కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -2

3. ప్రయివేటీకరణ: నవరత్నాలుగా పేరు గాంచిన వివిధ ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లను తెగనమ్మాలని పశ్చిమ కంపెనీలు పోరు పెడుతున్నాయి. అనగా ప్రభుత్వ్బ రంగ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రైవేటీకరణకు కావలసిన తాత్విక భూమికను పాలకవర్గాలు ఇప్పటికే ఏర్పరుచుకున్నాయి. లాభాలు వచ్చే పబ్లిక్ కంపెనీలను ఎందుకు అమ్మేస్తున్నారని అడిగేవారు ఇప్పుడు లేరు. ఆ వాటాలు తెగనమ్ముతుంటే ఎగబడి కొనుక్కునే ధనికవర్గాలే ఇప్పుడు ఉన్నారు. ఇలాంటి షేర్ల మెతుకుల కోసం ఎదురు చూసే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు కూడా ఇప్పుడు…

కొత్త ప్రభుత్వానికి పశ్చిమ దేశాల డిమాండ్లివి -1

భారత దేశంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కోసం ఆత్రం ఎదురు చూస్తున్నది ఎవరు? భారత ప్రజలైతే కాదు. ఎందుకంటే వారిలాంటి ఎన్నికల్ని అనేకం చూశారు. ఎన్నికల వల్ల, ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వాల వల్లా తమకు కొత్తగా ఒరిగేది ఏమీ లేదని వారికి ఎప్పుడో అర్ధమైపోయింది. కొత్త ప్రభుత్వాల వల్లా, వాటి నిర్ణయాల వల్లా ఎప్పుడూ ఎవరైతే లాభం పొందుతారో వారే ఎన్నికల ఫలితాల కోసం ఇప్పుడూ ఆత్రపడుతున్నారు. పోటీ చేసేదే రాజకీయ పార్టీలు గనక వాటికి…

మోడి వస్తే ఆర్.బి.ఐ గవర్నర్ కి పదవీ గండమా?

నరేంద్ర మోడి ప్రధాని అయితే (బి.జె.పి కూటమి అధికారంలోకి వస్తే) ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ కి పదవీ గండం తప్పకపోవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నిన్న ఒక కధనం ప్రచురించింది. పదవి నుండి తప్పుకోమని అడగకపోతే కనీసం రఘురాం రాజన్ పై కంపెనీల కోసం తీవ్ర స్ధాయిలో రాజకీయ ఒత్తిడులయినా ఉంటాయని ఆ పత్రిక వివరించింది. ఆ మేరకు వివిధ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ సంస్ధలు ఆశిస్తున్నాయనీ, కొన్నయితే ఏర్పాట్లే చేసుకుంటున్నాయని రాయిటర్స్ వివరించింది. రాయిటర్స్…

మాన్యుఫాక్చరింగ్: బి.జె.పి యేతర రాష్ట్రాలదే పై చేయి

బి.జె.పి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తరచుగా అభివృద్ధి మంత్రం జపిస్తుంటారు. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు ఇష్టానుసారం జనం సొమ్ము కట్టబెట్టడమే అభివృద్ధి మంత్రంలోని అంతస్సారం. పోనీ అందులోనైనా గుజరాత్ ముందు పడిందా అంటే అదీ లేదు. కాంగ్రెస్, బి.జె.పి రెండు పార్టీలూ లేని తమిళనాడు మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి, ఉద్యోగాల సృష్టి లలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారి గణాంకాలు తెలియజేస్తున్నాయి. బి.జె.పి తన ఎన్నికల ప్రచారంలో మాన్యుఫాక్చరింగ్,…

చైనా వృద్ధి కిందికి, ఉద్దీపన ఊహలకు ఊపు

చైనా ఆర్ధిక వృద్ధి అనుకున్నంత స్ధాయిలో నమోదు కావడం లేదన్న అంచనాలు పెరుగుతుండగా ఆ దేశ ప్రభుత్వం మరోసారి ఆర్ధిక ఉద్దీపన అమలు చేయనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2014 ఆర్ధిక సంవత్సరానికి గాను (చైనా ఆర్ధిక సంవత్సరం జనవరి 1 తేదీన మొదలై డిసెంబర్ 31తో ముగుస్తుంది) 7.5 శాతం జి.డి.పి వృద్ధి నమోదు చేయాలని చైనా ఆశిస్తోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పడిపోతున్న పరిస్ధితుల్లో ఇది సాధించడం అనుమానంగా మారింది. ఫలితంగా మరో…

