రెండు ఆందోళనలు, ఒక హిపోక్రసి -ఫొటోలు

ఇ.యు వద్దన్నందుకు, తగలబడుతున్న ఉక్రెయిన్ నిజానికి ఇ.యు (యూరోపియన్ యూనియన్) లో చేరడానికి ఉక్రెయిన్ పూర్తిగా ‘నో’ అని చెప్పింది లేదు. ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదరడం కోసం జరుగుతున్న చర్చలను వాయిదా వేయాలని మాత్రమే ఉక్రెయిన్ పార్లమెంటు నిర్ణయం తీసుకుంది. ఇ.యులో చేరే అంశాన్ని తాము పక్కన పెట్టడం లేదని వచ్చే మార్చి నెలలో ఆ విషయం చర్చిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇది జరిగింది నవంబర్ 23 తేదీన. అప్పటి…

ఎఎపి పాలన: సి.ఎం ధర్నా, కాంగీ మద్దతు వగైరా…

ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ విషయంలో తలెత్తిన విభేదాలు చివరికి ఢిల్లీ ప్రభుత్వాన్ని బలిగోరే వైపు నడుస్తున్నాయా? కాంగ్రెస్ చేసిన హెచ్చరిక ఈ అనుమానం కలిగిస్తోంది. అక్రమ మాదక ద్రవ్య వ్యాపారం, వ్యభిచారం నేరాలలో సంబంధం ఉన్న ఆఫ్రికా ర్యాకెట్ పై దాడి చేయాలన్న ఎఎపి మంత్రి ఆదేశాలను ఢిల్లీ పోలీసులు లెక్క చేయలేదు. ఫలితంగా ఎఎపి మంత్రే స్వయంగా దాడి చేయడంతో మొదలైన రగడ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా బహిరంగ ఆందోళనకు దిగడం వరకు దారి…

ఆయన విప్లవ ద్రోహి, ఆమె అతని భార్య కాదు -మావోయిస్టులు

ఆంధ్ర ప్రదేశ్ పోలీసులకు లొంగిపోయిన గుడ్స ఉసెండి అలియాస్ సుఖదేవ్ అలియాస్ గుముడవెల్లి వెంకట కృష్ణ ప్రసాద్ ను విప్లవ ద్రోహి గా సి.పి.ఐ(ఎం-ఎల్-మావోయిస్టు) పార్టీ ప్రకటించింది. పార్టీతో ఆయనకు సైద్ధాంతీక విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఒట్టిదే అని పార్టీ తెలిపింది. నైతికంగా దిగజారిన సుఖదేవ్ విప్లవ ద్రోహిగా మారి పోలీసులకు లొంగిపోయాడు తప్ప రాజకీయ విభేదాల వల్ల కాదని తెలిపింది. ఆయన భార్య పార్టీలోనే కొనసాగుతున్నారని, బైటికి వెళ్ళేటప్పుడు కూడా వేరే మహిళను వెంటపెట్టుకుని వెళ్ళి…

ఎకె-47 సృష్టికర్త కలష్నికోవ్ మరణం

ఈ రోజుల్లో ఎకె-47 రైఫిల్ గురించి విననివారు బహుశా ఎవరూ ఉండరు. చిన్న పిల్లాడి దగ్గర్నుండి పండు ముదుసలి వరకూ ప్రపంచ వ్యాపితంగా ఈ రైఫిల్ సాధించుకున్న పేరు ప్రతిష్టలు అసామాన్యం. ఎటువంటి వాతావరణంలోనైనా తనను ధరించిన వారి అంచనాలను ఏ మాత్రం తప్పని లక్షణం వల్లనే ఎకె-47 రైఫిల్ అంతగా పేరు సంపాదించింది. అలాంటి ఎకె-47 సృష్టికర్త  మిఖాయిల్ కలష్నికోవ్ తన 94 వ యేట సోమవారం ఉద్ముర్తియా రిపబ్లిక్ రాజధాని ఇఝెవ్స్క్ లో మరణించారు.…

