చైనా ఇప్పుడు అతిపెద్ద సరుకుల వ్యాపారి

ఆర్ధిక రంగంలో దూసుకుపోతున్న చైనా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద సరుకుల వ్యాపారిగా కూడా అవతరించింది. ప్రపంచ వాణిజ్య సంస్ధ లెక్కల ప్రకారం 2013లో చైనా ఈ మైలు రాయిని అధిగమించిందని జిన్ హువా వార్తా సంస్ధ తెలిపింది. 2013 సంవత్సరంలో చైనా సరుకుల వ్యాపారం మొత్తం 4.16 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రపంచ వాణిజ్య సంస్ధ గణాంకాలు తెలిపాయి. మరే దేశమూ ఈ స్ధాయిలో సరుకుల వాణిజ్యం చేయలేదు. 2013లో చైనా మొత్తం 2.21 ట్రిలియన్…

భారత మందులపై అమెరికా చిందులు -ఈనాడు ఆర్టికల్

ఇండియా, అమెరికాల మధ్య ఔషధ వాణిజ్య యుద్ధం రేగుతోంది. భారత ఫార్మా కంపెనీలపై విచారణలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తూ తమ బహుళజాతి ఔషధ కంపెనీల ప్రయోజనాల కోసం అమెరికా అక్రమ చర్యలకు దిగుతోంది. మరోవైపు అమెరికా చర్యలపై డబ్ల్యూ.టి.ఓ కు ఫిర్యాదు చేయడానికి సంసిద్ధం అవుతోంది. ఈ అంశంపై ఈ రోజు ‘ఈనాడు’ దినపత్రికలో ప్రచురించబడిన నా ఆర్టికల్ ఇది. కింద బొమ్మపై క్లిక్ చేస్తే పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఆర్టికల్ చూడవచ్చు. ఆర్టికల్ లో నేరుగా…

శత సహస్ర కోటీశ్వరుడు సుబ్రతో రాయ్ అరెస్ట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత సుబ్రతో రాయ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. సుబ్రతో రాయ్ కోసం ఆయనకు చెందిన లక్నో నివాసంలో పోలీసులు వెతికినప్పటికి దొరకలేదు. సుబ్రతో కంపెనీల వద్దా, నివాసాల వద్దా పోలీసులు కాపు కాయడంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన రాయ్ ఈ రోజు లక్నో…

సహారా బాస్ కి నాన్ బెయిలబుల్ వారంట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత, క్రికెట్ ఇండియా టీం మాజీ స్పాన్సరర్ అయిన సుబ్రతో రాయ్ కి సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ కోర్టుకు రాకపోవడంపై సుప్రీం ద్విసభ్య బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిగారి ఆరోగ్యం బాగాలేనందున హాజరు కాలేకపోయారన్న సుబ్రతో రాయ్ అడ్వకేట్, సో కాల్డ్ పేరు మోసిన క్రిమినల్ లాయర్…

ఇండియా ఫార్మా పరిశ్రమ: త్వరలో అమెరికా ఆంక్షలు?

జెనెరిక్ ఔషధ తయారీలో పేరెన్నిక గన్న భారత ఫార్మా పరిశ్రమపై వాణిజ్య ఆంక్షలు విధించడానికి అమెరికాలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ కంపెనీలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో ఎఫ్.డి.ఏ కమిషనర్ మార్గరెట్ హాంబర్గ్ ఇటీవలే ఇండియా పర్యటించారు. ఆమె వివిధ ఔషధ ఎగుమతి కంపెనీల పరిశ్రమలను తనిఖీ చేసి వెళ్ళిన అనంతరం ఇరు దేశాల మధ్య వాణిజ్య వాతావరణం మరింత వేడెక్కింది. ‘ప్రాధామ్య విదేశాలు’ (Priority Foreign Countries –…

