నిర్బంధానికి ఆహ్వానం (ఛత్తీస్ ఘర్ మావోయిస్టుల దాడి పై ‘ది హిందు’ సంపాదకీయం)

ఛత్తీస్ ఘర్ లో కాంగ్రెస్ పార్టీ కాన్వాయ్ పై మెరుపు దాడి చేసి సీనియర్ నాయకులు మహేంద్ర కర్మ, నంద కుమార్ పటేల్ లతో సహా 24 మందిని దారుణంగా చంపడం ద్వారా మావోయిస్టులు ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలు ఎదుర్కోనున్న విపరిణామాలతో సంబంధం లేకుండా బస్తర్ లో ఘర్షణను విస్తరించడానికి తమ సంసిద్ధతను చాటుకున్నారు. 2005లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మద్దతుతో స్ధానిక పోలీసులు ప్రారంభించిన హింసాత్మకమైన మావోయిస్టు వ్యతిరేక ‘సల్వా జుడుం’ ఉద్యమానికి బహిరంగ…

భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడిన జస్టిస్ చిన్నపరెడ్డి గారి స్మృతిలో…

(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఒంటెత్తుపల్లి చిన్నప రెడ్డి ఏప్రిల్ 13 తేదీన మరణించారు. భారత దేశంలో అటు న్యాయ పరిపాలనతో పాటు ఇటు రాజకీయ పరిపాలనను కూడా ప్రగతిశీల దృక్పధం వైపుకు నడిపించడానికి ప్రయత్నించిన ‘లెజెండరీ-క్వార్టెట్’ లో జస్టిస్ చిన్నప రెడ్డి ఒకరు. జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్, జస్టిస్ పి.ఎన్.భగవతి, జస్టిస్ డి.ఎ.దేశాయ్ లతో పాటు ‘లెజెండరీ క్వార్టెట్’ గా మన్ననలు అందుకున్న నలుగురిలోకి ఆయనే చిన్నవారు. తన 90 వ యేట వృద్ధాప్యం తెచ్చిన…

కుట్టు కూలీలే డిజైనర్లయితే… -కార్టూన్

—— స్వెట్ షాప్ వర్కర్లు తాము కుట్టే చొక్కాలను తామే డిజైన్ చేస్తే… *నేను స్కూల్ లో ఉండాల్సిన దాన్ని! *బాత్ రూమ్ బ్రేక్ లంటే నాకిష్టం! *దోపిడిని లాండ్రీ చేయడం చాలా కష్టం! *నేనేమీ తగ్గింపు ధరల ఐటెమ్ ని కాను! *నేను కుట్టిందే నువ్వు పిండుకుంటావు! *1000 చావుల 40 దారాల కౌంట్! —— అత్యంత దారుణమైన పని పరిస్ధితుల్లో, అత్యంత తక్కువ వేతనానికి, రోజుకు అనేక గంటలపాటు పని చేయించే బట్టల తయారీ…

వూల్ విక్ హంతకుడికి ఎం.ఐ-5 జాబ్, ఒక పరిశీలన

పశ్చిమ దేశాల మిలట్రీ గూఢచార సంస్ధలు టెర్రరిస్టులతో నిత్యం సంబంధం కలిగి ఉంటాయన్న వాస్తవాన్ని వూల్ విక్ హత్యోదంతం మరొకసారి వెలుగులోకి తెచ్చింది. పశ్చిమ దేశాలకు ఇస్లామిక్ టెర్రరిజం వ్యూహాత్మక మిత్రుడే కానీ శత్రువు కాదని అంతర్జాతీయ పరిశీలకులు ఎప్పుడూ చెప్పే మాట. లండన్ వీధుల్లో జరిగిన హత్య, అనంతరం వెల్లడి అవుతున్న విషయాలు ఈ సంగతిని ధృవీకరిస్తున్నాయి. లండన్ లోని వూల్ విక్ సబర్బ్ లో ఒక మిలట్రీ డ్రమ్మర్ ను పాశవికంగా చంపాడని బ్రిటిష్…

పాక్ పౌర విమానాన్ని దారిమళ్లించిన బ్రిటన్ ఫైటర్ జెట్స్, ఇద్దరు అరెస్టు

బి.బి.సి, రాయిటర్స్ వార్తా సంస్ధల ప్రకారం విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని బ్రిటన్ లోని ఎసెక్స్ పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో 297 మంది ప్రయాణిస్తున్నారని ది హిందు, ఎన్.డి.టి.వి, రాయిటర్స్ చెప్పగా బి.బి.సి మాత్రం ప్రయాణికులు 308 మంది విమాన సిబ్బంది 14 మంది విమానంలో ఉన్నారని తెలిపింది. రెండు రోజుల క్రితం లండన్ లోని వూల్ విక్ అనే చోట ఇద్దరు నైజీరియా సంతతి యువకులు ఒక బ్రిటిష్ సైనికుడిని నడి రోడ్డు పైన హత్య…

