రోహిత్: అబ్బే మేము తాకనిదే! -కార్టూన్

రోహిత్ వేముల ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని బాధ్యులైన వారంతా వివిధ మాటల్లో ప్రకటించారు. “ఇది దళిత-దళితేతర సమస్య” కాదు అనీ “శిక్షించిన కమిటీ నేత దళిత ప్రొఫెసరే” అనీ  ప్రకటిస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రి దూరం జరిగారు. “ఐదు రిమైండర్ లు రాయడం మామూలే. ఒత్తిడి కాదు” అని కూడా ఆమె నిరాకరించారు. “ఇది నేను తీసుకున్న చర్య కాదు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నది” అంటూ వైస్ ఛాన్సలర్ అప్పారావు గారు నిరాకరణ…

ఫ్రీ డేటా కోసం ఫేస్ బుక్ విసిరిన గేలం ‘ఫ్రీ బేసిక్స్’ -కార్టూన్

ఫేస్ బుక్ వ్యవస్ధాపకుడు మార్క్ జూకర్ బర్గ్ పేరు ఈ మధ్య ఇండియాలో తరచుగా వినిపిస్తోంది. భారత దేశంలోని పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’ ఇందుకు ప్రధాన కారణం. Free Basics పేరుతో ఫేస్ బుక్ కంపెనీ అందుబాటులో ఉంచుతున్న వేదిక ద్వారా పేద ప్రజలు సైతం ఉచితంగా ఇంటర్నెట్ సేవలను, విద్య-వైద్య-ప్రయాణ-ఉపాధి-ఆరోగ్య-వార్తా సేవలను పొందవచ్చని ఫేస్ బుక్ ఊరిస్తోంది. ఫ్రీ బేసిక్స్ గురించి ఇండియాలో ప్రచారం చేయడం కోసం…

నిజాయితీ గల ‘మౌత్ పీస్’ -కార్టూన్

“నిజాయితీ మౌత్ పీస్ లు ఇంకా ఎవరన్నా ఉన్నారా?” — కాంగ్రెస్ పార్టీ ముంబై విభాగం ‘కాంగ్రెస్ దర్శన్’ పేరుతో ఒక పత్రిక నడుపుతుంది. ఈ పత్రిక ఇటీవల కాశ్మీర్ పట్ల నెహ్రూ విధానాన్ని విమర్శిస్తూ ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఆ ఆర్టికల్ ఎవరు రాశారో పేరు వేయలేదు. అప్పటి హోమ్ మంత్రి వల్లబ్ భాయ్ పటేల్ సలహాలను పెడ చెవిన పెట్టి అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ సమస్యపై ఐక్య రాజ్య…

కొత్త పార్లమెంటు… స్వేచ్ఛగా కొట్లాడ్డానికి! -కార్టూన్

“నిజమే సుమా. ఇప్పుడు మరీ ఇరుకై పోయింది -ముఖ్యంగా వెల్ ఆఫ్ ద హౌస్ లో…” ____________________________ పార్లమెంటు కోసం కొత్త భవనం కావాలని స్పీకర్ కోరారు. ************ పార్లమెంటు కార్యకలాపాల కోసం కొత్త భవనం కావాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు ఆమె రెండు ఆప్షన్ లను ప్రభుత్వం ముందు పెడుతూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారికి లేఖ కూడా రాశారు. ఇపుడున్న పార్లమెంటు కాంప్లెక్స్…

నేషనల్ హెరాల్డ్ కధా కమామీషు!

‘నేషనల్ హెరాల్డ్’ పేరుతో పార్లమెంటులో ఓ వింత నాటకం ప్రదర్శితం అవుతోంది. నిజానికి పార్లమెంటులో ఇలాంటి వింత నాటకాల ప్రదర్శన కొత్తేమీ కాదు. ఈ నాటకాలు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడేట్లు చూడడంలో పాలకులు, ప్రతిపక్షాలు చూపించే ప్రతిభా సంపత్తులే ఆసక్తికరంగా ఉంటుంటాయి. నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని నేరుగా అవినీతి చర్చలోకి లాగిన రెండో ఉదంతం నేషనల్ హెరాల్డ్! మొదటి ఉదంతం బోఫోర్స్ అవినీతి ఆరోపణలని ప్రత్యేకంగా గుర్తు చేయనవసరం లేదు. విశేషం ఏమిటంటే బోఫోర్స్ అవినీతి కాంగ్రెస్ పార్టీ…