వాట్సప్ స్వాధీనం: గూగుల్ పై ఫేస్ బుక్ విజయం

‘WhatsApp’ అప్లికేషన్ కొనుగోలు మరియు స్వాధీనం (acquisition) కోసం జరిగిన పోటీలో ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ విజయం సాధించాడు. దానితో త్వరలో జరగబోయే ప్రపంచ స్ధాయి ఐ.టి (మొబైల్) కాన్ఫరెన్స్ లో జుకర్ బర్గ్ విజయగర్వంతో పాల్గొననున్నాడని వ్యాపార వార్తా సంస్ధలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దాదాపు ప్రతి రంగంలోనూ పాతుకుపోయిన గూగుల్ ని త్రోసిరాజనడం అంటే మాటలు కాదు మరి! స్మార్ట్ ఫోన్ ల దగ్గర నుండి మధ్య…

అమెరికా: మా ఇంటికొస్తూ ఏం తెస్తావ్? మీ ఇంటికొస్తే ఏమిస్తావ్?

అమెరికా ద్వంద్వ విధానాల గురించి అనేకానేక పుస్తకాలు, విమర్శలు, కధలు, వార్తా కధనాలు వచ్చాయ్, వస్తున్నాయ్, వస్తూనే ఉంటాయ్. మూడో ప్రపంచ దేశాలతో అమెరికాది ఎలాగూ పెత్తందారీ వైఖరే. పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రం అయ్యేకొద్దీ అమెరికా తన అనుంగు మిత్రులతో కూడా ఇదే తీరులో వ్యవహరిస్తోంది. ఇండియా లాంటి దేశాలపై వినాశకర అణు ఒప్పందాన్ని రుద్దిన అమెరికా కెనడాకు చమురు సరఫరా చేసే పైప్ లైన్ నిర్మాణానికి మాత్రం గ్లోబల్ వార్మింగ్ కారణంగా చూపుతోంది. ఉత్తర అమెరికా…

2జి వేలంలో 60 వేల కోట్ల ఆదాయం

ప్రధాని మన్మోహన్ సింగ్, ఐ.టి మంత్రి కపిల్ సిబాల్, ఆర్ధిక మంత్రి చిదంబరం, మాజీ ఐ.టి మంత్రి ఎ.రాజా తదితరులు వినిపించిన ‘జీరో లాస్’ (Zero loss) వాదన ఒట్టిపోయింది. సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 2జి లైసెన్స్ లలో కొంత భాగానికి వేలం జరిపిన కేంద్రం 60,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి కంపెనీలు నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం చేతికి తక్షణం రు. 18,273 కోట్లు ముడతాయి. స్పెక్ట్రమ్ రిజర్వ్…

అనూహ్యం: అంబానీ, మొయిలీలపై ఎఫ్.ఐ.ఆర్

సామాన్యుడు తలచుకుంటే అద్భుతాలకు ఏమిటి కొదవ? ఆ మాటకొస్తే సామాన్యులే కాదా చరిత్ర నిర్మాతలు! సామాన్యుడి పేరుతో పార్టీ స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ, సంకేతాత్మకమే అయినా, అలాంటి అద్భుతాలనే దేశ ప్రజలకు రుచి చూపిస్తోంది. కాకుంటే, ఈ దేశంలో పాలు తాగే పసిపిల్లలకు సైతం ఆదర్శ పురుషులుగా పరిచయం అయ్యే కార్పొరేట్ దిగ్గజాలపై అవినీతి కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం మునుపు ఎన్నడన్నా ఎరుగుదుమా? అంబానీ అంటే భారత దేశంలో ఒక బ్రాండ్. ఒక ట్రేడ్…

ఇండియాపై ఐరాసకు ఇటలీ ఫిర్యాదు

ఇటలీ మెరైన్ల కేసు మరో మలుపు తిరిగింది. ఇండియాపై క్రమంగా ఒత్తిడి పెంచుతూ వస్తున్న ఇటలీ ఇప్పుడు ఐరాస గడప తొక్కింది. తమ పౌరులను అన్యాయంగా యాంటీ-పైరసీ చట్టం కింద విచారిస్తున్నారని ఐరాస మానవహక్కుల కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తమ పౌరులపై ఇప్పటి వరకు ఎలాంటి అభియోగాలు మోపలేదని, 2012 నుండి తమ పౌరులను ఎటూ కదలకుండా నిరోధిస్తూ వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇటలీ విదేశీ మంత్రి ఎమ్మా బొనినో తమ…

వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని…

ఔషధాలపై అమెరికా ఆంక్షలు, భారత్ ఆందోళన

భారత ఔషధ కంపెనీలపై అమెరికా అలవిమాలిన ఆంక్షలు విధిస్తోంది. తనను తాను స్వేచ్ఛా వాణిజ్యానికి ఛాంపియన్ గా చెప్పుకుంటూ వీలు దొరికినప్పుడల్లా ప్రపంచానికి స్వేచ్ఛా వాణిజ్య సూత్రాల గొప్పతనం గురించి లెక్చర్లు దంచే అమెరికా ఆచరణలో అవలంబించేది మాత్రం అందుకు విరుద్ధమైన సూత్రాలు. భారత ఔషధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ, భారతీయ కంపెనీలకు ఇటీవల కాలంలో వరుసగా భారీ జరిమానాలు విధించడం పట్ల ప్రభుత్వం ఆందోళన ప్రకటించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కమిషనర్…

గుత్తేదారులకు అ’ధనం’ చెల్లించేస్తున్నారు -కత్తిరింపు

జనాన్ని విభజన రందిలో ముంచేసిన రాష్ట్ర పాలకులు తమ కార్యాల్ని నిర్విఘ్నంగా చక్కబెట్టుకుంటున్నారు. ఇ.పి.సి ఒప్పందాలకు విరుద్ధంగా జలయజ్ఞం కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని పెరిగిన ధరల పేరుతో అదనంగా చెల్లించడానికి సి.ఎం, ఆర్ధిక శాఖ ఆమోద ముద్ర వేసేశారు. కనీసం 20,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము గుత్తేదారుల పరం చేసే ఈ బృహత్కార్యాన్ని కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ప్రచురించింది. ఆర్ధిక శాఖ అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు జనవరి 27 తేదీన సమావేశం జరగనుందని పత్రిక…

లుక్ ఆఫ్రికా & లాటిన్ అమెరికా, ఇండియా కొత్త నినాదం?

ఒకటిన్నర దశాబ్దం క్రితం ‘లుక్ ఈస్ట్’ విధానం ప్రకటించి తూర్పు, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పిన భారత పాలకులు ఇప్పుడు వెనక్కి కూడా చూపు తిప్పినట్లు కనిపిస్తోంది. నమీబియాలో పర్యటిస్తున్న భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ 100 మిలియన్ డాలర్ల (రు. 620 కోట్లు) కొనుగోలు రుణం ఆ దేశానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. Buyer’s credit గా పేర్కొనే ఈ రుణం ద్వారా నమీబియా, ఇండియా నుండి దిగుమతులు చేసుకోవడానికి ప్రోత్సహించడం భారత్ లక్ష్యం.…

ఎఎపి పాలన: అంబానీ లైసెన్స్ రద్దుకు సిఫారసు

ఢిల్లీ ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. జనానికి సబ్సిడీ ధరలకు విద్యుత్ ఇవ్వడానికి నిర్ణయించిన ఎఎపి ప్రభుత్వం వాస్తవ విద్యుత్ పంపిణీ ఖర్చులను నిర్ధారించుకోడానికి ప్రైవేటు డిస్కంలపై కాగ్ ఆడిట్ చేయించాలని నిర్ణయించడంతో అంబానీ, టాటా కంపెనీలు సహాయ నిరాకరణకు దిగిన సంగతి తెలిసిందే. తొండి కారణాలు చెప్పి విద్యుత్ సరఫరా బంద్ చేయడానికి వీలు లేదనీ, అలా చేస్తే డిస్కంల లైసెన్స్ లను రద్దు చేయడానికి కూడా వెనుకాబడబోమని సి.ఎం ఎ.కె హెచ్చరించినట్లుగానే మొదటి వేటు…