స్టింగ్ ఆపరేషన్: తలలు తెగి పడుతున్నాయ్

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఫలితాలు చూపిస్తోంది. బలి పశువుల తలలు తెగిపడుతున్నాయి. సమస్య మూలాలను కదిలించడానికి బదులు జీతగాళ్లను బలి తీసుకునే కార్యక్రమం మొదలయింది. అందులో భాగంగా మనీ లాండరింగ్ కి అంగీకరిస్తున్నట్లు రహస్య కెమెరాల సాక్షిగా దొరికిపోయిన అధికారులను ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు సస్పెండ్ చేసింది. బ్యాంకు అంతర్గత విచారణ పూర్తయ్యేవరకు వారు సస్పెన్షన్ లో ఉంటారని సదరు బ్యాంకు తెలియజేసింది. రెండు వారాల లోపు విచారణ పూర్తవుతుందని బ్యాంకు అధికారులను ఉటంకిస్తూ పిటిఐ తెలియజేసింది.…

ప్రైవేటు బ్యాంకులే బ్లాక్ మనీకి ‘అడ్డా’లు; స్టింగ్ ఆపరేషన్

నల్ల డబ్బు తెల్ల డబ్బుగా మార్చడం, హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించి తిరిగి పెట్టుబడులుగా దేశంలోకి రప్పించడం ఎక్కడో చీకటి గదుల్లో, మూడో కంటికి తెలియని రహస్య గుహల్లో జరిగే పని అనుకుంటే పొరబాటని భారత దేశంలోని ప్రైవేటు బ్యాంకులపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడి అయింది. భారత దేశంలో దినదిన ప్రవర్థమానమై వర్ధిల్లుతున్న ప్రైవేటు బ్యాంకులే నల్ల డబ్బుకు అడ్డాలుగా మారాయని ‘కోబ్రా పోస్ట్‘ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ రుజువు చేసింది. దేశంలో…

బొగ్గు కుంభకోణం, మరో చీకటి అధ్యాయం

భారత పాలకవర్గాల అవినీతి చరిత్రలో మరో రసవత్తర అధ్యాయానికి తెర లేస్తోంది. 2జి కుంభకోణం దరిమిలా 122 లైసెన్సులను రద్దు చేసి కాంగ్రెస్ పాలకుల అవినీతి మాలిన్యాన్ని ధృవపరిచిన సుప్రీం కోర్టే తాజా అధ్యాయానికి నాందీ వాచకం పలుకుతోంది. ప్రాధమిక సాక్ష్యాల ప్రకారం బొగ్గు గనుల కేటాయింపులు ఒక పద్ధతి లేకుండా జరిగినట్లు స్పష్టం అవుతోందని, అవసరమైతే కేటాయింపులన్నింటిని రద్దు చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అసలు బొగ్గు గనుల కేటాయింపుల రాష్ట్రాల…

మహిళా బ్యాంకు బ్రాంచీలు ఆరు

– 2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని…

బడ్జెట్ 2013-14: వేతన జీవులకు 2000/- ముష్టి

ఆర్ధిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్ లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాసింత ముష్టి విదిలించి మధ్య తరగతి ప్రజల పట్ల తనకు ఉన్న ఔదార్యం చాటుకున్నాడు. సంవత్సరానికి రు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి రు. 2,000/- పన్ను చెల్లింపులో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంటే మొదటి పన్ను శ్లాబ్ ను రు. 2 లక్షల నుండి 2.2 లక్షలకు పెంచినట్లు అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇది పరిమితి పెంపు కాదు. ప్రభుత్వమే ఆయా…

బడ్జెట్ 2013-14: సబ్సిడీల్లో భారీ కోత

2013-14 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రభుత్వం సబ్సిడీలలో భారీ కోతలు ప్రతిపాదించింది. పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ కోతల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా దాచిపెట్టాడు. నిజానికి సబ్సిడీలను తగ్గించవలసిన అవసరం గురించి ప్రధాని, ఆర్ధిక మంత్రి, ప్రధాని ఆర్ధిక సలహా బృందం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు తదితరులంతా వీలు దొరికినప్పుడల్లా బోధనలు, సలహాలు, హెచ్చరికలు చేస్తూ వచ్చారు. వాటిని అమలు చేసే సమయంలో మాత్రం…

బడ్జెట్ 2013-14: మాటలు సామాన్యుడికి, మూటలు కార్పొరేట్లకు

చిదంబరం బడ్జెట్ చిదంబర రహస్యాలతో నిండిపోయింది. ఆదర్శాలు వల్లించడానికే తప్ప ఆచరించడానికి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మాటలు సామాన్యుడికి మూటలు కార్పొరేట్లకు పంచి పెట్టింది. దొడ్డి దారిలో మూటల్ని దాటించి, సింహద్వారంలో ఆదర్శాల మాటలు వేలాడగట్టింది. ఆహార భద్రత చట్టం గురించి ఘనంగా చెప్పుకుని అందుకోసం ముష్టి 10 వేల కోట్లు విదిలించింది. దేశ ప్రజలకు పూర్తిస్థాయి ఆహార భద్రత కల్పించాలంటే 84,000 కోట్లు అవసరమని చెప్పిన తన మాటలు తానే ఉల్లంఘించింది.…

కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు

ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం…

నరేంద్ర మోడి అభివృద్ధి బండారం ఇంకోసారి

దేశంలో మిగతా రాష్ట్రాలకంటే గుజరాత్ అభివృద్ధిపధంలో దూసుకెళుతోందనీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి సమర్ధతే దానికి కారణమనీ పత్రికలు భజన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో వాస్తవం ఏమిటో ‘గుజరాత్ అభివృద్ధి కధ‘ పేరుతో ఈ బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాయడం జరిగింది. గుజరాత్ లో జరిగిందంటున్న అభివృద్ధి స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులదే తప్ప అక్కడి ప్రజలది కాదని అందులో తెలియజేశాను. మరికొన్ని వివరాలు ఇపుడు చూద్దాం. వారపత్రిక అయిన తెహెల్కా నవంబరు…

