సామాజిక తెలంగాణా? కె.సి.ఆర్ తెలంగాణా? -కార్టూన్

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిర్భావాన్ని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఇలా వ్యక్తీకరించారు. ఏమిటి దీనర్ధం? సామాజిక తెలంగాణను హామీ ఇచ్చిన కె.సి.ఆర్ తన కుటుంబ తెలంగాణ మాత్రమే ఇచ్చారనా? కె.సి.ఆర్ బలం అంతా తెలంగాణ మాత్రమే అనా? కె.సి.ఆర్ బలం తెలంగాణ వాపులోనే ఉందని, అది త్వరలో తగ్గిపోతుందని (వాపు తగ్గాక నూతన రాష్ట్రం వల్ల ఒరిగిందేమీ లేదని ప్రజలు తెలుసుకుంటారని) అర్ధమా? పాఠకుల్లో ఎవరన్నా చెప్పగలరా?

తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిష్కృతం అయింది. ఉద్యమ పార్టీ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో కొలువు తీరిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అనగా దాదాపు 25 శాతం ఒకే కుటుంబ మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని కొత్త రాష్ట్రం తలకెత్తుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని సైతం కుటుంబ ఉద్యమంగా నడిపిన ఆరోపణలు ఎదుర్కొన్న కె.సి.ఆర్…

మంత్రులు, నేతలు, విద్యార్హతలు -కార్టూన్

X: ఏయ్! కొట్టుకోవడం ఆపండి! Y: నాయకత్వానికి విద్యార్హతలు ఎవన్నా ఉండాలా లేదా అని చర్చించుకోవడానికే ఇది… X: అయితే ఓ.కె, మన (సోనియా) నాయకత్వం పైన అనుమానాలు వ్యక్తం చేయడానికేమో అనుకున్నాలేండి… ********* స్మృతి ఇరానీ పుణ్యమాని నాయకత్వం విద్యార్హతల గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది. నిజానికి ఈ చర్చకు స్మృతి ఇరానీ ప్రత్యక్ష కారణం కాదు. పరోక్ష కారణమే. ఆమెను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మంత్రిగా ప్రధాని నరేంద్ర మోడి నియమించడంతో ఈ…

ఆర్టికల్ 370పై చర్చ: వేటగాడి వల?

ఆర్టికల్ 370 మరోసారి చర్చలోకి వస్తోంది. ఆ చర్చను కొత్తగా అధికారం చేపట్టిన కేంద్ర ప్రభుత్వమే ప్రేరేపిస్తోంది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఈ ఆర్టికల్ నిజానికి జీవత్ శవంతో సమానం. ఎన్నికల ప్రచారం సందర్భంగానే ఆర్టికల్ 370 పైన చర్చ జరగాలని ప్రతిపాదించిన నరేంద్ర మోడి అన్నివైపుల నుండి విమర్శలు రావడంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. తాజాగా ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రిగా నియమితులయిన జితేంద్ర సింగ్…

ఇంతకీ గెలిచిందెవరు? -కార్టూన్

2014 సాధారణ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? పార్లమెంటు సెంట్రల్ హాలులో భావోద్వేగ పూరిత ప్రసంగం ఇచ్చిన నరేంద్ర మోడి కన్నీరు పెట్టుకోగా, ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేస్తామని చెప్పిన రాహుల్ మాత్రం యధావిధిగా కాంగ్రెస్ యువరాజుగా కొనసాగుతున్నారు. దానితో ఎన్నికల్లో గెలిచిందేవరన్న అనుమానం వస్తోందని ఈ కార్టూన్ సూచిస్తోంది.  పార్లమెంటు సెంట్రల్ హాల్ లో బి.జె.పి పార్లమెంటరీ నేతగా ఎన్నికయిన అనంతరం 30 నిమిషాలు ప్రసంగించిన మోడి ఆ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నారని పత్రికలు నివేదించాయి.…

ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!

సాధారణ ఎన్నికలు ముగియడంతో ఓటమి చెందిన పార్టీలు కాసింత సంక్షోభానికి లోను కావడం మామూలే. అయితే అది సాధారణ, సాంప్రదాయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేరికలు, దూకుళ్ళు ఉంటాయి. కానీ ఆం ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కాదు లేదా కనీసం ఆ పార్టీ నాయకులు అలా చెబుతారు. అద్భుతాలేమీ సృష్టించకపోయినా కనీసం గణనీయ మొత్తంలోనయినా లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా వేసిన ఎఎపి కేవలం 4 సీట్లు మాత్రమే…

మోడికి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ 2

పశ్చిమ పంజాబ్ నుండి తరిమివేయబడ్డ సిక్కులు, హిందువులకు మల్లే, కాశ్మీరీ పండిట్లకు మల్లే భారత దేశంలోని మైనారిటీలు అందరూ, ఒక్క ముస్లింలు మాత్రమే కాదు సుమా, తమ మనో ఫలకాలపై గాయపడ్డ చారికలు కలిగి ఉన్నారు. నిజంగానే జరుగుతాయో లేక ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టినందువల్ల జరుగుతాయో… అకస్మాత్తుగా అల్లర్లు జరగొచ్చన్న భయం, అవి మళ్ళీ మరిన్ని రెట్లు పగ సాధింపు పేరుతో తిరిగి తలుపు తడతాయన్న భయం, వారిని పట్టి పీడిస్తోంది. అవి మహిళలను అత్యంత ప్రత్యేకంగా లక్ష్యం…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ -1

