ఢిల్లీ రాష్ట్ర పీఠంపై ఆమ్ ఆద్మీ

సామాన్య మానవుడి పేరుతోనే పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ బృందం దేశ రాజధానిలో అధికారం చేపట్టింది. సి.ఎం (కామన్ మేన్) స్వయంగా సి.ఎం (చీఫ్ మినిష్టర్) కుర్చీని అలంకరించిన దృశ్యం నేడు ఢిల్లీలో ఆవిష్కృతం అయింది. తాను నిజంగా కామన్ మేన్/ఆమ్ ఆద్మీ/సామాన్య మానవుడి నే అనీ, అధికారం మత్తు తాను ఎక్కించుకోనననీ, పదవీ దాహం తమ దరి చేరదని, ఢిల్లీ సామాన్య మానవుల సామాన్య కోర్కెలకు, సమస్యలకు, డిమాండ్లకు తాము కట్టుబడి ఉంటామని కేజ్రివాల్ బృందం…

గుజరాత్ అల్లర్లు ఆయన్ని మొదలంటా కదిలించాయట!

దాదాపు పన్నెండేళ్ళ నుండి గుజరాత్ అల్లర్లపై స్పందించడానికి నిరాకరించిన నరేంద్ర మోడి ఇప్పుడు నోరు విప్పారు. తన హయాంలో గుజరాత్ మారణకాండ చోటు చేసుకున్నందుకు కనీసం విచారం ప్రకటించడానికి కూడా మొండిగా తిరస్కరించిన మోడి, జకియా జాఫ్రీ విన్నపాన్ని మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన అనంతరమే స్పందించారు. అల్లర్లపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించబడిన స్పెషల్ ఇనివేస్టిగేషన్ టీం (సిట్) నరేంద్ర మోడికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని జకియా జాఫ్రీ సవాలు చేశారు. ఆమె…

మోడి మరియు మాధురి, ఒక అక్రమ నిఘా కధ

నరేంద్ర మోడి పై వచ్చిన స్నూపింగ్ ఆరోపణల కధ కేంద్ర ప్రభుత్వం చొరవతో రసకందాయంలో పడింది. ఒక అమాయక యువతి పట్ల మోహం పెంచుకున్న ‘సాహెబ్’ తన అనుంగు సహచరుడు అమిత్ షా కు ఆమెపై గూఢచర్యానికి పాల్పడమని ఆదేశాలు ఇవ్వడం, సదరు ఆదేశాలను అమిత్ తు.చ తప్పక పాటించడం, ఈ వ్యవహారాలన్నింటిని పరిశోధనాత్మక వార్తా పోర్టళ్ళు  కోబ్రా పోస్ట్, గులాయిల్ ఈక ఈక పీకి పెడుతుండడంతో గుజరాత్ ముఖ్యమంత్రిలోని మరో కోణం పచ్చిగా వెలుగు చూస్తోంది.…

కేజ్రివాల్, ఒక బహుమతి -కార్టూన్

“నేను ఒక విజయాన్నిగాని లేదా ఒక కేజ్రివాల్ ని గాని బహుమతిగా ఇమ్మని శాంతాను అడిగాను” – ఎ.ఎ.పి/కేజ్రివాల్ తో పొత్తు కాంగ్రెస్ కు లాభమా, నష్టమా? ఎ.ఎ.పి తో పొత్తు వద్దని కాంగ్రెస్ లో కొందరు నాయకులు మొదటి నుండి మొత్తుకుంటున్నారు. దానిక్కారణం ఆయన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై దాడి చేయడం ఒకటయితే, ముఖ్య కారణం కాంగ్రెస్ పాలనలో అవినీతిపై విచారణ జరిపిస్తానని వాగ్దానం చేయడం. కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి కేజ్రివాల్ విధించిన 18 షరతుల్లో…

రెండు వాగ్దానాలు నెరవేర్చిన అరవింద్?

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే తాను ఇచ్చిన వాగ్దానాల్లో రెండింటిని అరవింద్ కేజ్రివాల్ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. కోట్లాది కళ్ల పహారా మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అరవింద్ తనకు వ్యక్తిగత సెక్యూరిటీ అవసరం లేదని చెప్పి భద్రతా సిబ్బందిని వెనక్కి పంపేశారు. తద్వారా వి.ఐ.పి సంస్కృతిని నిర్మూలిస్తామన్న వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నాంది పలికారు. అలాగే ప్రభుత్వ భవనంలోకి తన నివాసం మార్చుకోవడానికి కూడా ఆయన తిరస్కరించారని పత్రికలు తెలిపాయి. తాను గానీ, తన ఎమ్మేల్యేలు…

ఊడ్చిన చెత్త బుట్టే కేజ్రివాల్ సి.ఎం సీటు! -కార్టూన్

అరవింద్ కేజ్రివాల్, మనీష్ సిసోడియా తదితర అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలు స్ధాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురు. చీపురు చేతబట్టి రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆప్ కు ఢిల్లీ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా చేశారు. 8 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మరో విధంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది. చీపురు ఊడ్చిన చెత్త ఎక్కడికి చేరుతుంది? చెత్త…

