దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…

22 బ్యాంకులకు 50 కోట్ల జరిమానా విధించిన ఆర్.బి.ఐ

సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా…

ఎన్.ఎస్.ఎ తో కుమ్మక్కై యూజర్లను మోసం చేస్తున్న మైక్రోసాఫ్ట్

అమెరికా రహస్య గూఢచార సంస్ధ ఎన్.ఎస్.ఎ -నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ- తో పేరు పొందిన కంప్యూటర్ సాఫ్ట్ వేర్ సంస్ధ మైక్రోసాఫ్ట్ కుమ్మక్కయింది. “Your privacy is our priority” అన్న తన మోటోకు తానే స్వయంగా తూట్లు పొడుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన విండోస్, ఈ మెయిల్ సంస్ధ ఔట్ లుక్ డాట్ కామ్ లకు తాను రూపొందించిన పటిష్టమైన ఎన్ క్రిప్షన్ ను ఛేదించి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించగల తాళాన్ని తానే…

అమెరికాలో ప్రయాణికుల విమానం క్రాష్ ల్యాండింగ్ -ఫోటోలు

సౌత్ కొరియాకు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి అమెరికాలోని శాన్ ఫ్రాన్ సిస్కో నగర విమానాశ్రయంలో దిగుతుండగా అదుపు తప్పి కూలిపోయింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా 181 మంది వరకూ గాయపడ్డారు. గాయపడ్డివారిలో కనీసం 50 మంది పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదుపు తప్పి కూలుతుండగా విమానానికి మంటలు అంటుకోవడంతో పలువురు ప్రయాణీకులకు కాలిన గాయాలు అయ్యాయి. ‘ఏసియానా ఎయిర్ లైన్స్’ రవాణా కంపెనీకి చెందిన బోయింగ్ 777 విమానం పైలట్లు…

ఐరోపా రాయబారులపై నిఘా, అమెరికాపై ఇ.యు ఆగ్రహం

అమెరికా గూఢచారులకు ఒక్క జనం మాత్రమే కాదు, ఐరోపా రాయబారులు కూడా లోకువే. యూరోపియన్ యూనియన్ రాయబారులు, ఇతర అధికారుల సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లపై కూడా ఎన్.ఎస్.ఎ గూఢచారులు నిఘా వేశారని స్నోడెన్ పత్రాలను ఉటంకిస్తూ జర్మన్ వార్తల మ్యాగజైన్ డర్ స్పీజెల్ తెలిపింది. ఈ మేరకు ది హిందూ ఓ వార్త ప్రచురించింది. ప్రపంచ వ్యాపితంగా సమస్త దేశాల ఇంటర్నెట్, సెల్ ఫోన్ వినియోగదారుల సంభాషణలపై ‘ప్రిజమ్’ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా నిఘా…

ఔషధ కంపెనీలకు రోగులే పాడియావులు -కార్టూన్

– భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై  యేడ్చు చుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు  బిగియ బట్టి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యం ఇది. భారత జాతీయోద్యమంలో, ఆ తర్వాత కూడా ఈ పద్యం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ పధ్యంలో తెల్లవారి స్ధానంలో బడా ఫార్మసీ కంపెనీలను, లేగదూడలుగా రోగులను చేర్చి చదువుకుంటే చక్కగా సరిపోతుంది. ఈ కార్టూన్ కూడా అదే చెబుతోంది. రాన్ బ్యాక్సీ కంపెనీ ఒక లైఫ్ సేవింగ్…

