ఆహార బిల్లును తప్పు పట్టొద్దు -ది హిందు సంపాదకీయం

(రూపాయి పతనానికి కారణంగా ఆహార భద్రతా బిల్లును కొంతమంది మార్కెట్ పరిశీలకులు చెప్పడాన్ని తప్పు పడుతూ ది హిందూ పత్రిక గురువారం, ఆగస్టు 29, 2013 తేదీన ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. పత్రిక వెలువరించిన అత్యద్భుతమైన సంపాదకీయాల్లో ఇది ఒకటి అనడంలో నాకు ఎట్టి సందేహం లేదు. రూపాయి పతనంకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -విశేఖర్) గత కొన్ని నెలల్లో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల…

రూపాయి ఇంకా కిందికి…, సామాన్యుడి చావుకి!

బుధవారం రూపాయి మళ్ళీ కొత్త రికార్డుకు పతనం అయింది. మంగళవారం డాలర్ ఒక్కింటికి 66 రూపాయల మార్కు దాటి రికార్డు సృష్టించిన రూపాయి విలువ బుధవారం 68 రూపాయల మార్కు దాటిపోయింది. ఒక దశలో డాలర్ ఒక్కింటికి రు. 68.75 పై కు పడిపోయింది. కడపటి వార్తల ప్రకారం (మధ్యాహ్నం 1:45) 1 డాలర్ = రు. 68.025 వద్ద రూపాయి విలువ కొట్టుకులాడుతోంది. (బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ) మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి 66.24 వద్ద…

రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని…

పతనం: రూపాయి vis-à-vis ఉపగ్రహం -కార్టూన్

– ఈ లోపు, మరో శాటిలైట్ లంచ్ వెహికల్: – ఒక వార్త: సోమవారం ఏకంగా 148 పైసలు పతనమై డాలర్ తో మారకపు విలువ 63 రూపాయల మార్కు దాటిన రూపాయి విలువ మంగళవారం మరో కొత్త పతన స్ధాయిని నమోదు చేసింది. నిన్న 63.13 రు.ల వద్ద ముగిసిన రూపాయి విలువ ఈ రోజు ట్రేడింగ్ ఎత్తుకోవడంతోనే 63.75 రు.ల వద్ద ఎత్తుకుంది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ అదింకా పతనమై డాలర్ ఒక్కింటికి రు.…

దశాబ్దంలోనే అత్యధికంగా పడిపోయిన రూపాయి

రూపాయి పతనం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు ప్రకటించినా తన దొర్లుడుకు అడ్డే లేదు పొమ్మంటోంది. ‘కొండలు, గుట్టలు, నదీనదాలు, ఎడారులా నా కడ్డంకి?’ అని శ్రీ శ్రీ ని అరువు తెచ్చుకుని మరీ ప్రశ్నిస్తోంది. అధో పాతాళాన్ని దాటలేనా అని సవాలు చేస్తూ దొర్లి పడుతోంది. తమిళ తంబిలు (అదేనండీ చిదంబరం) ఎందరొచ్చినా, హార్వర్డ్ ఉత్పత్తులు (హార్వర్డ్ ప్రోడక్ట్ అని మన మన్మోహనుడికి పశ్చిమ పత్రికలు ఇచ్చి మురిసిపోయే సర్టిఫికేట్ ఇది) ప్రధానులే…

యూరో జోన్ ఆర్ధిక వ్యవస్ధ పైకి తేలిందా? -కార్టూన్

యూరోజోన్ ఎక్స్ ప్రెస్: గాస్ప్! (ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం) పీతలు: “పాపం! వాళ్లింకా ఒడ్డున పడనేలేదు” – ఐరోపా ఖండంలోని 28 దేశాలు కలిసి యూరోపియన్ యూనియన్ (ఇ.యు) గా ఏర్పడగా అందులోని 17 దేశాలను యూరో జోన్ అని పిలుస్తారు. ఈ 17 దేశాలు తమ తమ జాతీయ కరెన్సీలను వదిలేసుకుని ఒకే కరెన్సీ ‘యూరో’ ఏర్పాటు చేసుకున్నాయి. యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) తప్ప మిగిలిన ప్రధాన దేశాలన్నీ యూరోజోన్ సభ్య దేశాలే.…