తీవ్ర సామాజిక సంక్షోభంలో అమెరికా

2007-08లో వాల్ స్ట్రీట్ కంపెనీలు తెచ్చిపెట్టిన ఆర్ధిక సంక్షోభం అమెరికన్ ప్రజలను పట్టి పల్లార్చుతోంది. పెట్టుబడిదారీ కంపెనీలు తమ సంక్షోభాన్ని కార్మికవర్గం పైకీ, ప్రజా సామాన్యం పైకీ బదలాయించడంలో విజయవంతం కావడంతో అమెరికన్ ప్రజానీకం సామాజిక సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. సంక్షోభం తెచ్చిన ‘టూ బిగ్ టు ఫెయిల్’ కంపెనీలు ఎప్పటిలా భారీ లాభాలతో అలరారుతుండగా కార్మికులు, ఉద్యోగులు నిరుద్యోగం, దరిద్రం, ఆకలి, రోగాలతో సతమతం అవుతోంది. గత మూడున్నర సంవత్సరాలలోనే కోట్లాది మంది అమెరికన్లు పని…

పొదుపు విధానాలపై ఆందోళనలతో అట్టుడుకుతున్న యూరప్ -ఫోటోలు

గత రెండున్నర సంవత్సరాలుగా యూరోపియన్ దేశాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు దాదాపు అన్నివర్గాల ప్రజలను వీధుల్లోకి తెస్తున్నాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రవేటీకరణ వల్ల లక్షలాది ఉద్యోగాలు రద్దవుతున్నాయి. ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోత విధించారు. పెన్షన్లను కూడా వదలకుండా దోచుకుంటున్నారు. వేతనాలు కోత పెట్టడమే కాకుండా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమ సదుపాయాలను కూడా రద్దు చేస్తున్నారు. దానితో ఆరోగ్య భద్రత కరువై వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఒకవైపు వేతనాలు తగ్గిస్తూ మరోవైపు పన్నులు…

మడత పేచీ: చిదంబరం వర్సెస్ ఆర్.బి.ఐ -కార్టూన్

రెండు రోజుల క్రితం భారత ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు పైన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కాడు. భారత ఆర్ధిక వ్యవస్ధ తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కించడానికి తాము (ప్రభుత్వం) ఒక రోడ్ మ్యాప్ గీసి మరీ శ్రమిస్తుంటే ఆర్.బి.ఐ తమకు సహకరించడం లేదని ఆయన ఆర్.బి.ఐ పైన యాష్టపోయాడు. ఆర్.బి.ఐ సహకారం లేకపోతే మాత్రం ఏమిటట? నేనొక్కడినే ఒంటరిగా శ్రమించడానికి వెనుకంజ వేసేది లేదు, అని కూడా సాక్ష్యాత్తూ…

బియ్యం బదులు తూకం రాళ్ళు మింగించేదే ‘నగదు బదిలీ పధకం’ -కార్టూన్

నగదు బదిలీ పధకం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా ఊదగరగొడుతూ వచ్చాయి. ఈ పధకాన్ని ఆచరణలోకి తెస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ కూడా ప్రకటించాడు. పేదలకు సబ్సిడీ ధరలకు సరుకులను అందించే బదులు సదరు సబ్సిడీని నగదు రూపంలో నేరుగా పేదల ఖాతాల్లోకి తరలించడమే ఈ పధకం లక్ష్యం. అంటే గ్యాస్ సిలిండర్, బియ్యం, రేషన్ సరుకులు తదితర సరుకలకీ ఇచ్చే సబ్సిడీని ఆయా సరుకులు కొనే సమయంలో ఇవ్వకుండా, సదరు…

ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశంలో వెల్లడయిన ప్రపంచ ఆర్ధికశక్తుల వైరుధ్యాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతున్న నేపధ్యంలో ప్రపంచ ఆర్ధిక శక్తుల మధ్య విభేదాలు క్రమంగా పెరుగుతున్నాయి. టోక్యోలో జరిగిన ఐ.ఎం.ఎఫ్ మరియు ప్రపంచ బ్యాంకుల వార్షిక సంయుక్త సమావేశంలో ఈ విభేధాలు ప్రస్ఫుటంగా వ్యక్తం అయ్యాయి. ప్రపంచ కాబూలీ సంస్ధలయిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల 2012 వార్షిక సమావేశాలు జపాన్ రాజధాని టోక్యో లో అక్టోబర్ 9 నుండి 14 వరకు జరిగాయి. పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా నెరవేరడానికి సూత్రాలు,…

అమెరికాలో పెరుగుతున్న అల్పాదాయ వర్గాలు -ప్యూ రీసర్చ్

2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో అల్పాదాయ వర్గాల సంఖ్య బాగా పెరిగిందని ‘ప్యూ రీసర్చ్ సెంటర్’ అధ్యయనంలో తేలింది.  అమెరికా వినాశకర ఆర్ధిక, విదేశాంగ విధానాల ద్వారా ఉత్పన్నమయిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత అమెరికాలో సామాన్యుల ఆదాయాల్లో వచ్చిన మార్పులను ఈ అధ్యయనం రికార్డు చేసింది. ప్యూ అధ్యయనం ప్రకారం అమెరికాలో తమను తాము అల్పాదాయ తరగతికి చెందినవారిగా గుర్తించుకునేవారి సంఖ్య 2008 లో పోలిస్తే బాగా పెరిగింది. జనాభాలో ఇలా…