ఢిల్లీలో కేజ్రీ-జంగాసన -కార్టూన్

జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినం (International Day of Yoga) గా జరపనున్నారు. గత సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ ఐరాస యోగా దినం ప్రకటించింది. సొంత ప్రచారానికి, జబ్బలు చరుచుకోడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలని బి.జె.పి, నరేంద్ర మోడిలు ఐ.డి.వై ప్రకటనను కూడా తమ విజయంగా చాటుతున్నారు. ఐ.డి.వై నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి కార్యక్రమాలు రూపొందించారు. జూన్ 21…

నా గొయ్యి నువ్వు, నీ గొయ్యి నేను -కార్టూన్

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రుల వ్యవహారం ఇది. ప్రజల్లో ఒకరిని మరొకరు పలుచన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న దాయాది ముఖ్యమంత్రులు ఒకరి గొయ్యి మరొకరు తవ్వుకుంటూ ఇద్దరూ గోతిలో పడిపోతున్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా చూస్తే ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పైనా జాలి చూపాల్సిన పరిస్ధితి కావచ్చు గానీ ప్రజల కోణంలో నుండి చూస్తే ఇరువురి చర్యల వల్ల వారి వారి అసలు రంగు బయటపడుతున్నందుకు ఆనందించాల్సిన సంగతి. శాసన మండలి సభ్యుల ఎన్నికల సందర్భంగా టి.డి.పి…

భూమిపూజ: కేంద్రం నుండి కొబ్బరిచిప్ప -కార్టూన్

విభజన రాజకీయాలు పూర్తి స్ధాయిలో సాగుతున్న కాలంలో, కేవలం సంవత్సర కాలం క్రితమే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇప్పటి బి.జె.పి ప్రభుత్వం గానీ ఇవ్వని వాగ్దానం లేదు. నూతన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అనేక సంస్ధలు, నిధులు వాగ్దానం చేసినా అవేవీ అమలు కాకపోగా, కనీసం అమలు చేస్తామన్న నమ్మకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. రాష్ట్ర విభజనలో తమది కూడా గణనీయమైన పాత్రే అని చెప్పుకోవడం బి.జె.పికి ఇష్టం. అటు తెలంగాణ ప్రజలకేమో తమ…

మ్యాగి పురుగు పట్టిన మన ఆహార భద్రత -కార్టూన్

ఆహార భద్రత గురించి మన దేశ ప్రధానుల దగ్గర్నుండి ఛోటా మోటా ఐ.ఏ.ఎస్ అధికారుల వరకు చెప్పని కబురు లేదు. వాస్తవంలో భారత దేశ ఆహార భద్రత పురుగులు పట్టి కుళ్లిపోయిన యాపిల్ పరిస్ధితికి దిగజారిందని కార్టూనిస్టు వ్యంగ్యంగా చూపారు. 2 నిమిషాల్లో వండిపడేసే మ్యాగిలో ఆనారోగ్య కారక రసాయనాలు ఉన్నాయని తేలడంతో పలు రాష్ట్రాలు మ్యాగి శాంపిళ్ళను పరీక్ష చేయిస్తున్న నేపధ్యంలో మన ఆహార భద్రత పరిస్ధితిని ఈ కార్టూన్ వివరిస్తోంది. గత ఏప్రిల్ నెలలో…

మోడి స్నేహ హస్తం! -ది హిందు ఎడిట్..

[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్] *************** సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల…

ప్రధాని, మాజీ ప్రధాని సమావేశం -కార్టూన్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. వారి సమావేశంలోనే అంశాలు ఏమిటో ఎవరికి తెలియదు. మాజీ ప్రధాని మాట్లాడి వెళ్ళాక ప్రధాని నరేంద్ర మోడిగారే స్వయంగా వారిద్దరు చేతులు కలిపిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఫోటోతో పాటు కొంత మేటర్ ఆయన రాశారు గానీ, అందులో వారి సమావేశంలోని అంశం ఏమిటో చెప్పలేదు. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా) మాజీ అధిపతి భాయిజి తన ఉద్యోగ అనుభవాలను…

