కె.సి.ఆర్ దాయాది బాబు -కార్టూన్

“ఈయన ఆంధ్ర నుండి వచ్చిన మా కజిన్. కుటుంబ చర్చల కోసం మాత్రమే ఆయన ఇక్కడకు వచ్చారు” *** ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సలహా మేరకు దాయాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ కలిసి కూర్చుని కష్ట, సుఖాలు మాట్లాడుకున్నారు. చర్చలు చాలా సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ఇద్దరు సి.ఎం లూ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని కె.సి.ఆర్ అంగీకరించినట్లుగా కూడా ఎ.పి. సి.ఎం బాబు చెబుతున్నారు. చర్చల…

ఒక చికాకుపై అతి స్పందన -ది హిందు ఎడిటోరియల్

(ఆగస్టు 25 తేదీన ఇండియా, పాకిస్ధాన్ ల విదేశాంగ శాఖల కార్యదర్శులు సమావేశమై చర్చలు జరపవలసి ఉంది. దానికంటే ముందు ఇండియాలోని పాక్ హై కమిషనర్ కాశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులకు ఆహ్వానాలు పంపారు. కొందరు హురియత్ నాయకులు వెళ్ళి మాట్లాడారు కూడా. దీనిని కారణంగా చూపిస్తూ మోడి ప్రభుత్వం కార్యదర్శి స్ధాయి చర్చలను రద్దు చేసింది. ఈ అంశంపై ఈరోజు (ఆగస్టు 20, 2014) ది హిందు పత్రిక రాసిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం.…

ఈనాడు వ్యాసాలన్నింటికి లంకెలు

మిత్రులు కొందరు గతంలో రాసిన ఈనాడు వ్యాసాలు అన్నీ అందుబాటులో ఉన్నాయా అని అడుగుతున్నారు. బ్లాగ్ లో అన్నీ ఉంటే వాటికి లింక్ లు ఇవ్వాలని కోరుతున్నారు. వారి కోరికను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఈనాడులో ప్రచురించబడిన ఈనాడు వ్యాసాలకు లంకెలు కింద ఇస్తున్నాను. *** జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా? -1వ భాగం సమాచార సేకరణకు చక్కని దారులు -2వ భాగం పరిభాష తెలిస్తే తేలికే -3వ భాగం ఐక్యవేదికలూ… వ్యూహాలూ -4వ…

మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్

కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి. షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య  ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన…

ఆజన్మ వైరం: బాబు Vs కె.సి.ఆర్ -కార్టూన్

ఎ.పి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరినొకరు ఆక్షేపించని రోజు లేకుండా పోతోంది. పోలవరం ముంపు గ్రామాల విలీనంతో మొదలుకుని ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు, ఫీజుల చెల్లింపుల వరకూ ఇరు ప్రభుత్వాలూ తగాదా పడుతూనే ఉన్నారు. స్వాతంత్ర దినం నాడు కూడా ఒకరు విభజన పద్ధతి ప్రకారం జరగలేదంటే మరొకరు ఇంకోటన్నారు. పుడుతూనే పౌరుషాలతో, పంతాలతో కొట్లాడుతూ పుట్టిన తెలుగు పుంజులు ఇరు రాష్ట్రాల ప్రజలకు లేని సమస్యలు సృష్టిస్తున్నారు. చల్లబరచాల్సిన అనవసర భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ఇది వారి…

‘మేక్’ ఇన్ ఇండియా -కార్టూన్

బులెట్ ప్రూఫ్ అద్దాలు లేకుండా ఎర్రకోటపై నిలబడి మొదటిసారి దేశ ప్రజలకు స్వాంతంత్ర్య సందేశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడి విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికారు. ప్రపంచంలో ఉన్న కంపెనీలన్నీ ఇండియా రావాలనీ పిలుపు ఇచ్చారు. ఇక్కడ సరుకులు ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆశ చూపారు. విదేశీ కంపెనీలకు ఎర్ర తివాచీ పరుస్తానని ఎర్రకోట బురుజులపై నిలబడి చాటింపు వేశారు. ఇప్పుడు ఏ సరుకు చూసినా ‘మేడ్ ఇన్ చైనా’ స్టిక్కర్ ను ప్రదర్శించేవే.…

