వెళ్ళి ఫైళ్ళు తవ్వుకు రండి, ఫోండి! -కార్టూన్

దాదాపు 80,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వికారమైన మలుపు తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కుంభకోణాన్ని విచారిస్తున్న సి.బి.ఐకి అవసరమైన ఫైళ్ళు బొగ్గు శాఖ ఇవ్వనే లేదు. ఈ విషయాన్ని సి.బి.ఐ కోర్టుకి ఫిర్యాదు చేస్తే కోర్టు తీసిన ఆరాలో ప్రభుత్వంగా చల్లగా చెప్పిన సంగతి ఏమిటంటే సంబంధిత ఫైళ్ళు కనపడడం లేదట. ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ విషయంపైన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఈ అఫిడవిట్ సమర్పించగా అందులో…

యూరో జోన్ ఆర్ధిక వ్యవస్ధ పైకి తేలిందా? -కార్టూన్

యూరోజోన్ ఎక్స్ ప్రెస్: గాస్ప్! (ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం) పీతలు: “పాపం! వాళ్లింకా ఒడ్డున పడనేలేదు” – ఐరోపా ఖండంలోని 28 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ (ఇ.యు) గా ఏర్పడగా అందులోని 17 దేశాలను యూరో జోన్ అని పిలుస్తారు. ఈ 17 దేశాలు తమ తమ జాతీయ కరెన్సీలను వదిలేసుకుని ఒకే కరెన్సీ ‘యూరో’ ఏర్పాటు చేసుకున్నాయి. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) తప్ప మిగిలిన ప్రధాన దేశాలన్నీ యూరోజోన్ సభ్య దేశాలే.…

రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!” – “రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు…

సరిహద్దులో పాక్ దాగుడుమూతలు! -కార్టూన్

సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే…

ఎక్కడున్నావే గొంగళీ అంటే… -కార్టూన్

అద్భుతమైన కార్టూన్ ఇది! మన్మోహన్ సింగ్ అనుసరించిన నూతన ఆర్ధిక విధానాల డొల్లతనాన్ని ఈ కార్టూన్ శక్తివంతంగా వివరిస్తోంది. డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప మరో దారి లేదని చెప్పి డబ్ల్యూ.టి.ఓ ఉరుగ్వే రౌండ్ చర్చలను భారత దేశ ప్రజల నెత్తిన ‘నూతన ఆర్ధిక విధానాలు’గా రుద్దిన మన్మోహన్ తిరిగి బయలుదేరిన చోటికే చేరడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ఆ విధానాల తీరే అంత. ఏ విధానాలైనా ప్రజల కొనుగోలు శక్తిని స్ధిరంగా పెంచగలిగితేనే కంపెనీలకి లాభాలూ,…

ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్

ఏం జరుగుతుందో తెలియడానికి ఇంతకు మించి వివరంగా బహుశా ఎవరూ చెప్పలేరేమో! ఐ.ఎ.ఎస్ లను ‘అయ్యా, ఎస్’ లు అని ఆంధ్ర ప్రదేశ్ జనం చెప్పుకుంటారు. వారు అలా ‘అయ్యా, ఎస్’ అని ఎందుకు అనవలసి వస్తోందో ఉత్తర ప్రదేశ్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. అధికారులకు కూడా స్పష్టమైన రూల్స్ ని ప్రభుత్వ గ్రంధాల్లో నిర్దేశించి ఉంచారు. కానీ రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, కంపెనీల స్వార్ధ ప్రయోజనాల కోసం వీటిని నీరుగార్చడం లోనే…

పార్లమెంటు పొయ్యిపై ఆహార బిల్లు వంటకం -కార్టూన్

కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రతా బిల్లుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాల నుండీ ఈ బిల్లు గురించి చెబుతూ వచ్చిన కాంగ్రెస్ నిరసనల హోరు మధ్య నిన్ననే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ నిరసనలు ఆహార భద్రతా బిల్లుపై కాకుండా వేరే అంశాలపైన కావడం గమనార్హం. కొంతమంది తెలంగాణ వద్దని నినాదాలు చేస్తుంటే, మరి కొంతమంది కాశ్మీరులో జవాన్ల హత్యలపై ఆందోళన చేస్తుండగా ఈ బిల్లుని హడావుడిగా ప్రవేశపెట్టారు. విచిత్రం ఏమిటంటే ఇలాంటి తొందర…

సమాజ్ వాదీ ఐ.ఎ.ఎస్ శిక్షణ శిబిరం -కార్టూన్

ఆగండాగండి! ఇది ఐ.ఎ.ఎస్ లను తయారు చేసే శిక్షణా శిబిరం కాదు. తయారయిన ఐ.ఎ.ఎస్ లకు శిక్షణ ఇచ్చే శిబిరం. ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని కావాలని ఆశ పడుతున్న ఎం.పి తండ్రి, ముఖ్యమంత్రి అయిపోయిన కుమారులుంగారు కలిసి ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం. ఇందులో దేనికి శిక్షణ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాలా?