మోడి ద సూపర్ హీరో -కార్టూన్

“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడమే తేలిక…” ************* గత యేడాదిలో పార్లమెంటు సమావేశాలకు అతి తక్కువ సార్లు హాజరైన ప్రధాన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోడి అదే సమయంలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విదేశాలు పర్యటించిన ఘనతను కూడా దక్కించుకున్నారు. సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడి 18 దేశాలు పర్యటించడం మున్నేన్నడూ ఎరగనిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళ కాలంలో ఏయే దేశాలైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయో ఆ…

జయ కారుకు కొర్టే ఇంజన్ -కార్టూన్

ఈ కార్టూన్ ను రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. ఒకటి: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను మరోసారి చేపట్టిన జయలలితకు ఆమెను జైలు జీవితం నుండి బైటపడడానికి కోర్టులే సహకరించాయన్న అర్ధం ఈ కార్టూన్ లో ద్యోతకం అవుతోంది. రెండు: ఇన్నాళ్లూ ఆమె ముఖ్య మంత్రిగా కారులో ప్రయాణించకపోవడానికి కోర్టు కేసులు ఆటంకంగా, అడ్డంగా ఉన్నాయని లాయర్లు శ్రమించి ఆ ఆటంకాన్ని తొలగించి సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తిరిగి ప్రయాణం ప్రారంభించారని మరో అర్ధం. ఈ రెండు…

ఎవరు జీరో, ఎవరు హీరో! -కార్టూన్

నరేంద్ర మోడి ఏడాది పాలనకు రాహుల్ గాంధీ ఇచ్చిన మార్కులు పదికి సున్నా (జీరో). ఈ మేరకు రాహుల్ గాంధీ స్వయంగా పార్లమెంటులో ప్రకటన చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఆనందంగా బల్లలు చరిచారు. రాహుల్ గాంధీ లాంటి పిల్లగాడు తమ అధినేతను జీరోను చేస్తే బి.జె.పి నేతలు ఊరుకుంటారా? చస్తే ఊరుకోరు. వెంకయ్య నాయుడు గారి లాంటి ప్రాసల పండితులైతే అసలే ఊరుకోరు. “జీరోలకు జీరోలే కనిపిస్తారు. హీరోలు కనిపించరు” అని రాహుల్ విమర్శను ఆయన తిప్పి…

గాలి కబుర్ల పాలనకు ఏడాది -కార్టూన్

నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – 2 అధికారం చేపట్టి ఏడాది అవుతోంది. అవడానికి ఎన్.డి.ఏ పాలన అయినప్పటికీ ఆచరణలో ఇది పూర్తిగా బి.జె.పి పాలన. ఈ ప్రభుత్వంపై వాజ్ పేయి భరించిన కూటమి ఒత్తిళ్ళు ఏమీ లేవు. శివసేన లాంటి నోరుగలిగిన భాగస్వాములను సైతం తొక్కి పెట్టగలిగిన ఎన్.డి.ఏ-2 పాలన పూర్తిగా బి.జె.పి పాలనగా చెప్పుకున్నా తప్పు లేదు. ఈ ఏడాది పాలన ఒట్టి గాలి కబుర్ల పాలనగా సాగిపోయిందని కార్టూనిస్టు సరిగ్గా చెప్పారు. ఇంకా చెప్పాలంటే…

చైనాకేనా, మనకూ ఉన్నారు టెర్రాకొట్ట వారియర్లు! -కార్టూన్

టెర్రాకొట్ట యుద్ధ వీరులు చైనాకు మాత్రమే ప్రత్యేకం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో బతికిన మొట్ట మొదటి ఎంపరర్ షిన్ షి హువాంగ్ చనిపోయినపుడు ఆయనకు మరణానంతరం కూడా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో తయారు చేసినవే టెర్రాకొట్ట యుద్ధ వీరుల విగ్రహాలు. ఈ విగ్రహాలను ఎంపరర్ తో కలిపి ఒక క్రమ పద్ధతిలో పూడ్చిపెట్టారు. 1974లో మొదటిసారి ఇవి రైతుల కంట బడ్డాయి. అనంతరం జాగ్రత్తగా తవ్వకాలు జరిపి కొన్ని విగ్రహాలను బైటికి తీసి మ్యూజియంలో భద్రపరిచారు.…

