గాల్లోంచి ఢిల్లీ పీఠంపైకి బేడీ -కార్టూన్

“ఇదేదో మన పీకల మీదికే వచ్చేట్లుంది….” ************ అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం పస ఏమిటో, అది ఎందుకు ఎవరి ప్రోద్బలంతో మొదలై చివరికి చప్పగా ముగిసిందో జనానికి బహుశా ఇప్పుడు తెలిసి ఉండాలి. అలాగే, అవినీతి వ్యతిరేక ఉద్యమం లోక్ పాల్ చట్టాన్ని సాధించలేని పరిస్ధితుల్లో ఇక రాజకీయాల్లోకి దిగుదామని కొత్త పార్టీ పెడదామని అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించినప్పుడు ఆయన కొలీగ్ కిరణ్ బేడీ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారో కూడా ఇప్పుడు జనానికి…

రాజపక్సే: నిలువునా కూలిన మర్రిమాను -కార్టూన్

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రీపాల సిరిసేన గెలుపును ‘ప్రజాస్వామ్యం విజయం’గా ది హిందు అభివర్ణించింది. అదే విషయాన్ని కార్టూనిస్టు ఇలా చెప్పారు. ప్రజాస్వామ్యం పని చేయడం ప్రారంభిస్తే మహేంద్ర రాజపక్సే లాంటి ఊడలు దిగిన మర్రిమానులు సైతం నిలువునా కూలిపోవలసిందేనని కార్టూనిస్టు భావన! వాస్తవంలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల భావోద్వేగాలను నియంత్రించగల భౌగోళిక స్ధాయి ఘటనలను ప్రేరేపించగల శక్తులు పని చేస్తున్నప్పుడు ఆధిపత్య శక్తుల అవసరాలే ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని పత్రికల నుండి, టి.వి ఛానెళ్ల నుండి ప్రజల…

స్టెపిని లేని మోడి సంస్కరణల కారు -కార్టూన్

ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీల సంస్కరణల వాహనం వింత పోకడలు పోతోంది. ఇన్నాళ్లూ దేశ ఆర్ధిక వ్యవస్ధకు పట్టుగొమ్మలుగా ఉంటూ వచ్చిన ప్రాధమిక వ్యవస్ధలను సమూలంగా నాశనం చేస్తున్నారు. వాటి స్ధానే విదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తి పాలనా పగ్గాలను ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల చేతుల్లో పెట్టే చర్యలను వారు వేగవంతం చేశారు. ఫలితంగా అభివృద్ధి సాధించి ఉద్యోగాలు రావడం అటుంచి ఉన్న సమస్యలు మరింత తీవ్రమై భారత ఆర్ధిక…

మోడి చాతుర్యం: దొడ్డిదారిన భీమా బిల్లు -కార్టూన్

అరుణ్ జైట్లీ: “ఇన్సూరెన్స్ పాలసీలోని ఫైన్ ప్రింట్ కి అనుగుణంగానే అది ఉంది” ********* బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా భీమా రంగంలో ఎఫ్.డి.ఐ ల వాటా పెంపుదల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నిండా లాభాలు పండిస్తున్న భీమా రంగాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అంటూ జాతీయవాద ఫోజులు పెట్టి ప్రశ్నించింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా దేశాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారు అని ఆగ్రహించింది. మేము అధికారంలోకి వచ్చాక బిల్లును చెత్త బుట్టలో వేస్తామని జనానికి హామీ ఇచ్చింది.…

వాజ్ పేయికి భారత రత్న సుపరిపాలనేనా? -కార్టూన్

“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?” ********* మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ,…

గాడ్సేకు బదులు మూడు కోతుల విగ్రహం బెటర్! -కార్టూన్

“దానికి బదులు మనం మూడు కోతులకు విగ్రహం కట్టాలి” ********* బి.జె.పి పాలన ప్రారంభం అయింది లగాయితు గాంధీ హంతకుడు నాధూరామ్ గాడ్సే ను ప్రశంసించేవారు ఎక్కువయ్యారు. సాక్ష్యాత్తు బి.జె.పి ఎం.పి లే బహిరంగంగా గాడ్సేను పొగిడి తమ భావజాలం నిజ స్వరూపం ఏమిటో చాటుకున్నారు. ఇప్పుడు ఏకంగా గాడ్సేకు దేశ రాజధానిలోనే విగ్రహం కట్టాలని అఖిల భారత హిందూ మహా సభ డిమాండ్ చేస్తోంది. మహాత్మా గాంధీ నిజంగా మహాత్ముడా కాదా అన్నది తర్వాత సంగతి.…

