గానుగెద్దు సి.బి.ఐ -కార్టూన్

ఆ, అది చాలా సార్లు దగ్గరగా వచ్చింది లెండి! – బీహార్ గడ్డి కుంభకోణం అందరికీ తెలిసిందే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇందులో ఒక నిందితుడు. ఈ కేసు అంతిమ తీర్పే తరువాయి అన్న దశలో ఉంది. ఈ దశలో గడ్డి కుంభకోణం కేసును సి.బి.ఐ కోర్టు నుండి మరో కోర్టుకు మార్చాలంటూ ఆయన బీహార్ హై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కేసు కొట్టేసింది. కేసును మార్చాలన్న ఆయన…

ప్రిజం: మరో 4 స్లైడ్లు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్

అమెరికా అక్రమ గూఢచర్యాన్ని ధ్రువపరిచే మరో నాలుగు పవర్ పాయింట్ స్లైడ్లను ‘ది వాషింగ్టన్ పోస్ట్‘ పత్రిక ప్రచురించింది. ప్రిజం అనే ప్రోగ్రామ్ సహాయంతో 9 ఇంటర్నెట్ కంపెనీల సర్వర్ల నుండి ప్రపంచ ప్రజల సెల్ ఫోన్, ఈ మెయిల్, చాటింగ్ తదితర సంభాషణలను అమెరికా గూఢచార సంస్ధ రికార్డు చేస్తున్న సంగతి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. గూఢచారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్లను స్నోడెన్ ద్వారా సంపాదించిన ‘ది…

గ్రీసు రుణ సంక్షోభం: లెంపలు వేసుకున్న ఐ.ఎం.ఎఫ్

దేశాల ఆర్ధిక వ్యవస్ధల తప్పులను సవరించే బాధ్యతను తనకు తాను నెత్తిమీద వేసుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్ధ మొదటిసారిగా, పటాటోపానికే ఐనా, లెంపలు వేసుకుంది. గ్రీసు దేశ ప్రజలపై బలవంతంగా రుద్దిన పొదుపు విధానాలు ఎంతవరకు పని చేస్తాయన్న విషయమై తాము తప్పుడు అంచనాలు వేశామని అంగీకరించింది. అమెరికా, ఐరోపాల తరపున ప్రపంచ దేశాల మీద ద్రవ్య పెత్తనం సాగించే ఐ.ఎం.ఎఫ్, తాను తప్పు చేశానని ఒప్పుకోవడం అసాధారణం. అయితే, ఈ ఒప్పుకోలు వలన…

గోపీనాధ్ ముండేకి ఎన్నికల సంస్కరణలు కావాలిప్పుడు -కార్టూన్

గోపీనాధ్ ముండే! ఈయన 2009లో మహారాష్ట్ర లోని బీడ్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికయిన బి.జె.పి నాయకుడు. లోక్ సభలో బి.జె.పి పార్లమెంటరీ పార్టీకి ఈయన ఉపనాయకుడు కూడా. 2009 ఎన్నికల్లో 19 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశానని ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చిన ముండే ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తాను లోక్ సభ ఎన్నికలకు 8 కోట్లు ఖర్చు చేశానని అసలు నిజం వెళ్ళగక్కారు. ఈయన మర్చిపోయి నిజం మాట్లాడలేదు.…