కేజ్రీవాల్ ఇంకో పెద్ద మెట్టు ఎక్కాలి -కార్టూన్

  ఢిల్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్/ఎఎపి ఒక పెద్ద మెట్టు ఎక్కి వచ్చారు. ఇప్పుడిక పూర్తి స్ధాయి పాలన అనే మరో పెద్ద మెట్టు ఎక్కాలి. ఆయన, ఆయన పార్టీ అన్నీ రకాలుగా విఫలం కావాలని సంపన్న వర్గాలు, వారి పార్టీలు తీవ్రంగా కోరుకుంటున్నందున ఢిల్లీ రాష్ట్ర పాలన ఎఎపికి నల్లేరుపై నడక ఏమీ కాదు. పార్టీ వయసు, అనుభవం… ఇత్యాది అంశాల రీత్యా ఎఎపి సైజు చాలా చిన్నదని కార్టూనిస్టు…

ఎఎపి ఓటర్లు దళితులు, పేదలు, యువకులు

  అత్యధిక సీట్లను గెలుచుకోవడం బట్టి ఎఎపికి ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలూ ఎఎపికి ఓటు వేసి ఉంటారని భావించవచ్చు. కానీ కాస్త లోతుకు వెళ్తే ఈ పరిశీలనలో లోపం కనిపిస్తుంది. ఎందుకంటే బి.జె.పికి వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదు. 32.2 శాతం ఓట్లు సీట్ల సంఖ్యను పెంచడంలో సహాయపడి ఉండకపోవచ్చు గాని ఒక పార్టీకి అన్ని ఓట్లు పడడాన్ని తక్కువ చేసి చెప్పలేము. అందుకే మరింత లోతుకి వెళ్ళి…

ఛిద్రమైన బి.జె.పి జంట టవర్లు -రాజ్ ధాకరే కార్టూన్

ఒబామా: “మరొకసారి జంట స్తంభాలు కూలిపోయాయి, కానీ విమానం మాత్రం భద్రంగా ఉందే” ********* అద్భుతమైన కార్టూన్ కదా! అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇటీవలే ఇండియా సందర్శించిన సంగతి తెలిసిందే. ఒబామా పర్యటన విజయవంతం అయిందని మోడి, బి.జె.పిలు ఆ తర్వాత ఢంకా బజాయించారు. చాలా పత్రికలు అదే నమ్ముతూ తాము కూడా శక్తి కొద్దీ ఢంకాలు బజాయించాయి. దానితో పాటు ‘ఆ విజయం ఢిల్లీ ఎన్నికల్లో మోడీకి ఉపయోగపడుతుంది’ అని కూడా చెప్పాయి. తీరా చూస్తే…

నితీష్ కొత్త విశ్వాసం ఎక్కడిది? -కార్టూన్

మోడి దెబ్బతో: “నేను ఓటర్ల విశ్వాసం కోల్పోయాను. రాజీనామా చేసేస్తున్నాను” లాలూ తోడు రాగా: “నాకు మళ్ళీ ఓటర్ల విశ్వాసం వచ్చేసింది” ********* లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయిన ఆనాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ “తాను ఓటరు విశ్వాసం కోల్పోయినందుకు రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించి గద్దె దిగిపోయారు. ఇప్పుడేమో తనకు 130 మంది ఎం.ఎల్.ఏ ల విశ్వాసం ఉన్నది గనుక తనకు మళ్ళీ సి.ఎం కుర్చీ ఇచ్చేయ్యాలని పాట్నా నుండి…

చీపురు కట్టా, కుతుబ్ మినారా? -కార్టూన్

  “వటుడింతింతై…” అన్నట్లుగా ఎదిగిపోయిన సామాన్యుడి పార్టీని చూసి తెల్లబోయే పని ఇప్పుడు బి.జె.పి సామ్రాజ్యాధీశుల వంతు. ‘లోక్ పాల్’ చట్టం కోసం హజారే, అరవింద్, బేడి, భూషణ్ ల బృందం జనాన్ని వెంటేసుకుని ఉద్యమిస్తున్నప్పుడు ‘మీరు రాజకీయాల్లోకి వచ్చి చూడండి. అదెంత కష్టమైన పనో’ అంటూ కాంగ్రెస్, బి.జె.పి పార్టీల నాయకులు ఎకసక్కెం చేశారు. “అయితే మేమూ రాజకీయాల్లోకి వచ్చి చూపిస్తాం. పార్టీ పెట్టి ప్రజల కోసం చేసే పాలన ఎంత తేలికో చూపిస్తాం” అంటూ…

