అంతర్జాతీయ సభలో డీజెల్ రేట్లపై ప్రధానికి నిరసన

న్యూ ఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మన్మోహన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ‘ఆసియాలో ఆర్ధిక వృద్ధి, కార్పొరేట్ వాతావరణంలో మార్పులు’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించడానికి లేచినపుడు సుప్రీం కోర్టు అడ్వకేటు ‘సంతోష్ కుమార్’ చొక్కా విప్పి నిరసన తెలిపాడు. పెంచిన డీజెల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాడు. నినాదాలతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు ఆపవలసి వచ్చిందని ‘ది హిందూ’ తెలిపింది. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్…

కూడంకుళం: ఆగని నిరసనలు, ట్యుటికోరిన్ పోర్టు సీజ్

కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా లక్షలాది గ్రామ ప్రజలు సాగిస్తున్న పోరాటం కొనసాగుతోంది. ప్రజల భయాలు, ఆందోళనలు పట్టించుకోకుండా కూడంకుళం అణు రియాక్టర్ లో యురేనియం ఇంధన కడ్డీలను నింపడం ప్రారంభం అయిన నేపధ్యంలో మత్స్యకారులు వెయ్యికి పైగా పడవలతో ట్యుటికోరిన్ పోర్టును శనివారం దిగ్బంధించారు. తమిళనాడు తీరం అంతటా మత్స్యకారులు ఆందోళన చేయాలని PMANE (Peoples Movement Aganist Nuclear Energy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ నిరసనను చేపట్టారు. మరో వైపు అణు…

కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాలి? ఏం చేస్తున్నాయి?

బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలు భారత దేశంలోని దోపిడి వర్గాలైన భూస్వాములు, పెట్టుబడుదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు. ఇవి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రభుత్వాధికారం చేతికి వచ్చాక దోపిడీవర్గాల ప్రయోజనాలే నెరవేరుస్తాయి. శ్రామిక ప్రజల ప్రయోజనాలను అవి పట్టించుకోవు. పట్టించుకోకపోగా హక్కుల కోసం, మెరుగైన జీవనం కోసం ప్రయత్నించే ప్రజలపైన అణచివేతను అమలు చేస్తాయి. అమెరికా తదితర పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు వీరి ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలు కట్టుబడి ఉంటాయి. సామ్రాజ్యవాదులకు…

నిలువునా చీలిన అన్నా బృందం, చిచ్చు పెట్టిన రాజకీయ పార్టీ ఆలోచన

“బృందం వేరు పడడం దురదృష్టకరం… ఎటువంటి రాజకీయ పార్టీలోనూ, గ్రూపులోనూ నేను చేరేదిలేదు. వారి ప్రచారానికి నేను వెళ్లను. ప్రచారం సందర్భంగా నా ఫోటోని గానీ, నా పేరుని గానీ వాడుకోవద్దని వారికి చెప్పాను. మీరు స్వంతంగా పోరాడండి.” అరవింద్ కేజ్రీవాల్ తో తెగతెంపులు చేసుకుంటూ అన్నా హజారే చేసిన ప్రకటన ఇది. కేజ్రీవాల్ తో విభేధాలున్నాయని అంగీకరించిన తర్వాత రోజే అన్నా, తాజా ప్రకటనతో రాజకీయ పార్టీ ఆలోచన నుండి పూర్తిగా వైదొలిగినట్లయింది. ఆగస్టులో అరవింద్…

భారత విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ తీర్చేనా? -కార్టూన్

విద్యుత్ అవసరాలు తీర్చుకునేందుకు భారత దేశం చేసే ప్రయాణంలో అణు విద్యుత్ కర్మాగారాలు సహాయపడతాయా?  లేక ఆటంకం కలిగిస్తాయా? ‘ది హిందూ’ కార్టూనిస్టు ‘కేశవ్’ కాసిన్ని గీతలు గీసి, మరి కాసిన్ని రంగులు అద్ది వివరించారు. అమెరికన్ అణు పరిశ్రమ వాణిజ్య అవసరాలు తీర్చుకోవడానికే భారత్-అమెరికాల మధ్య ‘అణు ఒప్పందం’ కుదుర్చుకున్నామని అణు నియంత్రణ సంస్ధ ఎ.ఇ.ఆర్.బి మాజీ అధిపతి గోపాల కృష్ణన్ సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టాడు. గతంలో అణు…

అణుకంప కేంద్రం! -ఈనాడు ఎడిటోరియల్

(అణు విద్యుత్ కి వ్యతిరేకంగా దేశంలో క్రమంగా నిరసన వ్యాపిస్తోంది. ప్రజల పట్ల జవాబుదారీతనం లేని ప్రభుత్వాల వ్యవహార శైలి మేధో జీవులను కదిలిస్తోంది. ప్రజల భయాలకు సమాధానం చెప్పే బదులు ‘జీవించే హక్కు’ ను కోరడమే ‘దేశ ద్రోహం’ కింద లెక్కిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల ‘ప్రజాస్వామిక డొల్లతనాన్ని’ పత్రికలు కూడా ప్రశ్నిస్తున్నాయి. సోమవారం, సెప్టెంబర్ 17 తేదీ నాటి ఈనాడు దిన పత్రిక సంపాదకీయం, కేంద్ర ప్రభుత్వ ఆలోచనా రాహిత్యాన్ని తూర్పారబట్టింది. ఆ సంపాదకీయమే ఇది.)…

