మోడి మార్కు లక్ష్మణ రేఖ -కార్టూన్

ప్రధాని నరేంద్ర మోడి తన లక్ష్మణ రేఖ ప్రకటించారు. సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ‘రామ్ జాదే – హరామ్ జాదే’ అంటూ చేసిన ప్రసంగం ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వడంతో ఆయన ‘కొత్త మంత్రులు, పార్టీ నేతలు’ ‘నియంత్రణ’లో ఉండాలని లక్ష్మణ రేఖ గీశారు. ఇంత గొడవ జరుగుతుంటే ప్రధాని ఎక్కడ? అంటూ ప్రతిపక్షాలు గర్జించడంతో పార్లమెంటుకు వచ్చిన ప్రధాని ‘కొత్త మంత్రి, గ్రామీణ నేపధ్యం, అంతా కొత్త. అయినా ఆపాలజీ…

ప్రతిపక్షం చేతికి ‘మత మార్పిడి’ ఆయుధం! -కార్టూన్

మత మార్పిడులు ఎప్పటి నుండో బి.జె.పి రాజకీయ అస్త్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మత మార్పిడులను భావోద్వేగాలను రెచ్చగొట్టగల ఆయుధంగా తయారు చేసుకున్న బి.జె.పి అనేకమార్లు దాన్ని ప్రయోగించి ఓట్లు నొల్లుకుంది. అయితే అది అధికారంలో లేనంతవరకు మాత్రమే ఆయుధం కాగలదని, అధికారంలోకి వచ్చాక ఎదురు తిరగుతుందని ఈ కార్టూన్ సూచిస్తోంది. కార్టూన్ లో ఉన్న మరో అంశం పిల్లిలా ఉన్న ప్రతిపక్షం మత మార్పిడుల వల్ల పులిగా మారిపోయిందని. బలం లేక, ఐక్యత కొరవడి, అధికార పక్షం…

ఇండియాకున్నది ఒకే పుస్తకం -ది హిందు ఎడిటోరియల్

(కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులే కాదు, మోడి కొలువులోని సీనియర్ మంత్రులు సైతం హిందూత్వ భావజాలాన్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భగవద్గీత పుస్తకాన్ని ‘జాతీయ గ్రంధం’ గా ప్రకటించాలని సుష్మ వ్యక్తం చేసిన కోరిక ఏదో యధాలాపంగా చేసినది కాదు. నిర్దిష్ట లక్ష్యం తోనే ఆమె ఆ మాటలు చెప్పారు. ఈ అంశంపై ది హిందు, డిసెంబర్ 10, 2014 తేదీన వెలువరించిన సంపాదకీయం.…

మహారాష్ట్ర: పులికి గంట కట్టిన బి.జె.పి -కార్టూన్

మహారాష్ట్ర ఎన్నికలు-ప్రభుత్వ ఏర్పాటు నాటకంలో చివరి అంకం పూర్తయింది. ఎన్నికలకు ముందు బి.జె.పి తో పొత్తును తెగతెంపులు చేసుకున్నది లగాయితు శివ సేన నేతలు, బి.జె.పి పై నిప్పులు చెరగని రోజంటూ లేదు. ఉత్తుత్తి పులి గాండ్రింపులు చేసి చేసి అలసిపోయిన శివసేన చివరికి పిల్లికంటే దిగజారి తమ ముందు ‘ఎలుక’గా అభివర్ణించిన బి.జె.పి చేతనే మెడలో గంట కట్టించుకుంది. మహారాష్ట్రలో ఎవరిది ఆధిపత్య హస్తం అన్నది నిర్ధారించుకోవడంలో పరస్పరం విభేదించుకున్న బి.జె.పి, శివసేనలు తమ విభేదం…

బి.జె.పి పాత్రధారుల పరిణామక్రమం

బి.జె.పి నేటి పూర్తి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకునే క్రమంలో ఆ పార్టీ నాయకులు ధరించిన వివిధ పాత్రల పరిణామాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ మాటకు వస్తే దాదాపు ప్రతి (దోపిడి) పార్టీ లోనూ జనాన్ని రెచ్చగొట్టే అతివాద పాత్రలు కొన్ని, జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయవలసిన పనిని చేసుకుంటూ పోయే పాత్రలు మరి కొన్నీ కనిపిస్తాయి. ఇలా రెండు రకాల పాత్రలను జనం ముందు ఉంచవలసిన అవసరం రాజకీయ పార్టీలకు ఎందుకు…