అత్యాచార నేరం: రెండు వేళ్ళ పరీక్ష ఆపండి -సుప్రీం

లైంగిక అత్యాచార నిర్ధారణకు రెండు వేళ్ళతో పరీక్ష జరపడం వెంటనే ఆపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘రెండు వేళ్ళ పరీక్ష,’ బాధితుల ‘ఏకాంత హక్కు’ (right to privacy) కు తీవ్ర భంగకరం అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లైంగిక అత్యాచార నేర నిర్ధారణ కోసం మరింత సానుకూలమైన, ఆధునిక పరీక్షలను బాధితులకు అందుబాటులో ఉంచాలని ధర్మాసనం కోరింది. పరీక్ష నివేదిక బాధితులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అది మరోసారి బాధితురాలిని అత్యాచారం చేయడంతో సమానమని…

అవినీతిని సహించరట! -కార్టూన్

– “వాళ్ళ అవినీతి కుంభకోణాల్లో ఎన్ని సున్నాలున్నా మనం భరిస్తున్నామనేనా దానర్ధం?” – “అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదు” ఇది మన మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి, రాజ్యాంగేతర శక్తులు తరచుగా చేసే హెచ్చరిక. ఈ హెచ్చరికలో ఎంత బోలుతనం, ఎంత పరిహాసం, ఇంకెంత కపటం, మరెంత నమ్మక ద్రోహం ఉన్నదో ఆ చెప్పేవాడికీ, విని రాసుకుని పత్రికల్లో నివేదించేవారికీ, చదివేవారికీ… అందరికీ తెలుసు. అయినా సరే, అలవాటు పడిపోయాం…

అబద్ధాన్ని పదే పదే చెబితే అది…. -మొగుల్ స్ట్రిట్ ఆర్ట్

బేంక్సీ అంత కాకపోయినా ఆ తరహాలో చిత్రకళను అభ్యసిస్తున్న వీధి చిత్రకారుల్లో మొగుల్ ఒకరు. స్వీడ దేశస్ధుడయిన మొగుల్ గీసిన ఈ వీధి చిత్రం స్టాక్ హోం నగరంలొని ఒక గోడ మీద గీసినది. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని మనకు తెలిసిన సామెత. రాజకీయ నాయకులు అబద్ధాని నిజం చేసే కళను తమ వ్రుత్తిగా స్వీకరించారని మొగుల్ వీధి చిత్రం సూచిస్తోంది. అదెంత నిజమో ఎల్లరకు తెలిసిందే కదా.  నాలుగుకోట్ల కుతుంబాలకు ఉపాధి కల్పించే చిల్లరవర్తకంలో…

తుపాకుల కాపలాలో అమెరికా స్వేచ్ఛ! -కార్టూన్

స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తానే అసలు ప్రతినిధినని చెప్పుకుంటుంది అమెరికా. వ్యక్తిగత స్వేచ్ఛను మించింది లేదని అంటుంది అమెరికా. (స్వేచ్ఛా హక్కు లాంటి ప్రాధమిక హక్కులకు హేతుబద్ధమైన పరిమితులు -reasonable restrictions- ఉండాలంటుంది భారత రాజ్యాంగం.) భారీ లిబర్టీ విగ్రహం సాక్షిగా చూపే అమెరికాలో లిబర్టీ, శిలగా తప్ప బతకలేని పరిస్ధితి అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో స్వేచ్ఛను స్ధాపిస్తానంటూ బాంబులు, ఫిరంగులతో బయలుదేరే అమెరికా అత్యంత కరుడుగట్టిన నియంతృత్వ రాజ్యాలకు కాపలా కాయడమే కాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన…

అమెరికా డ్రోన్ హత్యలు అక్రమం -పాక్ కోర్టు

పాకిస్ధాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా సైన్యం సాగిస్తున్న డ్రోన్ హత్యలు చట్ట విరుద్ధం అని ఒక పాకిస్ధాన్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా పాక్ ప్రభుత్వం, ఐరాస జోక్యం కోరాలని కూడా కోర్టు పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా తన వీటో అధికారాన్ని వినియోగించినట్లయితే ఆ దేశంతో దౌత్య సంబంధాలను రద్దు చేసుకునే అవకాశాలు పరిశీలించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. డ్రోన్ దాడులను అంగీకరిస్తూ పాక్ ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం…