లాతుఫ్ కార్టూన్ లపై టర్కీ నిషేధం

పాత టర్కీ ఒట్టోమాన్ సామ్రాజ్యం తరహాలో మధ్య ప్రాచ్యంలో సరికొత్త టర్కీ సామ్రాజ్యాన్ని స్ధాపించాలని కలలు గంటున్న టర్కీ ప్రధాని రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, అంతకంతకూ ఫాసిస్టు రూపం ధరిస్తున్నాడు. సిరియా విచ్ఛిన్నానికి కుట్రలు పన్నిన పశ్చిమ సామ్రాజ్యవాదుల వ్యూహాల్లో తురుపు ముక్కగా మారి అత్యంత విద్రోహకర, ప్రగతి నిరోధక పాత్ర పోషిస్తున్న క్రమంలో ఎర్డోగన్ టర్కీ ప్రజల ప్రాధమిక హక్కులను ఒక్కొక్కటిగా హరించి వేస్తున్నాడు. వేలాది ప్రతిపక్ష నేతలతో పాటు వారి మద్దతుదారులను కూడా జైళ్ళలో…

చెన్నై: వాన గ్రహణం -కార్టూన్

“కార్టూన్ పొలికేక వేసినట్లు ఉండకూడదు. రణగొణ ధ్వనులతో అస్పష్టంగా కూడా ఉండకూడదు. నిశ్శబ్దంగా, సూటిగా, స్పష్టంగా ఉండాలి” అని ది హిందూ కార్టూనిస్టు కేశవ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే కేశవ్ కార్టూన్స్ లో పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు ఉండవు. పొడవైన డైలాగ్స్ చాలా చాలా తక్కువ కనిపిస్తాయి. ఒక హెడ్డింగ్, ఒక శీర్షిక, ఒక సామెత, ఒక వాడుక, ఒక సార్వజనీన వాస్తవం… ఇవి మాత్రమే కనిపిస్తాయి. కాకుంటే చెన్నైను కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన…

అరుణుడి పరిణామంబెట్టిదనిన…! -కార్టూన్

అరుణుడు అంటే అంగారకుడు కాదు. మన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గారు! పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటివరకూ బి.జె.పి ప్రభుత్వ నేతల ప్రకటనల పరిణామాన్ని గమనించినట్లయితే వారు ఒక్కో మెట్టూ దిగుతూ రావడం మనకు కనిపిస్తుంది. లోక్ సభ ఎన్నికలు ముగిసి ఫలితం వచ్చాక బి.జె.పి నేతల ఆర్భాటపు ప్రకటనలు, ‘ఇక చూస్కోండి’ అన్నట్లుగా వారు మైకుల ముందు ప్రదర్శించిన భంగిమలు… ఆ తీరే వేరు. అదో ఊర్ధ్వ లోకం! ఢిల్లీ అసెంబ్లీ…

ఎక్కడ అసహనం, ఆయ్?

అసహనమా? ఏదీ చూపించు… చూపించు ఎక్కడో? ************ అమీర్ ఖాన్ అలా మాట్లాడుతున్నాడంటేనే భారత దేశం ఎంత సహన దేశమో చెప్పడానికి ఒక రుజువు అని హిందూత్వ అభిమాన గణం గొప్పలు పోతోంది. కానీ అమీర్ ఖాన్ మాటల్ని ‘ఎవరో ప్రభావంలో ఉండి మాట్లాటలు’ అనీ, ‘అయితే ఏ దేశం వెళ్తావో అదీ చెప్పు!’ అనీ ‘పాకిస్తాన్ వెళ్లిపో, ఫో!’ అనీ, ‘దేశాన్ని కించపరుస్తావా?’ అనీ, ‘నీసలు దేశభక్తి ఉందా?’ అనీ, ‘ఎన్ని అవమానాలు భరించినా అంబేద్కర్…

