మోడిని ప్రసన్నం చేసుకోలేని కెర్రీ? -కార్టూన్

అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ కొద్ది రోజుల క్రితం ఇండియా వచ్చి వెళ్లారు. మోడి రాక కోసం తమ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆత్రంగా ఎదురు చూస్తున్నారన్న సందేశాన్ని మోసుకొచ్చిన కెర్రీ, చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా మోడీ ముందు వ్యవహరించారని కార్టూన్ సూచిస్తోంది. దేవయాని ఖోబ్రగదేను అమెరికాలో అరెస్టు చేసినప్పటి నుండి ఇరు దేశాల సంబంధాలు క్షీణ దశలో ఉన్నాయని పత్రికలు చెప్పే మాట. మోడి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న…

సోనియా మరియు విదూషక నట్వర్ సింగ్ -కార్టూన్

యు.పి.ఏ-1 ప్రభుత్వంలో విదేశీ మంత్రిగా పని చేసి తొలగింపుకు గురయిన నట్వర్ సింగ్ పుస్తకం ప్రస్తుతం జాతీయ స్ధాయి చర్చల్లో నలుగుతోంది. ‘ఒక జీవితం చాలదు: ఆత్మకధ’ టైటిల్ తో ఈ రోజు వెలువడుతున్న పుస్తకం ఆయన సన్నిహితంగా మెలిగిన సోనియాపై విమర్శలు గుప్పించడంతో పత్రికలకు మేత లభించినట్లయింది. సోనియా చెప్పుకున్నట్లు అంతరాత్మ ప్రభోదం మేరకు ఆమె ప్రధాని పదవిని వదులుకోలేదని వాస్తవానికి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ నిరోధించడం వల్లనే ఆమె పదవిని త్యజించారని నట్వర్…

గడ్కారీ బెడ్రూంతో పాటు ఇంటింటికీ బగ్ అమర్చాలి -కార్టూన్

“మన సమస్యలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఇంటింటికీ బగ్ అమర్చాలి…” *** బి.జె.పి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఇంట్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చి ఉన్న సంగతి వెల్లడి అయింది. 2009లో బి.జె.పి అధ్యక్షుడుగా పదవి చేపట్టిన అనంతరం ఆయనకు అధికారిక నివాసాన్ని కేటాయించారు. ఆయన ఇప్పటికీ ఆ ఇంట్లోనే కొనసాగుతున్నారు. ఆయన నిద్రించే బెడ్ రూమ్ లో సంభాషణలు వినే పరికరం రహస్యంగా అమర్చినట్లు వెల్లడి కావడంతో కాంగ్రెస్, తదితర…

భోజన పళ్ళెం అందుకోలేని కాంగ్రెస్ -కార్టూన్

లోక్ సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా కోసం పోరాడవలసిన పరిస్ధితి కాంగ్రెస్ ది. మొత్తం సీట్లలో 10 శాతం వస్తే తప్ప ప్రతిపక్ష హోదా దక్కదని నిబంధనలు ఉన్నాయిట. తమకు 44 సీట్లే వచ్చినా యు.పి.ఏ కి 60 సీట్లు వచ్చాయి గనుక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎన్నికలకు ముందు యు.పి.ఏ పక్ష్యాలన్నీ ఒకే మేనిఫెస్టో, కార్యక్రమం ఇవ్వలేదు గనక ఆ లాజిక్ పని చేయదని బి.జె.పి తిప్పి కొడుతోంది. ఫలితంగా బి.జె.పి…

కురువృద్ధ కాంగ్రెస్ ను తీరానికి చేర్చేదిలాగేనా! -కార్టూన్

వందకు మించిన పార్లమెంటు సభ్యులకు నాయకత్వం వహించడానికి అలవాటుపడిన నెహ్రూ-గాంధీ కుటుంబం 44 మందికి కుదించుకుపోయిన పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహించడానికి సిగ్గుపడిందో ఏమో గానీ మొదటిసారి లోక్ సభ నాయకత్వాన్ని కుటుంబేతరుడు మల్లిఖార్జున్ ఖార్గే కు అప్పజెప్పింది. మొత్తం పార్లమెంటు సభ్యుల్లో కనీసం 10 శాతం సీట్లన్నా గెలుచుకోలేక ప్రతిపక్ష హోదా కోసం కూడా పాలక కూటమిని బతిమాలుకునే పరిస్ధితిలో ఉన్న కాంగ్రెస్, తెలివిగా దళితుడిని లోక్ సభ నేతగా ఎన్నుకోవడం ద్వారా ప్రతిపక్ష నాయకత్వాన్ని…