మళ్ళీ వార్తల్లో కె.పి.ఎం.జి, 5సం.గా కదలని లైంగిక వేధింపుల కేసు

ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేటు అకౌంటింగ్ కంపెనీ కె.పి.ఎం.జి (క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గార్దెలర్ – Klynveld Peat Marwick Goerdeler) మరోసారి వార్తలకెక్కింది ఒక మహిళ ఉద్యోగి పైన ఆమె సహ ఉద్యోగులే లైంగికంగా వేధింపులకు  పాల్పడిన కేసులోనే ఈసారి కూడా సదరు కంపెనీ వార్తల్లో నిలిచింది. దాదాపు ఐదేళ్ల క్రితం నాటి ఈ కేసు పోలీసు, న్యాయ, పరిపాలనా వ్యవస్ధలన్నీ ఏ విధంగా ధనికుల సావాసం చేస్తున్నాయో వెల్లడిస్తున్నది. బహుశా ‘ధనికుల సావాసం’ అనడం సమస్యలోని…

రెండు దేశాలు, ఒకే క్రూరత్వం

సరబ్ జిత్ సింగ్ చనిపోయాడు. పాకిస్ధాన్ లోని జిన్నా ఆసుపత్రి డాక్టర్లు ‘బతకడం కష్టమే’ అని చెప్పినట్లుగానే ఆయన చనిపోయాడు. మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు పాకిస్ధానీ ఖైదీలు లాహోర్ లోని కోల్ లఖ్పట్ జైలులో అమానుషంగా దాడి చేయడంతో కోమాలోకి వెళ్ళిన సరబ్ జిత్ సింగ్ గురువారం తెల్లవారు ఝామున 1 గంటకు తుది శ్వాస విడిచాడని పాక్ అధికారులు ప్రకటించారు. గత శుక్రవారం దాడికి గురైన సరబ్ జిత్ సింగ్ వారం రోజులు కోమాలో…

బంగ్లాదేశ్ ప్రమాదం: ఆదుకోడానికి ముందుకు రాని కంపెనీలు

బంగ్లాదేశ్ లో ఎనిమిది అంతస్ధూల భవనం కూలిపోయి 400 మందికి పైగా మరణించిన ప్రమాదంలో బాధిత కార్మికులను ఆడుకోడానికి పశ్చిమ దేశాల కంపెనీలు ముందుకు రావడం లేదు. కూలి పోయిన భవనంలో నడుస్తున్న అనేక బట్టల తయారీ కంపెనీలు ప్రధానంగా అమెరికా, ఐరోపా దేశాల బహుళజాతి కంపెనీలకు దుస్తులు సరఫరా చేస్తాయి. నెలకు 38 డాలర్లు చెల్లించే అత్యంత హీనమైన వేతనాలతో బిలియన్ల కొద్దీ డాలర్ల లాభాలు గుంజే ఫ్యాషన్ బట్టల కంపెనీలు తమకు లాభాలు ఆర్జించిపెడుతున్న…

అణు విద్యుత్తుతో ఆటలా? -కత్తిరింపు

ఏప్రిల్ 30 తేదీన (ఈ రోజు) ఈనాడు ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఇది. అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు రాశారు. తమిళనాడులో నిర్మించబడుతున్న కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి రష్యా నుండి నాసిరకం పరికరాలు సరఫరా అయ్యాయని ఆరోపణలు గుప్పుమన్న నేపధ్యంలో ఈ వ్యాసం వెలువడింది. నాసిరకం ఉక్కుతో తయారు చేసిన విడి పరికరాల వలన అణు విద్యుత్ కర్మాగారానికి ముప్పు పొంచి ఉన్నదని రచయిత చర్చించారు. కూడంకుళం అణు కర్మాగారాన్ని భారత ప్రభుత్వం…

జ్యోతి సింగ్ సింగపూర్ కి, సరబ్ జిత్ సింగ్ ఇండియాకి!?

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక విచిత్రమైన ప్రకటన జారీ చేసింది. సరబ్ జిత్ సింగ్ ని విడుదల చేసి ఇండియాకి పంపిస్తే ఇక్కడ ఉన్న అత్యున్నత వైద్య చికిత్సను అందజేసి ఆయన్ను బతికించుకుంటామన్నది ఆ ప్రకటన సారాంశం. ‘బతకడం కష్టమే’ అని పాకిస్ధాన్ డాక్టర్లు పెదవి విరుస్తున్న సరబ్ జిత్ సింగ్ కి అత్యున్నత స్ధాయి వైద్య చికిత్స అందజేసి గుర్రాన్ని ఎగిరించగల భారతీయ వైద్యం జ్యోతి సింగ్ పాండేకు ఎందుకు పనికిరాకుండా పోయింది?…