మన్మోహన్ కి కోరలు మొలిచాయి! -కార్టూన్

ఎప్పుడో తప్ప మాటలు పెగలని ప్రధాని మన్మోహన్ సింగ్ కి కొత్తగా ఉన్నట్లుంది కోరలు మొలిచాయని పత్రికలు గుసగుసలు పోతున్నాయి. ఇటలీ మెరైన్లు ఇండియాకు తిరిగి రాబోరని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ప్రధాన మంత్రి ఉభయ సభల్లో కాస్త గట్టిగా మాట్లాడడం ఈ గుసగుసలకు కారణం. ఇద్దరు కేరళ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి ఇటలీ నౌకపై ఉన్న మెరైన్లు కాల్చి చంపడంతో వారిని అరెస్టు చేసి సుప్రీం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.…

మోడి ప్రసంగం కేన్’సెల్’ -కార్టూన్

‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘, మోడి ప్రసంగం రద్దు చేయడం వలన ఎవరికి మేలు జరిగినట్లు? మార్చి 22-23 తారీఖుల్లో ఫిలడెల్ఫియా లో జరగనున్న ఫోరం సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని నరేంద్ర మోడిని ‘వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరం‘ ఆహ్వానించింది. కానీ ‘యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా‘ లోని కొందరు విద్యార్ధులు, బోధన సిబ్బంది మోడికి ఆహ్వానం పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002లో ముస్లిం ప్రజలపై జరిగిన అమానుష హత్యాకాండ దరిమిలా అమెరికా ప్రభుత్వమే మోడీకి…

యజమాని గర్వం, పొరుగువాని అసూయ -కార్టూన్

– ‘Owner’s pride, neighbor’s envy.’ ఒనిడా టి.వి ప్రవేశపెట్టిన ఈ నినాదం దాదాపు సామెతగా మారిపోయింది. రాజకీయ, సామాజిక పరిస్ధితుల గురించి మాట్లాడుకునే సందర్భాల్లో కూడా ఇది సామెతగా చొరబడిందంటే అతిశయోక్తి కాదేమో! యు.పి.ఎ-2 ప్రభుత్వ పాలనలో వెల్లివిరుస్తున్న కుంభకోణాల జాతరను ప్రతిపక్ష పాలక వర్గాలు అసూయతో ఎలా వీక్షిస్తున్నదీ ‘ది హిందు’ కార్టూనిస్టు సురేంద్ర ఈ ‘సామెత కానీ సామెత’ ద్వారా ఈ కార్టూన్ లో చక్కగా వివరించారు. బోఫోర్స్ కుంభకోణం దేశ రాజకీయాలను…

కై పొ చె! కాంగ్రెస్, బి.జె.పి ల గాలిపటాలాట -కార్టూన్

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నాయకులతో పాటు పత్రికల కేంద్రీకరణ అటు మళ్లడం సహజమే. రాజకీయ నాయకులే తమ ఏర్పాట్లతో పత్రికలను ఆకర్షిస్తారా లేక పత్రికలే రాజకీయ నాయకులను రెచ్చగొట్టి వార్తలు సృష్టిస్తాయా అన్నది చెప్పడం ఒకింత కష్టమే అయినా, ఒకరికొకరు సహకరించుకోవడం మాత్రం ఒక వాస్తవం. ప్రధాన మంత్రి పదవికి పోటీదారుగా ఎవరిని ప్రకటించాలి అన్న విషయమై బి.జె.పి, కాంగ్రెస్ పార్టీలలో సాగుతున్న అంతర్గత మరియు బహిరంగ ఉత్సుకత లేదా ఉద్రిక్తతల వ్యక్తీకరణలు వివిధ రూపాల్లో…