శివసేన పులి స్వారీ -కార్టూన్

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ఒక ముస్లిం ఉద్యోగి చేత శివసేన ఎం.పిలు బలవంతంగా చపాతీ తినిపించిన సంఘటన చుట్టూ ప్రస్తుతం రాజకీయ పార్టీలు చర్చను నడుపుతున్నాయి. సదరు చర్చకు పత్రికలు యధా శక్తి సహకరిస్తున్నాయి. ముంబై లోని మహా రాష్ట్ర సదన్ లో వడ్డిస్తున్న భోజనం క్వాలిటీ నాసిరకంగా ఉందని శివసేన ఎం.పి లు చెప్పదలిచారట. ప్రజా ప్రతినిధుల స్ధానంలో ఉన్నవారికి ఆ విషయాన్ని చెప్పడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. నాగరిక సమాజంలో…

మేము ఈల వేస్తే…. -కార్టూన్

అదేదో సినిమాలో తాను ఈల వేస్తే గోల్కండ కోట ఎగిరి పడుద్ది అని పాడతాడు. ఆయన సంగతేమో గానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అది కూడా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పెద్దల అవినీతి, అవకతవకల గురించి ఈల వేయడం మొదలు పెడితే జనానికి తెలియని చాలా అఘాయిత్యాలు బైటికి వస్తాయి. ఒక సంస్ధలో పని చేస్తూ, ఆ సంస్ధలో జరిగే అక్రమాలను బైటికి, రహస్యంగా గానీ బహిరంగంగా గానీ, చెబితే దానిని ఆంగ్లంలో విజిల్ బ్లోయింగ్…

అసమానుల తగాదా: నిస్పక్షపాతమూ పక్షపాతమే -కార్టూన్

ఓహ్… ఇద్దరూ మనకు మిత్రులే కదా! *** పోటీ అన్నది ఎప్పుడూ సమానుల మధ్య జరగడమే న్యాయం. ఆటలో ఒక పక్షం తొండాట ఆడుతున్నారని తెలిసీ నిస్పక్షపాతం అంటూ గిరి గీసుకు కూర్చుంటే అది చివరికి తొండాటకు మద్దతుగా తేలుతుంది. ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇలాగే ఉంది. ఇజ్రాయెల్ అన్ని విధాలుగా బలీయమైన రాజ్యం. అనేక దశాబ్దాలుగా అమెరికా, ఐరోపాల పోషణలో ఉన్న ఇజ్రాయెల్ మధ్య…

నన్ను పి.ఎంని చెయ్యి, నిన్ను అధ్యక్షుడ్ని చేస్తా -కార్టూన్

మనకిక్కడ ఒకప్పుడు ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఒకరి హఠాన్మరణం వలన ఆ రెండో పెద్దాయన కూడా హఠాత్తుగా ఒంటరి అయ్యారు. (తెలంగాణ ఆందోళన పుణ్యామని ఆ తర్వాత కూడా ఆయన కింగ్ మేకర్ గా కొనసాగారని కొన్ని పత్రికలు చెవులు కొరుకుతాయి.) గుజరాత్ లో కూడా ముఖ్యమంత్రి – ఆత్మ బంధువు జంట ఒకటి ఉండేది. ఈ జంటకి ప్రమోషన్ వచ్చి రాష్ట్ర స్ధాయి నుండి కేంద్ర స్ధాయికి ఎగబాకింది. వారు…

షీలా ఇంటికి 31 ఏ.సిలు! -కార్టూన్

“బహుశా ఆమె ఢిల్లీ మొత్తాన్ని చల్లగా ఉంచాలని భావించి ఉంటారు!” ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసానికి ఏకంగా 31 ఏ.సి మిషన్లు అమర్చారట. పోనీ అంతటితో ఆగారా అంటే, లేదు. 31 ఏ.సిలతో పాటు 15 ఎయిర్ కూలర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 14 హీటర్లు కూడా షీలా ఇంటిలో అమర్చారు. ఇంతా చేసి ఆ ఇల్లు 4 పడక గదుల ఇల్లు. నాలుగు పడకగదుల ఇంట్లో ఇన్ని ఏ.సిలు, ఎయిర్ కూలర్లు…