ఆశకు తగిన కారణం -ది హిందు ఎడిటోరియల్

(డిసెంబర్ 6, 2014 నాటి ది హిందు సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ఐదు అణ్వస్త్ర దేశాలు మరియు జర్మనీ (P5+1), ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న చర్చల ఎగుడు దిగుడు చరిత్ర గురించి బాగా తెలిసినవారు సదరు చర్చల తాజా రౌండ్, జూన్ 2015 వరకు మరో కొనసాగింపుకు నోచుకోవడాన్ని ఆశాభావంతో పరికించడం పట్ల చేయగలిగేది ఏమీ లేదు. ఇరాన్ తన మౌలిక అణు నిర్మాణాలను అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించడానికీ, ఆంక్షల నుండి గణనీయ మొత్తంలో,…

మోడి సరైన చర్య తీసుకుని తీరాలి -ది హిందు

కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉప మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీలో ఒక బహిరంగ సభలో మత మైనారిటీలను ఉద్దేశిస్తూ వారు అక్రమ సంతానం అంటూ చేసిన వ్యాఖ్యలు మత విద్వేషంతో కూడినవి, రెచ్చగొట్టేవి మరియు ఒక ఉన్నత ప్రభుత్వ కార్యాలయానికి అధిపతిగా ఉన్న వ్యక్తికి తగనివి. ఆమె చెప్పిన క్షమాపణలు బలహీనంగా వ్యక్తం అయ్యాయి. బహిరంగ ప్రకటనలు చేసేప్పుడు నడవడిక కోల్పోవద్దని, జాగ్రత్తగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి భారతీయ జనతా పార్టీ…

టి.ఎం.సి బలహీనతలే బి.జె.పికి బలమా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ లో ఒక దశలో ఎదురు లేనట్లు కనిపించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస ఇక్కట్లు ఎదుర్కొంటోంది. శారద చిట్ ఫండ్ కుంభకోణం మమత బెనర్జీ మెడకు భారీ గుదిబండగా మారిపోయింది. బర్ద్వాన్ పేలుళ్లు చేయించింది టి.ఎం.సి పార్టీయే అన్నట్లుగా బి.జె.పి అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ డబ్బు బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించారని,  శారదా చిట్ ఫండ్ కుంభకోణం దోషులను టి.ఎం.సి కాపాడుతోందని ఒక ర్యాలీలో మాట్లాడుతూ బి.జె.పి అమిత్…

మోడి దౌత్య మర్యాద ఉల్లంఘించారు -నేపాల్ పత్రికలు

సార్క్ దేశాల కూటమి సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి దౌత్య మర్యాదలను ఉల్లంఘించారని నేపాల్ పత్రికలు ఆరోపించాయి. ఆయన తన పరిమితులు గుర్తెరగకుండా నేపాల్ రాజ్యాంగం ఎలా ఉండాలో సలహా ఇవ్వడం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విరుచుకుపడ్డాయి. పాత పెద్దన్న వైఖరి, జోక్యందారీ పెత్తనం సహించరానివని కాంతిపుర్, నాగరిక్ పత్రికలు విమర్శించాయి. నేపాల్ లో రాచరికాన్ని కూల్చివేసిన తర్వాత రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదు. అనేక జాతుల సంగమం…

బ్యాట్స్ మేన్, రన్నర్ ఇద్దరూ ఆయనే -కార్టూన్

బి.సి.సి.ఐ భారత ప్రభుత్వ సంస్ధ అని చాలామంది భావిస్తారు. అది కేవలం ప్రైవేటు క్రికెట్ సంఘాలను కేంద్రీకృత స్ధాయిలో నియంత్రించే ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వారికి తెలియదు. అనేక యేళ్లుగా భారత ప్రజల్లో క్రికెట్ జ్వరాన్ని పెంచి పోషించి ఆ జ్వరాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బి.సి.సి.ఐ అవతరించింది. బి.సి.సి.ఐని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కొన్ని సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ క్రికెట్ జబ్బు డబ్బు తినడం మరిగిన సంపన్నులు…

