యనమల బడ్జెట్: నేల విడిచి సాము -2
5.23 లక్షల కోట్ల మేరకు రాష్ట్ర జి.డి.పి ఉండగలదని అంచనా వేస్తూ రెవిన్యూ లోటు జి.డి.పి లో 1.16 శాతం గానూ, బడ్జెట్ లోటు జి.డి.పి లో 2.3 శాతం గానూ తేల్చారు. ఈ అంకెలు ఆకర్షణీయంగానే ఉన్నా అసలు ఆదాయం, వ్యయం తేలితేగాని ఈ అంకెల పస తేలదు. బడ్జెట్ ప్రతిపాదనలకు వాస్తవ ఖర్చులకు పొంతన ఉండదని అనుభవం చెబుతున్న సత్యం. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్ధిక వ్యవస్ధను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఉద్దేశించిన పత్రంగా కాకుండా ఒక…
