సమస్య రాహుల్-మోడీ కాదు, టాటా-అంబానీలది -అరుంధతి

ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వ పోటీని రాహుల్ గాంధీ, నరేంద్ర మోడిల వరకే పరిమితం చేయడం సరైంది కాదని ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. రాజకీయ పార్టీల కూటములు రాజ్యం ఏలుతున్న కాలంలో ప్రధాని ఎవరు అవుతారన్న విషయం ఇద్దరు పోటీదారుల కంటే విస్తృతంగా విస్తరించి ఉన్న అంశం అని ఆమె పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో నరేంద్ర మోడీయా లేక రాహుల్ గాంధీయా అన్న ఊబిలో పడవద్దని ప్రజలను హెచ్చరించారు. దేశాన్ని పాలిస్తున్నది కార్పొరేట్…

మీడియాపై యుద్ధం ప్రకటించిన పశ్చిమ ప్రజలు

పశ్చిమ దేశాల ప్రజలు ఏకంగా మీడియాపైనే యుద్ధం ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా తమకు వాస్తవ వార్తలు అందించడం లేదని ఆరోపిస్తూ వందలాది మంది ఆయా మీడియా సంస్ధల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనలను ఎదుర్కొన్న మీడియా సంస్ధల్లో ‘నిస్పాక్షిక వార్తా ప్రసారానికి చిరునామాగా’ తమ భుజాలు తామే చరుచుకునే ప్రఖ్యాత మీడియా సంస్ధలు ఉండడం విశేషం. బి.బి.సి, ఎన్.బి.సి, ఫాక్స్ న్యూస్, ఎబిసి, సి.బి.ఎస్, సి.ఎన్.ఎన్ తదితర కార్యాలయాల ఎదుట అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల…

సోనీ సోరి: సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు

ఈ దేశంలో చట్టం ధనికులకు ఒక విధంగా పేదలకు మరో విధంగా పని చేస్తాయని చెప్పేందుకు ప్రబల ఉదాహరణ సోనీ సోరి. పోలీసులు అన్యాయంగా, అక్రమంగా బనాయించిన కేసులో రెండున్నరేళ్ల చిత్రహింసలు, జైలు జీవితం, ఎదురుచూపుల తర్వాత సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 12, 2013) బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్టయిన ఎస్సార్ స్టీల్ కంపెనీ జనరల్ మేనేజర్ రెండున్నర నెలల్లోనే బెయిల్ పై విడుదల కాగా సోనీ సోరి, లింగారాం కొడోపి లకు…

ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%

రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వాటా హైద్రాబాద్ నగరంలోనే వస్తోందని కాబట్టి విభజన వల్ల (తెలంగాణ లేని) ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని విభజన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళన. ఈ విధంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరిస్తూ ఈ బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. సదరు ఆర్టికల్ లోని అంశాలను దాదాపు ధ్రువపరుస్తూ ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర ఆదాయాల విశ్లేషణ ప్రచురించింది. ఇంకా చెప్పాలంటే నేను వేసిన…

అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతం

భారత దేశ మొట్టమొదటి అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతంగా పూర్తయింది. శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి – సి25 ఉపగ్రహ వాహక నౌక, అంగారకుడి చుట్టూ పరిభ్రమించడానికి ఉద్దేశించిన ఉపగ్రహాన్ని మొదటి దశలో భూమి చుట్టూ తిరిగే కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ తమ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రధాని, రాష్ట్రపతిలు కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం భూమి చుట్టూ…

విభజన ‘గీత’ -మరిన్ని శ్లోకాలు

రచన: తెరేష్ బాబు పైడి (పైడిశ్రీ) “బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!” అపార్థా…! ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము] ***                ***                *** కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి! జీవస్య ఎంజీవం…

అమెరికా డ్రోన్ హత్యలు యుద్ధ నేరాలే -ఆమ్నెస్టీ

పాకిస్ధాన్ లో అమెరికా సాగిస్తున్న డ్రోన్ దాడులు యుద్ధ నేరాల కిందికి వస్తాయని బ్రిటన్ కి చెందిన అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ నిర్ధారించింది. డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమని వాటిలో కొన్ని యుద్ధ నేరాలు కూడానని సదరు సంస్ధ తెలిపింది. అమెరికా డ్రోన్ దాడులకు పాకిస్ధాన్ లోని కొందరు అధికారులతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా సహకారం ఇస్తున్నాయని చెప్పడం ద్వారా ఆమ్నెస్టీ చిన్నపాటి సంచలనానికి తెర తీసింది. అమెరికా…

ఛత్తీస్ ఘర్: పటేల్ హత్యకు సారీ -మావోయిస్టులు

ఛత్తీస్ ఘర్ పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్ ల హత్యకు సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ క్షమాపణ చెప్పింది. తండ్రి కొడుకుల హత్య ద్వారా తమ కామ్రేడ్స్ భారీ తప్పిదం చేశారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నూతన కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు ఎవరో తమకు తెలియదని కానీ ఏడు పేజీల ఇంటర్వ్యూ తమకు చేరిందని పత్రిక…

రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక అయోమయ సృష్టి ఇత్యాది అంశాలపై కాస్త వాస్తవానికి దగ్గరగా విశ్లేషణలు, విమర్శలు, సూచనలు ప్రచురిస్తున్నది ఆంధ్ర జ్యోతి దిన పత్రికే అనుకుంటాను. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇతర పత్రికలు, ఛానెళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నది ఆ పత్రిక. ‘రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?’ శీర్షికతో వచ్చిన ఈ విశ్లేషణ ఈ రోజు (అక్టోబర్ 11, 2013) జ్యోతిలో…

ఓ సమైక్య మిత్రుడి ఆక్రోశం!

