ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతోంది -ఐ.ఎం.ఎఫ్

2008 ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకుంటోందని భావిస్తున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ బలహీనపడుతున్నదని ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాల విధానాలు నమ్మకాన్ని పునరుద్ధరించడంలో విఫలం కావడంతో ప్రపంచ ఆర్ధిక వృద్ధి క్షీణ దశలోకి జారిపోయిందని ప్రపంచ ద్రవ్య సంస్ధ తన తాజా నివేదికలో తెలియజేసింది. ఆర్ధిక వ్యవస్ధ మరింతగా క్షీణించే సూచనలు గణనీయంగా ఉన్నాయని కూడా ఐ.ఎం.ఎఫ్ తెలిపింది. 2013 లో ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేటు 3.9 శాతం ఉంటుందని గత…

అమెరికా నిరుద్యోగం నిజంగానే తగ్గిందా?

సెప్టెంబర్ లో అమెరికా నిరుద్యోగం 8.1 శాతం నుండి 7.8 శాతానికి తగ్గిందని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి.ఎల్.ఎస్) రెండు రోజుల క్రితం ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని బి.ఎల్.ఎస్ ప్రకటించడంతోటే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు సంతోషాన్ని ప్రకటించాయి. అమెరికా నిరుద్యోగం తగ్గినందుకు ఆశ్చర్యానందాలని ప్రకటించాయి. స్టాక్ మార్కెట్ల లాభాల్ని కూడా ఉపాధి నివేదికకి ఆపాదించి సంతృప్తి చెందాయి. అనుకోకుండా శుభవార్త విన్నామని శీర్షికలు పెట్టి మంచి రోజులు రానున్నాయని అమెరికా…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -2

(మొదటి భాగం తరువాయి…) వేతనాలు ఉద్యోగాలు ఇవ్వడం లేదా, వేతనాలు ఇవ్వడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఆ విషయం చూద్దాం. ప్రొఫెసర్ డాక్టర్. ఇందిరా హిర్వే, అహ్మదా బాద్ లోని ‘సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆల్టర్నేటివ్స్’ సంస్ధకు డైరెక్టర్ గా పని చేస్తోంది. సెప్టెంబర్ 27 న ‘ది హిందూ’ లో రాసిన ఆర్టికల్ లో గుజరాత్ అభివృద్ధి గురించి ఆమె చర్చించారు. గుజరాత్ లోని గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రంగాల్లో పని చేస్తున్న…

గుజరాత్ అభివృద్ధి కధ: అబద్ధాలూ, వాస్తవాలూ -1

నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదంటూ ఊదరగొట్టడం భారత దేశ కార్పొరేట్ పత్రికలకు కొంతకాలంగా రివాజుగా మారింది. ‘వైబ్రంట్ గుజరాత్’ గా నరేంద్రమోడీ చేసుకుంటున్న ప్రచారానికి పత్రికలు యధాశక్తి అండదండలు ఇస్తున్నాయి. బ.జె.పి నాయకులు, కార్యకర్తలు ఈ ఊకదంపుడు కధనాలను చెప్పుకుని ఉబ్బితబ్బిబ్బు అవుతుంటే, కాంగ్రెస్ నాయకులేమో వాటిని ఖండించి వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీల వాదనలన్నీ జి.డి.పి వృద్ధి రేటు, తలసరి ఆదాయం, పారిశ్రామిక వృద్ధి… వీటి చుట్టూనే తిరుగుతున్నాయి…

చిల్లర వర్తకంలో 51% విదేశీ పెట్టుబడులకు కేబినెట్ అనుమతి

అమెరికన్ కంపెనీలకు ఇచ్చిన హామీని భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది. దేశంలో ఇరవై కోట్లమందికి ఉపాధి నిస్తున్న చిల్లర వర్తకాన్ని తీసుకెళ్లి వాల్ మార్ట్ చేతుల్లో పెట్టింది. చిల్లర కొట్లు పెట్టుకుని స్వయం ఉపాధి కల్పించుకున్న ఐదు కోట్ల కుటుంబాలను వీధి పాలు చేస్తూ రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా అధికారికంగా పత్రికలకు చెప్పలేదు. పేరు చెప్పవద్దని కోరుతూ ఒక…

