తగ్గిపోయిన రిలయన్స్ జియో ఖాతాదారుల సంఖ్య

రిలయన్స్ మొబైల్ వైర్ లెస్ ఖాతాదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇలా తగ్గుదల నమోదు కావడం రిలయన్స్ జియో కంపెనీకి ఇది మొదటిదారిగా తెలుస్తున్నది. డిసెంబర్ 2021 నెలలో మొత్తం మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్యలోనే తగ్గుదల నమోదు కాగా అందులో ప్రధాన భాగం రిలయన్స్ కంపెనీ దే కావటం గమనార్హం. టెలికాం రంగం నియంత్రణ సంస్థ ‘టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడి చేసిన గణాంకాల ప్రకారం ఇండియాలో వైర్ లెస్ ఖాతాదారుల సంఖ్య…

శ్రీలంక సంక్షోభం, సాయం చేసేందుకు ఇండియా చైనా పోటీ

శ్రీలంక ఇటీవల కాలంలో ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. సంక్షోభం నుండి గట్టెక్కేందుకు శ్రీలంక బహిరంగంగానే ఇండియా సహాయం కోరింది. ఆ మేరకు ఇండియా కూడా గత నవంబరులో కొన్ని హామీలు ఇచ్చింది. ప్రమాదం గ్రహించిన చైనా తానూ సహాయం చేస్తానంటూ ముందుకు వస్తోంది. జనవరి మొదటి వారంలో చైనా విదేశీ మంత్రి శ్రీలంక పర్యటించనున్నారు. జనవరి 7 తేదీ గానీ లేదా 9 తేదీ గానీ ఈ పర్యటన జరగనున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యటనలో శ్రీలంకకు నోరూరించే…

ఇది హిందూత్వ కాదు ‘చోర్ బజార్’! -శివ సేన

హిందూత్వను ఎవరు నిజాయితీగా ఆచరిస్తున్నారు అన్న అంశంలో బి‌జే‌పి, శివసేన పార్టీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో కలిసి శివసేన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రం అయింది. బి‌జే‌పి తో స్నేహం విడనాడి లిబరల్ బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో జట్టు కట్టడమే హిందూత్వ సిద్ధాంతానికి ద్రోహం చెయ్యడంగా బి‌జే‌పి ఆరోపిస్తుంది. అసలు బి‌జే‌పి ఏనాడో హిందూత్వను వదిలి పెట్టి అవినీతికి,…

కోవిడ్ భవిష్యత్తు చెప్పే అర్హత బిల్ గేట్స్ కి ఎక్కడిది?

అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి తెలియని వారు ఉండరు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి కంపెనీలు వచ్చేవరకూ ప్రపంచ సాఫ్ట్ వేర్ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. అనేక మూడో ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు కూడా ఆయనతో స్టేజి పంచుకోవటానికి ఉబలాట పడేవారు. కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రధాన ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తనకు తెలిసింది తక్కువే అని ఆయన పలుమార్లు చెప్పుకున్నాడు. ఆరంభంలో…

రిపేర్ ఖర్చు పెట్టలేక టెస్లా ఎలక్ట్రిక్ కారు పేల్చేసిన ఓనర్!

ఇది ఫిన్లాండ్ దేశంలో జరిగింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టింది పేరు. ఎలాన్ మస్క్ ఈ కంపెనీ వ్యవస్ధాపకుడు. టెస్లా కంపెనీకి సి‌ఈ‌ఓ ఆయనే.  ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం కంపెనీల యజమాని మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేశాక, వాట్సప్ ని మొబైల్ ఫోన్ల నుండి తీసేసి దాని బదులు సిగ్నల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోమని యూజర్లకు ట్విట్టర్ ద్వారా సలహా ఇవ్వడం లాంటి చర్యలు, ప్రకటనల ద్వారా…

ఒమిక్రాన్ వైరస్ మిస్టరీ!

