అరుదైన ఫోటో, తోక లేపి నిద్రపోతున్న పులి

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎన్.ఎ.నజీర్ తీసిన ఫోటో ఇది. పాలక్కాడ్ జిల్లా (కేరళ) లోని పరంబికులం టైగర్ రిజర్వ్ అడవిలో ఫారెస్ట్ వాచర్ వెంట రాగా ప్రమాదకర పరిస్ధితుల్లో నజీర్ ఈ ఫోటో తీశాడని ఫ్రంట్ లైన్ తాజా సంచిక (డిసెంబర్ 28) తెలియజేసింది. పశ్చిమ కనుమల మధ్య విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో పచ్చదనం నీడలో అదమరిచి నిద్రపోతున్న పులి ఇలా నజీర్ కెమెరా కంటికి చిక్కింది. తోకను పైకి లేపి నిద్రపోతున్న పులిని కెమెరాలో…

అమెరికాలో విలయం సృష్టించిన పెను తుఫాను సాండీ -ఫోటోలు

అమెరికా ప్రజలు గుండెలు చిక్కబట్టుకుని ఆందోళనతో ఎదురు చూసిన పెను తుఫాను సాండీ అనుకున్నట్లుగానే పెను విలయాన్ని సృష్టించింది. బోస్టన్ పత్రిక ప్రకారం సాండీ ధాటికి ఏడు రాష్ట్రాల్లో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రానికి అట్లాంటిక్ తీరం వెంబడి 55 మంది చనిపోయారని ‘ది హిందూ’ తెలిపింది. ఐ.హెచ్.ఎస్ గ్లోబల్ ఇన్సైట్ ప్రకారం 20 బిలియన్ డాలర్ల మేరకు ఆస్తి నష్టం జరిగింది. 10 నుండి 30 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపార…

హరికేన్ శాండి: ప్రమాదపు అంచున అమెరికా అణు కర్మాగారం!

అమెరికాలో పెను తుఫాను శాండీ విధ్వంసం సృష్టిస్తోంది. విద్యుత్ వ్యవస్ధ నాశనం కావడంతో పాటు వేలాది ప్రజల తరలింపును అమెరికా నెత్తిన రుద్దిన పెను తుఫాను అమెరికా తూర్పు తీరంలోని పాతికకు పైగా అణు కర్మాగారాలను కూడా భయపెడుతోంది. తుఫాను మార్గానికి దగ్గరగా ఉన్న ఈ అణు కర్మాగారాల్లో న్యూ జెర్సీ ఒడ్డున ఉన్న ఓయిస్టర్ క్రీక్ కర్మాగారంలో ఇప్పటికే అప్రమత్తత ప్రకటించినట్లు కార్పొరేట్ పత్రికలు తెలిపాయి. ఈ అణు కర్మాగారాన్ని శాండి నేరుగా తాకినట్లు తెలుస్తోంది.…

ఫుకుషిమాలో రేడియేషన్ లీకేజి ఆగనే లేదు, ఇదుగో సాక్ష్యం

మార్చి 11, 2011 తేదీన సంభవించిన భారీ భూకంపం ఫలితంగా ఫుకుషిమా అణు కర్మాగారం తీవ్ర ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల వాతావరణంలోకి అణుధార్మికత పెద్ద ఎత్తున విడుదలయి అమెరికా, యూరప్ ల కు కూడా ప్రయాణించింది. ప్రమాదం జరిగాక నాలుగురోజుల్లోనే రేడియేషన్ విడుదలను అరికట్టామని టెప్కో కంపెనీ, జపాన్ ప్రభుత్వం చెప్పినా అది అబద్ధమేననీ చెబుతూ అనేకమంది జపనీయులు సాక్ష్యాలు ప్రచురించారు. డిసెంబర్ లో కోల్డ్ షట్ డౌన్ కూడా చేశామని…

అణు శక్తి లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీరతాయి -అధ్యయనం

అణు విద్యుత్ తో పని లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. బెంగుళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐ.ఐ.ఎస్.సి) కి చెందిన ప్రొఫెసర్లు తయారు చేసిన అధ్యయన నివేదిక ఈ సంగతి ప్రకటించింది. సౌర విద్యుత్తుతో పాటు ఇతర సాంప్రదేయేతర విద్యుత్ వనరుల ద్వారా భారత దేశం యొక్క పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ‘కరెంట్ సైన్స్’ అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అణు విద్యుత్…