ఉపాధి హామీ పధకం ఛారిటీ, దాన్ని ఆపాలి -మోడి

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తాను కప్పుకున్న ఒక్కో ముసుగూ విప్పి పారేస్తున్నారు. తాను వ్యాపారులు, కంపెనీల పక్షమే కానీ ప్రజల పక్షం కాదని చక్కగా చెప్పుకుంటున్నారు. తన గురించి పట్టించుకోవాల్సిన అంశం మతోన్మాదం కాదనీ, తన పక్కా ప్రజా వ్యతిరేక విధానాలే అనీ జనానికి గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ‘మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం’ ఛారిటీ పధకం అనీ, ఓట్ల కోసం ఉద్దేశించిన అలాంటి పధకాలు తనకు ఇష్టం లేదనీ…

రూపాయి: చేతకాకపోతే సరి! -కార్టూన్

“ఏం భయపడొద్దు. అది మరింత జారిపోకుండా ఎక్కడో ఒకచోట ఆగి తీరాల్సిందే!” – “రూపాయిన పతనం కానివ్వం.”అడిగినప్పుడల్లా ప్రధాని, ఆర్ధిక మంత్రులు చెప్పే మాట ఇది. ఒక పక్క పతనం అవుతూనే ఉంటుంది. వీళ్ళేమో మీడియా సెంటర్లో కూర్చుని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు. అదేమని అడిగితే “ఇక్కడ అంతా బాగానే ఉంది. విదేశాల్లో పరిస్ధితుల్ని మనం నియంత్రించలేము కదా?” అని చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు విదేశాల్లో పరిస్ధితి బాగోలేకపోతే ఆ ప్రభావం మనమీద ఎందుకు…

భారత స్టాక్ మార్కెట్లలో రక్తపాతం

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభాన్ని తలపించాయి. అమెరికాలో ఆశావాహ పరిస్ధితులు నెలకొన్నాయని భావించిన అంతర్జాతీయ మదుపరులు భారత స్టాక్ మార్కెట్ల నుండి, రూపాయి నుండి తమ సొమ్ము ఉపసంహరించుకుని డాలర్ల కోసం ఉరుకులు పరుగులు పెట్టడంతో రూపాయి ఢమాల్ మని కూలిపోయింది. రూపాయితో పాటు స్టాక్ సూచీలు కూడా ఒక్కుమ్మడిగా కూలిపోయాయి. మార్కెట్ల పతనాన్ని పత్రికలు రక్తపాతంతో పోల్చుతున్నాయి. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ను…

ఎక్కడున్నావే గొంగళీ అంటే… -కార్టూన్

అద్భుతమైన కార్టూన్ ఇది! మన్మోహన్ సింగ్ అనుసరించిన నూతన ఆర్ధిక విధానాల డొల్లతనాన్ని ఈ కార్టూన్ శక్తివంతంగా వివరిస్తోంది. డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం తప్ప మరో దారి లేదని చెప్పి డబ్ల్యూ.టి.ఓ ఉరుగ్వే రౌండ్ చర్చలను భారత దేశ ప్రజల నెత్తిన ‘నూతన ఆర్ధిక విధానాలు’గా రుద్దిన మన్మోహన్ తిరిగి బయలుదేరిన చోటికే చేరడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ఆ విధానాల తీరే అంత. ఏ విధానాలైనా ప్రజల కొనుగోలు శక్తిని స్ధిరంగా పెంచగలిగితేనే కంపెనీలకి లాభాలూ,…