తెలంగాణ: వివక్ష లేనిదేక్కడ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పునరుద్ధరణకు డిమాండ్ తలెత్తడానికి ముఖ్య కారణాలు రెండు. ఒకటి: వివక్ష రెండు: నిర్లక్ష్యం తెలంగాణ కంటే ముందుగా సంపన్నులైన సీమ, ఆంధ్ర భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలు ఆంధ్ర ప్రదేశ్ అధికార పగ్గాలను తమ చేతుల్లో ఉంచుకోగలిగారు. తద్వారా నూతనంగా సంపన్నులవుతున్న తెలంగాణ భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారీ వర్గాలకు అవకాశాలను వివిధ రూపాల్లో నిరాకరించారు. అవకాశం ఉన్న చోటల్లా వివక్ష చూపారు. అవకాశం లేనిచోట నిర్లక్ష్యం చూపారు. ఇందులో సీమ, ఆంధ్ర ప్రజలకు…

శపధాల ఆజ్యం పోసి దావానలం రాజేస్తాం!

(విప్లవ కమ్యూనిస్టు పార్టీ నేత మాదాల నారాయణ స్వామి గారు డిసెంబర్ 9 తేదీన 99 యేళ్ళ వయసులో మరణించారు. చివరి క్షణాల వరకూ విప్లవ రాజకీయాలను శ్వాసించిన స్వామి గారు ఎం.ఎన్.ఎస్ గా సుప్రసిద్ధులు. 1952లో ఒంగోలు అసెంబ్లీకి, 1962లో ఒంగోలు పార్లమెంటు సభ్యత్వానికి ఎన్నికయిన ఎం.ఎన్.ఎస్ గారు ధనిక కుటుంబంలో జన్మించినప్పటికీ తన జీవితం అంతా శ్రామికవర్గ విముక్తికి అంకితమై పని చేశారు. ప్రకాశం జిల్లా పల్లెలకు ‘స్వామిగారు’ గా చిరపరిచితులయిన ఎం.ఎన్.ఎస్ గారు…

విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం

సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను…

సింగపూర్ హింస, 24 మంది భారతీయుల అరెస్టు

ప్రపంచంలో అత్యంత భద్రమైన దేశాల్లో ఒకటిగా పరిగణించే సింగపూర్ ఆదివారం దాడులు, దహనాలతో వార్తల్లో నిలిచింది. అల్లర్లకు కారకులంటూ సింగపూర్ ప్రభుత్వం 27 మందిని అరెస్టు చేయగా వారిలో 24 మంది భారతీయులే. నగర రాజ్యం (city state) గా పిలిచే సింగపూర్ ప్రధానంగా వలస కార్మికుల శ్రమ పైనే ఆధారపడే దేశం. భారత దేశం నుండి వలస వెళ్ళిన కార్మికుడు ఒకరిని బస్సు ఢీ కొట్టి చంపడంతో అల్లర్లు చెలరేగినట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే అల్లర్లకు…

మండేలా: చరితలో చిరకాలం నీ పేరు నిలుచుననీ… -ఫోటోలు

పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ఐనా మనిషి దుఃఖించక మానడు. చావు, పుట్టుకలకు అతీతంగా జీవితాన్ని సార్ధకం చేసుకునేవారు చరిత్రలో అనేకులు ఉన్నారు. వారిలో మానవజాతి తలచుకునేది కొందరినే. ఎవరైతే జాతి పురోగతికి మార్గ నిర్దేశకులుగా నిలుస్తారో, ఎవరైతే జాతి మొత్తాన్ని ఏక తాటిపై నడిపిస్తారో వారిని మానవ జాతి చరిత్ర జాతి నేతలుగా రికార్డు చేస్తుంది. అలాంటి గొప్ప నాయకుల్లో నెల్సన్ మండేలా ముందు పీఠిన నిలుస్తారు. జులై 18, 1918 తేదీన ఒక…

తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట!

1990 దశాబ్దం అంతా ఈ పాట తెలుగు నేలపై మోగుతూ ఉండేది. ముఖ్యంగా పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘంతో పాటు ఇతర విప్లవ విద్యార్ధి సంఘాల్లో పని చేసిన, అనుసరించిన విద్యార్ధులకు ఈ పాట చిరపరిచితం. నల్లజాతి ప్రజల సాయుధ తిరుగుబాటుకు తలఒగ్గుతూ దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం 1990లో నెల్సన్ మండేలాను విడుదల చేసినపుడు అప్పటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు శక్తి ఉరఫ్ జె.కనకరాజు గారు ఈ పాట రాసి పాడారు. తెలంగాణ ప్రజా కళాకారులు జయరాజ్…

ఆరిపోయిన నల్ల వజ్రానికి ప్రపంచం నివాళి -ఫోటోలు

27 సంవత్సరాల కారాగారవాసం సైతం రొలిహ్లాహ్లా మండేలాను కుంగదీయలేదని చెప్పడానికి  95 యేళ్ళ ఆయన నిండు జీవితానికి మించిన సాక్ష్యం ఏముంటుంది? బలమైన శత్రువుకు వ్యతిరేకంగా జనాన్ని కూడగట్టడానికి ప్రారంభంలో గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఎత్తుగడల రీత్యా ఆశ్రయించిన మండేలా జాత్యంకార అణచివేతను నిర్ణయాత్మకంగా ఓడించాలంటే సాయుధ పోరాటం తప్ప దారి లేదని సరిగ్గానే అంచనా వేశారు. ఏ.ఎన్.సి యువజన సంస్ధ సాయుధమై మిలిటెంట్ గెరిల్లా పోరాటమే చేయకపోతే మండేలా విడుదల సాధ్యం అయ్యేదే కాదని చరిత్ర…

ముగిసిన మండేలా లాంగ్ వాక్ -2

మొదటి భాగం తరువాత………………. అయితే మండేలా ఖైదుతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం బలహీనపడకపోగా మరింత బలపడింది. 1980ల కల్లా జాత్యహంకార రాజ్యం ఆస్తులను ధ్వంసం చేసే చర్యలు ఊపందుకున్నాయి. గెరిల్లా దాడులు పెరిగిపోయాయి. మండేలా ఖైదు దక్షిణాఫ్రికా అంతటా సంవత్సరాల తరబడి స్ధిరమైన చైతన్యానికి పాదుకొల్పింది. ఉమ్మడి నాయకత్వానికి మండేలా ప్రాధాన్యం 1986లో వెలువడిన ‘మండేలా కోసం ఎదురుచూపులు’ అన్న పుస్తకంలో రచయిత జె.ఎం.కొయెట్జి ఇలా పేర్కొన్నారు. “1985 నాటి తిరుగుబాట్లలో ఎక్కడ చూసినా ఆయన…

లాంగ్ వాక్ చాలించిన నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా -1

నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా ‘సుదీర్ఘ నడక’ (లాంగ్ వాక్) గురువారం సాయంత్రంతో (స్ధానిక సమయం) ముగిసింది. 95 సంవత్సరాల ముదిమి మీద పడిన నల్ల సూర్యుడు నల్లజాతి విముక్తిని అర్ధాంతరంగా వదిలి శాశ్వత అస్తమయాన్ని ఆవాహన చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా పదే పదే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మండేలా ఇక ఊపిరి పీల్చడం తనవల్ల కాదంటూ సెలవు తీసుకున్నాడు. శ్వేత జాత్యహంకార అణచివేతను ధిక్కరించిన నల్ల వజ్రం తన జీవితకాల పోరాట వెలుగులను తన జాతిజనుల చరిత్రకు…

10 జిల్లాల తెలంగాణకు కేబినెట్ నిర్ణయం

10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాయల తెలంగాణ ఏర్పాటుపై సాగిన ఊహాగానాలకు దీనితో తెరపడింది. కావూరి సాంబశివరావు రాయల తెలంగాణ కోసం కేబినెట్ లో ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదని వార్తా ఛానెళ్ల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ 10 యేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇది 45…

రెండొంతులు మహిళా విలేఖరులకు వేధింపులు, బెదిరింపులు

ప్రపంచ వ్యాపితంగా మహిళా విలేఖరులు అనేక గడ్డు పరిస్ధుతుల మధ్య వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులుగా పని చేస్తున్న మహిళల్లో మూడింట రెండు వంతుల మంది వేధింపులు, బెదిరింపులు, లైంగిక అత్యాచారాలను ఎదుర్కొంటున్నారు. మహిళా విలేఖరుల పైన మొదటిసారి జరిగిన సర్వేలో ఈ సంగతి వెల్లడి అయింది. వార్తల మీడియాలో పని చేస్తున్న స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ హింసల గురించి ఈ సర్వే జరిగింది. ఈ వేధింపులు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్…