శాస్త్రవేత్తలకు ఒమిక్రాన్ ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది. దానికి కారణం గత కోవిడ్ రకాలతో పోల్చితే దీని లక్షణాలు కాస్త భిన్నంగా ఉండడం. డెల్టా రకం వైరస్ తో పోల్చితే ఒమిక్రాన్ లక్షణాలు తేలికపాటి గా ఉండడం ఇప్పటికీ ఊరటగా ఉంది. కానీ లక్షణాలు తేలికగా ఉన్నాయని చెప్పి దాన్ని తక్కువ అంచనా వేయడం తగదని WHO గట్టిగా హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉన్నా ముందు ముందు అది ఎలాంటి లక్షణాలు సంతరించు కుంటుందో…

ఒమిక్రాన్ పైన వ్యాక్సిన్ ప్రభావం లేదు -యూ‌ఎస్ స్టడీ

తాజాగా విస్తరిస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్ ఒమిక్రాన్. దీని దెబ్బకు పశ్చిమ దేశాలు అల్లాడుతున్నాయి. భారత దేశంలో ఒమిక్రాన్ విస్తరణ ఇంకా పెద్దగా నమోదు కాలేదు గానీ అమెరికా, ఐరోపా దేశాల్లో మాత్రం ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు అక్కడి పత్రికలు తెగ వార్తలు ప్రచురిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒమిక్రాన్ రకం వైరస్ గురించి అదే పనిగా హెచ్చరిస్తోంది. ఉదాసీనత వద్దని, తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రకటనలు గుప్పిస్తోంది. మరోపక్క అమెరికాలో, జర్మనీ,…

వ్యాక్సిన్: ప్రజల కంపెనీల్ని మూలకు తోసి ప్రైవేటుని మేపుతున్నారు!

ప్రజల కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అని. వ్యాక్సిన్ల తయారీలో భారత దేశం పేరెన్నిక గన్నది. ప్రభుత్వ రంగంలో వ్యాక్సిన్ పరిశోధన మరియు తయారీ కంపెనీలను స్ధాపించి నిర్వహించడంలో భారత దేశానికి పెద్ద చరిత్రే ఉన్నది. ఎల్‌పి‌జి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలను చేపట్టిన ఫలితంగా ఈ ప్రజల/ప్రభుత్వ కంపెనీలను ఒక్కటొక్కటిగా మూసివేస్తూ వచ్చారు. దానితో వ్యాక్సిన్ తయారీలో స్వయం సమృద్ధ దేశంగా ఉన్న భారత దేశం ఇప్పుడు పరాధీన దేశంగా మారిపోయింది. విదేశీ ప్రైవేటు…

రాఫేల్: బి‌జే‌పి నేతలారా, అధికారం మీదేగా విచారణ చెయ్యరేం?

భారతీయ జనతా పార్టీ (బి‌జే‌పి) నేతల ధోరణి మరీ విడ్డూరంగా కనిపిస్తోంది. కేంద్రంలో ప్రభుత్వాధికారం ఉన్నది బి‌జే‌పి చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోని అత్యంత శక్తివంతమైన విచారణ సంస్ధలన్నీ బి‌జే‌పి ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కమీషన్ చేతులు మారినట్లు వచ్చినట్లు ఆరోపణలపై విచారణ చేయవలసిన బాధ్యత బి‌జే‌పి పైనే ఉన్నది, అధికారం కూడా వారి చేతుల్లోనే ఉన్నది. అలాంటిది ఫ్రెంచి పరిశోధనా వార్తల పోర్టల్ మీడియా పార్ట్ తాజాగా…

రాఫెల్ డీల్: లంచం సాక్ష్యాలున్నా సి‌బి‌ఐ దర్యాప్తు చేయలేదు!

ఫ్రాన్స్ యుద్ధ విమానాల కంపెనీ దాసో ఏవియేషన్ (Dassault Aviation), భారత దేశానికి రాఫేల్ యుద్ధ విమానాలు సరఫరా చేసిన సంగతి తెలిసిందే. యూ‌పి‌ఏ హయాంలోనే 125 విమానాల సరఫరాకు ఒప్పందం కుదిరినా అంతిమ ఒప్పందం సాగుతూ పోయింది. నరేంద్ర మోడి అధికారం చేపట్టిన వెంటనే ఈ ఒప్పందాన్ని పరుగులు పెట్టించాడు. ఒప్పందాన్ని ప్రభుత్వం-ప్రభుత్వం ఒప్పందంగా మార్చి 36 రాఫేల్ జెట్ విమానాలు సరఫరాకు ఒప్పందం పూర్తి చేశాడు. ఈ ఒప్పందంలో లంచం చేతులు మారాయని ఫ్రెంచి…

ఫ్రాన్స్-బ్రిటన్ మధ్య తీవ్రమైన చేపల తగాదా: ఆకస్ పుణ్యం?

