మరో ‘వైట్’ హంతకుడికి ‘విముక్తి’ -ఫోటోలు

మరో వైట్ పోలీసు ఆధిపత్యం, మరో నల్లజాతి పౌరుడి హత్య, చివరికి మరో గ్రాండ్ జ్యూరీ గుడ్డి తీర్పు! గత జులైలో డ్రగ్స్ అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులు ఓ నల్లజాతి పౌరుడిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. అతడి గొంతు చుట్టూ చేయి బిగించి పట్టుకుని బరబరా పోలీసు వ్యాన్ దగ్గరికి ఈడ్చుకెళ్లారు. మరో ముగ్గురు, నలుగురు పోలీసులు గొంతు బిగించిన పోలీసుకు సహకరించారు. ఈడ్చుతున్నప్పుడే ఆ బాధితుడు అరుస్తూనే ఉన్నాడు, ‘నాకు ఊపిరి అందడం లేదు’ అని.…

కార్మికుల సమ్మెకు మోడి పరిష్కారం: విభజించు-పాలించు

కార్మికుడిని “శ్రమ యోగి” గా ప్రధాని నరేంద్ర మోడి అభివర్ణించారు. కార్మికులను ఆకాశానికి ఎత్తుతూ ‘శ్రమయేవ జయతే” అని నినాదం ఇచ్చారు. ఆయన అభివర్ణన, నినాదం కేవలం అలంకార ప్రాయమే అని కార్మికులకు తెలియడానికి నెల రోజులు కూడా పట్టలేదు. గత అరవై యేళ్లుగా భారత దేశ ప్రజల ఇంధనం అవసరాలను కోల్ ఇండియా కంపెనీ తీరుస్తోంది. అలాంటి కంపెనీలో వాటాలను మోడి ప్రభుత్వం ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు అమ్మేయడానికి నిరసనగా కార్మికులు సమ్మె బాట పట్టారు.…

మనోరమ: చిత్రహింసలు పెట్టి చంపేశారు -కమిషన్

మణిపురి యువతి తంగ్జామ్ మనోరమ హత్యకు ఎవరు బాధ్యులో విచారించిన జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఎట్టకేలకు వెలుగు చూసింది. నివేదికను కమిషన్ వెల్లడి చేసిన దశాబ్దం తర్వాత, అది కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నాకనే, అందులోని అంశాలు పాక్షికంగానైనా లోకానికి వెల్లడి అయ్యాయి. అస్సాం రైఫిల్స్ కు చెందిన సైనిక బృందం ఒకటి మనోరమ ఇంట్లో చొరబడి, ఆమెను లాక్కెళ్లి, చిత్రహింసలకు గురిచేసి, అనంతరం విచక్షణారహితంగా అనేకమార్లు తుపాకితో కాల్చి చంపారని కమిషన్ నివేదిక తెలిపింది.…

తగు మూల్యం చెల్లించిన భద్రతా బలగాలు -ది హిందు ఎడిట్

(మాచిల్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో కోర్టు మార్షల్ జరిగిన పర్యవసానంగా ఐదుగురు సైనికులకు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ శిక్షను చూపిస్తూ AFSPA ను రద్దు చేయనవసరం లేదని మాజీ ఆర్మీ అధిపతి, ప్రస్తుత ఉప విదేశీ మంత్రి  జనరల్ వి.కె.సింగ్ అప్పుడే ప్రకటించేశారు. ఈ పరిణామంపై ది హిందు ప్రచురించిన సంపాదకీయం. -విశేఖర్) కాశ్మీర్ లో బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడినందుకు గాను 4 రాజ్ పుటానా రైఫిల్స్ కు చెందిన…

ఏ‌ఎఫ్‌ఎస్‌పి‌ఏ వెనక నక్కి చేసిన కాల్పులు -ది హిందు ఎడిట్

(కాశ్మీరు లోయలో సైనికులు కాల్పులు జరిపి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరించిన ఘటనపై ది హిందు ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్) ********************** ఇద్దరు టీనేజి బాలురు చనిపోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో క్లిష్ట పరిస్ధితిలో ఉన్నారు. చెక్ పాయింట్ వద్ద ఉన్న సైనికులు వారిని కాల్చి చంపగా జరిగిన ఘటనపై విరుద్ధ కధనాలు వినబడుతున్నాయి. కనుక అది ఎవరు చేశారన్న ప్రశ్న లేదు. ఎందుకు చేశారన్నదే ప్రశ్న.…

కాశ్మీర్: మిగిలిన వారినీ చంపాలని చూశారా?