తాలిబాన్ తుపాకి శిక్షణ టార్గెట్లు: పూలు! -కార్టూన్

లేలేత ప్రాయపు చిన్న పిల్లలు సున్నిత శరీరాలను కలిగి ఉంటారు. వారి అవయవాలు తేలికగా వంగిపోయే విధంగా ఉంటాయి. ఈ కారణం తోనే చిన్న పిల్లలను పూలతో పోల్చడం కద్దు. పూల రెమ్మలు ఎంత మెత్తగా, సున్నితంగా ఉంటాయో చిన్న పిల్లల శరీరాలు, హృదయాలు కూడా అంతే మెత్తగా, సున్నితంగా ఉంటాయి. పెషావర్ లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై పాకిస్తాన్ తాలిబాన్ చేసిన పైశాచిక దాడి నేపధ్యంలో కార్టూనిస్టు తాలిబాన్ స్వభావాన్ని ఈ విధంగా సున్నితంగా…

ప్రతిపక్షం చేతికి ‘మత మార్పిడి’ ఆయుధం! -కార్టూన్

మత మార్పిడులు ఎప్పటి నుండో బి.జె.పి రాజకీయ అస్త్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది. మత మార్పిడులను భావోద్వేగాలను రెచ్చగొట్టగల ఆయుధంగా తయారు చేసుకున్న బి.జె.పి అనేకమార్లు దాన్ని ప్రయోగించి ఓట్లు నొల్లుకుంది. అయితే అది అధికారంలో లేనంతవరకు మాత్రమే ఆయుధం కాగలదని, అధికారంలోకి వచ్చాక ఎదురు తిరగుతుందని ఈ కార్టూన్ సూచిస్తోంది. కార్టూన్ లో ఉన్న మరో అంశం పిల్లిలా ఉన్న ప్రతిపక్షం మత మార్పిడుల వల్ల పులిగా మారిపోయిందని. బలం లేక, ఐక్యత కొరవడి, అధికార పక్షం…

నాట్లే ఇంకా కాలేదు, అన్నం కుక్కర్ రెడీ -కార్టూన్

కొత్త రాజధాని పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు చేస్తున్న హడావుడి చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియని పరిస్ధితి. భూ సమీకరణకు సంబంధించి విధాన ప్రకటన ఇంతవరకు చేయలేదు. లక్ష ఎకరాల భూమి సేకరించేది ఏ ప్రయోజనాల కోసమో తెలీదు.భూములు ఇవ్వబోయే రైతులకు నష్టపరిహారం ఎంతో తెలీదు. భూములు లేక భూములు గలవారిపై ఆధారపడి బ్రతుకుతున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు బ్రతుకు తెరువు ఏమిటో కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. భూములు ఇచ్చేందుకు ఎందరు…

మహారాష్ట్ర: పులికి గంట కట్టిన బి.జె.పి -కార్టూన్

మహారాష్ట్ర ఎన్నికలు-ప్రభుత్వ ఏర్పాటు నాటకంలో చివరి అంకం పూర్తయింది. ఎన్నికలకు ముందు బి.జె.పి తో పొత్తును తెగతెంపులు చేసుకున్నది లగాయితు శివ సేన నేతలు, బి.జె.పి పై నిప్పులు చెరగని రోజంటూ లేదు. ఉత్తుత్తి పులి గాండ్రింపులు చేసి చేసి అలసిపోయిన శివసేన చివరికి పిల్లికంటే దిగజారి తమ ముందు ‘ఎలుక’గా అభివర్ణించిన బి.జె.పి చేతనే మెడలో గంట కట్టించుకుంది. మహారాష్ట్రలో ఎవరిది ఆధిపత్య హస్తం అన్నది నిర్ధారించుకోవడంలో పరస్పరం విభేదించుకున్న బి.జె.పి, శివసేనలు తమ విభేదం…

