లైంగిక వేధింపులు: జస్టిస్ గంగూలీ రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు నిజం అయ్యాయి. రాజీనామాపై తాను ఇంకా నిర్ణయించుకోలేదని ఈ రోజు ఉదయం పత్రికలకు చెప్పిన జస్టిస్ గంగూలీ సాయంత్రానికి రాజీనామా ఇచ్చేశారు. తనకు మద్దతుగా సుప్రీం కోర్టులో దాఖలయిన ‘ప్రజా ప్రయోజనా వ్యాజ్యం’తో తనకు సంబంధం లేదని కూడా గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం…

రాహుల్ సిద్ధం, షరతులు వర్తించును -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తన పదవీకాలంలో మూడోసారి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తన అధికార దండాన్ని రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లుగా పరోక్షంగా సూచించారు. ప్రధాన మంత్రి అభ్యర్ధిని తర్వాత ప్రకటిస్తాం అని చెబుతూనే కాంగ్రెస్ నాయకులలోకెల్లా రాహుల్ గాంధీకే ఆ పదవికి తగిన అర్హతలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తద్వారా తన వారసుడు రాహుల్ గాంధీయే అని ఆయన స్పష్టం చేశారు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి పత్రికలపై విమర్శలు కురిపించారు. పత్రికల…

కాంగ్రెస్ నెత్తిన ఆదర్శ లాల్ బత్తి -కార్టూన్

“ఆ ఎర్ర బల్పును తీసేసే మార్గం మనకి ఏదో ఒకటి దొరక్కపోదు” – అవినీతి నిర్మూలన! ప్రస్తుతం రాజకీయ పార్టీలకు పట్టుకున్న జ్వరం ఇది. ఈ జ్వరం పట్టుకునేలా చేయడంలో తాము సఫలం అయ్యామని ఎఎపి ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటోంది. ఢిల్లీ ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ చేసిన పని ‘లాల్ బత్తి’ తొలగిస్తామని ప్రకటించడం. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే అనీ, ఒకరూ ఇద్దరు వి.ఐ.పి లు ప్రయాణిస్తుంటే ట్రాఫిక్ మొత్తం ఆపాల్సిన అవసరం లేదని ఆయన…

ఆదర్శ స్కాం, రాహుల్ ఆదర్శం -కార్టూన్

ఢిల్లీలో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మొదలు రాహుల్ గాంధీకి అవినీతి నిర్మూలనా జ్వరం పట్టుకుంది. అవినీతి నిర్మూలన తమ ఎజెండాలో కూడా ఉందని చెప్పుకోవడానికి ఆయన తెగ తంటాలు పడుతున్నారు. ఆదర్శ కుంభకోణం పైన మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దరిమిలా తానూ అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నానని చెప్పుకోడానికి మరో అవకాశం కలిసొచ్చింది. కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన భారత సైనికుల కోసం భారత ప్రభుత్వం ముంబైలో ఆదర్శ్ సొసైటీ పేరుతో స్ధల సేకరణ…

ఢిల్లీ శాసన సభ విశ్వాసం నెగ్గిన ఎఎపి

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసన సభ విశ్వాసం గెలిచింది. బి.జె.పి కూటమి సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా కాంగ్రెస్ అనుకూలంగా ఓటు వేసింది. కాంగ్రెస్ కాకుండా మరో అదనపు ఓటు కూడా ఎఎపి ప్రభుత్వానికి అనుకూలంగా పడింది. మంత్రి మనిష్ సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ముఖ్యమంత్రి అరవింద్ భావోద్వేగ ప్రసంగంతో తమ ప్రభుత్వాన్ని సమర్ధించాలని సభ్యులను కోరారు. తీర్మానానికి అనుకూలంగా 37 ఓట్లు, వ్యతిరేకంగా 32 ఓట్లు పడ్డాయి. దీనితో…

ఆమ్ ఆద్మీ పార్టీ అడుగు జాడల్లో…. కార్టూన్

ఎఎపి నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వరుస చర్యలతో దూసుకెళ్తున్న నేపధ్యంలో కాంగ్రెస్, బి.జె.పి లు అప్పుడే ఆ పార్టీని అనుకరించడం ప్రారంభించాయి. ఢిల్లీ ప్రభుత్వం లాగానే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలను తగ్గించాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేయగా బి.జె.పి నాయకులు సైతం ఎఎపి ప్రభుత్వ నిర్ణయాలను అనుకరించే యోచనలో ఉండడం విశేషం. మహారాష్ట్ర నుండి ఎం.పిగా ఉన్న సంజయ్ నిరుపమ్ గురువారం విద్యుత్ ఛార్జీల విషయంలో ఒక డిమాండ్ ముందుకు తెచ్చి…

అవినీతి రాజకీయ వ్యవస్ధకు మోడి ప్రతినిధి -ఎఎపి

భారత దేశంలోని అత్యంత అవినీతిమయమైన రాజకీయ వ్యవస్ధకు మాత్రమే నరేంద్ర మోడి ప్రతినిధి అని ఆయన పార్టీ చెప్పుకుంటున్నట్లు మార్పుకు ప్రతినిధి ఎంత మాత్రం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బహుశా మోడిని నేరుగా విమర్శించడం ఎఎపికి ఇదే మొదటిసారి కావచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గతంలో కొన్ని విమర్శలు చేసినప్పటికీ అవి ‘కర్ర విరగకుండా, పాము చావకుండా’ అన్నట్లు సాగాయి. ఈసారి కూడా విమర్శ చేసింది మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్, అరవింద్ కాదు. “కాంగ్రెస్,…

మరో వాగ్దానం: ఢిల్లీ వాసులకు సగం ధరకే విద్యుత్

ఎఎపి ప్రభుత్వం మరో వాగ్దానం నెరవేర్చింది. గృహ విద్యుత్ వినియోగదారులకు ఛార్జీలు సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నెలకు 400 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపింది. అంటే సబ్సిడీ ఇచ్చిన మేరకు ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. 400 యూనిట్లకు పైగా వినియోగించుకునేవారు పూర్తి ఛార్జీలు చెల్లించాల్సిందే. ధరలను యధావిధిగా కొనసాగిస్తూనే సబ్సిడీ ఇవ్వడం ద్వారా కింది తరగతులకు విద్యుత్ భారాన్ని ఎఎపి ప్రభుత్వం తగ్గిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా…

మరుగుజ్జు ఎఎపి కి ఆమ్ ఆద్మీయే కవచం -కార్టూన్

ఆమ్ ఆద్మీ పార్టీగానీ, అరవింద్ కేజ్రీవాల్ గానీ ఏ విధంగా చూసినా రాజకీయాలకు కొత్త. కాంగ్రెస్, బి.జె.పి పార్టీలతోనూ, వారి నాయకులతోనూ పోల్చితే ఎఎపి, అరవింద్ లు మరుగుజ్జులు అన్నట్లే. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా ఎన్.జి.ఓ నేతే గానీ రాజకీయ నేత కాదు. ఎఎపి లో ఉన్న ఇతర నేతలు కూడా ఎక్కువమంది ఎన్.జి.ఓ సంస్ధల నేతలే. ఈ ఎన్.జి.ఓ లను పోషించేది విదేశీ కంపెనీలు. ఎన్.జి.ఓలను ప్రెజర్ గ్రూపులుగా ఏర్పరచుకుని స్వకార్యం చక్కబెట్టుకునే విదేశీ కంపెనీలు…

చిక్కుముడులు అవలీలగా దాటిన మోడి! -కార్టూన్

ది హిందు పత్రిక నుండి నరేంద్ర మోడీకి వచ్చిన ప్రశంసా ఇది? ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేవైపుగా ప్రయాణం చేస్తున్న నరేంద్ర మోడి తన దారిలో ఎదురవుతున్న చిక్కు మూడులను అవలీలగా అధిగమించారని ఈ కార్టూన్ సూచిస్తోంది. తాడు మీద నడవడం చిన్న చిన్న సర్కస్ విద్యలు ప్రదర్శించేవారు చాలా తేలికగా ప్రదర్శించే విద్య. నరేంద్ర మోడి కేవలం తాడు మీద నడవడమే కాదు, తా తాడుపైన తల కిందులుగా కూడా నడిచి చిక్కు మూడులను అధిగమించారని…

అరవింద్ వాహనం నేటి వ్యవస్ధలో ఇమిడేనా? -కార్టూన్

అరవింద్ కేజ్రీవాల్/ఆమ్ ఆద్మీ పార్టీ తనకు తాను విధించుకున్న గీటురాళ్ళు సామాన్యమైనవి కావు. నిజానికి ఆబ్సల్యూట్ దృష్టికోణంలో చూసినపుడు అవి సామాన్యమైనవే. కానీ నేటి వ్యవస్ధ నిర్మాణం అయి ఉన్న తీరుతో పోలిస్తే అవి అసామాన్యమైనవి. ఎర్ర లైటు వాహనంలో తిరగను, మెట్రోల్లోనే ప్రయాణిస్తాను… లాంటివి చిన్న విషయాలు. ప్రజా పాలనలో అవేమీ పెద్ద విషయాలు కావు. అసలు విషయాలు వేరే ఉన్నాయి. అవినీతి నిర్మూలన గురించి ఆయన చేసిన వాగ్దానం భారీ వాగ్దానం. ఎందుకంటే అవినీతి…

మోడి రాతలపై బాధితుల ఆగ్రహం

జకియా జాఫ్రీ పిటిషన్ ను మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసిన అనంతరం నరేంద్ర మోడి తన బ్లాగ్ లో రాసిన రాతల పట్ల మారణకాండ బాధితుల్లో కొందరు ఆగ్రహం ప్రకటించారు. మోడి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కొందరు వ్యాఖ్యానించగా ఆయన అనుభవించిన బాధ బైటపెట్టడానికి పన్నెండేళ్లు సమయం కావాలా అని మరి కొందరు ప్రశ్నించారు. ప్రధాన మంత్రి పదవి కోసమే మోడి కొత్తగా బాధ నటిస్తున్నారని వారు ఆరోపించారు. గోధ్రా రైలు దహనంలో కరసేవకుల దుర్మరణం చెందిన అనంతరం…

ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!

దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె…

మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.…