సరిహద్దులో పాక్ దాగుడుమూతలు! -కార్టూన్

సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే…

దుర్గ, ఐఎఎస్: నెగ్గేది యాదవ్‌ల పంతమేనా?

అవినీతి రాజకీయ నాయకులకు, ఇసుక మాఫియాకు ఎదురొడ్డి నిలబడిన యువ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ అక్రమ సస్పెన్షన్ విషయంలో తండ్రీ కొడుకులయిన యాదవ్ లిద్దరూ తమ మంకు పట్టు కొనసాగిస్తున్నారు. దుర్గాశక్తికి న్యాయం చేయాలంటూ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసిన నేపధ్యంలో ఆమె సస్పెన్షన్ జాతీయ స్ధాయి రాజకీయ సమస్యగా ముందుకు వచ్చింది. దానితో ములాయం సింగ్ యాదవ్ తన పుత్రరత్నం తీసుకున్న చర్య సరైనదే అని ప్రకటిస్తుండగా ప్రతిపక్షాలు,…

జింబాబ్వే సిరీస్: రసూల్ బెంచికే పరిమితం, కాశ్మీర్ గరం గరం

కాశ్మీర్ నుండి మొట్టమొదటిసారిగా భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయిన ఆటగాడు పర్వేజ్ రసూల్. ఐదు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంతో కాశ్మీర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పత్రికలు చెబుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో భారత వ్యతిరేక సెంటిమెంట్లు మరోసారి ఊపందుకోవడానికి ఇదొక సందర్భంగా మారినట్లు తెలుస్తోంది. కాశ్మీరు ప్రజల్ని ఎన్నటికీ భారత జాతీయ స్రవంతిలో కలవనివ్వరని చెప్పడానికి…

ఆఫ్ఘన్ యుద్ధం మిగిల్చిన బాల్యం -ఫోటోలు

ఎడతెగని ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో ప్రధానంగా బలవుతోంది అక్కడి స్త్రీలు, పిల్లలు. ఈ యుద్ధం అనివార్యం ఏమీ కాదు. అమెరికా స్వయంగా పెంచి పోషించిన ‘ఒసామా బిన్ లాడెన్’ ను పట్టుకోవడం కోసం అంటూ ఆఫ్ఘనిస్ధాన్ పైన అమెరికా బలవంతంగా రుద్దిన దురాక్రమణ యుద్ధం ఇది. పన్నెండేళ్ళ సుదీర్ఘ యుద్ధంలో అమెరికా బావుకున్నది 2007-08 నాటి మహా ఆర్ధిక మాంద్యం మాత్రమే. అమెరికా, ఐరోపాలు రుద్దిన దురాక్రమణ యుద్ధం పుణ్యాన ఆఫ్ఘనిస్ధాన్ లో మరో యుద్ధ తరం…

ఎడ్వర్డ్ స్నోడెన్: రష్యాపై అమెరికా తీవ్ర అసంతృప్తి

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. సెప్టెంబర్ లో రష్యా వెళ్లనున్న ఒబామా సందర్శనను తాము పునఃసమీక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ విలేఖరులకు తెలిపాడని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. రష్యాతో అమెరికాకు గల సంబంధాలు బహుముఖమైనవని, అయినప్పటికీ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో పుతిన్ తో ఒబామా జరపనున్న శిఖరాగ్ర సమావేశం సంభావ్యతను తాము పునర్మూల్యాంకనం చేస్తున్నామని కార్నీ…

రష్యా ఆశ్రయం మంజూరు, స్నోడెన్ కు బంధ విముక్తి

ఎట్టకేలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం (temporary asylum) మంజూరు చేసింది. దానితో స్నోడెన్ బంధ విముక్తుడయ్యాడు. గత ఐదు వారాలుగా మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ గురువారం తట్టా బుట్టా సర్దుకుని విమానాశ్రయం నుండి బైటకి వచ్చేశాడు. తద్వారా రష్యా భూభాగం పైకి అడుగు పెట్టాడు. స్నోడెన్ వీసా రద్దు చేయడం ద్వారా అతన్ని ఎలాగైనా రప్పించుకోవాలని పధకం వేసిన అమెరికాకు ఇది చావుదెబ్బ! అంతర్జాతీయ వేదికపై అమెరికా రాజకీయ…

టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వారి దృష్టిలో తెలంగాణకు కారకులు కాదు. తెలుగుదేశం, వైకాపాలు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించింది తప్ప వారికి ఇవ్వాలని ఏ కోశానా లేదు. టి.డి.పి, వైకాపాల లేఖలకు, రాష్ట్ర విభజనకు నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ మంత్రులు,…

దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన…

తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!

తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా…

ఎడ్వర్డ్ స్నోడెన్: ఆంక్షల బెదిరింపులకు దిగిన అమెరికా

అమెరికాకు తెలిసిన భాష ఒక్కటే. బెదిరించడం, భయపెట్టడం, మందీ మార్బలంతో దాడి చేయడం, ఆనక  సంక్షోభంలో చిక్కుకోవడం. ఆ సంక్షోభ భారాన్ని మళ్ళీ ప్రపంచం నెత్తిన రుద్దడం. సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ ల మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ ను తిరిగి రప్పించడానికి ఇప్పటి వరకు జరిపిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడమే కాక, తనకే బెడిసి కొట్టడంతో అమెరికా బెదిరింపుల తీవ్రతను మరింత పెంచింది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చే దేశాలపై ఆంక్షలు విధిస్తానంటూ…

ఏది చీకటి, ఏది వెలుతురు? పాట ఒకటే చిత్రీకరణలేన్నో!

ఈ పాట రాసింది శ్రీ శ్రీ అని తెలియనివారు ఉంటారనుకోను. రాసినప్పుడు ఆయన పాటగా రాశారో, కవిత్వంగా రాశారో నాకు ఖచ్చితంగా తెలియదు. కవిత్వంగానే రాశారని నేనిన్నాళ్లూ అనుకున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడూ అదే అనుకుంటున్నాననుకోండి! ఈ పాటను ఒక సినిమాలోనే వాడుకున్నారని అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇంకా ఇతర సినిమాల్లో కూడా వాడుకున్నారని ఈ రోజు తెలిసింది. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఈ పాటను మొదటిసారి విన్నాను, చూశాను. చాలా చిన్నప్పుడు (ఎనిమిదో తరగతిలో) ఆ…

మోడీకి వీసా ఇవ్వొద్దు, అమెరికాకు 65 ఎం.పిల లేఖలు

నరేంద్ర మోడిపై అమెరికా విధించిన వీసా నిషేధాన్ని ఎత్తివేయించడానికి బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ ఒక పక్క ప్రయత్నాలు చేస్తుండగానే మరో పక్క ఆయనకు వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారత ఎం.పిలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు లేఖలు రాశారు. అమెరికా మోడి పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని వారు తమ లేఖల్లో కోరారు. లేఖలు రాసిన ఎం.పిల్లో 12 రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నారని ది హిందు తెలిపింది. వాస్తవానికి ఈ…

నాకు తెలియని ఉదయభాను

ఈ పాట నిన్నే విన్నాను (చూశాను). ఉదయభాను తన అమ్మగారితో కలిసి ఈ పాట రాశారట. పాట రాయడం అటుంచి ఆమె పాడతారని కూడా నాకు తెలియదు. ‘నేను గతంలో చాలాసార్లు పాడాను’ అంటున్న ఆమెను చూసి ‘నిజమా’ అనుకుని హాశ్చర్యపోయేసి అందులోంచి తేరుకునే లోపు ఆమె పాడడం కూడా మొదలుపెట్టారు. పాట ఒక్కోపాదం వినేకొద్దీ నా ఆశ్చర్యం అవధులు దాటింది. మధ్యలో తెలంగాణ యాసలో ఉన్న కొన్ని పదాలు తప్ప  చాలావరకు పాట అర్ధం అయింది.…

బీజింగ్ విమానాశ్రయంలో పేలుడు, వీల్ చైర్ వ్యక్తి అరెస్టు

బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లో విమానాశ్రయంలోకి వచ్చిన వ్యక్తి ఒకరు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి తప్ప మరెవ్వరూ గాయపడలేదని తెలుస్తున్నది. పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తి చాలా కాలంగా న్యాయం కోసం పోరాడి విఫలమై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.…

అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు

అమెరికాలో ప్రజాస్వామ్యం పని చేయడం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పష్టం చేసేశారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న గూఢచార విధానాలు పచ్చి అప్రజాస్వామికమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా అప్రజాస్వామిక గూఢచర్యం గురించి వెల్లడి చేయడం అమెరికాకు దీర్ఘకాలంలో లాభకరమని ఆయన వ్యాఖ్యానించారు.  జిమ్మీ కార్టర్ అమెరికాకు 1977 నుండి 1981 వరకు అధ్యక్షుడుగా పని చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవిని…