పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

భారత వ్యవసాయ రంగంలో మార్పులు -ఒక నోట్ -పార్ట్ 2       పంపిణీలు & ఉత్పత్తి (Distributions & Production): భూమి అద్దె, వేతనాలు, వడ్డీ మరియు లాభ మొత్తం లను పంపిణీ కిందా, భూమి, శ్రమ మరియు పెట్టుబడి మొత్తం లను ఉత్పత్తి కిందా మార్క్స్ చర్చించారు. “పంపిణీ రూపాలలో ఉండే వడ్డీ మరియు లాభాలు ‘పెట్టుబడి, ఉత్పత్తి యొక్క ప్రతినిధి (agent of production)’ అనే పూర్వాలోచన (presupposes) కలిగి ఉంటాయి” అని కూడా…

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

(భారత దేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల స్వభావం ఏమిటన్నదీ దేశంలో ఒక చర్చగా ఉంటోంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలలో, ఇంకా ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలలో ఈ అంశం పైన తీవ్రమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి. భారత దేశ వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం (Capitalist Mode of Production) ప్రవేశించిందని కొంత మంది వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను తిరస్కరిస్తున్నారు. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య వ్యవస్ధగా నిర్వచించబడిన భారత దేశ సామజిక వ్యవస్ధ…

వాస్తవాలను వెలికి తీసే విశ్లేషణ -ఈనాడు ఆర్టికల్ 6వ భాగం

‘జాతీయ అంతర్జాతీయ పరిస్ధితులపై అవగాహన సాధించడమెలా?’ అనే ఆర్టికల్ వరుసగా ఈనాడు చదువు పేజీలో ప్రచురితం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆరవ భాగం ఈరోజు (సోమవారం, మార్చి 25 తేదీ) ప్రచురించబడింది. ఐదు భాగాల వరకూ అంతర్జాతీయ పరిస్ధితులను ఎలా చూడలన్న విషయాన్ని చూశాము. అంతర్జాతీయ రంగంలో ఉండే వివిద శిబిరాలు, ఆర్ధిక, రాజకీయ కూటములు, భౌగోళిక విభజనలు, వాటి ప్రాధాన్యతలు తదితర అంశాలను ఈ ఐదు భాగాల్లో చర్చించాము. ఆరవ భాగం…

లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు

లతెహార్ ఎన్ కౌంటర్ లో గిరిజనులను పోలీసులు బలవంతం చేసి మానవ కవచంగా వాడుకున్నారని ‘ది హిందూ‘ పరిశోధనలో వెల్లడయింది. మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన పోలీసుల శవాలను వెతికే పనిలో గ్రామ ప్రజలను మానవ కవచంగా పోలీసులు వినియోగించడంతో నలుగురు గిరిజనులు దుర్మరణం చెందారు. పోలీసులు మరణించిన తమ సహచరుడి శవానికి ఇరవై అడుగుల దూరంలోనే నిలబడి శవాన్ని తేవడానికి గిరిజనులను పంపించడంతో పేలుడునుండి పోలీసులు తప్పించుకోగా గిరిజనులు చనిపోయారు. శవాన్ని తన భుజానికి ఎత్తుకుంటూ శవం…

నార్వేలో కొడుకుని కొట్టి జైలుపాలయిన తెలుగు అమ్మా నాన్నలు

రెండు సామాజిక వ్యవస్ధల కుటుంబ విలువల మధ్య ఉన్న వైరుధ్యాలు ఒక యువ తెలుగు విద్యాధిక జంటను జైలుపాలు చేశాయి. ప్రఖ్యాత భారత సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ ఉద్యోగి చంద్ర శేఖర్, కంపెనీ కోసం నార్వే వెళ్ళి ఊహించని పరిణామాల వల్ల క్షోభను అనుభవిస్తున్నాడు. ఎదుగుదల క్రమంలో నేర్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్న 7 యేళ్ళ కుమారుడిని అదుపులో పెట్టే క్రమంలో చంద్రశేఖర్ తండ్రిగా అదుపు తప్పాడని నార్వే కోర్టులు భావించి 18…

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -2

మొదటిభాగం తరువాయి… ఇపుడు మళ్ళీ ఆయన చెప్పేదేమిటో ఊహించదగినదే. అదేమంటే, ముస్లింలు భారతీయ ఆర్కిటెక్చర్ ను నాశనం చేశారు; ప్రతీదీ కూలిపోయింది. వారు దోపిడీదారులు మరియు వినాశనకారులు. ముస్లింల హయాంలో ఏమి జరిగిందో తెలియాలంటే ఏ భవనాన్నైనా చూడవచ్చు. జనం ఆయనతో వాదించినపుడు ఆయన తాజ్ గురించి ఏమాన్నాడో చూడండి: “తాజ్ అనేది పెద్ద వృధా, క్షీణదశలో ఉన్నది. చివరికది ఎంత క్రూరమైనదంటే అక్కడ ఎక్కువసేపు ఉండడం నాకు చాలా కష్టంగా తోచింది. ప్రజల రక్తం గురించి…

ముస్లింల వ్యతిరేకి వి ఎస్ నైపాల్ కి అవార్డా! ఎందుకు? -గిరీష్ కర్నాడ్ -1

[సుప్రసిద్ధ నాటక రచయిత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ముంబై గడ్డపై ఒక సాహితీ వేదికలో నిర్వాహకులపైనే కత్తి దూశాడు. ట్రినిడాడియన్-బ్రిటిష్ పౌరుడు, నోబెల్ సాహితీ బహుమతి స్వీకర్త విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ కు ‘టాటా లిటరేచర్ లైవ్! ఫెస్టివల్’, లైఫ్ అఛీవ్మెంట్ అవార్డ్ ప్రకటించడంపై మండిపడ్డాడు. ‘నాటకరంగంలో తన ప్రయాణం’ పై ప్రసంగించడానికి నిర్వాహకులు గిరీష్ ను ఆహ్వానించగా ఆయన నైపాల్ రాతలపై, భావాలపై దాడి చేయడానికి అవకాశాన్ని వినియోగించాడు.బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్ధించిన…