కూడంకుళం: ‘ఇదింతకరై’ లో అప్రకటిత ఎమర్జెన్సీ -నిజ నిర్ధారణ నివేదిక

కూడంకుళంలో మత్స్యకారుల శాంతియుత నిరసనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్రాల సోకాల్డ్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రూర నిర్బంధ విధానాలు స్వతంత్ర పరిశీలకుల ద్వారా మరోసారి వెల్లడైనాయి. కూడంకుళం అణు కర్మాగారంలో అణు ఇంధనం నింపడానికి వ్యతిరేకంగా సెప్టెంబరు 10 తేదీన సముద్రతీర గ్రామ ప్రజలు చేపట్టిన శాంతియుత ఆందోళనపై పోలీసులు అమానుష నిర్బంధాన్ని ప్రయోగించారనీ పిల్లలు, స్త్రీలపై కూడా బలప్రయోగం చేశారనీ, మైనర్ పిల్లలపై దేశ ద్రోహం నేరం మోపి బాలల ఖైదుకి పంపారని నిజనిర్ధారణ కమిటీ…

కూడంకుళం: ఆగని నిరసనలు, ట్యుటికోరిన్ పోర్టు సీజ్

కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా లక్షలాది గ్రామ ప్రజలు సాగిస్తున్న పోరాటం కొనసాగుతోంది. ప్రజల భయాలు, ఆందోళనలు పట్టించుకోకుండా కూడంకుళం అణు రియాక్టర్ లో యురేనియం ఇంధన కడ్డీలను నింపడం ప్రారంభం అయిన నేపధ్యంలో మత్స్యకారులు వెయ్యికి పైగా పడవలతో ట్యుటికోరిన్ పోర్టును శనివారం దిగ్బంధించారు. తమిళనాడు తీరం అంతటా మత్స్యకారులు ఆందోళన చేయాలని PMANE (Peoples Movement Aganist Nuclear Energy) ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఈ నిరసనను చేపట్టారు. మరో వైపు అణు…

అచంగ మార్కు డొల్ల శాస్త్రీయత మరొక్కసారి…

ఎకాలజిస్టు అచంగ గారు మళ్ళీ పాఠకులను తప్పుదారి పట్టించే పనిలో పడ్డారు. ఆయన నన్ను ఉద్దేశించి రాసిన తాజా టపాలో ఇలా రాశారు. ఇంకా తమరేమన్నారంటే, “అసలీయన సవాలు విసిరిందే ఫుకుషిమా రేడియేషన్ అమెరికా, యూరప్‌ల దాకా రాలేదని“ఈ ముక్క చెప్పి చెలరేగిపోయారు! తమరికి తెలుగు రాకపోయన్నా ఉండాలి లేదా ఒక వ్యక్తి వ్యాఖ్యలను తమ నరంలేని నాలుక వంకర్లు తిప్పి అయినా ఉండాలి. నేనన్నదేమిటి మీరు చెప్పింది ఏమిటి? “అణుధార్మికత యూరోపు వరకూ విస్తరించిందనటానికి ఆధారాలేవైనా…

అణుకంప కేంద్రం! -ఈనాడు ఎడిటోరియల్

(అణు విద్యుత్ కి వ్యతిరేకంగా దేశంలో క్రమంగా నిరసన వ్యాపిస్తోంది. ప్రజల పట్ల జవాబుదారీతనం లేని ప్రభుత్వాల వ్యవహార శైలి మేధో జీవులను కదిలిస్తోంది. ప్రజల భయాలకు సమాధానం చెప్పే బదులు ‘జీవించే హక్కు’ ను కోరడమే ‘దేశ ద్రోహం’ కింద లెక్కిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల ‘ప్రజాస్వామిక డొల్లతనాన్ని’ పత్రికలు కూడా ప్రశ్నిస్తున్నాయి. సోమవారం, సెప్టెంబర్ 17 తేదీ నాటి ఈనాడు దిన పత్రిక సంపాదకీయం, కేంద్ర ప్రభుత్వ ఆలోచనా రాహిత్యాన్ని తూర్పారబట్టింది. ఆ సంపాదకీయమే ఇది.)…

అచ్చమైన ప్రజలే కూడంకుళం ఉద్యమ నిర్మాతలు -ఫోటోలు

కూడంకుళం అణు కర్మాగారం వల్ల తమ భద్రతకు, జీవనోపాధికీ ప్రమాదమని స్ధానిక ప్రజలు భయపడుతున్నారు. ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక వారి భయాలు నిజమేనని వారికి రూఢి అయింది. కూడంకుళం అణు కర్మాగారానికి వ్యతిరేకంగా, గత సంవత్సరం ఆగస్టు నుండి వారు శాంతియుత నిరసన ప్రారంభించారు. కర్మాగారానికి వ్యతిరేకంగా గ్రామ సభలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. నెలల తరబడి నిరాహార దీక్ష చేశారు. వారి భయాలు పోగొట్టడానికి బదులు ప్రభుత్వం వందలమంది ప్రజలపై ‘దేశ ద్రోహం’…

