ఎమ్మెల్యేకు బి.జె.పి వెల రు. 4 కోట్లు -ఎఎపి వీడియో

ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అనైతికం ఏమీ లెదంటూ ప్రకటించిన బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా అంతరార్ధం ఏమిటో ఎఎపి పార్టీ వెల్లడి చేసింది. తమ ఎం.ఎల్.ఎ లు ఇద్దరినీ కొనుగోలు చేసేందుకు బి.జె.పి ఢిల్లీ శాఖ ఉపాధ్యక్షుడు షేర్ సింగ్ దాగర్ ఒక్కొక్కరికి 4 కోట్లు ఇవ్వజూపారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సాక్ష్యంగా వీడియోను కూడా ఎఎపి విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మెజారిటీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం గురించి విలేఖరులు అడిగిన…

కాదేదీ రాజకీయాల కనర్హం! టీచర్స్ డే కూడా -కార్టూన్

A for Achche din… గతంలో ఎన్నడూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ‘ఉపాధ్యాయ దినోత్సవం’ (సెప్టెంబర్ 5) ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడి పుణ్యమాని ఓ పెద్ద చర్చాంశం అయింది. రాజకీయాలకు అతీతంగా నిస్పాక్షిక సంబరంగా ఇన్నాళ్లూ ఉంటూ వచ్చిన ఉపాధ్యాయ దినం ఇప్పుడు రాజకీయ ప్రకటనలకు వేదిక కావడమూ ప్రధాని మోడి పుణ్యమే. ‘చాయ్ పే చర్చా’ తరహాలో ప్రధాన మంత్రి స్వయంగా పిల్లలతో మాట్లాడుతారంటూ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ…

ఉపఖండంలో ఆల్-ఖైదా, పశ్చిమ జోక్యానికి సూచిక

భారత ఉపఖండంలో ఆల్-ఖైదా విభాగాన్ని స్ధాపించినట్లు ఆల్-ఖైదా నేతగా చెప్పుకునే అయిమన్ ఆల్-జవహరి ప్రకటించాడు. ఈ విభాగం ద్వారా భారత ఉపఖండం అంతటా జీహాద్ విస్తరణకు పాటుపడనున్నట్లు తెలిపాడు. ఆన్-లైన్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఆల్-జవహరి ‘ఖైదత్ ఆల్-జిహాద్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్’ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా, సోమాలియా, యెమెన్, మాలి, లిబియా తదితర దేశాల్లో మొదట ఆల్-ఖైదా లేదా మరో పేరుతో టెర్రరిస్టులను ప్రవేశపెట్టడం,…

స్కాట్లండ్ రిఫరెండం: ‘యెస్’ కు పెరుగుతున్న ఆదరణ

స్కాట్లండ్ రిఫరెండం దగ్గర పడేకొద్దీ బ్రిటన్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్కాట్లండ్ స్వతంత్రాన్ని కోరేవారు రోజు రోజుకీ పెరుగుతుండమే దానికి కారణం. ఆర్ధిక కారణాలు, చారిత్రక కారణాలు, బెదిరింపులు, బుజ్జగింపులు… ఇలా ఎన్ని ఆశలు పెడుతున్నా యెస్ వోటు పెరుగుతుండగా నో వోటు తగ్గిపోతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఫలితంగా ఇంగ్లండ్ పాలకుల్లో గుబులు బయలుదేరింది. స్కాట్లండ్ స్వతంత్రాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ పత్రికలు సైతం ఆందోళన ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంగ్లండ్ నేతృత్వంలోని యునైటెడ్ కింగ్…

రైతులు ఓ.కె అంటే మంగళగిరి, లేదంటే నూజివీడు

రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మైండ్ గేమ్ ఆడబోతున్నట్లు కనిపిస్తోంది. రైతులకు, ఇతర వర్గాలకు మధ్య అనవసర విభేదాలు రేపే నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం తీసుకుందని ఛానెళ్ల వార్తలను బట్టి తెలుస్తోంది. మంత్రివర్గ నిర్ణయాలను ఎవరికీ చెప్పొద్దని ముఖ్యమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని చెబుతూనే రాజధానిపై వారేమి చర్చించారో వెల్లడి చేశాయి. రైతులు అంగీకరిస్తే మంగళగిరి కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఒకవేళ మంగళగిరి రైతులు మొరాయిస్తే గనుక నూజివీడు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయాలని…

