ర్రయ్… ర్రయ్… యు.పి.ఎ-2 పయనం ఎందాక? -కార్టూన్

చిన్న పిల్లలకి వాహనాలను స్వయంగా నడపాలన్న కోరిక బుర్రని తొలుస్తూ ఉంటుంది. కానీ పెద్దవారి భయం వారిని వెనక్కి లాగుతుంటుంది. వాహనాలు ఉన్న ఇంట్లో అయితే స్టీరింగ్ ముందు కూర్చుని దాన్ని తిప్పుతూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుకుంటారు. వాహనాలు లేనివారయితే ఉత్త చేతుల్ని స్టీరింగ్ పట్టుకున్నట్లు గాలిలో ఉంచి స్టీరింగ్ ని తిప్పుతున్నట్లు చేతులు ఆడిస్తూ ‘ర్రయ్… ర్రయ్…’ అని ఆడుతుంటారు. తాడు రెండు కొసల్ని ముడివేసి మధ్యలో నలుగురైదుగురు చేరి ‘బస్సమ్మ బస్సు…’ అంటూ…

సి.బి.ఐ దయనీయ స్ధితి -కార్టూన్

“రాజకీయ నాయకుల నుండి సి.బి.ఐ ని విముక్తం చేయడం మా తక్షణ కర్తవ్యం” అని సుప్రీం కోర్టు నిన్న సి.బి.ఐకి తలంటుతూ వ్యాఖ్యానించింది. “రాజకీయ నాయకుల ఆదేశాలు పాటించవలసిన అవసరం మీకు లేదు” అని సుప్రీం బెంచి చెప్పాక “ఇక నుండి బుద్ధిగా నడుచుకుంటాం. బొగ్గు కుంభకోణం విచారణ పురోగతి నివేదికలన్నీ నేరుగా మీకే చూపుతాం. ప్రభుత్వానికి చూపించం” అని తలూపి కోర్టు బైటికి వచ్చిన సి.బి.ఐ అధిపతి కోర్టు ఆవరణలోనే మాట మార్చేశారు. “సి.బి.ఐ స్వతంత్ర…

కర్ణాటక ఎన్నికలు: బి.జె.పి విచిత్ర పోరాటం

మాకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీయేనని కర్ణాటక బి.జె.పి ప్రకటిస్తోంది. తమ నుండి చీలి ‘కర్ణాటక జనతా పార్టీ’ పేరుతో వేరు కుంపటి పెట్టిన యెడ్యూరప్ప ప్రభావాన్ని ఆ విధంగా తక్కువ చేసి చూపాలని బి.జె.పి ప్రయత్నం. బి.జె.పి పాలనలో నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ జనతాదళ్ (సెక్యులర్) అని కనుక తామే బి.జె.పి కి ప్రధాన పోటీ అని జె.డి(ఎస్) ప్రకటిస్తోంది. ఆ పార్టీకి ప్రత్యేకంగా పోరాటం చేయాల్సిన పని లేదని దాని ఓటు…

మన్మోహన్ ఫైలుకి పరిష్కారం లేదు -కార్టూన్

ది హిందు పత్రికలో కేశవ్ కార్టూన్లు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఒక్కోసారి కేశవ్ కవి కాబోయి కార్టూనిస్టు అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కార్టూన్లకు కవిత్వానికి ఉన్నంత లోతు ఉంటుంది. ఆ లోతు ఒక్కోసారి చాలామందికి అందదు. (నాక్కూడా.) ఈ కార్టూన్ అందులో ఒకటిగా కనిపిస్తోంది. ‘మిస్టర్ క్లీన్’గా ఒకప్పుడు మన్ననలు అందుకున్న మన్మోహన్ సింగ్ ఇప్పుడు అవినీతి రాజుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మన్మోహన్ కి ఆపాదిస్తున్న అవినీతి ద్వారా ఆయన స్వయంగా లబ్ది పొందకపోవడమే…

తాటిచెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకు అన్నాట్ట! -కార్టూన్

