అణు విద్యుత్తుతో ఆటలా? -కత్తిరింపు

ఏప్రిల్ 30 తేదీన (ఈ రోజు) ఈనాడు ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఇది. అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు రాశారు. తమిళనాడులో నిర్మించబడుతున్న కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి రష్యా నుండి నాసిరకం పరికరాలు సరఫరా అయ్యాయని ఆరోపణలు గుప్పుమన్న నేపధ్యంలో ఈ వ్యాసం వెలువడింది. నాసిరకం ఉక్కుతో తయారు చేసిన విడి పరికరాల వలన అణు విద్యుత్ కర్మాగారానికి ముప్పు పొంచి ఉన్నదని రచయిత చర్చించారు. కూడంకుళం అణు కర్మాగారాన్ని భారత ప్రభుత్వం…

బతుకులు చిదిమిన ఈ సౌధం, మానవ నిర్మిత విషాదం -ఫోటోలు

బంగ్లాదేశ్ లో అత్యంత శక్తివంతమైన బట్టల తయారీదారులు తమ లాభ దాహంతో 324 మందికి మరణ శాసనం లిఖించారు. గంటల తరబడి నీరు, ఆహారం అందక వేడి వాతావరణంలో డీ హైడ్రేషన్ వల్ల చనిపోయినవారు కొందరైతే, భవనాల గోడల మధ్య, కాంక్రీటు నేలల మధ్య చిక్కుకుని చితికిపోయినవారు మరికొందరు. శిధిలాల చుట్టూ వేలాది జనం తమవారి కోసం విలపిస్తూ అధికారులు గోడలపైన అంటిస్తున్న జాబితాల్లో తమవారి పేర్లు వెతుక్కుంటూ విషాదం అంతా కళ్ళల్లో నింపుకుని కనిపిస్తున్నారు. ఢాకా…

బొగ్గు కేటాయింపులు చట్ట విరుద్ధం -పార్లమెంటు కమిటీ

బొగ్గు గనుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టారీతిన బొగ్గు గనులను కేటాయించారని, గనుల కేటాయింపులో ఎలాంటి పారదర్శకత గానీ, సక్రమమైన పద్ధతులు గానీ పాటించలేదని దుయ్యబట్టింది. ప్రజలు అప్పజెప్పిన అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగపరిచారని జాతీయ సహజ వనరులను కొద్ది సంఖ్యలోని కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా దోచిపెట్టిందని తేల్చి చెప్పింది. 1993-2010 మధ్య కాలంలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ దేశానికి మసి పూయడంలో భాగస్వామ్యం…

టెక్సాస్: భూకంపం తలపిస్తూ ఎరువుల ఫ్యాక్టరీ పేలుడు, మరణాలు 70? -ఫోటోలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వాకో నగరం వద్ద ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ భారీ స్ధాయిలో పేలిపోయింది. 5 నుండి 15 మంది వరకు చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతుండగా పత్రికలు డజన్ల మంది మరణించి ఉండవచ్చని భావిస్తున్నాయి. 70 మందికి పైనే మరణించారని స్ధానిక పత్రికలు చెప్పినట్లు తెలుస్తోంది. 160 మందికి పైగా గాయపడ్డారని బి.బి.సి తెలిపింది. ఎరువుల ఫ్యాక్టరీ కావడంతో మంటల వలన వ్యాపిస్తున్న దట్టమైన పొగ విషపూరితంగా ఉన్నదని, దానితో వివిధ విభాగాల భద్రతా…

రేషన్ షాపు కాదు బంగారం కొట్టు -కార్టూన్

“ఇది రేషన్ కోసం. బంగారం కోసం క్యూ అదిగో, అక్కడుంది!” ——————————— గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీ స్ధాయిలో పతనం అవుతోంది. ఇండియాలో అయితే గత శనివారం నుండి బంగారం రేటు పెద్ద ఎత్తున పడిపోతోంది. మంగళవారం వరకు భారీగా పతనం అయిన బంగారం ధర బుధవారం కూడా పతనం కొనసాగి ట్రేడింగ్ చివర కొద్దిగా పెరిగినట్లు తెలుస్తోంది. భుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర 25,790 రూపాయల వద్ద…

ప్రధాని జర్మనీ పర్యటన, ఏ రోటి కాడ ఆ పాట!

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జర్మనీ కంపెనీలు ఆతృతగా ఎదురు చూడగా అది పెద్దగా ముందుకు సాగలేదని తెలుస్తోంది. ఆరు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రకటించాయి. సోలార్ ఎనర్జీ లాంటి సాంప్రదాయేతర ఇంధన టెక్నాలజి, విద్య, వ్యవసాయం తదితర రంగాలలో ఈ ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఆరేళ్లలో ఒక బిలియన్ యూరోలు రుణం ఇస్తామని హామీ ఇచ్చారుట. జర్మనీ కార్ల దిగుమతులపై అధిక పన్నులు వేయడం పట్ల…