అణు విద్యుత్ లేకపోయినా విద్యుత్ అవసరాలు గడిచిపోతాయి -అణు శాస్త్రవేత్త

ఇది ఈనాడులో సెప్టెంబర్ 1 తేదీన వచ్చిన ఆర్టికల్. భారత దేశానికి ఆ మాటకొస్తే ప్రపంచానికయినా అణు విద్యుత్ అవసరమా అన్న సమస్యను అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు ఇందులో చర్చించారు. అణు విద్యుత్ విషయమై భారత దేశంలో లోతైన చర్చ జరగలేదని సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు. భారీ పెట్టుబడులు అవసరమైన అణు విద్యుత్ వల్ల ఇతర ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నిధులు మృగ్యం అవుతాయని తెలిపారాయన. అనేక అపోహలను తయారు చేసి…

కూడంకుళం ఆందోళన: సముద్ర అలలపై కొత్తతరహా ఉద్యమం

కూడంకుళం అణు కర్మాగారంకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్ధానిక ప్రజలు తమ పోరాటానికి సముద్రాన్ని తోడు తెచ్చుకున్నారు. ప్రభుత్వాలు తమ ఊళ్లను, రహదారులను, ఖాళీ స్ధలాలను పోలీసు మాయం చేసిన నేపధ్యంలో గురువారం సముద్రంలోకి దిగి ఆందోళన మొదలు పెట్టారు. మధ్య ప్రదేశ్ ‘జల్ సత్యాగ్రహ్’ తరహాలో సముద్రంలోకి దిగి మానవహారాన్ని నిర్మించి రోజంతా ఆందోళన తెలిపారు. ప్రభుత్వం యధావిధిగా పోలీసుల చేత సముద్రం ఒడ్డుని దిగ్భంధించింది. అదనపు పోలీసు బలగాలను రప్పించి ప్రజలపై వేధింపులు కొనసాగించింది.…

కూడంకుళం: ప్రజల భద్రతే అంతిమం -సుప్రీం కోర్టు

కూడంకుళం అణు కర్మాగారం (ఫొటో: ది హిందూ) తమిళనాడు కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్ధానిక ప్రజలు సాగిస్తున్న పోరాటానికి సుప్రీం కోర్టు నుండి ఒకింత మద్దతు లభించీంది. ఇంధనం నింపడంపై స్టే విధించడానికి నిరాకరించినప్పటికీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాన్ని పరిశీలించడానికి అంగీకరించింది. కర్మాగారం చుట్టూ ఉన్న ప్రజల భద్రతే అంతిమమని వ్యాఖ్యానించింది. ఇంధనం నింపినప్పటికీ రెండు నెలల వరకూ కర్మాగారాన్ని ప్రారంభించబోమన్న కేంద్రం హామీపై నమ్మకం ఉంచింది. మద్రాస్ హై కోర్టు…

కూడంకుళం: ప్రధానికి సహాయపడితే విదేశీ నిధులు ఓ.కేనా? -అణు బోర్డు మాజీ చైర్మన్

కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారం వల్ల ప్రజల భద్రతకు ప్రమాదం లేదనీ, తాము అన్నివిధాలుగా భద్రతా చర్యలు తీసుకున్నామనీ ప్రధాని మన్మోహన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న కబుర్లు నిజం కాదని రుజువవుతోంది. భారత అణు శక్తి నియంత్రణ బోర్డు (Atomic Energy Regulatory Board -AERB) మాజీ అధిపతి గోపాల్ కృష్ణన్ స్వయంగా ఈ విషయాన్ని బట్టబయలు చేశాడు. ఫుకుషిమా అణు ప్రమాదం దరిమిలా, కూడంకుళం అణు…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలపై కూడంకుళం ప్రజల వీరోచిత పోరాటం

పర్యావరణంతో పాటు జీవనోపాధిని కూడా దెబ్బతీసే ‘కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు’ (కె.ఎన్.పి.పి) కి వ్యతిరేకంగా కూడంకుళం ప్రజల పోరాటం కీలక దశకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అణచివేత, దుష్ప్రచారం, పోలీసు నిర్బంధాలకు ఎదురోడ్డి సామాన్య ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉద్యమ నాయకులు ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులను పోలీసులు పట్టుకెళ్లకుండా నిరంతరం కాపలా కాస్తున్నారు. పోలీసుల తప్పుడు కేసుల్లో నిజాయితీ నిరూపించుకోవడానికి అరెస్టు అవుతానని ఎస్.పి.ఉదయ్ కుమార్ తదితరులు ప్రకటించినప్పటికీ…