కాశ్మీరులో కారుపై సైన్యం కాల్పులు జరిపిన ఘటనలో ఇద్దరు బులెట్ గాయాలతో తప్పించుకున్న సంగతి తెలిసిందే. గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం పరుగెత్తి పారిపోవడం వల్ల బతికిపోయాడే తప్ప సైన్యం కాల్పులు జరపడం ఆపడం వల్లనో లేదా కారు ఆపడం వల్లనో కాదని తెలుస్తోంది. దుర్ఘటన నుండి గాయాలు కాకుండా తప్పించుకున్న బాసిం అహ్మద్ చెప్పిన వివరాలను బట్టి కారు విద్యుత్ స్తంబానికి గుద్దుకుని ఆగిపోయిన తర్వాత కూడా సైనికులు కాల్పులు కొనసాగించారు. కారు తలుపు తీసుకుని…

కాశ్మీర్: కారు ఆపలేదని పిల్లల్ని చంపేశారు

దేశసేవలో మునిగి తేలుతున్నారని, వారు లేనిదే దేశం లేదనీ పొగడ్తలు పొందే మన సైనికులు కాశ్మీర్ లో అమాయక పౌరులపై ఏ విధంగా రెచ్చిపోతారో తెలిపే దుర్ఘటన సోమవారం జరిగింది. సైన్యం నెలకొల్పిన చెక్ పోస్ట్ దగ్గర రెడ్ సిగ్నల్ చూపించినా ఆగకుండా వెళ్లిపోయారని కారుపై కాల్పులు జరిపి ఇద్దరు పిల్లల్ని పొట్టనబెట్టుకున్నారు. కారు ఆగకుండా వెళ్తే టైర్లను కాల్చవచ్చు. టైర్లకు బదులు కారు విండ్ స్క్రీన్స్ కి గురిపెట్టి కాల్చడంతోనే సైనికుల ఉద్దేశం స్పష్టం అవుతోంది.…

జనాగ్రహంలో బర్కినా ఫాసో పార్లమెంటు దగ్ధం -ఫోటోలు

27 యేళ్ళ పాటు తమను పట్టి పీడించిన సో కాల్డ్ ప్రజాస్వామ్య నియంత బ్లైసే కంపోరే, మరో 15 యేళ్లపాటు దేశాన్ని ఏలడానికి ఏర్పాట్లు చేసుకోవడంతో పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం బర్కినా ఫాసో ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. గురువారం (అక్టోబర్ 30) రాజధాని ఔగాడౌగౌ వీధులను ముంచెత్తుతూ తీవ్ర స్ధాయిలో నిరసన ప్రకటించారు. కంపోరేకు పదవీకాలం పొడిగింపుకు అవకాశం ఇచ్చే చట్టం ఆమోదం పొందకుండా ఉండేందుకు జనం మూకుమ్మడిగా పార్లమెంటుపై దాడి చేశారు. పార్లమెంటు, ఇతర ప్రభుత్వ…

కాశ్మీర్: ఇండియా అవగాహనకు దూరమౌతున్న అమెరికా!

జమ్ము&కాశ్మీర్ రాష్ట్రం విషయంలో ఇండియా అవలంబిస్తున్న అవగాహనకు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికేమీ కాదు. పశ్చిమ రాజ్యాధినేతలు దక్షిణాసియా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇండియాలో ఇండియాకు కావలసిన మాటలు, పాకిస్ధాన్ లో పాకిస్ధాన్ కు కావలసిన మాటలు చెప్పి తమ పనులు చక్కబెట్టుకొని పోవడం పరిపాటి. మొదటిసారిగా అమెరికా సెనేటర్లు కొందరు ఇండియాలో ఇండియా వ్యతిరేక అవగాహన ప్రకటించిన ఘటన చోటు చేసుకుంది. సమస్యలు లేని చోట కూడా సమస్యలు పుట్టించి…