ఢిల్లీ: బ్యాలట్ ఓట్ Vs సోషల్ మీడియా ఓట్ -కార్టూన్

“ధన్యవాదాలు, ఢిల్లీ! ప్రజాస్వామిక ఓటింగ్ తీర్పును పక్కన పెట్టినందుకు…” అవినీతి వ్యతిరేక నినాదంతో వినూత్న రీతిలో ఢిల్లీ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. పార్టీ స్ధాపించిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టి కరిపించి రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎ.ఎ.పి ఎన్నికల అనంతరం కూడా పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బి.జె.పి, ఎ.ఎ.పి…

తెలంగాణ: పామూ నిచ్చెనల ఆటకు వేదిక -కార్టూన్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సంగతేమో గానీ ఆ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు పరమ జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రజల దైనందిన సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోని ప్రబుద్ధులు కొందరు ఇప్పుడు సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి కొందరు తెలంగాణ వస్తే చాలు ఇక స్వర్గమే అన్నట్లుగా ‘అరచేతిలో వైకుంఠం’ చూపుతున్నారు. ఇద్దరూ కలిసి అటూ, ఇటూ జనాన్ని ఎంతగా వంచించగలరో అంతా వంచిస్తున్నారు. కాకపోతే అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా…

తెలంగాణ ముసాయిదాకు రాష్ట్రపతి కవరింగ్ లెటర్

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తయారు చేయగా కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ బిల్లు 2013’ ముసాయిదాను రాష్ట్రపతి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ పరిశీలన నిమిత్తం పంపారు. బిల్లు మొత్తంగానూ, అంశాలవారీగానూ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు ముసాయిదాపై ఏమి అభిప్రాయపడుతున్నదీ రాష్ట్రపతికి తెలియజేయాలని చెబుతూ అందుకు జనవరి 23ను తుది గడువుగా రాష్ట్రపతి నిర్దేశించారు. సదరు బిల్లు ముసాయిదాకు రాష్ట్రపతి రాసిన కవరింగ్ లెటర్ లోని అంశాలు ఇలా…

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ చర్చ ప్రారంభం, గొడవ, వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు 2013’ ప్రవేశపెట్టారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు. అయితే చర్చ ప్రారంభం అయిందా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాంతాల వారీగా చీలిపోయిన మంత్రులు తమ తమ ప్రాంతానికి అనుగుణంగా భాష్యం ఇస్తున్నారు. చర్చ ప్రారంభం అయిందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, ప్రారంభం కాలేదని సీమాంధ్ర మంత్రులు చెబుతున్నారు. మొత్తం మీద బిల్లయితే అసెంబ్లీ లోకి అడుగు పెట్టినట్లే. శాసనసభ…

దేవయాని అరెస్టు: ఇండియా ఆగ్రహం, తగ్గని అమెరికా

న్యూయార్క్ లో భారత కాన్సల్ కార్యాలయంలోని డిప్యూటీ కాన్సల్ జనరల్ దేవయాని అరెస్టుపై ఇండియా తీవ్రంగా స్పందించింది. వియన్నా సదస్సు ఒప్పందాలను గౌరవించకుండా తమ రాయబారి పట్ల అనుచితంగా వ్యవహరించడం తమకు ససేమిరా ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇండియాలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ ను పిలిపించుకుని వివరణ కోరారు. కాగా అమెరికా మాత్రం వెనక్కి తగ్గలేదు. దేవయాని…

విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం

సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను…

ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు. గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ…

సీమాంధ్ర ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువు

సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిల అవిశ్వాస తీర్మానానికి మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతాల్లోని ఇతర పార్టీల ఎం.పిల మద్దతు కూడగట్టినప్పటికీ ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్ధితి ఏ పార్టీకి లేకపోవడమే దీనిని ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చివరికి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కూడా అవిశ్వాసం తెలపడానికి నిరాకరించారని ది హిందు పత్రిక తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల పరువు…

‘ఆధార్ కార్డు–ఉరిశిక్ష’ -తమాషా కధ

ఆంధ్ర జ్యోతి (ఆదివారం) నుండి *** ఉరిశిక్ష పడిన ఖైదీని ఉరికంబం ఎక్కించారు. ముసుగు తొడగబోతుంటే వద్దన్నాడు ఖైదీ. “ముసుగేసుకోకపోతే భయమేస్తుంది” అన్నాడు తలారి. “నీకా?” అడిగాడు ఖైదీ. “కాదు. నీకు”అన్నాడు తలారి. ఖైదీ నవ్వాడు. ” నా ఆఖరి శ్వాసదాకా ఈ దరిద్రగొట్టు అవకతవక కంగాళీ ప్రపంచాన్ని చూడనీ. బాగా గుర్తు పెట్టుకోవాలి. పొరపాటున మళ్లీ ఈ భూమ్మీద పుట్టి ఛస్తానేమో. అలా జరక్కూడదని కళ్లు తెరిచే ప్రార్థించుకుంటా” అన్నాడు. తలారికి ఏం అర్థం కాలా.…