అమెరికా: వడ్డీ రేటు ఇప్పట్లో పెంచేది లేదు

తమ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ ప్రకటించింది. చికాగో రాష్ట్ర ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు చార్లెస్ ఇవాన్స్ ఈ మేరకు స్పష్టం చేశారని రాయిటర్స్ తెలిపింది. వడ్డీ రేటు పెంచితే ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ గాడి తప్పుతుందని ఆయన అంచనా వేశారు. నిరుద్యోగం ఇంకా తీవ్రంగానే ఉన్నదని, బాగా తక్కువగా ఉన్న ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెంపు వల్ల…

ప్రశ్న: సరళీకరణ విధానాలు దేశానికి మంచివే కదా?

హరీష్: ఇవాళ ప్రభాత్ పట్నాయక్ గారి ఇంటర్వ్యూ ఈనాడులో ప్రచురించారు. సరళీకరణ వల్ల  ఆర్ధిక అసమానతలు పెరిగాయని ఆయన వివరించారు. కాని ఆ సరళీకరణ విదానాల వల్లనే మనం ఆర్థికంగా మెరుగయ్యామని చెప్తుంటారు కదా. మేమూ అలానే అనుకుంటున్నాం. చాలా  మంది కొత్తవాళ్ళకి అవకాశాలు అందించాయి  కదండి. దాని గురుంచి కాస్త విపులంగా వివరించగలరు. సమాధానం: ప్రభాత్ పట్నాయక్ గారు చెప్పింది నిజమే. సరళీకరణ విధానాలు ప్రజల కోసం ప్రవేశపెట్టినవి కావు. భారత దేశ మార్కెట్ ను…

ఉక్రెయిన్ పై మొదటి వేటు వేసిన ‘పడమటి గాలి’

‘పడమటి గాలి’ ఆరోగ్యానికి మంచిది కాదని వింటుంటాం. ‘అబ్బ! పడమటిగాలి మొదలయిందిరా’ అని పెద్దవాళ్ళు అనుకుంటుండగా చిన్నప్పుడు విని ఉన్నాం. అది ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. సాంస్కృతికంగా పశ్చిమ దేశాల సంస్కృతి ఎంతటి కల్లోలాలను సృష్టిస్తున్నదో ‘పడమటి గాలి’ నాటకం ద్వారా రచయిత పాటిబండ్ల ఆనందరావు గారు శక్తివంతంగా ప్రేక్షకుల ముందు ఉంచారు. ఇ.యు వైపుకి ఉక్రెయిన్ జరిగిన ఫలితంగా ఇప్పుడు అదే పడమటి గాలి, ఆ దేశాన్ని చుట్టుముడుతోంది. ప్రజల ఆర్ధిక ఆరోగ్యానికి అదెంత ప్రమాదకరమో…

భారత వృద్ధి: పరిశ్రమలు బలహీనం, పెట్టుబడులు కరువు

భారత దేశ అభివృద్ధి కధ ఎప్పటికయినా పునరుద్ధరించబడేనా? 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ముందు వరకు సగటున 9 శాతం జి.డి.పి వృద్ధి రేటుతో పశ్చిమ పెట్టుబడులకు చైనా తర్వాత ఫేవరెట్ గా నిలిచిన ఇండియా ఇప్పుడు అందులో సగం వృద్ధి సాధించడానికి కూడా ఆపసోపాలు పడుతోంది. ‘ఫాస్ట్ ట్రాక్’ పేరుతో స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు అనుమతులను భారత చట్టాలను బుల్ డోజ్ చేస్తూ జారీ చేస్తున్నా ఆర్ధిక వ్యవస్ధలో మునుపటి కళ గోచరించడం…

ఎన్నికల బడ్జెట్ -కార్టూన్

లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలనే బైపాస్ రోడ్లుగా వేసుకుంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం పదేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. విదేశీ మాస్టర్లు, స్వపార్టీ నాయకుల ఆదేశాలను కిమ్మనకుండా పాటించే హార్వర్డ్ మర మనిషి యు.పి.ఎ డ్రైవర్ గా తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించారు. ఇచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా ఎంత ఖచ్చితంగా అమలు చేస్తే మర మనిషి అంత సమర్ధవంతంగా పని చేసినట్లన్నది లోకోక్తిగా మార్చడంలోనూ మన మరమనిషి సఫలం అయ్యారు. ఇక చివరి బడ్జెట్…

స్కాట్లండ్ రిఫరెండం: యు.కె పాచిక ‘పౌండ్’