ఆస్ట్రేలియా, యూ‌కే, అమెరికాలు కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతం లక్ష్యంగా ‘ఆకస్’ కూటమి ఏర్పడిన నేపధ్యంలో ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల మధ్య చేపల వేట తగాదా మరింత తీవ్రం అయింది. డిసెంబర్ 31, 2020 నాటితో బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తయినప్పటి నుండి అడపా దడపా ఇరు దేశాల ఫిషింగ్ బోట్లు చేపల వేట హక్కుల విషయమై తగాదా పడుతూ వచ్చాయి. నేడు ఆ తగాదా ఫ్రెంచి ప్రభుత్వమే ప్రత్యక్ష చర్య తీసుకునే వరకూ వెళ్లింది. ఆకస్ ఏర్పాటు ఫలితంగా…

క్యూబా వాక్సిన్ రెడీ: ఫార్మా కంపెనీల గుండెల్లో గుబులు

కోవిడ్ 19 (సార్స్-కోవ్-2) వ్యాధి నిర్మూలనకై పశ్చిమ దేశాలకు చెందిన బడా కార్పొరేట్ ఫార్మా కంపెనీలు అనేక వ్యాక్సిన్ లు తయారు చేశాయి. అవసరమైన 3 దశల పరీక్షలు జరిపినట్లు చెప్పాయి. ఇక వైరస్ చచ్చినట్లే అని నమ్మబలికాయి. ఆ మేరకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రియా, జర్మనీ తదితర ధనిక దేశాల అధిపతులు కూడా తమ తమ కంపెనీల తరపున సగర్వ ప్రకటనలు జారీ చేశారు. కానీ వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. తయారైన…

దిగొచ్చిన యూ‌కే, ఇండియాపై కోవిడ్ ఆంక్షలు తొలగింపు

ఇండియా ప్రతీకార చర్యలతో యూ‌కే దిగి వచ్చింది. వ్యాక్సిన్ డోసులు పూర్తిగా వేసుకున్న భారత ప్రయాణీకులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాతో పాటు మరో 47 ఇతర దేశాలపై కూడా ఆంక్షలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10, సోమవారం నుండి గతంలో విధించిన నిబంధనలను భారత ప్రయాణీకులు పాటించనవసరం లేదని యూ‌కే ప్రభుత్వ ఒక ప్రకటనలో తెలిపింది. (లైవ్ మింట్, అక్టోబర్ 8) దీని ప్రకారం స్ధానికంగా ఉత్పత్తి చేసిన కోవి షీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు…

కస్టమ్స్ సుంకం తగ్గించి ట్రంప్ కి ఫోన్ చేసిన మోడి

ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రుల (కేబినెట్) విధాన నిర్ణయాలు ఎవరి ప్రయోజనం కోసం ఉద్దేశించబడి ఉండాలి? ఈ ప్రశ్నకు జవాబు చాలా సులభం. దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు విధానాలు రూపొందించి అమలు చేయాలి. విదేశాలు, విదేశీ కంపెనీల మరియు విదేశీయుల పెట్టుబడుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం పని చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే దేశద్రోహం అవుతుంది. భారత దేశ రక్షణ కోసం పని చేసే ఆర్మీ-నేవీ-ఎయిర్ ఫోర్స్ అధికారులు రక్షణ రహస్యాలను విదేశాలకు అందజేస్తే…

గోవా బి‌జే‌పి అవినీతి: 88 మైనింగ్ కాంట్రాక్టులు రద్దు చేసిన కోర్టు

కాంగ్రెస్ పార్టీ అవినీతికి రారాజు అని బి‌జే‌పి నేతలు తిట్టి పోస్తారు. ఎన్నడూ నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడన్నా నోరు తెరిస్తే మాత్రం కాంగ్రెస్ అవినీతి గురించీ, అనువంశిక పాలన గురించీ విమర్శించకుండా ఉండడు. కానీ కాంగ్రెస్ అవినీతిని కొనసాగించడానికి మాత్రం బి‌జే‌పికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. గోవా బి‌జే‌పి ప్రభుత్వం రెన్యూవల్ చేసిన 88 మైనింగ్ లీజులు అక్రమం అని సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్ధారించింది. లీజులను రద్దు చేస్తూ ఈ రోజు…