“అబ్బే ఏ దారిలో వెళ్లాలో తెలుసుకోడానికి ఇక్కడకు వచ్చారంతే!” – బొగ్గు కుంభకోణం నుండి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను, ఆయనతో పాటు కాంగ్రెస్ (యు.పి.ఏ) ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతలు పిల్లి మొగ్గలు అన్నీ ఇన్నీ కాదు. బొగ్గు కుంభకోణం పైన విచారణ జరుపుతున్న సి.బి.ఐ సుప్రీం కోర్టుకు దశలవారీగా స్ధాయి నివేదికలను (status reports) సమర్పిస్తోంది. మార్చి నెలలో నివేదికను కోర్టుకు సమర్పించడానికి ముందు న్యాయ శాఖ మంత్రి అశ్వని కుమార్…

చిట్ ఫండ్ మోసానికి మమత పొగాకు పరిష్కారం -కార్టూన్

జనం బాధలంటే రాజకీయ నాయకులకు ఎంత చులకనో! ప్రజల కష్టాలకు వారు ఎదుర్కొంటున్న మోసాలకు సానుభూతి పలుకుతూనే వారి పరిస్ధితి పైన కుళ్ళు జోకులు వేయడం నాయకులకు తేలికైన విషయం. తాజాగా మమతా బెనర్జీ కూడా ఇలాంటివారి జాబితాలో చేరిపోయారు. పశ్చిమ బెంగాల్ లో శారదా చిట్ ఫండ్స్ సంస్ధ బోర్డు తిప్పేయడంతో లక్షలాది జనం దాచుకున్న సొమ్ము కోల్పోయి గొల్లుమంటున్నారు. మోసపోయిన వారి కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి…

ప్రధానికి సోనియా అభయ హస్తం -కార్టూన్

“ఏమీ పట్టించుకోవద్దు, అలా వెళ్తూనే ఉండండి!” – 2జి కుంభకోణంలో తన పాత్రపై మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా చేసిన ఆరోపణలకు బదులివ్వాలని ప్రతిపక్షాలు అరిచి గీపెడుతున్నా ప్రధాన మంత్రి నోరు విప్పడం లేదు. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సిన్హా ముచ్చటగా మూడోసారి ఈ విషయమై ప్రధానికి లేఖ రాశారు. ‘మీ మౌనం మీ దోషిత్వాన్ని ఎత్తి చూపుతోంది’ అని ఆయన ఘాటుగా లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు మౌనం వహించడం, విదేశీ కంపెనీలకు దోచి…

2జి కుంభకోణం: సున్నం కొట్టుడు విజయవంతం! -కార్టూన్

2జి కుంభకోణానికి కాంగ్రెస్ తలపెట్టిన ‘సున్నం కొట్టుడు’ కార్యక్రమం పూర్తయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఏ-2 ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (సం.పా.సం – జాయింట్ పార్లమెంటరీ కమిటీ -జె.పి.సి) ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పేమీ లేదని, పాపం అంతా అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా దేనని ముక్తాయించిన సం.పా.సం నివేదిక ఊహించని విధంగా మాజీ ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి ని నివేదికలో…

దాహం వేసినప్పుడు బావి తవ్వుకుందాం! -కార్టూన్

“ఏయ్! ఆ పోలీసు సంస్కరణల పుస్తకాలు పట్రండి… ఇప్పుడే!” – ప్రభుత్వము, పోలీసులు అనేక అంశాల్లో దాహం వేసినప్పుడు బావి తవ్వుకునే ధోరణి అనుసరించడం అందరూ ఎరిగినదే. మహిళలపై అత్యాచారాలు జరిగిన సందర్భం వచ్చినప్పుడల్లా పోలీసు సంస్కరణల గురించి మంత్రులు, రాజకీయ నాయకులు, చివరికి పోలీసు అధికారులు సైతం అనేక మాటలు, వాగ్దానాలు కురిపించడం సర్వసాధారణంగా మారింది. దుర్ఘటన జరిగినపుడు పోలీసులు తగిన రీతిలో స్పందించకపోవడం పోలీసుల తీరుతో ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడం ప్రభుత్వము,…

పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

పర్వేజ్ ముషర్రాఫ్: నేరుగా మొసలి బోనులోకే లాండింగ్ -కార్టూన్

తన దేశ ప్రజలకోసం సరికొత్త ఐడియాలతో తిరిగొచ్చానని నమ్మబలికిన పాకిస్ధాన్ మాజీ నియంత పర్వేజ్ ముషర్రాఫ్ నేరుగా మొసలి బోనులోకి ల్యాండ్ అయ్యాడు. సాధారణంగా పాకిస్ధాన్ లో మిలట్రీ పాలకులు, కోర్టులు ఒకే పక్షం వహిస్తాయి. ఎక్కడ బెసికిందో గాని ముషర్రాఫ్ ని వెంటనే అరెస్టు చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు అరెస్టు చేసేలోపు మిలట్రీ అందజేసిన అంగరక్షకుల సహాయంతో పోలీసుల కళ్ళు గప్పి ఆయన పారిపోగలిగాడు. ఆయన పారిపోలేదని…

మైనస్ జె.డి(యు), మోడి ఇమేజ్ భారం బి.జె.పి ఆపగలదా? -కార్టూన్

బి.జె.పి లో నరేంద్ర మోడి అనుకూల ప్రచారం ఇతర నాయకులకు అలవి కానంతగా పెరిగింది. మోడి తప్ప దేశానికి దిక్కు లేదని దేశ ప్రజలకు నచ్చజెప్పడానికి ఆయన పార్టీ మద్దతుదారులు, అభిమానులు చెవినిల్లు కట్టి పోరుతున్నారు. మోడీకి ముందే జరిగిన గుజరాత్ అభివృద్ధిని కూడా మోడి చలవే అని తాము నమ్మి ఇతరులను కూడా నమ్మమంటున్నారు. మోడి ప్రధాని అయితే మంత్రి పదవులు దక్కుతాయన్న అసవల్లనే యేమో గాని బి.జె.పిలో ఆరెస్సెస్సేతర నాయకులైన యశ్వంత్ సిన్హా లాంటివారు…

మోడిని ఎంత విమర్శిస్తే అంత బలం -కార్టూన్

గుజరాత్ లోపల మోడి వాలి టైపు. వాలికి ఎదురు నిలబడి పోరాడినవాడి నుండి సగం బలం వాలికి వచ్చి చేరుతుందట! దానితో శ్రీరాముల వారు సైతం చెట్టు చాటున నిలబడి దొంగ దెబ్బ తీయక తప్పలేదు. మోడి విషయం కూడా అంతే. ఆయనను ఎంత విమర్శిస్తే మోడీకి అంత బలం. మోడిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మోడీకి ఇంకా బలం. గత మూడు ఎన్నికల్లో అదే జరిగింది. తనపైన ప్రత్యర్ధులు విరుచుకుపడినప్పుడల్లా దానిని ‘గుజరాత్ ఆత్మాభిమానం’ కింద మలుచుకుని…

ఏ రాయయితేనేం… పళ్లూడగొట్టుకోడానికి? -కార్టూన్

రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలి? ప్రజలను ఎటువంటి వివక్ష లేకుండా పాలన చేయడం అటుంచి వారి మానాన వారిని బతకనిచ్చే పార్టీలు ఇండియాలో ఏమున్నాయని? వనరులన్నీ విదేశీ కంపెనీలు తరలించుకుపోతున్నా నోరు మూసుకున్నందుకు కాళ్ళ కింద భూమిని కూడా ఇప్పుడు లాక్కుపోతున్నారు. ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోయినా చిల్లర కొట్టు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకుంటే దాన్ని తీసుకుపోయి వాల్ మార్ట్ కి అప్పజెపుతున్నారు. ఇన్ని చేసినా సహించి ఊరుకుంటే నువ్వు ముస్లింవి కనుక చంపుతాను అని ఒకరోస్తే,…

మమత ఒంటరితనం స్వయంకృతం! -కార్టూన్

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉపయోగించడం భారత పాలకుల నైజం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇందులో నాలుగాకులు ఎక్కువే చదివింది. ఎన్నికల నాటి ప్రమాణాలను సంవత్సరం లోపే పూర్తి చేసేశానని ప్రకటించిన మమత ‘వాగ్దానాలను అమలు  చేయండి’ అని అడిగిన ఒక సాధారణ రైతు పైన మావోయిస్టు అని ముద్ర వేసి అరెస్టు చేయించింది. తద్వారా మావోయిస్టులు రైతుల కోసం పని చేస్తున్నారని చెప్పకనే చెప్పింది. మహిళల హక్కులు, ప్రజల ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నాయని ఒక…