గదిలో ఏనుగు, పాక్ మిలట్రీ -కార్టూన్

పాకిస్ధాన్ లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం (ప్రజల ప్రజాస్వామ్యం కాదు) కూడా ఓ ఎండమావిగా మారిపోయింది. ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం ఏర్పడి అది కుదురుకునే లోపుగా అక్కడి మిలట్రీ జోక్యం చేసుకోవడం, ఎన్నికయిన ప్రభుత్వాల్ని కూల్చివేయడం ఒక పరిపాటి అయింది. పాలక వర్గాల మధ్య కుమ్ములాటలే ఈ ప్రహసనానికి మూల కారణం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ నవాజ్ షరీఫ్ కీ, అక్కడి మిలట్రీకి…

ఢిల్లీ: ఎఎపి నేతకు సి.ఎం పదవి ఎరవేసిన బి.జె.పి

“The Party with a difference” అని బి.జె.పి నేతలు తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. “The party with differences” అని కాంగ్రెస్ పరాచికాలాడుతుంది. కాంగీ పరాచికాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కంటే తాము భిన్నం ఏమీ కాదని వివిధ సందర్భాల్లో బి.జె.పి నిరూపించుకుంది. తాజాగా ఎ.ఎ.పి ని చీల్చి ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు బి.జె.పి ప్రయత్నించిన సంగతి వెల్లడి అయింది. గత లోక్ సభ ఎన్నికల్లో అమేధిలో రాహుల్ గాంధీ పై పోటీ…

(బి.జె.పి లో) తరాల మార్పులు -ది హిందు సంపాదకీయం

బి.జె.పిలో అత్యంత శక్తివంతమైన పార్లమెంటరీ బోర్డు నుండి త్రిమూర్తులు అతల్ బిహారీ వాజ్ పేయి, ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషిల నిష్క్రమణ, నూతనంగా సృష్టించిన సలహా కమిటీ మార్గదర్శక మండలిలోకి వారి తరలింపు… ఒక శకం ముగిసిందని సంకేతం ఇచ్చాయి. తన సైద్ధాంతిక నిలయానికే పార్టీ లంగరు తాళ్ళు కట్టివేయబడడం కొనసాగినప్పటికీ దాని పని విధానం మాత్రం -బి.జె.పి పరివర్తన వరకు జరిగిన పరిణామాలను బట్టి- అనివార్యంగా ప్రస్తుతం ఆ పార్టీని నియంత్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ప్రధాని…

హోమ్ మంత్రి తూణీరం ఎదురు తిరిగిన వేళ -కార్టూన్

యుద్ధంలో ప్రత్యర్ధుల బాణాలను ఎదుర్కోక ఎలాగూ తప్పదు. కానీ స్వపక్షంలోని వారే వెనుక నుండి బాణాలు వదిలితే? భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పరిస్ధితి అలాగే ఉందని ఇటీవల పరిణామాలు చెబుతున్నాయి. బి.జె.పి పార్టీని తన అస్త్ర, శస్త్రాలను నిలువ చేసుకునే అమ్ముల పొదగా హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ భావిస్తున్నారు. కానీ పార్టీలోనే అధికారం కోసం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల ఫలితంగా స్వపక్షం వారే ఆయనపై అస్త్రాలను ప్రయోగించి దొంగ దెబ్బ…

ముఖ్యమంత్రుల ఎగతాళికి బి.జె.పి సమర్ధన! -కార్టూన్

“నా ప్రియమైన ఎగతాళి మరియు వెక్కిరింపుల్లారా…” *** మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు బి.జె.పి యేతర పార్టీలకు చెందినవారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ హుడాలు కాంగ్రెస్ పార్టీ నేతలు కాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకుడు. ఇటీవల ఈ ముగ్గురితో కలిసి ప్రధాని పాల్గొన్న సభల్లో ప్రేక్షకుల్లో కొందరు పని గట్టుకుని ముఖ్యమంత్రులను వెక్కిరింపులతో వేధించే ప్రయత్నం చేశారు. మోడి…

