గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు. గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం…

ఢిల్లీలో రైతు ఆత్మహత్య, పాలకుల మొసలి కన్నీళ్లు -ఫోటోలు

బుధవారం ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన కిసాన్ ర్యాలీ సందర్భంగా రాజస్ధాన్ నుండి వచ్చిన రైతు (గజేంద్ర సింగ్) ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య లేఖ రాసి మరీ చనిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నెపాన్ని ఢిల్లీ ప్రభుత్వం పైకి నేట్టేందుకు చట్ట సభల సాక్షిగా ఆసక్తి ప్రదర్శించింది. కాగా అనంతరం జరిగిన, జరుతున్న తంతు ఈ దేశ పాలకవర్గాల కపటత్వాన్ని పచ్చిగా వెల్లడి చేసింది. భారత దేశంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త కాదు. కాంగ్రెస్, టి.డి.పి, బి.జె.పి,…

కోకోకోలాపై పెరుందురై ప్రజల విజయం

ప్రజలు ఎక్కడ తిరగబడుతున్నారు అని ప్రశ్నిస్తున్న అమాయక బుద్ధి జీవులకు తమిళనాడులోని పెరుందురై ప్రజలు సమయానుకూల సమాధానం ఇచ్చారు. నీటి వనరులను పీల్చి పంటల్ని పిప్పి చేసే కోకోకోలా ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడడంతో కోకోకోలాకు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కోకోకోలాకు భూములపై ఇచ్చిన లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పెరుందురై ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక సంస్ధ…

రైతుల భూములపై రాహుల్ కి అంత ప్రేమ ఏల? -కార్టూన్

రాహుల్ గాంధీ సెలవు కాలం ముగించుకుని కలుగులోంచి వెలికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రైతుల (కోసం) ర్యాలీ నిర్వహించి తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు (లేదా చాటానని ఆయన అనుకున్నారు). ఆయన మాట్లాడినంత సేపూ జనం (ఎలాగో) ఉన్నారని, ఆయన ముగించి సోనియా గాంధీ మాట్లాడడం ప్రారంభించగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారని పత్రికలు గుస గుస రాశాయి. పునరాగమనం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి తెచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై ఆయన నిప్పులు…

చైనా రియల్ రాబందుల భూదాహానికి ప్రతిఘటన ఈ మేకు ఇళ్ళు -ఫోటోలు

చైనా అత్యంత వేగంగా అమెరికా జి.డి.పి పరిమాణాన్ని సమీపిస్తోంది. ప్రస్తుతం అమెరికా వార్షిక జి.డి.పి 16.8 ట్రిలియన్ డాలర్లు ఉంటే చైనా జి.డి.పి 9.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మూడేళ్ళ క్రితం జపాన్ ను మూడో స్ధానానికి నెట్టి రెండో స్ధానానికి చేరేనాటికి చైనా జి.డి.పి 4.5 ట్రిలియన్లు. ఇప్పుడు అంతకు అంతా జి.డి.పి ని పెంచుకుని అమెరికాని వెనక్కి నేట్టేందుకు దూసుకుపోతోంది. చైనా విశృంఖల అభివృద్ధిలో ‘రియల్ ఎస్టేట్ బూమ్’ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.…

ఢిల్లీ: సామాన్యుడి దెబ్బకు దిమ్మ తిరిగింది!

ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు…

భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్ -ది హిందు ఆర్టికల్ (2)

మొదటి భాగం తరువాత…………. – అభివృద్ధి పేరుతో… ఈ వాదనతో ఉన్న రెండో సమస్య ఏమిటంటే, ధరలపై కేంద్రీకరించడం ద్వారా మరింత మౌలికమయిన రాజకీయ సమస్యను విస్మరించింది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రైతుల నుండి భూములను బలవంతంగా గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి? కనీసం ఆంగ్లంలో అనుబంధాలు ఇచ్చినప్పటి నుండి… భూములను ఒక గ్రూపు ప్రజల నుండి తీసేసుకుని మరో గ్రూపుకు (సాధారణంగా సంపన్నులు) ఇవ్వడాన్ని “ప్రజా” లేదా “జాతీయ” లక్ష్యాన్ని నెరవేర్చడంగా ప్రభుత్వాలు సమర్ధించుకున్నాయి.…

అమెరికా పౌరహక్కుల ‘రారాజు’ జనించి 86 యేళ్ళు! -ఫోటోలు

జాత్యహంకారానికి గురవుతున్న నల్లజాతి ప్రజలతో పాటు పెట్టుబడిదారీ పదఘట్టనల క్రింద నలుగుతున్న తెల్లజాతి కార్మికవర్గ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం ఉద్యమించిన పౌరహక్కుల ఉద్యమ తరంగం మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్! ఆయన జన్మించి జనవరి 15తో 86 సం.లు నిండాయి. వాషింగ్టన్ డి.సి లింకన్ హాలు ముందు మెట్లపై నిలబడి ఆయన చేసినచరిత్రాత్మక ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగం ఇప్పటికీ అత్యంత ఉత్తేజకరమైన ప్రసంగాలలో ఉన్నతమైనదిగా కొనియాబడుతోంది. ఆధిపత్య వర్గాల…