రామాయణ విషవృక్షం – మతవిమర్శ

(రంగనాయకమ్మ గారి ఉద్గ్రంధాల్లో ఒకటి ‘రామాయణ విషవృక్షం’. ఆ పుస్తకంపై ప్రశంసలు ఎన్నివచ్చాయో, విమర్శలు అన్ని వచ్చాయి. ఆ పుస్తకం వలనే రచయిత్రిపై విద్వేషం పెంచుకున్నవారు అనేకులు. “మతమన్నది, నిజానికి, ఇంకా తనను తాను జయించలేని లేదా తనను తాను మరొకసారి కోల్పోయిన మనిషి యొక్క ఆత్మ-చేతన (self-consciousness) మరియు ఆత్మ-గౌరవం (self-esteem)” అనీ “మతం, ప్రపంచపు ప్రజాదరణ పొందిన రూపంలోని తర్కం. మతం, ప్రపంచపు అత్యాధ్మిక గౌరవాన్ని సమున్నతపరిచే అంశం” అనీ కారల్ మార్క్స్ అభివర్ణించాడు.…

కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి -2

మొదటి భాగం తరువాయి… … ‘కమ్యూనిస్టు హోలోకాస్ట్’ కి సంబంధించిన పాపపు కధలన్నీ పశ్చిమ దేశాలు కనిపెట్టినవిగా నేను మాట్లాడిన కాంబోడియన్లు కొట్టిపారేశారు. నిజంగా ఏంజరిగిందో వారు నాకు గుర్తుచేశారు. 1970లో న్యాయబద్ధమైన తమ పాలకుడు యువరాజు సిహ్నౌక్ ని అమెరికన్లు వెంటపడి తరిమేసి అతని స్ధానంలో తమ కీలుబొమ్మ, మిలటరీ డిక్టేటర్ లోన్ నోల్ ను ప్రతిష్టించడంతో వారి కష్టాల చరిత్ర ప్రారంభం అయింది. లోన్ నోల్ మధ్య నామం అవినీతి. అతని అనుచరులు తమకు…

కాంబోడియా చరిత్ర: పోల్ పాట్ గురించి మరొకసారి 1

(ప్రఖ్యాత అంతర్జాతీయ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, మాస్కో నివాసి అయిన ఇస్రాయెల్ షమీర్ సెప్టెంబర్ 18 తేదీన ‘కౌంటర్ పంచ్’ పత్రికకు రాసిన వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. కాంబోడియాలో అమెరికా సాగించిన నీచ హత్యాకాండలను కప్పి పుచ్చుకోవడానికీ, బైటికి రాకుండా చేయడానికీ కమ్యూనిస్టు విప్లవ నేత పోల్ పాట్ పై అనేక అబద్ధాలు సృష్టించి పశ్చిమ పత్రికలు, రాజ్యాలు ప్రచారంలో పెట్టాయి. తన ప్రజలను తానే మిలియన్ల సంఖ్యలో మట్టుపెట్టిన  రక్తపిపాసిగా ప్రపంచం అంతా గుర్తుకు…

ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడయిన ప్రపంచ ఆర్ధికశక్తుల వైరుధ్యాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు,…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -2

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ట తీర్ధ ఒప్పుకోలు ఇక్కడ పరిగణిచాలి. ఆమె ఒప్పుకున్నది గనుక పరిగణించడం కాదిక్కడ. ఐరాస ఒప్పందం, సుప్రీం కోర్టు పరిశీలన, సామాజిక అధ్యయనవేత్తల లెక్కలు అన్నీ పరిగణిస్తే కృష్ట తీర్ధ ఒప్పుకోలు, పరిగణించవలసిన వాస్తవం అని గ్రహించవచ్చు. మంత్రి ఒప్పుకోలును పరిగణిస్తే భారత దేశ జి.డి.పి 2010 లో 1143 బిలియన్లు కాదు. దాని విలువ 1747 బిలియన్ డాలర్లు. ఇందులో 35 శాతం కేవలం గృహిణుల శ్రమనుండి…

ఇంటిపనికి వేతనం ఇవ్వాల్సింది భర్త కాదు, గృహిణుల శ్రమను దోచే ఆధిపత్య వర్గ ప్రభుత్వం -1

సెప్టెంబర్ మొదటివారంలో అకస్మాత్తుగా దేశ పత్రికలు, చానెళ్ళు వేతనంలేని ఇంటిపని గురించి మాట్లాడడం మొదలు పెట్టాయి. ఇంటి పని చేసినందుకుగాను భర్తల వేతనంలో కొంతభాగం భార్యలకు చెల్లించేలా చట్టం తెస్తామని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ తీర్ధ ప్రకటించడంతో వివిధ వేదికలపైన దేశవ్యాపితంగా చర్చలు మొదలయ్యాయి. మహిళా సంఘాలు, సామాజిక శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్ధల ఎజెండాల్లోనూ, డిమాండ్లలోనూ దశాబ్దాలుగా నలుగుతున్నప్పటికీ, పత్రికల సామాజిక బాధ్యతలో మాత్రం ‘ఇంటిపని వేతనం’ పెద్దగా చోటు సంపాదించలేకపోయింది.…

కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి?

బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికి వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయి. శ్రామిక ప్రజల ప్రయోజనాలను అవి పట్టించుకోవు. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయి. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయి. సామ్రాజ్యవాదులకు…

చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి…