హై అలర్ట్: ఆల్-ఖైదాకు వ్యతిరేకం కాదు అనుకూలం -నిపుణులు

ఆల్-ఖైదా నేతగా చెబుతున్న అయిమన్ ఆల్-జవహిరి వీడియో వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్ధితిని సమీక్షించి, భద్రతా సంస్ధలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను నిపుణులు విమర్శిస్తున్నారు. ‘హై అలర్ట్’ అంటూ ప్రకటించిన అప్రమత్తత చివరికి మైనారిటీ ప్రజలను పోలీసులు, ఇతర బలగాలు వేధింపులకు గురిచేసి భారత ప్రధాన స్రవంతి నుండి దూరం చేసేందుకే దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.…

అమెరికా పోలీసు హింస: అంతర్జాతీయ విచారణకు డిమాండ్

మిస్సోరీ రాష్ట్రంలోని ఫెర్గూసన్ పట్టణంలో తెల్లజాతి పోలీసు ఒకరు, యువ నల్లజాతి పౌరుడు మైఖేల్ బ్రౌన్ ను కాల్చి చంపడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులపై పోలీసుల అణచివేత సైతం తీవ్ర స్ధాయిలో కొనసాగుతోంది. పట్టణంలో ఎవరినీ ఒక చోట నిలబడనీయకుండా పోలీసులు తరిమి కొడుతున్నారు. నేషనల్ గార్డ్ బలగాలు పట్టణంలో దిగి మిలట్రీ తరహా పాలనను అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఫెర్గూసన్ లోని పోలీసు, మిలట్రీ హింసపై విచారణ చేయడానికి అంతర్జాతీయ కమిషన్ ను నియమించాలని…

నీగ్రోను చంపిన పోలీసులు, అట్టుడికిన అమెరికా -ఫోటోలు

సివిల్ పోలీసులకు మిలట్రీ ఆయుధాలను సరఫరా చేస్తే ఏమవుతుందో అమెరికాలో అదే జరుగుతోంది. రెండున్నర సంవత్సరాల క్రితం ట్రేవాన్ మార్టిన్ అనే 17 సం.ల నీగ్రో యువకుడిని ఒట్టి పుణ్యానికి కాల్చి చంపిన ఉదంతం మరువక ముందే మరో నీగ్రో యువకుడిని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. ఈసారి కూడా తెల్లజాతి పోలీసే హత్యకు పాల్పడ్డాడు. రోడ్డు మధ్యలో కాకుండా పక్కన నడవాలని ఆదేశించిన పోలీసుల ఆజ్ఞను త్వరగా అమలు చేయకపోవడమే ఆ యువకుడు చేసిన నేరం.…

ఉక్రెయిన్ ఫైటర్ జెట్ SU-25తో కూల్చారు -2

ట్యాంకు విధ్వంసక ఇన్సెండియరీ బాంబులు, splinter-explosive బాంబులు ఆల్టర్నేట్ గా కాక్ పిట్ ను తాకితే ఏమవుతుందో ఒకసారి ఊహించండి! ఇవి ఆధునిక ట్యాంకును ధ్వంసం చేయడానికి ఉద్దేశించినవి. ఇన్సెండియరీ బాంబులు పాక్షికంగా కాక్ పిట్ గుండా ప్రయాణించి అవతలి వైపు నుండి కాస్త మారిన రూపంతో బైటికి వచ్చాయి. (ఏవియేషన్ ఫోరెన్సిక్ నిపుణులు శ్రద్ధ పెడితే వాటిని విమానం కూలిన ఏరియాలో కనుగొనవచ్చు.) మందపాటి ట్యాంకు గోడలను ఛేదించుకుని పోయే విధంగా ఈ బాంబు గుళ్లను…

‘ప్రజాస్వామ్యం’ ఎండమావికై చైనా యువత రోడ్డెక్కిన ఆ రోజులు -ఫోటోలు

సరిగ్గా పాతికేళ్ళ క్రితం ఈ రోజుల్లోనే చైనా యువత ‘పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యం’ అనే ఎండమావి కోసం వీధులకెక్కి నినదించారు. 1911 ప్రాంతంలో ఆనాటి జాతీయ ప్రజాస్వామ్య ఉద్యమ రధసారధి డాక్టర్ సన్ యెట్ సేన్ జ్ఞాపకాలను అపహాస్యం చేస్తూ చైనీయ యువత మిడి మిడి జ్ఞానంతో పశ్చిమ దేశాల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉందని నమ్మారు. అలాంటి ప్రజాస్వామ్యమే చైనాలో ప్రవేశపెట్టాలని కోరుతూ వేలాది మంది యువత, విద్యార్ధులు బీజింగ్ చేరుకుని చరిత్రాత్మక తీయానాన్మెన్ స్క్వేర్ లో…

ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణదేవాలయంలో కత్తుల కోలాటం -ఫోటోలు

జూన్ 6 తేదీతో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కు 30 యేళ్ళు నిండాయి. సిక్కుల పవిత్ర దేవాలయం ‘గోల్డెన్ టెంపుల్’ లో తిష్ట వేసిన ఖలిస్తాన్ టెర్రరిస్టులను పారద్రోలేందుకు ఇందిరాగాంధి ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్, భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.…

తెలంగాణ మొదటి అడుగు: కె.సి.ఆర్ వాగ్దాన ఉల్లంఘన

నూతన రాష్ట్రం తెలంగాణ ఆవిష్కృతం అయింది. ఉద్యమ పార్టీ నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది మంత్రులతో కొలువు తీరిన నూతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో సహా ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. అనగా దాదాపు 25 శాతం ఒకే కుటుంబ మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని కొత్త రాష్ట్రం తలకెత్తుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని సైతం కుటుంబ ఉద్యమంగా నడిపిన ఆరోపణలు ఎదుర్కొన్న కె.సి.ఆర్…

ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు జెస్సి జాక్సన్ ఇండియా సందర్శించారు. జెస్సీ జాక్సన్ అమెరికాలో 1960ల కాలంలో వెల్లివిరిసిన నల్ల జాతి పౌర హక్కుల ఉద్యమానికి నేతృత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ సమకాలికులు. భారత జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ‘నేతాజీ మ్యూజియం’ ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోల్ కతా లో ఆయన సుభాష్ సోదరుని కుమార్తె కృష్ణ బోస్ కలిసి జెస్సీ…

పెప్పర్ స్ప్రే: ఆత్మరక్షణ కాదు, ఉద్దేశ్యపూర్వకం! -వీడియో

‘ఆత్మ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే చల్లాను’ అని విజయవాడ ఎం.పి లగడపాటి రాజగోపాల్ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. భారత ప్రజాస్వామ్యానికి తీరని కళంకం అనీ, దుర్దినం అనీ, మాయని మచ్చ అనీ, సభ్యుడిని ఎన్నికల నుండి డీబార్ చేయాలని, దేశానికి చెడ్డపేరు తెచ్చారని దాదాపు అందరూ విమర్శిస్తున్నప్పటికీ లగడపాటి పాత్రం తన చర్యను సమర్ధించుకుంటున్నారు. టి.డి.పి ఎం.పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కాపాడడానికి పరుగెత్తానని, తమపై గూండాల్లాంటి ఎం.పిలు దాడికి వచ్చారనీ, అందుకే ఆత్మ రక్షణ…

ఎ.పి అసెంబ్లీ ఆటంకం దాటిన టి.బిల్లు -కార్టూన్

ఎన్.డి.ఎ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్, ఛత్తీస్ ఘర్, ఉత్తర ఖండ్. ఈ రాష్ట్రాల ఏర్పాటు నల్లేరుపై నడకలాగే సాగింది. ఆ ప్రాంతాల మూల రాష్ట్రాల అసెంబ్లీలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడం దానికొక కారణం. అక్కడ అభ్యంతరం చెప్పకపోవడానికీ, ఇక్కడ తీవ్ర అభ్యంతరం చెప్పడమే కాకుండా ఆందోళనలు కూడా జరగడానికి కారణం ఏమిటి? బి.జె.పి పార్టీ దానికి కారణం కాంగ్రెస్ వ్యవహరించిన పద్ధతి అని ఆరోపిస్తోంది. ‘మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది’ అని వెక్కిరిస్తోంది. ‘ప్రశాంతంగా పాత…

విద్యుత్ సబ్సిడీ: ఎఎపి ప్రభుత్వంపై ముప్పేట దాడి

యుద్ధం మొదలయింది. జనం పక్షాన నిలిస్తే ఏమవుతుందో ఎఎపికీ, జనానికీ తెలిసి వస్తోంది. ఇంకా తెలియకపోతే ఇప్పుడన్నా తెలియాలి. సాంప్రదాయ పార్టీల రాజకీయ నాయకులు, పరిశ్రమ వర్గాలు, వీరిద్దరి చేతుల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇప్పుడు మూడువైపుల నుండి ఢిల్లీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. మా ఆర్ధిక పరిస్ధితి బాగాలేదు కాబట్టి రోజుకి 10 గంటల కోత పెడుతున్నామని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు ప్రైవేటు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు తమ పాత బాకీ…

ప్రశ్న: ఆర్టికల్ 370 కాశ్మీర్ కి అవసరమా?

ఉమేష్ పాటిల్: ఆర్టికల్ 370 గురించి వివరించండి. కాశ్మీర్ కి అది అవసరమా? సమాధానం: జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించినదే ఆర్టికల్ 370. 1949 నుండి ఇది ఉనికిలో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ నిజంగా ఊపిరి పీల్చుకుని సజీవంగా నిలిచిన రోజులు మాత్రం చాలా తక్కువే. వివిధ ఒప్పందాల పేరుతోనూ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానూ ఈ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ కు కల్పించిన అధికారాలు అన్నింటిని కత్తిరించేశారు. ఆర్టికల్ 370 జీవచ్ఛవంగా…

పత్రిబాల్ కేసు తిరిగి తెరవండి -ది హిందు సంపాదకీయం

(2000 సం.ము మార్చి 24-25 తేదీల మధ్య రాత్రి దినాన కాశ్మీర్ కు చెందిన 5గురు అమాయక యువకులు సైనికుల కరకు గుళ్ళకు బలై చనిపోయారు. వారు సీమాంతర ఉగ్రవాదులని సైన్యం దేశానికి చెప్పింది. కాదు వారు అనంత్ నాగ్ ఏరియా నివాసులని సి.బి.ఐ నిర్ధారించింది. సైన్యం AFSPA చట్టాన్ని కవచంగా తెచ్చుకోగా సుప్రీం కోర్టు సరేనంది. కోర్టు మార్షల్ అయినా చెయ్యాలంది. ఆ కోర్టు మార్షల్ మొన్న ముగిసింది. తమవాళ్లు తప్పు చేయలేదని నిర్ధారించి కేసు…

ఫ్రాన్స్ లో హింసాత్మక ఆందోళనలు

ఉక్రెయిన్ లో ఆందోళనలను అణచివేస్తున్నారంటూ ఆరోపిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అధ్యక్షుడు ఫ్రాన్షా ఒలాండేకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం ప్యారిస్ వీధుల్లో కదం తొక్కారు. ఒలాండే అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ‘ఆగ్రహ దినం’ పాటిస్తున్నామని ప్రకటించారు. పోలీసులతో వీధి యుద్ధాలకు తలపడ్డారు. పోలీసులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారని, 250 మంది వరకు అరెస్టు చేశారని పత్రికలు తెలిపాయి. ఆందోళనకారులు కొందరు ఇ.యు నుండి ఫ్రాన్స్ బైటికి రావాలని డిమాండ్ చేయడం…

బిల్లు వెనక్కి పంపండి! స్పీకర్ కు కిరణ్ నోటీసు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నట్లు ఆయన వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆడిస్తున్న నాటకంలో భాగంగానే సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, సమయం వచ్చినప్పుడు ఆయన సహకరిస్తారని కొందరు చేసిన ఊహాగానాలు సరికాదని గత కొద్ది రోజులుగా కిరణ్ తీసుకుంటున్న నిర్ణయాల ద్వారా అర్ధం అవుతోంది. ఎ.ఐ.సి.సి సమావేశాలకు, రాజ్యసభ నామినేషన్ల ఎంపికకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధినాయకత్వం పిలిచినా వెళ్లని…