ప్రొద్దుటూరి అప్పారావు గారి వ్యాఖ్య ఇది. ‘పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి’ అన్న టపా కింద రాశారు. ఆంగ్లంలో రాసిన వ్యాఖ్యను తెనుగీకరించి ప్రచురిస్తున్నాను. మనం సమైక్యాంధ్ర కోసం పోరాడొచ్చు. కానీ మార్గం సరైనది కాదు. రాజకీయ నాయకులు (ఎం.ఎల్.ఏలు, ఎం.పిలు) అందరూ తమ జీత భత్యాలను వినియోగించుకుంటున్నారు. ఒక ఎం.పి గారు (ఉద్యమంలో) పాల్గొంటూనే తిరుమల ఛైర్మన్ గా పదవిని అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకుల వ్యాపారాలన్నీ ఆటంకం లేకుండా చక్కగా నడుస్తూనే ఉన్నాయి.…

ఇంత రాక్షసత్వమా? -వసంత్ కుంజ్ కేసులో కోర్టు

ఢిల్లీ పోష్ లోకాలిటీ ‘వసంత్ కుంజ్’ లో ఒక మైనర్ బాలిక ను పనిలో పెట్టుకుని హింసించిన కేసులో నిందితురాలికి కోర్టు బెయిలు నిరాకరించింది. నోయిడాలో ఒక పేరు పొందిన బహుళజాతి సంస్ధలో కమ్యూనికేషన్ విభాగాని అధిపతిగా పని చేస్తున్న వందన ధీర్ కు బెయిల్ నిరాకరిస్తూ ఢిల్లీ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల జార్ఖండ్ బాలిక ఆర్తనాదాలు విని పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక స్వచ్ఛంద సంస్ధ, పోలీసుల సాయంతో బాలిక…

తెలంగాణ షో -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఎలాగో ధైర్యం చేసి తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆ పార్టీని ఎక్కడ ముంచి ఎక్కడ తేల్చనున్నదో తెలియని పరిస్ధితి. అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన పెద్ద మనుషులంతా ఆ మాట తీసి గట్టున పెట్టి తలో దారి పడుతున్నారు. సీమాంధ్ర జనం కోసం రాజీనామాలు నటించలేక అలాగని పార్టీలో కొనసాగుతూ ప్రజల ఆగ్రహానికి నిలవలేక ఆపసోపాలు పడుతున్నారు. తెలంగాణ మ్యాజిక్ ద్వారా ‘anti-incumbency’ ఫ్యాక్టర్ ని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ భావించిన…

పిట్ట కధ: తెలంగాణ – నదిలో దుప్పటి

విజయనగరంలో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయ్యాయని ది హిందు పత్రిక ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త కింద సయ్యద్ మునిరుద్దీన్ అనే ఒక పాఠకుడు వ్యాఖ్యానంగా ఈ కింది పిట్టకధ రాశారు. ఈ పిట్టకధని ఆయన చిన్నప్పుడు విన్నారట. తెలంగాణ-సమైక్యాంధ్ర ఉద్యమాలను చూసి తనకా కధ గుర్తుకొస్తోంది అని చెబుతూ రాశారు. చాలా తమాషాగా ఉంది చదవండి! అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారు ఒక రోజు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు.…

విజయనగరంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్, నోట్ ఆమోదించడానికి నిరసనగా విజయ నగరం అట్టుడుకుతోంది. ఏ.పి.ఎన్.జి.ఓ సంఘం ఇచ్చిన 48 గంటల బంద్ పిలుపు ముగిసినప్పటికీ మూడో రోజు కూడా అక్కడ ప్రజలు ఆగ్రహంతో వీధులకెక్కారు. కర్ఫ్యూ ప్రకటించినప్పటికి పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ అయినట్లు ది హిందు తెలిపింది. ప్రజల ఆగ్రహం ప్రధానంగా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కేంద్రీకృతం అయింది. పి.సి.సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోనియా…

కేబినెట్ ఆమోదంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభం

ఎట్టకేలకు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. గురువారం సాయంత్రం సమావేశమయిన కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోమ్ మంత్రి ప్రవేశ పెట్టిన నోట్ ను తీర్మానంగా ఆమోదించింది. టి.వి ఛానెళ్లు చెబుతున్నదాని ప్రకారం సి.డబ్ల్యూ.సి తీర్మానాన్ని కేబినెట్ యధాతధంగా ఆమోదించింది. హైద్రాబాద్ 10 యేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కొత్త రాజధాని ఎక్కడన్నదీ కేబినెట్ నియమించే మంత్రుల బృందం నిర్ణయిస్తుందని హోమ్ మంత్రి సుశీల్ కుమార్…