12 మిలియన్ల యాపిల్ డివైజ్ లపై ఎఫ్.బి.ఐ నిఘా, హ్యాకర్ల వెల్లడి

1.2 కోట్ల యాపిల్ ఉత్పత్తుల కొనుగోలుదారులపై అమెరికా ఫెడరల్ పోలీసు సంస్ధ ఎఫ్.బి.ఐ నిఘా పెట్టిన సంగతిని హ్యాకర్లు బట్టబయలు చేశారు. ఎఫ్.బి.ఐ ఉన్నతాధికారికి చెందిన ల్యాప్ టాప్ ను హ్యాక్ చేసి అందులో 12,367,232 యాపిల్ డివైజ్ లకు చెందిన యు.డి.ఐ.డి (Unique Device IDentifiers) లను ఎఫ్.బి.ఐ నిలవ చేసిన సంగతిని హ్యాకర్లు వెల్లడి చేశారు. యు.డి.ఐ.డి లు నిజమైనవే అని చెప్పడానికి ఒక మిలియన్ యు.డి.ఐ.డి లను కూడా తమ వెబ్ సైట్…

మోడి ప్రతీకార సిద్ధాంతానికి చెంపపెట్టు, నరోడ-పాటియా తీర్పు

గుజరాత్ నరమేధం లో భాగంగా జరిగిన నరోడ-పాటియా హత్యాకాండ కేసులో ప్రత్యేక సెషన్స్ కోర్టు తరతరాలకు నిలిచిపోయే విధంగా అత్యద్భుతమైన తీర్పు ప్రకటించింది. గోధ్రా రైలు దహనానికి హిందువులు ఐచ్ఛికంగా తీసుకున్న ప్రతీకార చర్య ఫలితమే ‘ముస్లింలపై సాగిన నరమేధం’ అని ప్రవచించిన నరేంద్ర మోడి ‘ప్రతీకార సిద్ధాంతానికి’ చెంప పెట్టులాంటి తీర్పు ప్రకటించింది. గుజరాత్ మాజీ మంత్రి మాయా కొడ్నాని, భజరంగ్ దళ్ నాయకుడు బాబూ భజరంగి తదితరులు పన్నిన కుట్ర ఫలితంగానే ‘నరోడ-పాటియా నరమేధం’…

బి.జె.పి ని కూడా టార్గెట్ చేద్దాం: కేజ్రీవాల్, వద్దు: కిరణ్ బేడీ

బొగ్గు కుంభకోణం కి సంబంధించి  బి.జె.పి ని టార్గెట్ చేసే విషయంలో మాజీ అన్నా బృందం కీలక సభ్యులయిన అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడీ ల మధ్య విభేధాలు పొడసూపాయి. బొగ్గు గనులను ప్రవేటు కంపెనీలకు విచ్చలవిడిగా కట్టబెట్టడంలో కాంగ్రెస్, బి.జె.పి లు రెండూ దోషులేనని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తుండగా, పాలక పార్టీ అయిన కాంగ్రెస్ ప్రధాన దోషి అని కనుక దానినే టార్గెట్ చెయ్యాలనీ కిరణ్ బేడీ భావిస్తోంది. లోక్ పాల్ విషయంలో పూర్తిగా కాకపోయినా…

ఆసాంజే అరెస్టుకి బ్రిటన్ రహస్య పధకం

ఈక్వడార్ రాయబార కార్యాలయంలో శరణు పొందిన జూలియన్ ఆసాంజే ని ఏ పరిస్ధితిలోనైనా అరెస్టు చెయ్యాల్సిందేనని లండన్ పోలీసులకు వచ్చిన రహస్య ఆదేశాలు బట్టబయలయ్యాయి. పోలీసు అధికారి చేతిలో ఉన్న ఆదేశ పత్రాలలోని అక్షరాలు విలేఖరుల కంటికి చిక్కడంతో రహస్య పధకం వెల్లడయింది. ఈక్వడార్ ‘రాజకీయ ఆశ్రయం’ లో రక్షణ పొందుతున్నప్పటికీ ఎట్టి పరిస్ధితుల్లోనూ జూలియన్ ఆసాంజే ను అరెస్టు చెయ్యడానికి బ్రిటన్ నిశ్చయించిందని తెలిసి వచ్చింది. వివిధ దేశాల మధ్య రాయబార సంబంధాల విషయమై కుదిరిన…

ఈశాన్య వలసలతో మండుతున్న దేశం, పట్టని ప్రభుత్వాలు -విశ్లేషణ

దాదాపు దేశంలోని అన్నీ ప్రాంతాల నుండీ ఈశాన్యీయులు పెద్ద సంఖ్యలో ఇళ్లకు తిరిగి వెళుతున్నా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల నుండి చర్యలు కరువయ్యాయి. ‘మీకేం భయం లేదు, ఉన్న చోటనే ఉండండి’ అంటూ ప్రభుత్వాలు ఇస్తున్న నోటి మాటల వాగ్దానాలు వారిలో ధైర్య, స్ధైర్యాలను నింపలేకపోతున్నాయి. అక్కడక్కడా పారామిలిటరీ బలగాల చేత ఒకటి రెండు సార్లు కవాతు చేయించినా, రాష్ట్రాల  హోమ్ మంత్రులు పత్రికల్లో, చానెళ్లలో కనబడి హామీలు గుప్పిస్తున్నా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ తమ…