బి.జె.పి పుండుపై శివసేన ఉప్పు

అసలే పరువు పోయి బాధలో ఉన్నపుడు మిత్రుడు చేసే సరదా ఎగతాళి కూడా కోపం తెప్పిస్తుంది. మిత్రులు అనుకున్నవాళ్లు సీరియస్ గానే ఎగతాళి చేస్తే ఇక వచ్చే ఆగ్రహం పట్టలేము. బి.జె.పి పరిస్ధితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఏఏపి చేతుల్లో చావు దెబ్బ తిన్న దిగ్భ్రాంతి నుండి ఇకా బైటపడక ముందే మహారాష్ట్రలో మిత్ర పక్షంగా అధికారం పంచుకుంటున్న శివ సేన ఎగతాళి ప్రకటనలు చేస్తూ బి.జె.పి దుంప తెంచుతోంది. “వేవ్ కంటే సునామీ ఇంకా శక్తివంతమైనదని…

ఢిల్లీ: సామాన్యుడి దెబ్బకు దిమ్మ తిరిగింది!

ఆమ్ ఆద్మీ దెబ్బ ఏమిటో సంపన్నులకు రుచి చూపిన ఘనత ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెబుదాం. ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో భారత దేశంలోని సామాన్య కార్మికవర్గ పౌరుడు కాస్త గర్వంగా తల ఎగరవేయదగ్గ రోజు ఈ రోజని చెప్పడంలో సందేహం లేదు. స్ధల, కాల పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే భారత దేశంలోని పార్లమెంటరీ రాజకీయాల్లో అచ్చంగా సామాన్య ప్రజలు ఐక్యమై పాలకవర్గాలకు వారి వెనుక ఉన్న సంపన్న కులీన దోపిడీ శక్తులకు…

నిశ్శబ్దం ఒక ఎంపిక కాదు -ది హిందు ఎడిటోరియల్

అమెరికా అధ్యక్షుడు బారక్ బారక్ ఒబామా, ఇండియాలో కుంచించుకుపోతున్న మత సామరస్యం గురించి తొమ్మిది రోజుల వ్యవధిలో రెండుసార్లు వరుసగా ప్రకటనలు గుప్పించడంపై ఇండియాలో కాస్త తత్తరపాటును సృష్టించింది. మొదటి సారి జనవరి 27 తేదీన తన భారత సందర్శనను ముగిస్తూ మత ప్రాతిపదికన లోలోపల విభజనకు గురైన దేశాలు ఎన్నటికీ ప్రగతి సాధించలేవన్న అంశాన్ని ఒబామా నొక్కి చెప్పారు; రెండోసారి ఫిబ్రవరి 5 తేదీన మాట్లాడుతూ ఆయన భారత దేశం నుండి వెలువడుతున్న మత అసహనం…

వెచ్చగా ఉంచమంటే మంటలు రగిలించాడు -కార్టూన్

బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝి సంప్రదాయానికి విరుద్ధంగా పోయి గొప్ప చిక్కుల్నే తెచ్చి పెట్టారు. చిక్కులు ఎవరికి అన్నది కొద్ది రోజుల్లో తేలవచ్చు, ఇప్పటివరకు చూస్తే మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ చిక్కులు ఎదుర్కొంటున్నారు. మంఝిని నమ్మి ముఖ్యమంత్రి పీఠం అప్పజెపితే ఆయన మోసం చేశారని నితీష్ ఫిర్యాదు చేయవచ్చు గానీ, నిజానికి సి.ఎం సీటులో కూర్చోబెట్టడానికి గానీ, దిగిపొమ్మనడానికి గానీ ఆయనెవరు? లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత తీసుకుని రాజీనామా చేసిన…

బి.జె.పిలో మోడి, షా లదే రాజ్యం -కార్టూన్

కాంగ్రెస్ కంటే తమది విభిన్నమైన పార్టీ అని బి.జె.పి నేతలు చెప్పుకుంటారు. కాంగ్రెస్ లో సంస్ధాగత ప్రజాస్వామ్యం బొత్తిగా లేదని, కేవలం కుటుంబ స్వామ్యమే ఉన్నదని వెంకయ్యనాయుడు లాంటి నేతలు తరచుగా ఆరోపిస్తారు. అలాంటి బి.జె.పి లోనూ నేడు కేవలం ఇద్దరంటే ఇద్దరు వ్యక్తులదే ఇష్టా రాజ్యం అయిందని ఈ కార్టూన్ చెబుతోంది. బి.జె.పి చిహ్నం కమలంలో వికసించిన పూ రెమ్మలు మోడి అయితే, వాటికి పత్రహరితాన్ని పోషణగా అందించే ఆకులు అమిత్ షా అని కార్టూనిస్టు…

