మన్మోహన్ కి కోరలు మొలిచాయి! -కార్టూన్
ఎప్పుడో తప్ప మాటలు పెగలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి కొత్తగా ఉన్నట్లుంది కోరలు మొలిచాయని పత్రికలు గుసగుసలు పోతున్నాయి. ఇటలీ మెరైన్లు ఇండియాకు తిరిగి రాబోరని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ప్రధాన మంత్రి ఉభయ సభల్లో కాస్త గట్టిగా మాట్లాడడం ఈ గుసగుసలకు కారణం. ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి ఇటలీ నౌకపై ఉన్న మెరైన్లు కాల్చి చంపడంతో వారిని అరెస్టు చేసి సుప్రీం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.…