పాకిస్తాన్ పై తప్పుడు సలహాలు -ది హిందు సంపాదకీయం

(Ill-advised on Pakistan శీర్షికతో ది హిందూ ఈ రోజు సంపాదకీయం రాసింది. దానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్) నరేంద్ర మోడి అసలు స్వరూపం ఏమిటి? ఎన్నికల విజయం నాటి ఆరంభ పుష్టితో ఇస్లామాబాద్ కు స్నేహ హస్తం చాచి, తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించి, ఆయనతో తమ తమ తల్లుల కోసం దుశ్శాలువలు, చీరలు ఇచ్చిపుచ్చుకున్న వ్యక్తా? లేక “సంప్రదాయ యుద్ధం చేయగల సామర్ధ్యాన్ని పాకిస్ధాన్ కోల్పోయింది.…

మూజువాణి: తెలంగాణ మాదిరిగానే జ్యుడీషియల్ బిల్లు కూడా

సుప్రీం కోర్టు, హై కోర్టులకు జడ్జిల నియామకంలో పార్లమెంటుకు కూడా అధికారాలు కట్టబెట్టడానికి ఉద్దేశించిన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. 121వ రాజ్యాంగ సవరణ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ ఏర్పాటు లను అమలులోకి తెచ్చే బిల్లు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందడం ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. తెలంగాణ బిల్లును ఆనాటి లోక్ సభ, రాజ్య సభలు మూజు వాణి ఓటుతో ఆమోదం పొందినపుడు అనేకమంది రాజకీయవేత్తలు, ఎ.పి.ఎన్.జి.ఓ లాంటి ఆందోళన సంస్ధలు,…

కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభ పరిష్కర్త ఎవరు? -కార్టూన్

ఇంకెవరు, రాజవంశమే. దృతరాష్ట్రుడు గుడ్డివాడయినందుకు ఆయన్ని సింహాసనానికి దూరం చేశారా? పోనీ జనంలో ఇంకా ఎవరన్నా ఉద్దండుడు ఉన్నారా అని వెతికారా? లేదు కదా! ఆయన తమ్ముడు పాండు రాజుచేత బాధ్యతలు నిర్వర్తింపజేస్తూ ఆ గుడ్డాయన్నే కుర్చీలో కూర్చోబెట్టారు. సో కాల్డ్ ప్రజాస్వామ్యం లోనూ అదే తంతు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో రాజకీయ పార్టీలకు నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? కార్యకర్తల నుండే రావాలి. కింది స్ధాయి నుండి సంస్ధాగత ఎన్నికలు జరిపించాలి. ఆ ఎన్నికల్లో నెగ్గిన వారిలోనుండి…

అమిత్ షా: కమల దళాలే ఆక్టోపస్ చేతులవ్వాలి -కార్టూన్

బి.జె.పి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన అమిత్ షా భారత దేశం కోసం తాను కంటున్న కలలేమిటో వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి అమిత్ షాకు అప్పగించడానికి బి.జె.పి కార్యర్గం లాంఛన ప్రాయంగా ఆమోద ముద్ర వేసిన అనంతరం ఆయన బి.జె.పి జాతీయ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్రసంగించారు. సదరు ప్రసంగంలో తన ఉద్దేశ్యాలేమిటో శాంపిల్ గా వివరించారాయన. ఇన్నాళ్లూ కాంగ్రెస్ ఐడియాలజీ ఒక్కటే దేశాన్ని శాసించిందని ఇక నుండి కాంగ్రెస్ ఐడియాలజీని పక్కకు నెట్టి కేవలం బి.జె.పి…