పీడనకు ఎదురొడ్డింది బ్రిటనూ, ఆస్ట్రేలియా కాదు స్వతంత్ర ఈక్వడార్! -అస్సాంజ్

“పీడన నుండి నన్ను కాపాడడానికి నిలబడ్డ దేశం బ్రిటన్ కాదు, జన్మ భూమి ఆస్ట్రేలియా కూడా కాదు… ఒక సాహసోపేతమైన స్వతంత్ర లాటిన్ అమెరికా దేశం.” ఈ మాటలన్నది జూలియన్ అస్సాంజ్. స్వీడన్ అనే ఒక స్కాండినేవియా దేశాన్ని ముందు నిలిపి దుష్ట శక్తి అమెరికా రెండు సంవత్సరాలుగా సాగిస్తున్న పీడననూ, వేధింపులనూ ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ అన్న మాటలు. ప్రజా స్వామ్యానికీ, మానవ హక్కులకూ, స్వేచ్ఛా సమానత్వాలకూ భూతల స్వర్గంగా జబ్బ చరుచుకునే ప్రపంచ పోలీసు…

నేనే జులియన్! అంతర్జాతీయ యోధుడి కోసం బ్రిటిషర్ల నిరసనలు -ఫోటోలు

మహా మహులుగా, తలపండిన రాజకీయ పోరాట యోధులుగా, వ్యవస్ధలను నడిపించే దేశ నాయకులుగా, ఆర్ధిక చిక్కుల పరిష్కర్తలుగా ఫోజులు కొట్టే దేశ దేశాల నాయకమ్మన్యులు సైతం అమెరికా ధూర్త రాజ్యం ముందు సాగిలపడి సలాములు కొడుతున్న పాడు కాలం ఇది. సమస్త భూగోళాన్ని క్షణమాత్రంలో భస్మీ పటలం చేసే అణ్వస్త్ర శస్త్రాల బలిమితో విరగబడుతున్న అంకుల్ శామ్ దేశ దేశాల్లో సాగించిన రహస్య వికృత క్రీడలని, ‘వికీలీక్స్’ ద్వారా ప్రపంచ ప్రజల ముందు ఆరబోసిన డిజిటల్ యోధుడికి…

ఈక్వడార్ ధిక్కారం, బ్రిటన్ బెదిరింపుల మధ్య అస్సాంజ్ కి రాజకీయ ఆశ్రయం మంజూరు

దక్షిణ అమెరికా దేశం ‘ఈక్వడార్’ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ బెదిరింపులను ఎడమ కాలితో తన్నేస్తూ ‘జూలియన్ అస్సాంజ్’ కు ‘రాజకీయ ఆశ్రయం’ ఇస్తున్నట్లు ప్రకటించింది. స్వీడన్ లో తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న జూలియన్ అస్సాంజ్ ను స్వీడన్ కూ, అక్కడి నుండి అమెరికాకు తరలించాలని అమెరికా, యూరప్ దేశాలు పన్నిన కుట్రను భగ్నం చేసే కృషిలో తన వంతు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. గొప్ప ప్రజాస్వామ్య దేశాలం అంటూ తమ జబ్బలు తామే చరుచుకునే…

‘అస్సాం హింస’ ముస్లిం మిలిటెన్సీకి దారి తీయవచ్చు -మైనారిటీస్ కమిషన్

అస్సాంలోని బోడో జిల్లాల్లో చెలరేగిన హింసలో ముస్లిం ప్రజల భద్రతకు హామీ లభించకపోతే ‘ముస్లిం మిలిటెన్సీ’ కి దారి తీయవచ్చని ‘నేషనల్ మైనారిటీస్ కమిషన్’  (ఎన్ ఎం సి) హెచ్చరించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోని జీహాదీ సంస్ధల మద్దతుతో అటువంటి మిలిటెన్సీ తలెత్తే అవకాశాలు ఉన్నాయని కమిషన్ తయారు చేసిన నివేదిక హెచ్చరించింది. ‘బోడోలాండ్ టెరిటోరియల్ అటానమస్ డిస్ట్రిక్క్ట్స్’ (బి.టి.ఎ.డి) కింద ఉన్న నాలుగు జిల్లాలను కమిషన్ సందర్శించిన అనంతరం ఈ నివేదిక తయారు చేసిందని ‘ది…

మమతకు ప్రజల ప్రశ్నలు సుత్తీ కొడవళ్ళుగా కనిపిస్తున్నాయా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫాసిస్టు విన్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలపై విరుచుకు పడడానికే వినియోగిస్తున్నది. ప్రజలకు కావలసింది శుష్క వాగ్దానాలు కావనీ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావని ప్రశ్నించినందుకు టి.బి తో బాధపడుతున్న ఒక సాధారణ రైతును అరెస్టు చేసి దొంగ కేసులు బనాయించింది. బుధవారం పశ్చిమ మిడ్నపూర్ లో బహిరంగ సభ పూర్తయ్యాక ఎప్పటిలాగే ప్రశ్నలు అడగాలని కోరిన మమత రైతులకోసం ఏమి చేస్తున్నారన్న ప్రశ్నను సహించలేకపోయింది.…