2014-15 Q3 లో టి.సి.ఎస్ తొలగింపులు 11,693

భారత దేశ ఐ.టి దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ లే-ఆఫ్ (ఉద్యోగుల తొలగింపు) ఉదంతంలో వాస్తవాలు నానాటికీ మరింతగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కంపెనీ విడుదల చేసిన మూడవ త్రైమాసిక ఫలితాలలో వాస్తవ ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఎంతో కంపెనీయే స్వయంగా ప్రకటించింది. కంపెనీ అధిపతులు మొదట చెప్పినట్లుగా కేవలం 1 శాతం మాత్రమే తొలగింపులు ఉన్నాయనడం నిజం కాదని కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ‘నాన్-పెర్ఫార్మర్స్’ పేరుతో టి.సి.ఎస్ కంపెనీ పెద్ద సంఖ్యలో…

టి.సి.ఎస్ లే-ఆఫ్ కు సీనియర్ల అధిక వేతనాలే కారణం -2

భారత వ్యాపార, ఐ.టి రంగాలను ట్రాక్ చేసే Track.in అనే బిజినెస్ వెబ్ సైట్ ప్రకారం మధ్య స్ధాయి మేనేజర్లను, కన్సల్టెంట్లను తన లే-ఆఫ్ (ఉద్యోగాల తొలగింపు) కు టి.సి.ఎస్ లక్ష్యంగా చేసుకుంది. టి.సి.ఎస్ లో ఇలా ఎన్నడూ జరగలేదనీ ఉద్యోగ భద్రతకు పేరు గాంచిన టి.సి.ఎస్ ఇప్పుడు తన ఏ, బి, సి, డి, ఇ రేటింగులలో చివరి 3 రేటింగుల వారిని అందరినీ తొలగించాలని లక్ష్యంగా చేసుకుందని ట్రాకిన్ తెలిపింది. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను…

టి.సి.ఎస్ లే-ఆఫ్: సీనియర్ల వేతనాలు కారణం కాదా?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద, మెరుగైన 10 సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. భారత దేశంలో నయితే ఇదే అతి పెద్ద సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ. ఈ కంపెనీలో చేరితో ఉద్యోగ భద్రత ఉంటుందని కూడా ఇటీవలి వరకూ ఒక భావన వ్యాప్తిలో ఉండేది. అలాంటి కంపెనీ ఆ వంకా, ఈ వంకా పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోందని, ఎటువంటి నోటీసు, తగిన చెల్లింపులు లేకుండా…

టి.సి.ఎస్ లో సామూహిక తొలగింపులు

భారత దేశంలో అతి పెద్ద సాఫ్ట్ వేర్ ఉత్పత్తి మరియు సేవల కంపెనీగా ప్రసిద్ధి గాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ నుండి తొలగించబడిన ఉద్యోగులు ఈ మేరకు బెంగుళూరు/కర్ణాటక డిప్యూటీ లేబర్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారు అధికారికంగా ఇంకా ఫిర్యాదు చేయవలసి ఉందని తెలుస్తోంది. ఉద్యోగులను సామూహికంగా తొలగించే కార్యక్రమాన్ని టి.సి.ఎస్ కంపెనీ యాజమాన్యం చేపట్టిందని ఉద్యోగులు చెబుతున్నారు.…

అస్సాం మారణకాండ -ది హిందు ఎడిటోరియల్

(ది హిందు, 25.12.2014 నాటి Carnage in Assam ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం.) జాతుల హింసాకాండ దిగ్భ్రాంతికర రీతిలో తిరిగి జడలు విప్పడంతో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్.డి.ఎఫ్.బి) – సాంగ్ బిజిత్ ముఠా కు చెందిన సాయుధ మిలిటెంట్లు సోనిట్ పూర్, కొక్రాఝర్ మరియు ఇతర జిల్లాల్లో సాగించిన వరుస దాడుల్లో 67 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు. (ఈ ఆదివాసీలు ఇప్పటికీ గిరిజన హోదా కోసం పోరాడుతున్నారు.) మూడు…

అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి

అస్సాం రాష్ట్రంలో, ముఖ్యంగా బోడో స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బోడో మిలిటెంట్ సంస్ధల్లో ఒకటయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ [ఎన్‌డి‌ఎఫ్‌బి(ఎస్)] కు చెందిన మిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు. అత్యధికంగా స్త్రీలు, పిల్లలు చనిపోయిన హత్యాకాండలో 67 మంది ఆదివాసీ పౌరులు చనిపోగా, పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. బోడో హత్యలకు ప్రతీకారంగా ఆదివాసీలు కొందరు బోడోల ఇల్లు తగలబెట్టారు. దాదాపు వంద సంవత్సరాల క్రితం అస్సాంలోని ఇతర…

భోపాల్: వేల ప్రాణాలకు గడ్డిపోచ విలువ కట్టి 30 యేళ్ళు -ఫోటోలు

విషపు రెక్కల డేగ భోపాల్ నగరం విను వీధుల్లో విష విహారం చేసి డిసెంబర్ 3 తేదీకి 30 యేళ్ళు గడిచిపోయాయి. సో కాల్డ్ నాగరిక ప్రజాతంత్ర భారత రిపబ్లిక్ రాజ్యం సాక్షిగా, ఘనతర ఆధునిక న్యాయ వ్యవస్ధల కనుసన్నల్లో, సామ్రాజ్యవాద అమెరికాతో స్నేహ సంబంధాలు దినదిన ప్రవర్ధమానం అవుతుండగానే భోపాల్ విష వాయు బాధితులు నేటికీ విషవాయువు పీడితులుగా ఇళ్ళు, ఒళ్ళు, తరతరాల ఆరోగ్యం అన్నీ గుల్ల చేసుకుని న్యాయం కోసం దేబిరిస్తూనే ఉన్నారు. రారాజులు,…