స్టేటస్ కో కోసమే జ్యుడీషియల్ కమిషన్ బిల్లు

సుప్రీం కోర్టు, హై కోర్టుల జడ్జిల నియామకాలకు సంబంధించి యు.పి.ఏ చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించేవైపుగా పరిణామాలు జరుగుతున్నాయి. సుప్రీం కోర్టులకు, హై కోర్టులకు జడ్జిలను నియమించే అధికారం ప్రస్తుతం పూర్తిగా సుప్రీం చేతుల్లో లేదా న్యాయ వ్యవస్ధ చేతుల్లో ఉంది. దీనిని మార్చేవైపుగా ఎన్.డి.ఏ ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ఈ రోజు ప్రవేశపెట్టింది. ఫలితంగా యు.పి.ఏ పదేళ్ళలో చేయలేని పనిని ఎన్.డి.ఏ సాధించనుంది. నూతన ఆర్ధిక విధానాలలో భాగంగానూ, ప్రపంచ…

భారత ప్రధానికి బోలెడు ఉపగ్రహాలు -కార్టూన్

“శ్రీలంక నుండి అప్రమత్తత సంకేతమా? కాస్త ఆగండి. నేను చెన్నైలోని మా ప్రాంతీయ ఉపగ్రహం నుండి వివరాల కోసం ఎదురు చూస్తున్నాను.” ********* భారత ప్రధాని నరేంద్ర మోడీకి బోలెడు ఉపగ్రహాలు. ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలను పిలిపించుకుని (సో కాల్డ్) ‘చరిత్ర సృష్టించడం’ ద్వారా భారత పెద్దన్న పాత్రను ఆదిలోనే రుజువు చేశారు ప్రధాని. ఆ చర్యతో భారతేతర సార్క్ దేశాలు ఇండియా ఉపగ్రహాలన్న అభిప్రాయం ఒకటి అంతర్జాతీయ పరిశీలకులకు ఏర్పడిపోయింది. ప్రధాని మోడి దేశీయంగా…

సోనియా మరియు విదూషక నట్వర్ సింగ్ -కార్టూన్

యు.పి.ఏ-1 ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా పని చేసి తొలగింపుకు గురయిన నట్వర్ సింగ్ పుస్తకం ప్రస్తుతం జాతీయ స్ధాయి చర్చల్లో నలుగుతోంది. ‘ఒక జీవితం చాలదు: ఆత్మకధ’ టైటిల్ తో ఈ రోజు వెలువడుతున్న పుస్తకం ఆయన సన్నిహితంగా మెలిగిన సోనియాపై విమర్శలు గుప్పించడంతో పత్రికలకు మేత లభించినట్లయింది. సోనియా చెప్పుకున్నట్లు అంతరాత్మ ప్రభోదం మేరకు ఆమె ప్రధాని పదవిని వదులుకోలేదని వాస్తవానికి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నిరోధించడం వల్లనే ఆమె పదవిని త్యజించారని నట్వర్…

గడ్కారీ బెడ్రూంతో పాటు ఇంటింటికీ బగ్ అమర్చాలి -కార్టూన్

“మన సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటికీ బగ్ అమర్చాలి…” *** బి.జె.పి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఇంట్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి ఉన్న సంగతి వెల్లడి అయింది. 2009లో బి.జె.పి అధ్యక్షుడుగా పదవి చేపట్టిన అనంతరం ఆయనకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఆ ఇంట్లోనే కొనసాగుతున్నారు. ఆయన నిద్రించే బెడ్ రూమ్ లో సంభాషణలు వినే పరికరం రహస్యంగా అమర్చినట్లు వెల్లడి కావడంతో కాంగ్రెస్, తదితర…

భోజన పళ్ళెం అందుకోలేని కాంగ్రెస్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా కోసం పోరాడవలసిన పరిస్ధితి కాంగ్రెస్ ది. మొత్తం సీట్లలో 10 శాతం వస్తే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదని నిబంధనలు ఉన్నాయిట. తమకు 44 సీట్లే వచ్చినా యు.పి.ఏ కి 60 సీట్లు వచ్చాయి గనుక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎన్నికలకు ముందు యు.పి.ఏ పక్ష్యాలన్నీ ఒకే మేనిఫెస్టో, కార్యక్రమం ఇవ్వలేదు గనక ఆ లాజిక్ పని చేయదని బి.జె.పి తిప్పి కొడుతోంది. ఫలితంగా బి.జె.పి…