ఆఫ్ఘన్ దురాక్రమణ: 3 రోజుల్లో 8 మంది నాటో సైనికులు హతం

శుక్రవారం నుండి ఆదివారం వరకూ మూడు రోజుల పరిధిలో ఎనిమిది మంది నాటో సైనికులు హతమయ్యారు. ఆఫ్ఘన్ ప్రతిఘటనా దళాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే సైనిక స్ధావరాలపై దాడులు చేసి శుక్రవారం ఇద్దరు, శనివారం మరో ఇద్దరు, ఆదివారం నలుగురు విదేశీ దురాక్రమణ సైనికులను చంపేశారు. చనిపోయిన విదేశీ సైనికులు ఏ దేశానికి చెందినదీ తెలియలేదు. వాయవ్య ఆఫ్ఘనిస్ధాన్ లోని బ్రిటిష్ స్ధావరంలో శుక్రవారం చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికులని, శనివారం చనిపోయిన ఇద్దరు…

చంద్రబాబు నాయుడు గారూ! గ్యాస్ బండ మోస్తే, నిరసనా?

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పెంచింది. పెంచడం పరోక్షంగా జరిగినా జనంపైన మాత్రం ప్రత్యక్షంగా బాదేసింది. సంవత్సరానికి కుటుంబానికి 6 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ రేట్లకు ఇస్తానని చెప్పింది. తద్వారా మిగిలిన సిలిండర్లను ఓపెన్ మార్కెట్లో 750/- ధరకి కొనక తప్పని పరిస్ధితి కల్పించింది. బి.జె.పి నాయకుడు వెంకయ్య నాయుడు ప్రకారం ప్రతి కుటుంబం పైనా సంవత్సరానికి అదనంగా 750 రూపాయల భారం పడనుంది. ఈనాడు ఎడిటోరియల్ ప్రకారం ఐదుగురు ఉన్న కుటుంబానికి…

ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు

ఇస్లాంని అవమానిస్తూ అమెరికాలో రూపొందిన సినిమాను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగా నిరసనలు జరుగుతున్నాయి. గత మంగళవారం బెంఘాజీ (లిబియా) లో అమెరికా రాయబారిని బలి తీసుకున్న ముస్లింల ఆగ్రహ ప్రదర్శనలు ఆసియా, ఆఫ్రికాలతో పాటు యూరోపియన్ దేశాలకు కూడా విస్తరించాయి. మహమ్మద్ ప్రవక్తను ‘స్త్రీ లోలుడు’ గా హంతకులకు నాయకుడుగా చిత్రీకరించడం పట్ల చెలరేగిన నిరసన పలు చోట్ల హింసాత్మక రూపం తీసుకున్నాయి. లిబియా, ఈజిప్టులతో పాటు ట్యునీషియా, సూడాన్ లలో కూడా అమెరికా రాయబార కార్యాలయాలపై…

అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు

కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’…

కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం

కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.…

కూడంకుళం: ప్రజల భద్రతే అంతిమం -సుప్రీం కోర్టు

కూడంకుళం అణు కర్మాగారం (ఫొటో: ది హిందూ) తమిళనాడు కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు నుండి ఒకింత మద్దతు లభించీంది. ఇంధనం నింపడంపై స్టే విధించడానికి నిరాకరించినప్పటికీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. కర్మాగారం చుట్టూ ఉన్న ప్రజల భద్రతే అంతిమమని వ్యాఖ్యానించింది. ఇంధనం నింపినప్పటికీ రెండు నెలల వరకూ కర్మాగారాన్ని ప్రారంభించబోమన్న కేంద్రం హామీపై నమ్మకం ఉంచింది. మద్రాస్ హై కోర్టు…

కూడంకుళం: ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కేనా? -అణు బోర్డు మాజీ చైర్మన్

కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై కూడంకుళం ప్రజల వీరోచిత పోరాటం

పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ…

అవినీతి వ్యతిరేక కార్టూనిస్టు ‘అసీమ్ త్రివేది’ అరెస్టు, దేశవ్యాపిత నిరసన

రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా కార్టూన్లు గీసినందుకు కాన్పూర్ కార్టూనిస్టు అసిమ్ త్రివేది ని మహారాష్ట్ర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  గత నెలలో అసిమ్ త్రివేదికి వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారంట్ చేసిన స్ధానిక కోర్టు సోమవారం ఆయనని వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పజెప్పింది. త్రివేది అరెస్టుపై దేశవ్యాపితంగా నిరసన తలెత్తింది. ప్రెస్ కౌన్సిల్ ఇండియా ఛైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు అరెస్టును తీవ్రంగా ఖండించాడు. రాజకీయ నాయకుల…