ఈ దేశంలో బిచ్చగాళ్లూ ధనికులే -కార్టూన్

మేధావులు: ఈయన భోజనంలో రు. 15/- ల అన్నం, రు. 10/- ల పప్పు, రు. 5/0 ల ఉల్లి, రు. 5/- ల మసాలాలు ఉన్నాయి. కాబట్టి ఈయన దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్లే! *** ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ తాజాగా తన దరిద్ర ప్రమాణాల లెక్కలు విడుదల చేయడంతో దేశంలో పేదలు ఎంతమంది అన్న చర్చ మరోసారి రేగింది. సురేష్ టెండూల్కర్ లెక్క సరికాదని చెప్పిన రంగరాజన్ పట్టణ, గ్రామీణ దరిద్రం లెక్కని…

ఫుట్ బాల్ వీరుడు మోడి -కార్టూన్

నడుస్తున్నది ప్రపంచ ఫుట్ బాల్ సీజన్. కాబట్టి బంతిని రెండు స్తంభాల నడుమకు నెట్టేస్తే సరిపోతుంది. కానీ రానున్నది అసలు పందెం. ఈ పందెంలో స్తంబాల మధ్య నెట్టడానికి బంతీ ఉండదు. ఆట ఆడితే మోగే చప్పట్లూ ఉండవు. ఎందుకంటే ఆ అసలు పందెంలో అన్నీ దాటి తీరవలసిన ఆటంకాలే. 30 రోజుల ప్రభుత్వం పైన తీర్పు ఇవ్వడానికి ఏమీ ఉండదని కార్టూనిస్టు ఇలా చెప్పారు. అధికారంలోకి వచ్చిన ప్రారంభ రోజులను అధికార పార్టీకి హానీ మూన్…

రైలు ఛార్జీలు కాదు విమాన ఛార్జీలు -కార్టూన్

“… చెన్నై, బెంగుళూరు, భోపాల్, లక్నో, పాట్నా మరియు చండీఘర్ ల మీదుగా ఢిల్లీ పోవు తదుపరి విమానం 11వ నంబర్ ప్లాట్ ఫారం నుండి బయలుదేరును…” *** రైల్వే ఛార్జీల పెంపుదలను కార్టూనిస్టు ఇలా వ్యంగ్యీకరించారు. గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే రైల్వే సరుకు రవాణా చార్జీలను పెంచడాన్ని తప్పు పట్టిన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, తాను ప్రధాని అయ్యాక అదే తరహాలో ఛార్జీలు పెంచడానికి ఏ మాత్రం వెనకాడలేదు.…

కాంగ్రెస్ గవర్నర్ల గెంటివేత -కార్టూన్

“రాజీనామా? అబ్బే కాదు. గెంటేశారు!!” *** కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాత ప్రభుత్వం తాలూకు వాసనలను వదిలించుకోవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల గవర్నర్ లను మార్చడానికి మోడి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కొందరు గవర్నర్ లు అందుకు సహకరించడానికి సిద్ధంగా లేరు. దానితో బి.జె.పి మండిపడుతోంది. ముఖ్యంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహా రాష్ట్ర రాష్ట్రాల గవర్నర్లు తమకు రాజీనామా చేసే ఉద్దేశ్యం ఏమీ లేదని స్పష్టం చేయడంతో…

ఎన్.జి.ఓలు vis-a-vis మోడి -కార్టూన్

“… ఆ, అవే, మనకి అనుకూలంగా తిరగడం లేదు చూశావా, అక్కడికి పద…” *** ఎన్.జి.ఓ లు మరొకసారి చర్చనీయాంశం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గూఢచార సంస్ధ ‘ఇంటలిజెన్స్ బ్యూరో’ (ఐ.బి), అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ సంస్ధగా చెప్పుకునే గ్రీన్ పీస్ కీ, ఇంకా ఇతర సంస్ధలకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రికి నివేదిక ఇవ్వడంతో తాజాగా ఎన్.జి.ఓలపై చర్చ నడుస్తోంది. గ్రీన్ పీస్ తదితర ఎన్.జి.ఓల కార్యకలాపాలు భారత దేశ అభివృద్ధికి ఆటంకంగా మారాయన్నది సదరు నివేదిక…