స్నోడెన్: ఈక్వడార్ కు అమెరికా బెదిరింపులు

ఇంటర్నెట్ కంపెనీల ద్వారా ప్రపంచ ప్రజలపై అమెరికా సాగిస్తున్న గూఢచర్యాన్ని, ఏకాంత హక్కుల ఉల్లంఘనను వెల్లడి చేసిన మాజీ సి.ఐ.ఏ టెక్నీషియన్ ఎడ్వర్డ్ స్నోడెన్ కేంద్రంగా అమెరికా బెదిరింపులు కొనసాగుతున్నాయి. మాస్కో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ ను వెంటనే తమకు అప్పగించాలనీ, లేకపోతే రష్యా-అమెరికా సంబంధాలు దెబ్బ తింటాయని హెచ్చరించిన అమెరికా, స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపుతున్న ఈక్వడార్ ను తీవ్రంగా బెదిరిస్తోంది. అమెరికా ప్రభుత్వం లోని వివిధ నాయకులు, అధికారులు ఈక్వడార్ పై వాణిజ్య…

అమెరికా నిఘాపై పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు

భారత ప్రజల వ్యక్తిగత వివరాలను అక్రమంగా సేకరిస్తూ, వారి రోజువారీ సంభాషణలపై నిఘా పెడుతున్న అమెరికా పైన భారత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ కు అర్జెంటు హియరింగ్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. అమెరికా మిలట్రీ గూఢచార సంస్ధ ఎన్.ఐ.ఏ భారతీయుల ఇంటర్నెట్ కార్యకలాపాల డేటాను ‘ప్రిజమ్’ అనే ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా సేకరించడానికి ఇంటర్నెట్ కంపెనీలు అంగీకరించడం వలన భారత జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పిటిషనర్ ఆరోపించారు. ఢిల్లీ…

అమెరికా గూఢచర్యం: ప్రిజమ్ గుప్పిట ప్రపంచ ప్రజల తలరాతలు

ప్రైవసీ పాలసీల పేరుతో గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రోసాఫ్ట్, యాపిల్ తదితర భారీ ఇంటర్నెట్ కంపెనీలు మనకు చూపిస్తున్నదంతా వాస్తవం కాదని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా అంగీకరించాడు. అమెరికా ప్రజల భద్రత కోసం తమ గూఢచార సంస్ధలకు ప్రపపంచ ప్రజల వ్యక్తిగత సమాచారం, వారి ఇంటర్నెట్ కార్యకలాపాలు, వారు షేర్ చేసుకొనే ఫోటోలు, వారు పంపుకునే ఈ మెయిళ్ళు అన్నీ తమకు కావలసిందేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశాడు. అంతర్జాల కంపెనీలు ‘అబ్బే,…

ఇ.యు, చైనాల వాణిజ్య యుద్ధం, మొదటి అంకం మొదలు

యూరోపియన్ యూనియన్ చెప్పినట్లుగానే చైనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాలపై దిగుమతి సుంకం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. తద్వారా చైనాతో వాణిజ్య యుద్ధానికి తెర లేపింది. చౌక పరికరాలను పెద్ద ఎత్తున డంపింగ్ చేయడానికి వ్యతిరేకంగానే తాను అదనపు సుంకం విధిస్తున్నట్లు ఇ.యు ప్రకటించింది. సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే సోలార్ పానెళ్లు, బ్యాటరీలు, వేఫర్లు మొదలైన పరికరాలకు 12 శాతం అదనపు సుంకం వేయనున్నట్లు ఇ.యు ట్రేడ్ కమిషనర్ కారెల్ డి గచ్ మంగళవారం తెలిపాడు.…

స్పాట్ ఫిక్సింగ్ వెనక దావూద్, ఛోటా షకీల్

పీట ముడి పడిందో, విడిపోయిందో గానీ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు ఛోటా షకీల్ ల పాత్ర ఉన్నదని కనుగొన్నామని పోలీసులు ప్రకటించేశారు. దానితో స్పాట్ ఫిక్సింగ్ నిందితులు అందరిపైనా MCOCA (Maharashtra Control of Organised Crimes Act) చట్టం కింద కేసులు పెడుతున్నామని వారు తెలిపారు. వారిలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. బుకీలు బెదిరించి ఆటగాళ్లను లొంగదీసుకున్నారని కూడా పోలీసులు చెబుతున్నారు. దావూద్ ముఠా ఆదేశాల…

బి.సి.సి.ఐ మ్యాచ్ ఫిక్స్, ‘శ్రీ’నివాసన్ ఔట్?