మోడి బాణాలు కేజ్రీవాల్ కలికితురాళ్ళు -కార్టూన్

లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్ధితిని ఢిల్లీ ఎన్నికలకు ముందు బి.జె.పి ఎదుర్కొంది. ఇంకా చెప్పాలంటే ఆనాడు బి.జె.పి ప్రదర్శించిన ఓటు చతురతను ఈ రోజు ఎఎపి ప్రదర్శించింది. వ్యక్తిగత స్ధాయికి వెళ్ళినట్లయితే ఆనాడు మోడి కనపరిచిన చాతుర్యం ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ కనబరుస్తున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నిస్పృహతో చేసిన విమర్శలను తన ప్రచారాస్త్రాలుగా మోడి/బి.జె.పి మలుచుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ బి.జె.పి ఒకింత బెదురుతో, నిస్పృహతో చేసిన విమర్శలను…

భూసేకరణ చట్టం సవరణ ఆర్డినెన్స్ -ది హిందు ఆర్టికల్ (2)

మొదటి భాగం తరువాత…………. – అభివృద్ధి పేరుతో… ఈ వాదనతో ఉన్న రెండో సమస్య ఏమిటంటే, ధరలపై కేంద్రీకరించడం ద్వారా మరింత మౌలికమయిన రాజకీయ సమస్యను విస్మరించింది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రైతుల నుండి భూములను బలవంతంగా గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి? కనీసం ఆంగ్లంలో అనుబంధాలు ఇచ్చినప్పటి నుండి… భూములను ఒక గ్రూపు ప్రజల నుండి తీసేసుకుని మరో గ్రూపుకు (సాధారణంగా సంపన్నులు) ఇవ్వడాన్ని “ప్రజా” లేదా “జాతీయ” లక్ష్యాన్ని నెరవేర్చడంగా ప్రభుత్వాలు సమర్ధించుకున్నాయి.…

ఇమాం మద్దతుకు ఎఎపి తిరస్కరణ!

ఢిల్లీ ఎన్నికలపై బి.జె.పి పెట్టుకున్న ఆశల్ని ఎఎపి వమ్ము చేసేట్లే ఉంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఢిల్లీ ఇమాం మద్దతు కోసం ఎదురు చూస్తుంటే ఆ ఇమామే ఎదురొచ్చి మద్దతు ఇస్తానంటున్నా ‘వద్దు, పొమ్మని’ ఎఎపి తిరస్కరించింది. ఫలితంగా, ఢిల్లీ ఓటర్లను మత ప్రాతిపదికన చీల్చే అమూల్య అవకాశం బి.జె.పికి దూరం అయింది. జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ బుఖారి ఇటీవల ఎఎపి పార్టీకి మద్దతు ప్రకటించారు. ఎఎపి కోరనప్పటికీ ఆయనే స్వయంగా ముందుకు వచ్చి…

దిష్టి బొమ్మను నిలబెట్టి, దానిపైనే రెట్ట వేస్తూ… -కార్టూన్

‘జనతా పరివార్’ గా చెప్పుకుంటున్న నేతల భాగోతం ఇది! తమను తాము దళితోద్ధారకులుగా చెప్పుకోవడం ఈ నేతలకు ఉన్న అలవాటు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాము సెక్యులరిస్టులం అని కూడా వీళ్ళు చెప్పుకుంటారు. వాస్తవంలో వీరి ఆచరణ అంతా అందుకు విరుద్ధం. ఎన్నికల్లో బి.జె.పి చేతుల్లో చావు దెబ్బ రుచి చూసిన నితీశ్ కుమార్ పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ఒక దిష్టి బొమ్మను వెతుక్కుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టారు. ఆయన పేరు జీతన్…

అనిశ్చితికి ముగింపు పలకండి! -ది హిందూ ఎడిట్

(ది హిందు, ఫిబ్రవరి 3, 2015 నాటి సంపాదకీయం ‘End the ambivalence’ కు యధాతధ అనువాదం. -విశేఖర్) ********** రాజ్యాంగం పీఠిక నుండి ‘లౌకిక’ మరియు ‘సామ్యవాద’ పదాలను తొలగించాలన్న డిమాండ్లపై తలెత్తిన వివాదాన్ని తప్పించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సరిగ్గానే కృషి చేశారు. ది హిందు కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక అంతకంటే స్పష్టత ఉండబోదన్న రీతిలో వివరించారు: “ప్రస్తుతం ఉన్న పీఠిక ఇప్పుడు ఉన్నట్లుగానే యధాతధంగా…