ఆర్ధిక మాంద్యం కోరల్లో 17 దేశాల యూరోజోన్ -ఒఇసిడి

ఋణ సంక్షోభం ఫలితంగా, 17 యూరప్ దేశాల ద్రవ్య యూనియన్ అయిన ‘యూరో జోన్’ లో ఆర్ధిక మాంద్యం (recession) బలపడుతోందని ఒఇసిడి (Organisation for Economic Coperation and Development) నిర్ధారించింది. తాను మాంద్యంలో కూరుకుపోతూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధను కూడా అందులోకి ఈడుస్తోందని ప్యారిస్ లో విడుదల చేసిన మధ్యంతర నివేదికలో పేర్కొందని అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్ధ తెలిపింది. యూరప్ నాయకురాలు జర్మనీ సైతం ఈ సంవత్సరాంతానికి మాంద్యంలోకి జారుతుందని ఒఇసిడి…

వోడాఫోన్ పన్ను వివాదం: ప్రణబ్ నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్న చిదంబరం?

భారత ప్రభుత్వానికి వోడాఫోన్ కంపెనీ పన్ను ఎగవేసిన వివాదానికి సంబంధించి ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలు అపహాస్యం పాలవుతున్నాయి. ప్రభుత్వ ఖజానా కోసం ప్రణబ్ ముఖర్జీ తీసుకున్న నిర్ణయాలను అపఖ్యాతిపాలు చెయ్యడంలో కొత్త ఆర్ధిక మంత్రి చిదంబరం బిజీ అయినట్లు కనిపిస్తోంది. వోడా ఫోన్ పన్ను విషయమై దుడుకు (rash) నిర్ణయాలు తీసుకోబోమని చిదంబరం సోమవారం ప్రకటించాడు. తద్వారా ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం అనాలోచితమైనదని పరోక్షంగా సూచించాడు. కేమన్ ఐలాండ్ లో రిజిస్టరై భారత్…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

నిష్కళంకుడి బండారం బట్టబయలు, 1.86 ల.కోట్ల బొగ్గు కుంభకోణానికి మన్మోహన్ సారధ్యం

నిష్కళంకుడుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునే ప్రధాని మన్మోహన్ సింగ్ నిజ స్వరూపం ఏమిటో దేశానికి తెలిసి వచ్చింది. 1.86 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సారధ్యం వహించి ప్రజల వనరులను ప్రవేటు ముఠాలకు అప్పజెప్పిన మన్మోహన్ ‘మిస్టర్ అన్ క్లీన్’ గా అవతరించాడు. 2జి కుంభకోణం గురించి తనకు తెలియదని బుకాయించి తప్పించుకున్న ప్రధాని ‘బొగ్గు కుంభకోణం’ లో కన్నంలో వేలితో అడ్డంగా దొరికిపోయాడు. బొగ్గు గనులను వేలం వేయాలన్న ప్రతిపాదన 2004 లో…

కేంద్ర మంత్రికి ద్రవ్యోల్బణం సంతోషమేనట!–కార్టూన్

రైతుతో: ఎక్కువ అడగొద్దయ్యా! రేటు ఎక్కువైతే మళ్ళీ సగటు మనిషికి భారం కదా!        జనంతో: ధరలు పెరిగాయని గొణక్కండి. రైతులకి అదే లాభం. —————————————— ప్రజల అవసరాలతో పరాచికాలాడడం కేంద్ర మంత్రులకు ఆటగా మారినట్లుంది. ‘వాటర్ బాటిల్ కి 15/- ఖర్చు పెడతారు గానీ బియ్యం ధర రూపాయి పెరిగినా సహించలేరు’ అంటూ మధ్య తరగతి జనంపై ఏవగింపుని చాటుకున్న చిదంబరం సరసన, కేంద్ర ఉక్కు మంత్రి బేణీ ప్రసాద్ వర్మ చేరిపోయాడు. బియ్యం, గోధుమలు,…

పెట్టుబడిదారులకి సంక్షోభం కనిపించేది ఇలాగే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో వచ్చే ‘చక్ర భ్రమణ సంక్షోభాలు’ (cyclic crises) ప్రజల మూలుగలని పిప్పి చేసినా పెట్టుబడిదారులకి కాసులు కురవడం మాత్రం ఆగిపోదు. సంక్షోభం పేరు చెప్పి సర్కారు ఖజానాపై మరింత దూకుడుగా ఎలా వాలిపోవాలో అనేక వంచనా మార్గాలని వారు అభివృద్ధి చేసుకున్నారు; సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకి కొత్త కాదు గనక. ట్రిలియన్ల కొద్దీ బెయిలౌట్ల సొమ్ము భోంచేసినప్పటికీ, కంపెనీలు దానిని ఏ మాత్రం కార్మికవర్గానికి విదల్చకపోవడం వల్ల సంక్షోభం ప్రధాన ఫలితం నిరుద్యోగమే అవుతుంది.…

ఫ్రాన్స్ లో లండన్ తరహా అల్లర్లు, ఆర్ధిక సామాజిక సమస్యలే కారణం

డజన్ల కొద్దీ  యువకులు రోడ్లపైకి వచ్చి రోజంతా లూటీలకూ, దహనాలకూ పాల్పడిన ఘటన ఫ్రాన్సులో చోటు చేసుకుంది. ఉత్తర ఫ్రాన్సులోని అమీన్స్ పట్టణంలో జరిగిన ఈ అల్లర్లలో 16 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసులు చెప్పగా ప్రజలు ఎంతమంది గాయపడిందీ ఏ పత్రికా చెప్పలేదు. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన అల్లర్లు అదనపు బలగాల రాకతో మగళవారం తెల్లవారు ఝాము 4 గంటలకు ముగిశాయని ఎ.పి తో పాటు ఇతర వార్తా సంస్ధలు తెలిపాయి.…

అమెరికా గురుద్వారాలో 6గురు సిక్కులను కాల్చి చంపిన తెల్ల దురహంకారి

అమెరికాలో సిక్కుల ప్రార్ధనామందిరం గురుద్వారా లో జొరబడిన తెల్లజాతి దురహంకారి (వైట్ సూపర్ మాసిస్ట్) ప్రార్ధనలో మునిగి ఉన్న ఆరుగురు సిక్కు మతస్ధులను కాల్చి చంపాడు. తీవ్రవాది కాల్పుల్లో కనీసం మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ‘ది హిందూ’ తెలిపింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో మిల్వాకీ సబర్బన్ ప్రాంతం అయిన ‘ఓక్ క్రీక్’ లోని సిక్కుల ప్రార్ధనామందిరం లో ఆదివారం ఉదయం ఈ హత్యాకాండ జరిగింది. విచారణ జరిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా హామీ ఇవ్వగా, ఇండియాలోని సిక్కు…

పెట్టుబడిదారీ సంక్షోభ పరిష్కారం అంటే ప్రజల గోళ్ళూడగొట్టడమే -కార్టూన్

పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభాలు సర్వ సాధారణం. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు వీటికి ‘సైక్లిక్ క్రైసిస్’ అని పేరు పెట్టి సైద్ధాంతీకరించేశారు కూడా. (అంటే సిద్ధాంతం కనక ఇక అడగొద్దని.) పెట్టుబడిదారీ వ్యవస్ధలో సంక్షోభం అంటే ప్రధానంగా పెట్టుబడిదారుల సంక్షోభమే. పెట్టుబడిదారులకు లాభాలు తగ్గిపోతే అదే సంక్షోభం. దేశంలో దరిద్రం తాండవిస్తున్నా అది సంక్షోభం కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నూటికి యాభై మందికి ఇళ్ళు లేకపోయినా, నలభై మంది ఆకలితో, అర్ధాకలితో చస్తూ బతుకుతున్నా, మొత్తంగా ప్రజల జీవన…

ఆర్.బి.ఐ సమీక్ష: జి.డి.పి టార్గెట్ కి కోత, వడ్డీ రేట్లు యధాతధం

వడ్డీ రేట్లు తగ్గించాలన్న పారిశ్రాక సంఘాల డిమాండ్ ను ఆర్.బి.ఐ తలొగ్గలేదు. ద్రవ్యోల్బణంపై పోరాటం తన లక్ష్యమని చెప్పింది. ఈ దశలో ఆర్.బి.ఐ వడ్డీ రేటు తగ్గించి మరింత డబ్బుని మార్కెట్ కి వదిలితే ద్రవ్యోల్బణం కట్లు తెంచుకుంటుందని తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను జి.డి.పి వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుండి భారీగా 0.8 శాతం తగ్గించుకుని 6.5 శాతం నమోదయితే చాలని చెప్పింది. ఎస్.ఎల్.ఆర్ లో మాత్రం కొంత సడలింపు ప్రకటించింది.…