నువ్వు పులివి, పులిలా పరుగెత్తు! -కార్టూన్

ప్రధాని మోడి: నూవ్వింకా వేగంగా పరుగెత్తాల్సి ఉంది. వాళ్లందరికీ నేను నువ్వు పులివి అని చెప్పి వస్తిని… ****************** సింగపూర్ లో భారత ప్రధాని చేసిన ప్రసంగం వింటే నోటిపై వేలు వేసుకోకుండా ఉండలేము. ఆయన తన మాటల మాయాజాలంతో ఆకాశంలో విహరింపజేస్తూ చెప్పింది ఏ ఇండియా గురించో అర్ధంకాక తలలు పట్టుకోకుండా ఉండలేము. తాము అధికారం చేపట్టిన 18 నెలలు గడిచాయో లేదో అప్పుడే భారత దేశం వెనకడుగు మానుకుని చుక్కల్లోకి దూసుకు పోతోందట! “ప్రపంచం…

వ్యాపం దర్యాప్తు ముగుస్తోందిట! -కార్టూన్

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్: దర్యాప్తు ఇక ముగింపుకు వస్తోంది! ****************** ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’ అన్నది మధ్య ప్రదేశ్ లో వివిధ కోర్సులకు, ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో ఎం.పి.పి.ఇ.బి గా దీన్ని పిలుస్తారు. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ, టీచింగ్, పోలీస్ తదితర కోర్సులు, ఉద్యోగాల అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని. ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు…

‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్

చూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కార్టూన్ లో లోతైన అర్ధం దాగి ఉంది. ప్రధాన మంత్రి పదవి లాంటి ముళ్ళ కుర్చీని యోగాసనాల సహాయంతో నరేంద్ర మోడి అవలీలగా నిర్వహిస్తున్నారని ఈ కార్టూన్ చెబుతున్నట్లు మొదటి చూపులో అనిపిస్తుంది. కానీ ‘డెవిల్ ఇన్ ద డీటైల్స్’ అన్నట్లుగా కార్టూన్ అంతరార్ధం అంతా ఆ నాలుగు పదాల కార్టూన్ వ్యాఖ్యానంలో దాగి ఉంది. ఆ నాలుగు పదాల వ్యాఖ్య: THE YOGA OF POLITICS: ఏమిటి ఈ వ్యాఖ్య…

రాజే: అసెంబ్లీ క్లీన్ చిట్ అక్కరకు వచ్చేనా! -కార్టూన్

  ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది. లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి…

క్రికెట్: బడా బాబుల కేకు పంపకం -కార్టూన్

  ఐదు రోజుల టెస్ట్ క్రికెట్ నుండి ఒక్క పూటలో ముగిసిపోయే టి20 మ్యాచ్ ల వరకు క్రికెట్ ఆట ప్రయాణించింది. ఈ ప్రయాణంలో ఆట గమ్యం ఏమిటన్నది చూస్తే జనుల మానసికోల్లాసం కాకుండా డబ్బు సంపాదనే అని స్పష్టం అవుతుంది. ఏ ఆట అయినా మనిషి యొక్క శారీరక, మానసిక, మేధో శక్తులను మెరుగుపరచడానికి, దైనందిన జీవనం నుండి కాసింత బైటపడి సేద తీరడానికీ, ఆరోగ్యం పెంపొందించడానికి పుట్టినదే. కానీ సమాజం డబ్బు జబ్బుతో బాధపడడం…

ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్

ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం లాగానే ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం కూడా భారత దేశంలోని వివిధ కళా, సాంస్కృతిక, విద్యా వ్యవస్ధలను కాషాయీకరించే పనిలో పడిపోయింది. చరిత్ర రచనా పద్ధతి (historiography) లోకి జొరబడి భారత దేశ చరిత్రకు సొంత అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఐ.సి.హెచ్.ఆర్ డైరెక్టర్ నియామకాన్ని చేసిన కేంద్రం తాజాగా పూనె లోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కి కూడా అర్హతలు లేని బి.జె.పి నేతను నియమించిన విమర్శలను ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో పూనే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్…