పౌండ్ స్టెర్లింగ్ ను కరెన్సీగా వదులుకోవాల్సి వస్తే స్కాట్లండ్ కొత్త కరెన్సీని ఏర్పాటు చేసుకోవడం గానీ లేదా యూరో జోన్ లో చేరడం ద్వారా యూరోను కరెన్సీగా చేసుకోవడం గానీ చేయాల్సి ఉంటుంది. అయితే స్కాట్లండ్ నేతలు యూరో జోన్ లో చేరడానికి సిద్ధంగా లేరు. యూరోపియన్ యూనియన్ లో ఒక స్వతంత్ర సభ్య దేశంగా ఉండడానికి మాత్రమే వారు మొగ్గు చూపుతున్నారు. కానీ పౌండ్ కరెన్సీని కోల్పోయినట్లయితే స్కాట్లండ్ ఆర్ధిక వ్యవస్ధ కొన్ని ఆర్ధిక కుదుపులను…

ప్రశ్న: వోట్-ఆన్-అకౌంట్ అంటే?

ప్రశ్న (మల్లిఖార్జున్): సాధారణ బడ్జెట్ కీ, వోట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ కీ తేడా చెప్పండి? సమాధానం: క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఖర్చులు గడుపుకోవడానికి ప్రతిపాదించే బడ్జెట్ నే వోట్-ఆన్-అకౌంట్ అంటారు. సాధారణంగా ఎన్నికల సంవత్సరంలో వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ అవసరం వస్తుంది. పూర్తి స్ధాయి సాధారణ బడ్జెట్ ఆమోదించాలంటే సభల్లో సంతృప్తికరంగా చర్చలు జరగాలి. ఈ చర్చలన్నీ ముగియాలంటే సమయం తీసుకుంటుంది. కొత్త బడ్జెట్ సంవత్సరం వచ్చేస్తుంది. ఈ లోపు ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. పాత ప్రభుత్వం పూర్తి…

వోడాఫోన్ పన్ను కేసు: రాజీ చర్చలు విఫలం

వోడాఫోన్ ఆదాయ పన్ను కేసులో కంపెనీ, భారత ప్రభుత్వంల మధ్య జరుగుతున్న చర్చలు విఫలం అయ్యాయి. దానితో రు. 20,000 కోట్ల రూపాయల పన్ను వసూలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ కు న్యాయ శాఖ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. వోడాఫోన్ కంపెనీ వైఖరితో విసిగిపోయిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ రాజీ చర్చల నుండి వెనక్కి మళ్లాలని కేబినెట్ లో నోట్ పెట్టిందని…

అమెరికా ఋణ పరిమితి: సమీపిస్తున్న మరో గడువు

అమెరికా ఋణ పరిమితి పెంపుకు గడువు మరోసారి సమీపిస్తోంది. అమెరికా చెల్లింపులు చేయలేని పరిస్ధితికి త్వరలోనే వస్తుందని ఆ దేశ కోశాగార అధిపతి (ట్రెజరీ సెక్రటరీ) జాక్ ల్యూ హెచ్చరించాడు. ఫిబ్రవరి ఆఖరు వరకు ఖర్చులు గడుస్తాయని కానీ ఆ తర్వాత రోజులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. గత సంవత్సరం తాత్కాలికంగా ఋణ పరిమితిని పెంచడం ద్వారా ఇరు పార్టీలు సంక్షోభం నుండి తృటిలో బైటపడినట్లు చెప్పాయి. ఒబామా కేర్ చట్టం…

యూరప్ ముంగిట ఎమర్జింగ్ మార్కెట్ సంక్షోభం

ఋణ సంక్షోభంతో తీసుకుంటున్న ఐరోపా ప్రస్తుతం మరో సంక్షోభం ముంగిట నిలబడినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఋణ సంక్షోభంలో కూరుకుపోయిన యూరో జోన్ దేశాలు ఐ.ఎం.ఎఫ్ సహాయంతో బైటపడడానికి పాట్లు పడుతున్నాయి. కంపెనీల సంక్షోభాన్ని ప్రజల పైకి మరల్చడం ద్వారా సో-కాల్డ్ అభివృద్ధి చెందిన ఐరోపా ఆర్ధిక వ్యవస్ధలు ఋణ సంక్షోభం ద్వారా ఎదుర్కోవలసిన ఆర్ధిక మాంద్యాన్ని తాత్కాలికంగా వాయిదా వేయగలిగాయి. అయితే బ్రిక్స్, మింట్, ఫ్రగైల్ ఫైవ్ గా…