హిందీ-చీనీ భాయ్ భాయ్, మళ్ళీ! -కార్టూన్

నిజంగా చాలా అద్భుతమైన కార్టూన్. కాసిన్ని గీతల్లో ఎంతో విశాలమైన అర్ధాన్ని పొదిగిన ఇలాంటి కార్టూన్ లను చాలా కొద్ది మంది మాత్రమే గీయగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి అర్ధవంతమైన కార్టూన్ లు గీయాలంటే చరిత్ర జ్ఞానం కావాలి. ఒట్టి చరిత్ర జ్ఞానం ఉన్నా చాలదు. ఆ జ్ఞానం సరైన దిశలో చూస్తూ ఉండాలి. సమకాలీన పరిమాణాలపైనా, వర్తమానం లోని వివిధ రాజకీయ, ఆర్ధిక, సామాజిక ఘటనల పైనా తగిన పట్టు కలిగి ఉండాలి. అన్నీ కుదిరాక వాటిని…

రైతులకు ఉరి బిగించే అభివృద్ధి -కార్టూన్

అభివృద్ధి పేరుతో భారత పాలకులు రైతుల మనుగడను ఏ స్ధాయిలో ప్రశ్నార్ధకం చేస్తున్నారో పట్టిస్తున్న కార్టూన్ ఇది! పాలకులు నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తారు గానీ ఆ అభివృద్ధి ఎవరికి చెందినదో ఎప్పుడూ చెప్పరు. అసలు 66 యేళ్ళ స్వతంత్రావనిలో అభివృద్ధి లేకుండా ఎలా పోయిందో మొదట వారు చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వారు పార్టీల మధ్య తగాదా స్ధాయికి కుదించి జనాన్ని కూడా అదే నమ్మమంటారు. పాలకవర్గ పార్టీలన్నింటి వెనుకా ఉన్నది ఒకే దోపిడీ…

పనికి(మాలిన)రాని కీచులాట! -కార్టూన్

రైతుల సమస్యల పట్ల పాలక, ప్రతిపక్ష పార్టీలు ఇరువురికీ చిత్తశుద్ధి కొరవడిందని శక్తివంతంగా చెబుతున్న కార్టూన్ ఇది. రాహుల్ గాంధీ తన పునరాగమనానికి భూసేకరణ చట్టం – 2013 కు మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలను ఆలంబనగా చేసుకున్నారు. తాము రైతులకు అనుకూలమైన చట్టం తెస్తే మోడి దానికి చిల్లులు పొడుస్తున్నారని ఆయన ఆక్రందన! విచిత్రంగా బి.జె.పి, మోడిలు సైతం తమ సవరణలు రైతుల కోసమే అని చెబుతున్నారు. కొంతమంది పనిగట్టుకుని తమ సవరణలపై దుష్ప్రచారం చేస్తున్నారని…

అంబేద్కర్ విగ్రహ పూజా పందెం -కార్టూన్

ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకైనా తెగించేలా చేస్తాయి. రాజకీయ, ఆర్ధిక అవినీతికి వ్యతిరేకంగా జన్మించిన పార్టీ ఎఎపి. ఆ పార్టీ కూడా గెలవడం కోసం తన స్ధాపనా సూత్రాలను కూడా వదిలిపెట్టి అభ్యర్ధులను నిలబెట్టిందని మాజీ అన్నా బృందం సభ్యుడు ప్రశాంత్ భూషణ్ బహిరంగంగా పత్రికలకు ఎక్కవలసిన పరిస్ధితి! అంబేద్కర్ 125వ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ గా జరిపేందుకు కాంగ్రెస్, బి.జె.పి లు శాయశక్తుల ఎలా కృషి చేస్తున్నాయో మొన్నటి ది హిందు సంపాదకీయం “Admiration…