గూగుల్ మోసాలను కట్టడి చేయండి -మైక్రోసాఫ్ట్, ఒరకిల్ ఫిర్యాదు

వినియోగదారుల ప్రైవసీని ఉల్లంఘించి సొమ్ము చేసుకుంటున్న గూగుల్ చర్యలను కట్టడి చేయాలని 17 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల గ్రూపు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) కి ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల మార్కెట్ లో అవాంఛనీయ పద్దతుల్లో తన ఉత్పత్తులకు మార్కెట్ చేసుకుంటూ పోటీకి, సరికొత్త ఆవిష్కరణలకు ఆటంకంగా గూగుల్ పరిణమించిందని పదిహేడు కంపెనీల కన్సార్టియం ‘ఫెయిర్ సెర్చ్’ తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా మైక్రో సాఫ్ట్ కంపెనీ గూగుల్ కంపెనీ పై మళ్ళీ…

చమురు లీకేజి శుభ్రం చేసే కార్మికుల కష్టాలు చూసితీరాలి -ఫోటోలు

జులై 17, 2010 తేదీన చైనా ఈశాన్య రాష్ట్రం లియావోనింగ్ లో చమురు ప్రమాదం సంభవించి ‘పచ్చ సముద్రం’ ను ముంచెత్తింది. చమురు డాక్ యార్డ్ లో చమురు ట్యాంకులు పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం చమురు లీకేజీని అరికట్టడానికి, పొర్లిపోయిన చమురుని తిరిగి ఎత్తి వినియోగంలోకి తేవడానికీ, సముద్ర కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ఆ దృశ్యాలే ఇవి. 1500 తన్నుల క్రూడాయిలు సముద్రంలోకి ఒలికిపోగా అందులో మూడో వంతుని…

పోటీ పేరుతో డేటా చౌర్యం, గూగుల్ అతి తెలివి

‘స్ట్రీట్ వ్యూ’ కార్ల ద్వారా పశ్చిమ దేశాలలో పౌరుల వివరాలు అనుమతి లేకుండా సంపాదించి విచారణ ఎదుర్కొంటున్న గూగుల్ కంపెనీ భారత దేశ వివరాలు సంపాదించడానికి ‘మేపధాన్’ పోటీని ఎరగా వేసింది. ప్రత్యక్షంగా తాను డేటా సేకరించడం ‘చౌర్యం’ కిందికి రావడంతో అమాయక వినియోగదారులను అడ్డం పెట్టుకుని సృజనాత్మక పద్ధతుల్లో ‘డేటా చౌర్యానికి’ గూగుల్ పూనుకుంది. గూగుల్ అతి తెలివిని పసిగట్టిన బి.జె.పి ఎం.పిలు ఫిర్యాదు చేయడంతో, అధికారిక ‘రాజకీయ భౌగోళిక మేప్ ల నిర్వహణకు’ బాధ్యురాలయిన…

ఫుకుషిమా అణు ఫ్యాక్టరీలో మళ్ళీ పవర్ కట్

రెండేళ్ల క్రితం భారీ ప్రమాదం సంభవించిన ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మూడో నెంబరు అణు రియాక్టరు వద్ద వాడిన అణు ఇంధనాన్ని చల్లబరిచే కూలింగ్ వ్యవస్ధ రెండు గంటల సేపు విఫలం అయిందని జపాన్ వార్తా సంస్ధ క్యోడో న్యూస్ ఏజన్సీని ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది. నెల రోజులలో ఇక్కడ విద్యుత్ సరఫరా విఫలం కావడం ఇది రెండోసారి. తక్షణ ప్రమాదం ఏమీ లేదని అణు కర్మాగారం నిర్వహిస్తున్న…

ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని

కేరళ జాలర్లను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇటలీ మెరైన్లను ఇండియాకు పంపక పోయి ఉన్నట్లయితే అంతర్జాతీయంగా ఇటలీ ఒంటరి అయుండేది అని ఆ దేశ ప్రధాని మారియో మోంటి గురువారం వ్యాఖ్యానించాడు. మెరైన్లను వెనక్కి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ విదేశీ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా చేయడంతో మారియో నాయకత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. న్యూ ఢిల్లీతో సంబంధాల విషయంలో తీవ్రమైన స్ధాయిలో…

చైనాలో కోకాకోలా గూఢచర్యం?

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ‘సైబర్ గూఢచర్యం‘ ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి. చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే…

ఐరాస మానవ హక్కుల ఓటుకు భారత్ పై శ్రీలంక ప్రతీకారం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ…

చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు

– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…

మోడి ప్రసంగం కేన్’సెల్’ -కార్టూన్

‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘, మోడి ప్రసంగం రద్దు చేయడం వలన ఎవరికి మేలు జరిగినట్లు? మార్చి 22-23 తారీఖుల్లో ఫిలడెల్ఫియా లో జరగనున్న ఫోరం సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని నరేంద్ర మోడిని ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ ఆహ్వానించింది. కానీ ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా‘ లోని కొందరు విద్యార్ధులు, బోధన సిబ్బంది మోడికి ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002లో ముస్లిం ప్రజలపై జరిగిన అమానుష హత్యాకాండ దరిమిలా అమెరికా ప్రభుత్వమే మోడీకి…