భారత సముద్ర జలాల్లో సాయుధ బ్రిటిషర్ల అరెస్టు

భారత సముద్ర జలాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన ఒక ఓడను ఇండియా అదుపులోకి తీసుకుంది. తమిళనాడులోని ట్యుటుకోరిన్ వద్ద సియర్రా లియోన్ దేశం జెండాతో ఉన్న ఈ ఓడలో అత్యాధునిక ఆయుధాలు ధరించిన బ్రిటిషర్లు ఉన్నారు. వారితో పాటు ఎస్తోనియా, ఉక్రెయిన్, భారత్ జాతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. సియర్రా లియోన్ జెండా ఉన్నప్పటికీ ఓడ వాస్తవానికి ఒక అమెరికా కంపెనీకి చెందినది. ఓడలో అత్యాధునిక ఆయుధాలు ఉండడంతో అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నట్లు భారత అధికారులు అనుమానిస్తున్నారు.…

ఆకలికి నకనకలాడుతున్నవారు 84 కోట్లు -ఐరాస

తీవ్ర ఆకలితో (chronic hunger) అలమటిస్తున్నవారు ప్రపంచంలో 84.2 కోట్లమందని ఐరాస ప్రకటించిన నివేదిక ఒకటి తెలిపింది. 2010-12 కాలంలో ఈ సంఖ్య 86.8 కోట్లని, 2011-13 కాలంలో అది 2.6 కోట్లు తగ్గిందని సదరు నివేదిక తెలిపింది. కాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తీవ్రంగా ఆకలిగొన్నవారు 1.57 కోట్లమంది ఉండడం గమనార్హం. ‘ప్రపంచంలో ఆహార అబధ్రత పరిస్ధితి’ అన్న నివేదికలో ఐరాస ఈ అంశాలను తెలియజేసింది. ఐరాసలోని ఆహార విభాగం ఎఫ్.ఎ.ఓ (Food and Agricultural…

ఒరిగి మునిగిన భారీ ఓడను నిలబెట్టారు -ఫోటోలు

ఈ ఓడ పేరు కోస్టా కంకార్డియా. దాదాపు రెండేళ్ల క్రితం ఈ ఓడ పొరపాటునో, గ్రహపాటునో ఇటలీ లోని ఒక ద్వీపం ఒడ్డుకు దగ్గరగా వచ్చి అడుగును ఢీ కొట్టడంతో పక్కకు ఒరిగిపోయింది. ఆ సందర్భంగా ప్రయాణీకులు, సిబ్బందిలో 32 మంది చనిపోయారు. 600 రోజులకు పైగా ఇలా పక్కకు ఒరిగి ఉండడంతో ఓడ బరువుకు ఒరిగిన వైపు మొత్తం అణిగిపోయి దెబ్బతింది. ‘కోస్టా కంకార్డియా’ను దీనిని తిరిగి నెలబెట్టడానికి ఇటలీ ప్రభుత్వం, కంపెనీలు అప్పటి నుండీ…

అణు పరిహార చట్టం: గదిలో ఏనుగు! -కార్టూన్

“Elephant in the room” అనేది ఆంగ్లంలో ఒక సామెత. ‘చర్చించడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టం లేని సమస్య, కానీ విస్మరించలేని సమస్య’ ను సూచించడానికి ఈ ‘గదిలో ఏనుగు’ సామెతను వాడతారు. భారత అణు పరిహార చట్టం విదేశీ కంపెనీలకు ఈ సామెతను గుర్తుకు తెస్తోంది(ట)! గదిలో ఏనుగు ఉన్నపుడు, భారీ ఆకారంతో ఉంటుంది గనక ఆ గదిలో ఉన్నవారికి ఒక సమస్యగా ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోడానికి వారికి మార్గం లేని పరిస్ధితి వారికి ఉంటుంది.…

అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు

ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు. అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్,…

అమెరికాకు చట్టవిరుద్ధ రాయితీ ఇవ్వడానికి ప్రధాని రెడీ?

భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు…

ఒళ్ళు జలదరించే విమాన విన్యాసాలు -ఫోటోలు

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇటీవల రోజుల్లో జరిగిన విమాన ప్రదర్శనల ఫొటోలివి. పక్షిని చూసి అలాగే ఎగరడానికి మొదట్లో తంటాలు పడిన మనిషి చివరికి ఆ పక్షిని దాటిపోయి ఆకాశం మొత్తం ఆక్రమించేశాడు. మనిషి శక్తి, యుక్తులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేవాటిలో విమానాలు బహుశా ముఖ్య స్ధానంలో ఉంటాయేమో. అయితే కానిబాల్స్ తరహాలో స్వజాతి భక్షణ కోసం మనిషి తెగించడంతో ప్రయాణ విమానాలకు తోడుగా యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. యుద్ధాలు వస్తే తప్ప పని దొరకని…

కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి

భారత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని పక్కకు నెట్టి విదేశాలకు మేలు చేసే నిర్ణయాలను అంతర్జాతీయ వేదికలపై ఒప్పుకుని వచ్చే దేశాధినేతలు ఎక్కడయినా ఉంటారా? మనం ఆ అదృష్టం చేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న వాయువుల విడుదలను అరికట్టే విషయంలో ‘అంతర్జాతీయ ధరిత్రి వేదిక’లపై అమెరికా, ఐరోపాల పెత్తనాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించే ప్రధాని మన్మోహన్ తీరా ఆచరణలోకి వచ్చేసరికి అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను గంగలో కలిపే ఒప్పందంపైన సంతకం చేసిన దారుణానికి ఒడిగట్టారు.…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…

ఇరాన్ చమురుతో రు.55 వేల కోట్లు ఆదా -మంత్రి

అమెరికా ఒత్తిడితో ఇరాన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించుకున్న ఇండియా తద్వారా చమురు బిల్లును భారీగా పెంచుకుంది. ఆ భారాన్ని ప్రజలపై మోపి నష్టాలంటూ జనం ముక్కు పిండి వసూలు చేసింది. ఈ నిజాన్ని చమురు మంత్రి మొయిలీ ద్వారా బైటికి వచ్చింది. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ మారక ద్రవ్య (డాలర్) నిల్వలు భారీగా తరిగిపోతున్న నేపధ్యంలో

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…

సొంత కరెన్సీల్లో ఇండియా-ఇరాక్ వ్యాపారం

ఇండియా, ఇరాక్ దేశాలు తమ సొంత కరెన్సీల్లో ద్వైపాక్షిక వ్యాపారం సాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెబుతున్నారు. ఇరాక్ ప్రధాని నౌరి కమిల్ ఆల్-మాలికి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న నేపధ్యంలో ఆనంద్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ కరెన్సీకి బదులుగా సొంత కరెన్సీలలో వ్యాపారం చేసినట్లయితే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునే భారం ఇరు దేశాలకు తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతూ, కరెంటు…

వెళ్ళి ఫైళ్ళు తవ్వుకు రండి, ఫోండి! -కార్టూన్

దాదాపు 80,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వికారమైన మలుపు తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుంభకోణాన్ని విచారిస్తున్న సి.బి.ఐకి అవసరమైన ఫైళ్ళు బొగ్గు శాఖ ఇవ్వనే లేదు. ఈ విషయాన్ని సి.బి.ఐ కోర్టుకి ఫిర్యాదు చేస్తే కోర్టు తీసిన ఆరాలో ప్రభుత్వంగా చల్లగా చెప్పిన సంగతి ఏమిటంటే సంబంధిత ఫైళ్ళు కనపడడం లేదట. ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ విషయంపైన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఈ అఫిడవిట్ సమర్పించగా అందులో…

ఉల్లి భద్రతా బిల్లు కావాలి! -కార్టూన్

– “దానికంటే ముందు ఉల్లి భద్రతా బిల్లు తెస్తే ఎలా ఉంటుందంటారు?” – ఆహార భద్రతా బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పత్రికలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు గాను ఈ బిల్లును ‘ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్’గా కాంగ్రెస్ పరిగణిస్తోందనీ అందుకే ఈ బిల్లుపై అత్యంత పట్టుదలతో ఆ పార్టీ ఉన్నదనీ పత్రికల కధనం. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పట్టుబట్టి ఈ బిల్లుకు రూపకల్పన చేశారని కాబట్టి…

ఫుకుషిమా డ్రైనేజి నీటిలో ప్రమాదకర రేడియేషన్ -కంపెనీ

ఫుకుషిమా అణు కర్మాగారం చల్లబరచడానికి నిర్మించిన డ్రైనేజి వ్యవస్ధ మొత్తం తీవ్రస్ధాయి రేడియేషన్ తో కూడిన నీటితో నిండిపోయిందని కర్మాగారాన్ని నిర్వహిస్తున్న ‘టోక్యో ఎలక్ట్రికల్ పవర్ కంపెనీ’ (టెప్కో) ప్రకటించింది. డ్రైనేజీలో ఇప్పుడు 20,000 టన్నుల నీరు నిలవ ఉన్నదనీ ఇందులో అణు ధార్మికత అత్యంత ప్రమాద స్ధాయిలో ఉన్నదని కంపెనీ తెలిపింది. భూమి అడుగున నిర్మించిన పైపుల్లో ఉన్న ఒక లీటర్ నీటిలో 2.35 బిలియన్ బెక్యూరల్స్ పరిమాణంలో సీసియం రేడియేషన్ (అణు ధార్మికత) ఉన్నట్లు…