ఏదీ రూపాయి, ఎక్కడా కనబడదేం? -కార్టూన్

– రాజకీయ నాయకుడు: “రూపాయి చాలాకనిష్ట స్ధాయిలో ఉంది. ఇప్పుడూ – దాన్ని ఇంకా మెరుగ్గా గవర్న్ చెయ్యొచ్చంటారా?” – రూపాయి బతుకు కనాకష్టంగా మారింది. జింబాబ్వే ప్రభుత్వం లాగా జాతీయ కరెన్సీ రూపాయి రద్దు చేసుకుని అమెరికన్ డాలర్ నే కరెన్సీగా చేసుకునే రోజులు దాపురిస్తాయా అన్నట్లు తయారయింది పరిస్ధితి. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం కొనసా…….గుతూనే ఉంది. జులై 8 తేదీన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయి…

సి.ఐ.సి వేటగాడొస్తే పార్టీల పక్షులన్నీ ఐక్యమౌతాయ్ -కార్టూన్

రాజకీయ పార్టీలు తమకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నది సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పడంతో పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయింది. పారదర్శకత గురించి ప్రబోధించే ఈ పార్టీలకు అకస్మాత్తుగా పారదర్శకత రాజకీయ పార్టీల హక్కులకు భంగకరంగా కనిపించడం ప్రారంభం అయింది. అది ఎంతవరకూ వచ్చిందంటే పార్టీలన్నీ ఐక్యమై ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్.టి.ఐ చట్టం) సవరించేంతవరకూ. రాజకీయ పార్టీలు సి.ఐ.సి చెప్పినట్లుగా పబ్లిక్…

అది ఆంధ్ర, ఇది తెలంగాణ -కార్టూన్

“శుభ వార్త! హై కమాండ్ నిర్ణయం తీసేసుకుంది. అదేమో ఆంధ్ర, ఇదేమో తెలంగాణ…”  — కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరం, తెలంగాణ ఏర్పాటును ఎలా తరుముకొచ్చిందో ఈ కార్టూన్ చక్కగా వివరిస్తోంది. తెలంగాణ అనుకూల నిర్ణయం ద్వారా తెలంగాణలో గణనీయ సంఖ్యలో పంచాయితీలను ఇప్పటికే కాంగ్రెస్ గెలుచుకుంది. విచిత్రంగా సీమాంధ్ర ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ గెలుచుకున్న పంచాయితీలు తక్కువేమీ కాదు. చూడబోతే 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ విసిరిన పాచిక పారబోతున్నట్లే ఉంది.

తెలంగాణ: కాంగ్రెస్ ఫుడ్ సెక్యూరిటీ? -కార్టూన్

రాజకీయ పార్టీలకు ఏది ఆహారం? ఇంకేది, ఓట్లు, సీట్లు. ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. సీట్లు పెరిగేకొందీ అధికారం దగ్గరవుతుంది. వర్షాకాలం సమావేశాల్లో ‘ఆహార భద్రతా బిల్లు’ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోడానికి కాంగ్రెస్ తెగ తాపత్రయ పడుతోంది. ‘గ్రామీణ ఉపాధి హామీ పధకం’ 2009 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల వరప్రదాయని అయినట్లుగా 2014 ఎన్నికల్లో ‘ఆహార భద్రతా చట్టం’ ఆ తరహా పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ ఆశ. అందుకే బి.జె.పి, తృణమూల్ కాంగ్రెస్ తదితరులు…

మేడం-తెలంగాణ -కార్టూన్

“మేడం గారు నిర్ణయం తీసేసుకున్నారు. సరైన సమయంలో దాన్ని బైటపెడతారు.” – భారత దేశం ప్రజాస్వామ్య దేశం అని పాలకులు చెబుతుంటారు. మామూలు ప్రజాస్వామ్య దేశం కూడా కాదు, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం’ అని వారు తరచుగా చెప్పే మాట! అంటే ఇక్కడ జరిగే నిర్ణయాలన్నీ ప్రజల అభీష్టం మేరకే జరగాలి. ఎన్నికలు జరిగాక, ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీ లేదా పార్టీల కూటమి వివిధ నిర్ణయాలు చేస్తుంది కనుక ఏ…

అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్

“అబ్బే, దాన్నేమీ సీరియాస్ గా తీసుకోనక్కర్లేదు. దాన్నుండి మేము దూరం జరుగుతున్నాంగా!” “ఇహిహి, అది కేవలం జోక్, అంతే. దాన్నుండి మేము దూరంగా జరుగుతున్నాం. సరేనా!” “మరేం పర్లేదు. మేమూ మీ నుండి దూరంగా జరుగుతున్నాం!” దేశంలో పేదల బతుకుల్ని అపహాస్యం చేస్తున్న పేదల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రుచి చూపుతోంది. దారిద్ర్య రేఖకు ప్రణాళికా శాఖ నిర్ణయించిన ప్రాతిపదిక అన్యాయంగా ఉన్నదని సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తన కాకి లెక్కలనే మళ్ళీ ప్రకటించింది.…

ఈగ. ఈగ.. ఈగ… యముడి మెరుపు తీగ! -కార్టూన్

ఈగ సినిమా చూశారు కదా! చిన్న ఈగను చంపబోయి ఒక పెద్ద విలను తానే కోరి చావును కొని తెచ్చుకుంటాడు. లేదా ఈగే తెలివిగా విలన్ ను చావు వైపుకి నడిపిస్తుంది. ఇప్పుడు బీహార్ లో నితీశ్ కుమార్ పరిస్ధితి కూడా అలాగే ఉంది చూడబోతే! బుద్ధ గయ పేలుళ్లు, మధ్యాహ్న భోజనం తిని 23 మంది పిల్లలు చనిపోవడం.. ఈ రెండు దుర్ఘటనల అనంతరం ఆసక్తికరమైన మౌనం పాటించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నట్టుండి…