ఆంధ్ర రాజధాని: భూ స్వాధీనానికి రైతులు వ్యతిరేకం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొంతు రోజు రోజుకి కఠినంగా మారుతోంది. రైతులకు బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చి భూములు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు “భూములు ఇచ్చారా సరే సరి, లేదా…” అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల అభివృద్ధిలో రైతులకు వాటా ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ వైపు మొగ్గు ప్రకటిస్తున్నారు. పూలింగ్ కు ఒప్పుకోకపోతే స్వాధీనం చేసేసుకుంటాం అని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి…

విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు. తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం.…

అవాంఛనీయ ఉపసంహరణ -ది హిందు ఎడిటోరియల్

(లోక్ సభ ఎన్నికల్లో బి.జె.పి ప్రధాన నినాదాలు అభివృద్ధి, ఉపాధి. అధికారంలోకి వచ్చాక ఈ నినాదాలకు కట్టుబడి ఉండడానికి బదులు సరిగ్గా వ్యతిరేక చర్యలను బి.జె.పి ప్రభుత్వం తలపెడుతోంది. మిలియన్ల మంది గ్రామీణ పేదలకు కాస్తో, కూస్తో వరంగా పరిణమించిన గ్రామీణ ఉపాధి పధకంలో కోత విధించడం ద్వారా మోడి ప్రభుత్వం తన హామీని అడ్డంగా ఉల్లంఘిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు హిందు ప్రచురించిన ఎడిటోరియల్ కు యధాతధ అనువాదం ఇది. -విశేఖర్) ప్రపంచంలో అతి…

మోడీకి సమన్లు ఇస్తే $10 వేల బహుమతి

పట్టిస్తే పదివేలు! ఈ పేరుతో పాత తెలుగు సినిమా ఒకటి ఉందనుకుంటా. అమెరికాకు అధికార పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడికి న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు అక్కడి మానవ హక్కుల సంస్ధ సరిగ్గా ఇలాంటి మార్గాన్నే ఎంచుకుంది. కోర్టు సమన్లను నరేంద్ర మోడీకి అందజేసినవారికి 10,000 డాలర్లు బహుమతిగా ఇస్తామని ఎ.జె.సి తరపు లాయర్ గుర్పత్వంత్ సింగ్ పన్నున్ ప్రకటించారు. భారత దేశంలో నక్సలైట్ నాయకులను పట్టుకోవడానికి వారి తలలకు…

ఒడిషా: డెంగ్యూను పోషిస్తున్న టాటా స్టీల్

ఒడిషా రాష్ట్రంలో టాటా స్టీల్ నిర్మిస్తున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ కార్మికులను అవస్ధలకు గురి చేస్తోంది. ఫ్యాక్టరీ పరిసరాల్లో శుభ్రత పాటించకపోవడంతో కార్మికులు ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరానికి గురై అవస్ధలు పడుతున్నారు. ఒడిషా ప్రభుత్వ శాఖలు టాటా యాజమాన్యం వైఖరిని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. టాటా కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇది ప్రతేడూ ఉండేదే అని చేతులు దులిపేసుకుంటున్నారు. టాటా గ్రూపు కంపెనీల్లో ఒకటయిన ‘టాటా స్టీల్’ కంపెనీ ఒకప్పుడు భారత దేశానికి ఒకే…

స్టెర్లింగ్ చావుకొచ్చిన స్కాట్లండ్ సంబరం

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అని సామెత. యునైటెడ్ కింగ్ డమ్ (గ్రేట్ బ్రిటన్) కరెన్సీ పరిస్ధితి ఇప్పుడు అలానే ఉంది. స్కాట్లండ్ స్వతంత్రం పట్ల స్కాటిష్ ప్రజల్లో ఆదరణ పెరిగేకొద్దీ బ్రిటిష్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ విలువ దిగజారుతోంది. ఆదివారం జరిగిన అభిప్రాయ సేకరణలో స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా విడిపోవడానికి ‘యెస్’ అంటున్న ఓటర్ల సంఖ్య మొదటిసారిగా మెజారిటీ సాధించినట్లు తేలింది. ఓటింగులో పాల్గొన్నవారిలో అటో, ఇటో చెప్పినవారిలో 51 శాతం మంది ‘యెస్’ అని…