ఫ్రాన్స్ లో లండన్ తరహా అల్లర్లు, ఆర్ధిక సామాజిక సమస్యలే కారణం

డజన్ల కొద్దీ  యువకులు రోడ్లపైకి వచ్చి రోజంతా లూటీలకూ, దహనాలకూ పాల్పడిన ఘటన ఫ్రాన్సులో చోటు చేసుకుంది. ఉత్తర ఫ్రాన్సులోని అమీన్స్ పట్టణంలో జరిగిన ఈ అల్లర్లలో 16 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసులు చెప్పగా ప్రజలు ఎంతమంది గాయపడిందీ ఏ పత్రికా చెప్పలేదు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన అల్లర్లు అదనపు బలగాల రాకతో మగళవారం తెల్లవారు ఝాము 4 గంటలకు ముగిశాయని ఎ.పి తో పాటు ఇతర వార్తా సంస్ధలు తెలిపాయి.…

‘లండన్ ఒలింపిక్స్ 2012’ స్ట్రీట్ ఆర్ట్ -ఫోటోలు

ప్రఖ్యాత వీధి చిత్రకారుడు బ్యాంక్సీ, లండన్ లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న సందర్భంగా రెండు వీధి చిత్రాలను తన వెబ్ సైట్ లో ప్రదర్శించాడు. ఈ చిత్రాలు ఏ వీధిలో ఉన్నదీ ఇంకా ఎవరికీ తెలిసినట్లు లేదు. బ్యాంక్సీ కూడా ఆ వివరాలేవీ చెప్పలేదు. (ఆ మాటకొస్తే తన వెబ్ సైట్ లో ఆయన ఉంచిన ఏ చిత్రానికీ వివరాలు లేవు.) వెబ్ సైట్ లో ప్రదర్శించేదాకా ఆ చిత్రాల సంగతి ఎవరికీ తెలిసినట్లు కూడా కనిపించడం…

టార్చర్ ఛాంబర్ల నుండి దేశాధ్యక్ష పదవి వరకూ…

కాళ్ళకూ, చెవులకూ ఎలక్ట్రిక్ షాక్ లు, బట్టలు ఊడడదీసి చేతులూ కాళ్ళూ కట్టేసి తలకిందులుగా వేలాడదీసి లాఠీలతో కుళ్లబోడవడం ఇవీ బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నలభైయేళ్ల క్రితం ఎదుర్కొన్న చిత్రహింసలు. యుక్త వయస్సులో లెఫ్టిస్టు గెరిల్లా పోరాటంలో ఉండగా నియంతృత్వ ప్రభుత్వ పోలీసులకు పట్టుబడి మూడేళ్ళ చీకటి కారాగారవాసం అనుభవించిన దిల్మా రౌసెఫ్ తన గత జీవితాన్ని బహిరంగంగ ఇంతవరకూ ఏ పత్రికకూ, వ్యక్తులకూ చెప్పలేదు. ఎస్టెల్లా అనే యుద్ధ నామం (nom de guerre)…

టీం అన్నా రాజకీయ రంగ ప్రవేశం -కార్టూన్

అన్నా బృందం రెండో నిరాహార దీక్ష ఎంత చప్పగా ప్రారంభం అయిందో అంతే చప్పగా ముగిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పది రోజుల పాటు నిరాహార దీక్ష చేసినా, జనం కోసం అన్నా కూడా ఆయనతో జత కలిసినా పట్టించుకున్నవారు లేరు. అన్నా హజారే గత సంవత్సరం చేసిన నిరాహార దీక్షకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన పత్రికలు, ఛానెళ్ళు ఈసారి అంతగా పట్టించుకోలేదు. అన్నా దీక్ష విరమణ కోసం పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం,…

కుదంకుళం: అణు పరిహార చట్ట ఉల్లంఘనకు అణు విద్యుత్ శాఖ ప్రయత్నాలు?

కుదంకుళం అణు కర్మాగారం పట్ల స్ధానిక ప్రజల భయాలు ఎంత నిజమో తెలిసి వస్తోంది. విదేశీ అణు కంపెనీల ప్రయోజనాలే తప్ప భారత ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వంలో విలువలేదని తెలిపే సంఘటన వెల్లడయింది. 2010 లో భారత ప్రభుత్వం చేసిన ‘అణు ప్రమాద పరిహార’ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సరైన అణు పరికరాలను సరఫరా చేయకపోవడం వల్ల ఏర్పడే అణు ప్రమాదాలకు నష్టపరిహారాన్ని పరికరాల సరఫరాదారు కంపెనీలు కూడా భరించవలసి ఉంటుంది. తమిళనాడులోని కుదంకుళంలో రష్యా…