టి.ఎం.సి బలహీనతలే బి.జె.పికి బలమా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ లో ఒక దశలో ఎదురు లేనట్లు కనిపించిన తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస ఇక్కట్లు ఎదుర్కొంటోంది. శారద చిట్ ఫండ్ కుంభకోణం మమత బెనర్జీ మెడకు భారీ గుదిబండగా మారిపోయింది. బర్ద్వాన్ పేలుళ్లు చేయించింది టి.ఎం.సి పార్టీయే అన్నట్లుగా బి.జె.పి అధ్యక్షుడు ప్రచారం చేస్తున్నారు. శారదా చిట్ ఫండ్ డబ్బు బర్ద్వాన్ పేలుళ్లకు ఉపయోగించారని,  శారదా చిట్ ఫండ్ కుంభకోణం దోషులను టి.ఎం.సి కాపాడుతోందని ఒక ర్యాలీలో మాట్లాడుతూ బి.జె.పి అమిత్…

బ్యాట్స్ మేన్, రన్నర్ ఇద్దరూ ఆయనే -కార్టూన్

బి.సి.సి.ఐ భారత ప్రభుత్వ సంస్ధ అని చాలామంది భావిస్తారు. అది కేవలం ప్రైవేటు క్రికెట్ సంఘాలను కేంద్రీకృత స్ధాయిలో నియంత్రించే ప్రైవేటు సంస్ధ మాత్రమేనని వారికి తెలియదు. అనేక యేళ్లుగా భారత ప్రజల్లో క్రికెట్ జ్వరాన్ని పెంచి పోషించి ఆ జ్వరాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బి.సి.సి.ఐ అవతరించింది. బి.సి.సి.ఐని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కొన్ని సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ క్రికెట్ జబ్బు డబ్బు తినడం మరిగిన సంపన్నులు…

కమండలం నుండి కమేండోల వరకూ… -కార్టూన్

హిందూత్వ ప్రబోధకులు గొప్పగా చెప్పుకునే సనాతన స్వర్ణ యుగంలో మునులు, సాధువులు, బాబాలు, గురువులు ఏం చేసేవారు? ముక్కు మూసుకుని ఒంటికాలి తపస్సు చేసేవారు. హిమాలయాలకు చేరి పవిత్ర గంగా తీరాన లేదా మరో నది తీరాన కమండల ధారియై తపమాచరించెడివారు. సర్వసంగపరిత్యాగియై హరహర శంభో అంటూ దివ్యజ్ఞానార్ద్ధులై కఠోర బ్రహ్మచర్యం పాటించేవారు. శిష్యులను వెంటేసుకుని ధర్మ ప్రబోధం కావించేవారు. మనం చూడకపోయినా మన పుస్తకాలు, కధలు, బోధనలు ఈ సంగతి చెబుతాయి. మరి ఇప్పుడో! ఏ.సి…

ఫడ్నవీస్: విశ్వాస పరీక్ష ఇంత సులువా? -కార్టూన్

కూటమి యుగం ప్రారంభం అయ్యాక రాష్ట్రాల శాసన సభల్లోనూ, లోక్ సభలోనూ విశ్వాస పరీక్ష నెగ్గడం రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారిపోయింది. కూటమిలో ప్రతి చిన్న పార్టీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, అలాగని వారిని వదులుకోలేక కూటమి నేత పార్టీలు నానా చావు చచ్చేవి. కానీ మహారాష్ట్రలో మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీ లేకపోయినా సరే అతి సులభంగా విశ్వాస పరీక్ష నెగ్గి ముందు తరాలకు ఒక ఆదర్శాన్ని చూపింది. బహుశా ఫడ్నవీస్…

నెహ్రూ వారసత్వానికి కాంగ్రెస్ తాళం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోడి ఇమేజి దెయ్యమై వేధిస్తోంది. కళ్ళు తెరిచినా, మూసినా మోడి భూతమే ప్రత్యక్షం అవుతుండడంతో తనను బంధించుకునే పరిస్ధితిలో పడిపోయింది. తాను ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే స్వాతంత్ర పోరాట వారసత్వాన్ని మోడి ఎక్కడ తన్నుకుపోతారో అన్న భయంతో ప్రధమ ప్రధాని నెహ్రూ ఇమేజికి తాళం వేసేసుకుంది. నవంబర్ 14, నెహ్రూ జన్మదినం. ఎప్పుడూ వచ్చే జన్మదినం కాదు 125వ జన్మదినం. అది పురస్కరించుకుని నెహ్రూ సంస్మరణ సభలు, సెమీనార్లు ఏర్పాటు చేసిన కాంగ్రెస్…