గానీ చెయ్యడమే వీరు చేసిన నేరం. దేశంలో ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారని ‘ది హిందూ’ చెబుతోంది. బొగ్గు గనుల్ని దోచుకున్న వారిని ఏమీ చెయ్యలేకపోగా పార్లమెంటు సైతం వారికి అండగా ఉంటుంది.  ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకున్నవారిని…

బొగ్గు కుంభకోణంలో మీడియా, మాయమవుతున్న ఫోర్త్ ఎస్టేట్

2జి కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మీడియా బొగ్గు కుంభకోణంలో నేరుగా లబ్ది పొందినట్లు సి.బి.ఐ పరిశోధనలో వెల్లడైంది. నాలుగు మీడియా కంపెనీలు అక్రమ లబ్ది పొందాయని ‘ది హిందూ’ చెప్పినప్పటికీ పేర్లు వెల్లడించలేదు. నెట్ వర్క్ 18 (ఐ.బి.ఎన్ గ్రూపు), డి.బి కార్ప్ (డెయిలీ భాస్కర్ గ్రూపు) లు లబ్ది పొందిన మీడియా కంపెనీల్లో ఉన్నాయని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.  తమకు కేటాయించిన బొగ్గు గనులనుండి కంపెనీలు అక్రమ లబ్ది పొందాయన్న ఆరోపణలపై సి.బి.ఐ విచారణ…

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…

మధ్య ప్రదేశ్ కోల్-గేట్: కాంగ్రెస్, బి.జె.పి ఇరువురూ పాత్రధారులే

బొగ్గు కుంభకోణం దరిమిలా ప్రధాని రాజీనామాకు బి.జె.పి పట్టుబడుతున్న నేపధ్యంలో బి.జె.పి ముఖ్యమంత్రుల ‘మినీ బొగ్గు కుంభకోణాలు’ బైటికి వస్తున్నాయి. 2011 లో రిలయన్స్, ఎస్సార్ కంపెనీలకు బొగ్గు గనులు తవ్వకానికి అనుమతి ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో లాబీయింగ్ నిర్వహించి సఫలమయిన విషయాన్ని ‘ది హిందూ’ పత్రిక వెల్లడి చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మాజీ మంత్రి జై రామ్ రమేష్ తీవ్ర అభ్యంతరాలను పక్కనబెట్టి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం

నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో…

2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?

సహజ వనరు అయిన 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇష్టారీతిన పంచి పెట్టడం వలన భారత ప్రభుత్వ ఖజానాకు గరిష్టంగా 1,76,645 కోట్ల నష్టం వచ్చిందని ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఎ.జి) 10 నవంబర్, 2010 తేదీన నివేదిక వెలువరించింది. కాగ్ నివేదిక అంచనా వేసిన మొత్తం భారీగా ఉండడంతో పత్రికలు దానిని సంచలనం చేశాయి. అప్పటి నుండీ ఏదో ఒక రూపంలో (కేసులు, ఖండన మండన ప్రకటనలు, నీరా…

గీతిక శర్మ ఆత్మహత్యకు కారకుడు హర్యానా హోమ్ మంత్రి

ఎయిర్ హోస్టెస్ గీతిక శర్మ ఢిల్లీలోని తన గదిలో ఫ్యానుకి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హర్యానా రాష్ట్ర హోమ్ మంత్రి గోపాల్ గోయల్ కాండా, అతని ఎక్జిక్యూటివ్ అరుణ చద్దా లే తన ఆత్మహత్యకు కారకులని ఆత్మహత్య లేఖలో రాసి చనిపోయింది. వీరిద్దరూ తన జీవితాన్ని నాశనం చేశారనీ, నమ్మకద్రోహానికి పాల్పడ్డారనీ, వారి స్వప్రయోజనాల కోసం తన జీవితాన్ని బలితీసుకున్నారనీ ఆమె తన లేఖలో ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేసిందే కాక తన తల్లిదండ్రులను…

భారత జలాల్లోకి రాకుండా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లపై నిషేధం

అమెరికా షరతులకు తలొగ్గి ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకునేది లేదంటూ డంబాలు పలికిన భారత ప్రభుత్వం సరిగ్గా అందుకు విరుద్ధమైన కార్యాచరణకు దిగింది. అమెరికా ఆంక్షలు విధించిన ఇరానియన్ నౌకలను భారత సముద్ర జలాల్లో ప్రవేశించకుండా నిషేధం విధించింది. తద్వారా, ఐక్యరాజ్య సమితి విధిస్తే తప్ప వివిధ దేశాలు సొంతగా విధించే ఆంక్షలను ఇండియా అమలు చేయదన్న విధాన ప్రకటనను ప్రభుత్వం తానే ఉల్లంఘించింది. అంతేకాక భారత ప్రజల ప్రయోజనాలా లేక పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలా…

అమెరికాలో కరువు, గత పాతికేళ్లలో ఇదే తీవ్రం

గ్లోబల్ వార్మింగ్ కు అన్ని దేశాల కంటే అధికంగా కారణంగా నిలిచిన అమెరికా ఫలితం అనుభవిస్తోంది. అనావృష్టి వలన గత పాతికేళ్ళలోనే అత్యంత తీవ్రమైన స్ధాయిలో కరువు ఏర్పడిందని అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపాడు. వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బ తిని ఆహార ద్రవ్యోల్బణం తీవ్రం కానున్నదని అమెరికా వ్యవసాయ కార్యదర్శి టాం విల్సక్ బుధవారం పత్రికల సమావేశంలో చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది. విస్తార ప్రాంతాల్లో మొక్క జొన్న, సోయా బీన్స్ లాంటి…