శ్రీలంక మీదుగా తమిళనాట కమల వికాసం -కార్టూన్

సాధారణ ఎన్నికల్లో బి.జె.పి గెలుపుకి వాల్ స్ట్రీట్ కంపెనీలూ స్వయంగా రంగంలోకి దిగడం తెలిసిన విషయమే. సామ్రాజ్యవాద కంపెనీలు గనుక తమ అనుకూల ప్రభుత్వాలు వచ్చేలా చూసుకోవడం అవి ఎప్పుడూ చేసేపనే. కానీ సార్క్ సహోదరి శ్రీలంక ప్రభుత్వం సైతం తన పొరుగునే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో బి.జె.పి పునాదులు విస్తరించడానికి సకరిస్తుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. భారతీయ జనతా పార్టీలో వ్యూహ చతురుడుగా ప్రసిద్ధికెక్కిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, తమిళనాడులో కమలం…

కనీవినీ ఎరుగని దోషారోపణ -ది హిందు ఎడిట్

(మరి కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న సి.బి.ఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాను 2జి కేసు విచారణ నుండి పక్కకు తప్పుకోవాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించిన పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం ఈ వ్యాసం. -విశేఖర్) ************** సి.బి.ఐ డైరెక్టర్ గా రంజిత్ సిన్హా హయాం గురించి సానుకూలాంశం ఏదన్నా ఉందంటే అది, మరి కొద్ది రోజులలో ఆయన హయాం ముగింపుకు రావడమే. సున్నితమైన కేసుల్లో అత్యంత సామర్ధ్యంతో పరిశోధన చేసిన…

కమండలం నుండి కమేండోల వరకూ… -కార్టూన్

హిందూత్వ ప్రబోధకులు గొప్పగా చెప్పుకునే సనాతన స్వర్ణ యుగంలో మునులు, సాధువులు, బాబాలు, గురువులు ఏం చేసేవారు? ముక్కు మూసుకుని ఒంటికాలి తపస్సు చేసేవారు. హిమాలయాలకు చేరి పవిత్ర గంగా తీరాన లేదా మరో నది తీరాన కమండల ధారియై తపమాచరించెడివారు. సర్వసంగపరిత్యాగియై హరహర శంభో అంటూ దివ్యజ్ఞానార్ద్ధులై కఠోర బ్రహ్మచర్యం పాటించేవారు. శిష్యులను వెంటేసుకుని ధర్మ ప్రబోధం కావించేవారు. మనం చూడకపోయినా మన పుస్తకాలు, కధలు, బోధనలు ఈ సంగతి చెబుతాయి. మరి ఇప్పుడో! ఏ.సి…

ఫడ్నవీస్: విశ్వాస పరీక్ష ఇంత సులువా? -కార్టూన్

కూటమి యుగం ప్రారంభం అయ్యాక రాష్ట్రాల శాసన సభల్లోనూ, లోక్ సభలోనూ విశ్వాస పరీక్ష నెగ్గడం రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారిపోయింది. కూటమిలో ప్రతి చిన్న పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, అలాగని వారిని వదులుకోలేక కూటమి నేత పార్టీలు నానా చావు చచ్చేవి. కానీ మహారాష్ట్రలో మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా సరే అతి సులభంగా విశ్వాస పరీక్ష నెగ్గి ముందు తరాలకు ఒక ఆదర్శాన్ని చూపింది. బహుశా ఫడ్నవీస్…

నెహ్రూ వారసత్వానికి కాంగ్రెస్ తాళం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోడి ఇమేజి దెయ్యమై వేధిస్తోంది. కళ్ళు తెరిచినా, మూసినా మోడి భూతమే ప్రత్యక్షం అవుతుండడంతో తనను బంధించుకునే పరిస్ధితిలో పడిపోయింది. తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని మోడి ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయంతో ప్రధమ ప్రధాని నెహ్రూ ఇమేజికి తాళం వేసేసుకుంది. నవంబర్ 14, నెహ్రూ జన్మదినం. ఎప్పుడూ వచ్చే జన్మదినం కాదు 125వ జన్మదినం. అది పురస్కరించుకుని నెహ్రూ సంస్మరణ సభలు, సెమీనార్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్…