ఏదీ రూపాయి, ఎక్కడా కనబడదేం? -కార్టూన్

– రాజకీయ నాయకుడు: “రూపాయి చాలాకనిష్ట స్ధాయిలో ఉంది. ఇప్పుడూ – దాన్ని ఇంకా మెరుగ్గా గవర్న్ చెయ్యొచ్చంటారా?” – రూపాయి బతుకు కనాకష్టంగా మారింది. జింబాబ్వే ప్రభుత్వం లాగా జాతీయ కరెన్సీ రూపాయి రద్దు చేసుకుని అమెరికన్ డాలర్ నే కరెన్సీగా చేసుకునే రోజులు దాపురిస్తాయా అన్నట్లు తయారయింది పరిస్ధితి. ఆర్.బి.ఐ, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రూపాయి పతనం కొనసా…….గుతూనే ఉంది. జులై 8 తేదీన చరిత్రలోనే అత్యంత కనిష్ట స్ధాయి…

మోడి, అమార్త్య సేన్, ఓ భారత రత్న

“Politics is the last refuge of scoundrels.” అని పెద్దాయన జార్జి బెర్నార్డ్ షా ఏ సందర్భంలో, ఎందుకు అన్నారో గానీ దాన్ని రుజువు చేయడానికి భారత రాజకీయ నాయకులు అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు. అమార్త్య సేన్ తన భావ ప్రకటనా హక్కును వినియోగించుకుంటూ ‘నరేంద్ర మోడి ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పిన సందర్భం వారికి మరోసారి కలిసొచ్చింది. తన అభిప్రాయం చెప్పినందుకు కొందరు బి.జె.పి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక…

రిలయన్స్-మంత్రుల్ చెట్టపట్టాల్ -కార్టూన్

కేశవ్ గారి మేజికల్ అప్పీల్ కి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? భారత దేశ రాజకీయ నాయకులు ఈ దేశంలోని అత్యంత ధనికుడుగా పేరు పొందిన వ్యక్తి, రిలయన్స్ కంపెనీ అధినేత అయిన ముఖేష్ అంబానీతోనూ, ఆయన కంపెనీ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తోనూ పాలు-నీళ్ళు లాగా ఎంతగా కలిసిపోయారో చెప్పగల ఇలస్ట్రేషన్ ఇంతకు మించి ఉంటుందా? ఒకవేళ అర్ధం కాకపోతే ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ కంపెనీ లోగోనూ, ఈ కార్టూన్ నూ పక్క పక్కనే పెట్టి చూస్తే మర్మం…

భారత ఆర్ధిక వ్యవస్ధ, మన్మోహన్ వ్యర్ధ ప్రయత్నం -కార్టూన్

భారత ఆర్ధిక వ్యవస్ధకు చేసిన జబ్బుకి మళ్ళీ ఎఫ్.డి.ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) మందు వేయడానికి మన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను వృద్ధి చేసుకోడానికీ, ప్రమాదకరంగా ఉన్న కరెంటు ఖాతా లోటును స్ధిరీకరించడానికి ఎఫ్.డి.ఐలు తప్ప మరో మార్గం లేదని భారత ప్రభుత్వంలోని ఆర్ధిక పండితులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రజలు, ప్రతిపక్షాల అభ్యంతరాలతో నిమిత్తం లేకుండా వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్…

22 బ్యాంకులకు 50 కోట్ల జరిమానా విధించిన ఆర్.బి.ఐ

సగటు మనిషి తన అవసరాల కోసం ఖాతా తెరవాలంటే బ్యాంకులు సవాలక్ష నిబంధనలు వల్లిస్తాయి. ‘నువ్వు నువ్వే అనడానికి గ్యారంటీ ఏమిట’ని అడుగుతాయి. ‘నిన్ను గుర్తించే పెద్ద మనిషిని పట్టుకురా’ అని పురమాయిస్తాయి. ఎవరూ లేకపోతే గుర్తింపు కార్డు తెమ్మంటాయి. ‘నీకెందుకు ఖాతా’ అని కూడా అంటాయి. అన్నీ అయ్యాక కనీసం ఇన్నివేలయినా ఖాతాలో ఉంచాలని షరతు పెడతాయి. కానీ నోట్ల కట్టలు పట్టుకొస్తే మాత్రం ఎక్కడిది నీకింత డబ్బు అని అడగానే అడగవు. అలా అడగకుండా…