ప్రధాని సభల్లో కాంగ్రెస్ సి.ఎంలకు అవమానం -కార్టూన్

‘మొహం చాటేశాడు’ అంటారు. అది ఇదేనేమో! మోడి భక్తాగ్రేసరుల ఎగతాళి, వెక్కిరింపులు, కూతలు ఇతర పార్టీల నేతలకు సమస్యగా మారింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించని నాయకుల పట్ల ఆగ్రహంతో దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఎరుగుదుము. సభల్లో తమ సమస్యలపై నాయకులను జనం నిలదీయడం ఎరుగుదుము. కానీ ప్రధాని అంతటి రాజ్యాంగ, మరియు దేశాధినేత పాల్గొన్న సభల్లో ఆయనకు మద్దతుగా ఇతర పార్టీల రాజ్యాంగ, రాష్ట్రాధినేతలను ఎగతాళి చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. ఒక నేతపై ఉండే…

ప్రతిపక్ష నాయకుని సీటులో మోడి ఖర్చీఫ్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదాను ఎవరికీ ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా అనేక రాజ్యాంగ పదవులను ఏకపక్షంగా నియమించుకునే అవకాశాన్ని బి.జె.పి/ఎన్.డి.ఏ సొంతం చేసుకుంది. ప్రజాస్వామ్యం సారమే భిన్నాభిప్రాయానికి విలువ ఇచ్చి గౌరవించడం. ఈ సూత్రం ప్రకారమే అత్యున్నత రాజ్యాంగ పదవులైన లోక్ పాల్, సి.వి.సి, విజిలెన్స్ కమిషనర్ ల నియామకంలో లోక్ సభ ప్రతిపక్ష నేత అభిప్రాయానికి స్ధానం ఇచ్చారు. తద్వారా పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాన్ని కాస్త నిరోధించారు. ప్రతిపక్ష నాయకుని అభిప్రాయానికి స్ధానం…

లోక్ సభ ప్రతిపక్ష హోదా: రంగంలోకి సుప్రీం కోర్టు?

లోక్ సభలో ప్రతిపక్ష నాయక హోదాను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి బి.జె.పి/ఎన్.డి.ఏ/మోడి ప్రభుత్వం నిరాకరించింది. లోక్ సభ సీట్ల మొత్తం సంఖ్యలో 10 శాతం సీట్లు తెచ్చుకోవడంలో విఫలం అయినందున కాంగ్రెస్ పార్టీ ఆ హోదాకు అర్హురాలు కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తేల్చేశారు. ఇది రాజ్యాంగ పదవుల నియామకానికి ఆటంకంగా పరిగణించడంతో సుప్రీం కోర్టు రంగంలోకి దిగుతోంది. వివిధ రాజ్యాంగ పదవులను భర్తీ చేయడంలో లోక్ సభ ప్రతిపక్ష నేతను విశ్వాసం లోకి…

లోక్ సభ: ప్రతి ముగ్గురు ఎం.పిల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు

….నేషనల్ ఎలెక్షన్ వాచ్ మరియు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ వారి నివేదిక ప్రకారం 2014 లోక్ సభ ఎన్నికలలో పోటీచేయు అబ్యర్ధులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం కొత్తగా ఎన్నికైన 541 మండి ఎం‌పి లలో 34% ఎం‌పి లు అనగా ప్రతి ముగ్గురిలో ఒకరు  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2009 లో 30% అనగా 158 మంది  ఎం‌పి లు,2004 లో 24% మంది ఎం‌పిలు  క్రిమిననల్ కేసులు ఎదుర్కొన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న 186…

ఇండియాతో చర్చలు: మండుతున్న పాకిస్ధాన్ -కార్టూన్

“… జనాబ్ మోడీజీ, మీతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి మేము గీత దాటితిమి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతోందో…” *** ప్రస్తుతం పాకిస్ధాన్ రాజధాని ఇస్లామాబాద్, ముఖ్యంగా పార్లమెంటు ప్రాంతం ఆందోళనలతో రగులుతోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ, మరో మతగురువు నేతృత్వంలోని సంస్ధ రెండూ పాకిస్ధాన్ పార్లమెంటు మీదికి దండెత్తి వచ్చారు. తమ ఆందోళనకు వారు చెబుతున్న కారణం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చిందని. అక్రమ ప్రభుత్వం కనుక వెంటనే రాజీనామా చేసి…