ఈ తుఫాను గాలులు ఎక్కడివి? -కార్టూన్

“ఈ విప్లవాగ్నులు ఎచటివి అని అడిగితే నగ్జల్బరి వసంత మేఘ గర్జనవైపు వేలు చూపండి” ప్రముఖ విప్లవ కవి చెరబండరాజు రాసిన ఒక కవితలోని పాదాలివి. ఒక కాలంలో కాలేజీలు, యూనివర్శిటీలను ఒక్క ఊపు ఊపి బహుళ ప్రసిద్ధి చెందిన పాదాలివి. భారత ప్రజలు మార్పుని కోరుకుంటున్నారు అన్న నిజానికి సంకేతంగా 1960ల చివర్లో పశ్చిమ బెంగాల్ లో నగ్జల్బరి గ్రామంలో పుట్టిన రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రస్తావిస్తూ చెరబండరాజు ఈ మాటలు రాశాడు. నగ్జల్బరిలో వసంత…

‘వన్ డే’ లనుండి సచిన్ రిటైర్మెంట్, ఒక పరిశీలన -కార్టూన్

(కార్టూన్: ది హిందూ నుండి) – 50 ఓవర్ల పరిమిత క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా విరమించుకుంటున్నట్లు భారతీయుల ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో ఆయన 50 సెంచరీలు పూర్తి చేసుకోవాలన్న అభిమానుల కోరిక నెరవేరకుండానే వన్ డే ఆట నుండి తప్పుకుంటున్నట్లు సచిన్ ప్రకటించడం అభిమానులకు ఒకింత నిరాశ కలిగించినా శ్రేయోభిలాషులైన క్రికెట్ పెద్దలు అభినందనలు తెలియజేశారు. భారతదేశ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించాక సచిన్…

బాల్ ధాకరే అస్తమయం -కార్టూన్

బహుశా, ఈ కార్టూన్ కి ప్రత్యేక వివరణ అవసరం లేదేమో. స్వయంగా కార్టూనిస్టు అయిన బాల్ ధాకరేకు మరో ప్రఖ్యాత కార్టూనిస్టు కేశవ్ (ది హిందూ) ఇచ్చిన నివాళి ఇది.     –

కాగ్ ని బలహీనపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం? -కార్టూన్

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG – కాగ్) రాజ్యాంగ బద్ధ సంస్ధ. ఎకౌంటింగ్ లెక్కలతో పాటు ప్రభుత్వ విధానాల ఫలితాలను కూడా ఆడిట్ చేసే హక్కు (దీనినే పెర్ఫార్మెన్స్ ఆడిట్ అని పిలుస్తున్నారు) కూడా కాగ్ కి ఉంది. గత రెండు మూడేళ్లుగా కోర్టులతో పాటు కాగ్ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. దానితో ప్రభుత్వాలు నడుపుతున్న పెద్దల అవినీతి ఘనకార్యాలు పచ్చిగా వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తుల అవినీతితో పాటు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల అసలు స్వరూపం కూడా…

యెడ్యూరప్ప కొత్త పార్టీకి బి.జె.పి ఆక్సిజన్ -కార్టూన్

అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన కర్ణాటక బి.జె.పి నాయకుడు యెడ్యూరప్ప కొత్త ప్రాంతీయ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు యెడ్యూరప్ప ప్రకటించినప్పటికీ ఆయనను బహిష్కరించలేని పరిస్ధితి బి.జె.పిది. బి.జె.పి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదని యెడ్యూరప్ప ప్రకటించినందుకే బి.జె.పి ఆయన పట్ల కృతజ్ఞతతో పడి ఉంటోంది. అలా కాదని ధైర్యం చేసి బెహిష్కరిస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. దానితో యెడ్యూరప్ప పార్టీలో ఉంటూనే కొత్త పార్టీ పనులను చక్కబెట్టుకునే అపూర్వ అవకాశం యెడ్యూరప్పకి…

‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ దిశ ఎటు? -కార్టూన్

అన్నా హాజరే, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల నేతృత్వంలో దాదాపు సంవత్సరం క్రితం అట్టహాసంగా ప్రారంభమయిన ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ఇపుడు క్రియాశీలక మద్దతుదారులు లేక మూలపడింది. నాయకత్వం చెరోదారి పట్టడంతో ఐ.ఎ.సి కి ఇపుడు దిశ లేకుండా పోయింది. దారులు చీలినప్పటికీ ఒకేవైపుకి ప్రయాణం కొనసాగితే లక్ష్యం వద్దనయినా కలుసుకోవచ్చు. చివరి పోరాటంలోనైనా భుజం భుజం కలపొచ్చు. ‘మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే’ అని చీలిక సమయంలో ప్రకటించిన ఇరు వర్గాలు ఇపుడా స్ఫూర్తిని ప్రదర్శించడం లేదు.…