ఆదివారం బి.సి.సి.ఐ బోర్డు అత్యవసర సమావేశం జరిపి అధ్యక్షుడు శ్రీనివాసన్ కు ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. కార్యదర్శి జగ్దాలే, ట్రెజరర్ అజయ్ షిర్కే ల రాజీనామాలతో శ్రీనివాసన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి పరిణామాలను కారణంగా చూపుతూ, ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా శనివారం రాజీనామా చేయడంతో ఇక శ్రీనివాసన్ రాజీనామా దాదాపు ఖాయమేనని పత్రికలు చెప్పేస్తున్నాయి. అయితే రాజీనామాకు శ్రీనివాసన్ కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తోంది. తనకు…

రెంటల్ మేన్స్ గేమ్ -కార్టూన్

ఐ.పి.ఎల్ కుంభకోణం గురించి పత్రికల్లో కార్టూన్ల వరద పారుతోంది. జెంటిల్మెన్ గేమ్ గా గొప్పలు చెప్పుకున్న గేమ్ కాస్తా రెంటల్మెన్ గేమ్ గా మారిపోయిందని కార్టూనిస్టు నవరే శ్రేయాస్ వినూత్న రీతిలో స్పష్టం చేస్తున్నారు. ఐ.పి.ఎల్ లో పాత్రధారులైన వివిధ సెక్షన్లకు కుంభకోణం దరిమిలా అది ఒక్కో కంటికి ఎలా కనిపిస్తోందో కార్టూనిస్టు విశ్లేషించారు. ఒక్కోక్కరికి ఒక్కో విధంగా కళ్ళు మూసుకుపోయాయని కూడా ఈ కార్టూన్ కి అర్ధం తీసుకోవచ్చు. ఆటగాళ్లకు డబ్బు తప్ప ఆట కనిపించడం…

కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే -జపాన్ లో ప్రధాని

భారత ప్రధాని మన్మోహన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. భారత దేశంలో ప్రజలకు హామీలు ఇచ్చే అవకాశం ఎన్నడూ రాని ఆయన (ఎన్నికల్లో పోటీ చేయరు గనుక) దానిని జపాన్ లో దొరకబుచ్చుకున్నట్లు కనిపిస్తోంది. అడిగిందే తడవుగా జపాన్ పారిశ్రామిక వేత్తలకు హామీలు ఇచ్చేశారు ప్రధాని మన్మోహన్ సింగ్. ‘కావాలంటే ఇస్తాలే, మావన్నీ ఇక మీవెలే’ అంటూ పరమానంద రాగం ఆలపించినంత పని చేశారు. ‘మీ మార్కెట్లు ఇంకా బాగా తెరవాలి’ అంటే ‘దాందేముంది, మా ప్రజలకు…

జర్మనీలో చైనా ప్రధాని, చర్చకు రానున్న వాణిజ్య ఉద్రిక్తతలు

మూడు దేశాల పర్యటనను ముగించుకున్న చైనా ప్రధాని లీ కెషాంగ్ తన పర్యటనలో చివరి మజిలీ అయిన జర్మనీ చేరుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించిన తర్వాత ఇండియాతో తన మొట్టమొదటి విదేశీ పర్యటనను ప్రారంభించిన లీ అనంతరం పాకిస్తాన్, స్విట్జర్లాండ్ సందర్శించారు. ఆదివారం జర్మనీ చేరుకున్న లీ, జర్మనీ ఛాన్సలర్ తో జరిపే చర్చల్లో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు చర్చకు రానున్నాయని తెలుస్తోంది. వాణిజ్య వ్యవహారాల్లో పరస్పర ఆరోపణలు చేసుకుని ఒకరిపై మరొకరు…