(గోపాల కృష్ణ గాంధీ మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి మరియు రాయబారి. 2004-2009 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ గానూ, 2005-2006 మధ్య బీహార్ అఫీషియేటింగ్ గవర్నర్ గానూ పని చేశారు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు కూడా. ది హిందూ పత్రికకు ఆయన రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)  ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు…

నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ

ప్రియమైన ప్రైమ్ మినిస్టర్-డిసిగ్నేట్, నా హృదయపూర్వక అభినందనలతో ఈ లేఖ రాస్తున్నాను. నిజాయితీగానే నేనిలా భావిస్తూ మీకు చెబుతున్నాను. ఇలా (అభినందనలు) చెప్పడం నాకు అంత తేలికయిన విషయం కాదు. ఎందుకంటే మీరు చేరుకున్న అత్యున్నత అధికార స్ధానాన్ని మీరు చేరుకోగా చూడాలని కోరుకున్నవారిలో నేను ఒకరిని కాను. మీరు ప్రధాన మంత్రి అవనున్నారని అనేక మిలియన్ల మంది ఆనంద పరవశులై ఎదురు చూస్తుంటే ఇంకా అనేక మిలియన్ల మంది నిజానికి వికలమై ఉన్నారన్న సంగతి మరే…

ఎన్నికలయిపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? -పతంజలి

దీనిని పతంజలి, ఉదయం దినపత్రికలో, 29.12.1984 తేదీన రాశారంట. ఈ నాటి పరిస్ధితులకు కూడా ఇంకా ఎంత చక్కగా సరిపోయిందో చూడండి.: https://www.facebook.com/loknath.kovuru/posts/4175978093833 -తిరుపాలు ***          ***           ***          *** ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? దగాపడిన ఒక ఆడకూతురిలా వుంటుంది! దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం. ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది తీరని కోరికలతో లక్ష బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది…

బీహార్ ని ఇంకా వదలని మోడి సుడి -కార్టూన్

ఎన్నికల ఫలితాల ప్రభావం బీహార్ ని ఇంకా వదలడం లేదు. మోడి సృష్టించారని చెబుతున్న సుడిగాలికి లాలూ, కాంగ్రెస్ కూటమితో పాటు అధికార పార్టీ కూడా కుదేలు కావడం ఒక విషయం కాగా ప్రభుత్వంలో పుట్టిన ముసలం మరో సంగతి. ఘోరమైన ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం కాస్తా పాలనా సంక్షోభంగా మారిపోయింది. నితీష్ కుమార్ రాజీనామాను బి.జె.పి మిత్రుడు, లోక్ జన శక్తి పార్టీ…

హిందూత్వ డిమాండ్లకు రాజ్యాంగ మద్దతు ఉంది -ఆర్.ఎస్.ఎస్

బి.జె.పి మొదటిసారి సొంతగా మెజారిటీ సాధించిన నేపధ్యంలో ఆ పార్టీ మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ ఆశలు మోసులెత్తుతున్నాయి. హిందూత్వ డిమాండ్లను మోడి నెరవేర్చాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్ అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. బి.జె.పి మేనిఫెస్టోలో సాంస్కృతిక విభాగంలోకి నెట్టివేశామని ఎన్నికలకు ముందు చెప్పిన హిందూత్వ డిమాండ్లు ఇప్పుడు కేంద్ర స్ధానానికి తెచ్చే ప్రయత్నంలో ఆర్.ఎస్.ఎస్ ఉన్నదని సంస్ధ సిద్ధాంత కర్త ఎం.జి.వైద్య మాటల ద్వారా అర్ధం అవుతోంది. “అయోధ్యలో రామ మందిరం, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370 రద్దు……

పునఃప్రచురణ: కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి

(ఈ ఆర్టికల్ గత ఏప్రిల్ 24 తేదీన రెండు భాగాలుగా ప్రచురించబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపధ్యంలో రెండింటినీ కలిపి ఒకే ఆర్టికల్ గా పునఃప్రచురిస్తున్నాను -విశేఖర్) భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త…

కాంగ్రెస్: ఓటమి సంపూర్ణం – బి.జె.పి: కరువు తీరింది

కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మట్టి కరిచింది. సంపూర్ణంగా ఓటమి పాలయింది. మరోవైపు బి.జె.పికి కరువుతీరా విజయం లభించింది. ఎన్.డి.ఏ కూటమి భాగస్వామ్య పార్టీలతో సంబంధం లేకుండానే సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయగల సీట్లను సంపాదించేవైపుగా బి.జె.పికి సీట్లు వస్తాయని ఫలితాల సరళి చెబుతోంది. కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో పాటు బి.జె.పి అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఆ పార్టీకి అమితంగా ఉపయోగపడ్డాయని స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కూడా…

EXIT: బయటకు దారి -కార్టూన్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేన్ని సూచిస్తున్నాయో ఈ కార్టూన్ చెబుతోంది. కానీ బయటకు వెళ్ళే పెద్దాయనా, లోపలికి వస్తున్న మరో పెద్దాయనా ఇద్దరూ ఇంకా గడప దాటకుండా కార్టూనిస్టు జాగ్రత్త పడ్డారు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ఎన్నికల ఫలితాలు కాదు గనక! ప్రధాని మన్మోహన్ ఇప్పుడు సంచి సర్దుకుంటున్నట్లు చూపారు గానీ నిజానికి ఆయన ఎప్పుడో మకాం మార్చేశారు. ఒకవేళ యు.పి.ఏ III ప్రభుత్వం ఏర్పడ్డా ఆయన మాత్రం ప్రధాని నివాసం ఖాళీ చేయక తప్పదు.…