నితిన్ గడ్కారీ భవితవ్యం ఎటు వైపు? -కార్టూన్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ భవితవ్యం డోలాయమానంలో పడినట్లు కనిపిస్తోంది. వరుసగా రెండోసారి కూడా బి.జె.పి అధ్యక్షుడుగా ఎన్నిక కావాలని కోరుకుంటున్న గడ్కారీ ఆశలకు సాక్ష్యాత్తూ ఎల్.కె.అద్వానీ నుండే ప్రతిఘటన ఎదురవుతోంది. కొద్ది నెలల క్రితం ముంబైలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడి సహాయంతో రెండో పదవీకాలానికి అనుమతిని గడ్కారీ సంపాదించినప్పటికీ ఆ నిర్ణయం జాతీయ మహాసభలో ఆమోదం పొందవలసి ఉంది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అద్వానీ ముంబైలోనే అలకపాన్పు ఎక్కాడు.…

మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్

రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ…

రాహుల్ గాంధీ ఎందుకు కేంద్ర మంత్రి కాలేడు? -కార్టూన్

రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రివర్గంలో స్ధానం ఇవ్వాలనీ, ఆయనకి ప్రభుత్వంలో కూడా నాయకత్వ పదవి అప్పజెప్పాలనీ కాంగ్రెస్ లో అనేకమంది చాలా కాలంగా శతపోరుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉన్నప్పుడల్లా ఈసారి రాహుల్ కి సముచిత పదవి తధ్యమని కాంగ్రెస్ పెద్దలతో పాటు, పత్రికలు కూడా ఊహాగానాలు చేయడం ఒక రొటీన్ గా ఉంటూ వచ్చింది. 22 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తాజా విస్తరణలో కూడా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో స్ధానం పొందలేదు. ఎప్పటికప్పుడు…

బియ్యం బదులు తూకం రాళ్ళు మింగించేదే ‘నగదు బదిలీ పధకం’ -కార్టూన్

నగదు బదిలీ పధకం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా ఊదగరగొడుతూ వచ్చాయి. ఈ పధకాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కూడా ప్రకటించాడు. పేదలకు సబ్సిడీ ధరలకు సరుకులను అందించే బదులు సదరు సబ్సిడీని నగదు రూపంలో నేరుగా పేదల ఖాతాల్లోకి తరలించడమే ఈ పధకం లక్ష్యం. అంటే గ్యాస్ సిలిండర్, బియ్యం, రేషన్ సరుకులు తదితర సరుకలకీ ఇచ్చే సబ్సిడీని ఆయా సరుకులు కొనే సమయంలో ఇవ్వకుండా, సదరు…

అవినీతిని వదిలి ప్రజాస్వామిక చట్టాలపై ప్రధాని పోరాటం -కార్టూన్

ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రకటనలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అవినీతి నిర్మూలనకి చట్టం తెమ్మంటే అలా అడిగినవాడికి అవినీతిని అంటగడతారు. లోక్ పాల్ చట్టం తెమ్మంటే ప్రభుత్వాన్ని ప్రవేటు సంస్ధలు బ్లాక్ మెయిల్ చేయడాన్ని సహించనంటూ లక్షలాది కోట్ల అవినీతిపై పల్లెత్తు మాట మాట్లాడడు. పాలకుల, కంపెనీల అవినీతిని కొద్దో గొప్పో వెల్లడిస్తున్న సమాచార హక్కు చట్టం వల్ల ప్రవేటు వ్యక్తుల ప్రైవసీ హక్కులకి భంగం కనుక సవరిస్తానని హుంకరిస్తున్నాడు. సమాచార…