పశ్చిమ దేశాల పంచ ముఖ ముట్టడికి రష్యా జవాబు ఇచ్చేనా!?

మానవ జాతి నాగరికత మరియు అభివృద్ధి, పరస్పర సహకారం మరియు సౌభ్రాతృత్వం, సమస్త మానవుల ప్రజాస్వామ్యం-సమానత్వం ఇవి మానవ సమాజం సాధించిన మహోన్నత విలువలు. ఈ విలువలతో పోల్చితే అమెరికా, పశ్చిమ దేశాలు తాము ఎంత అనాగరిక పాశవిక దశలో ఉన్నామో స్పష్టంగా తమ నోటి తోనే ప్రకటించుకుంటున్నాయి. ఉక్రెయిన్ కేంద్రంగా రష్యా, నాటో దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వారికి ఆ అవకాశం ఇచ్చింది. రష్యాపై విధించిన ఆంక్షలకు మద్దతు ఇవ్వకుండా తటస్థ వైఖరిని పాటిస్తున్న…

‘బ్లాగింగ్’ మరియు ‘హ్యూమన్ సివిలైజేషన్’!

బ్లాగింగ్ అన్నది అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఒక సాధనం. పత్రికలు, ఛానెళ్లు కొద్ది మంది వ్యక్తిగత, వృత్తిగత జర్నలిస్టులకి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందులో ఉద్యోగం సంపాదించి అభిప్రాయాలు అనేకమందితో పంచుకోవడం, చెప్పడం అందరికీ సాధ్యం కాదు. జర్నలిజంలో ప్రవేశం లేకుండానే, జర్నలిజం చదవకుండానే అనేకమంది వివిధ అంశాలను చర్చించగల సామర్ధ్యం కలిగి ఉంటారు. అలాంటివారికి తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి బ్లాగింగ్ మంచి సాధనం. బ్లాగింగ్ అయినా, మరే సామాజిక…

సల్లీ డీల్స్ కేసులో మొదటి అరెస్టు

బాధితులు ఫిర్యాదు చేసిన 6 నెలల తర్వాత ‘సల్లీ డీల్స్’ అప్లికేషన్ కేసులో మొదటి అరెస్టు జరిగింది. ఈ అరెస్టును ఆదివారం ఢిల్లీ పోలీసులు చేశారు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం నుండి ‘ఓంకారేశ్వర్ ఠాకూర్’ ని అరెస్ట్ చేశామనీ, అతనే సల్లీ డీల్స్ ఆప్ సృష్టికర్త అనీ ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ముంబై పోలీసులు ‘బుల్లీ బాయ్’ కేసులో వరుసగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు కూడా స్పందించక తప్పలేదు. జులై…

బుల్లి బాయ్: ఢిల్లీ పోలీసుల చేతుల్లో ప్రధాన కుట్రదారు

బుల్లి బాయ్ ఆప్ వెనుక ఉన్న ప్రధాన కుట్రదారు ఎవరో తెలిసిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అస్సాంలో అతని జాడ కనుగొన్నామని వారు చెప్పారు. ఢిల్లీ పోలీసు బృందం అస్సాం వెల్లిందని ఈ రోజు సాయంత్రం 3 లేదా 4 గంటల సమయానికి నిందితుడిని ఢిల్లీకి తెస్తారని ఢిల్లీ సైబర్ సెల్ డి‌సి‌పి కే‌పి‌ఎస్ మల్హోత్రా చెప్పారు (ఇండియన్ ఎక్స్^ప్రెస్, 06/01/2022). “ప్రధాన కుట్రదారుని మేము అరెస్ట్ చేశాము. అతనే వెబ్ సైట్ తయారీలో ప్రధాన ముద్దాయి.…

Bulli Bai ఆప్: నిర్ఘాంతపోయే నిజాలు!

ముంబై పోలీసుల పుణ్యమాని బుల్లి బాయ్ ఆప్ కేసులో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. సల్లీ డీల్స్ ఆప్ కేసులో గత జులై నెలలో బాధితులు, ఢిల్లీ వుమెన్ కమిషన్, విలేఖరులు వెంటపడి వేడుకున్నా నిందితులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది చొరవతో ముంబై పోలీసులు కేసును వేగంగా ఛేదిస్తున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలే కేసు వివరాలు కొన్నింటిని విలేఖరులకు వెల్లడించారు. ఇప్పటివరకు ముగ్గురు…

హిందూత్వ ముఠాలు ఉపరాష్ట్రపతి మాటలు వినాలి!

ఇటీవల కాలంలో క్రైస్తవ మతం అనుసరిస్తున్న ప్రజలపై దాడులు పెరిగాయి. హిందూ మతం పేరు చెప్పుకుని వివిధ రౌడీ మూకలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. తమ దాడులకు న్యాయ బద్ధత, నైతిక సమర్థత కల్పించుకునేందుకు మత మార్పిడి జరుగుతోందని, దాన్ని అడ్డుకుంటున్నామని సాకు చెబుతున్నారు. కొన్నిసార్లయితే బహిరంగంగానే పర మత విద్వేషం చాటుకుంటున్నారు. మధ్య యుగాల నాటి శైవ, వైష్ణవ ఊచకోతలు, ఆసియా-ఐరోపాల్లోని క్రైస్తవ క్రూసేడ్లను తలపిస్తూ ముస్లింలు, క్రైస్తవులపై దాడులకు తెగబడుతున్నారు. కర్ణాటక బి‌జే‌పి ఎం‌పి…

మోడి అహంకారి! -మేఘాలయ గవర్నర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అహంకారి అని మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ అభివర్ణించారు. రైతుల సమస్య గురించి చర్చించడానికి వెళితే ఇద్దరం వాదులాడుకోవలసిన పరిస్ధితి ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు. (ఇండియన్ ఎక్స్^ప్రెస్, జనవరి 3, 2022) బి‌జే‌పి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అదురు బెదురు లేకుండా విమర్శించే బి‌జే‌పి నేతల్లో సత్య పాల్ మాలిక్ ఒకరు. రెండు అధికార కేంద్రాలు (నరేంద్ర మోడి, ఆర్‌ఎస్‌ఎస్) ఉన్న చోట…

చట్టం అమలు: మెజారిటీలకి ఒకటి, మైనారిటీలకి ఒకటి

మునవర్ ఫరూకి ఒక స్టాండప్ కమెడియన్. జనాన్ని నవ్వించడం ఈ యువ కళాకారుడి వృత్తి, ప్రవృత్తి. జనవరి 1, 2021 తేదీ ఇండోర్ (మధ్య ప్రదేశ్) పట్టణంలో అతను ప్రదర్శన ఇవ్వబోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 295 ఏ కింద కేసు పెట్టారు. నేరం ఏమిటని విలేఖరులు అడిగితే “తన కామెడీ షోలో ఇతరుల మత భావాలను నమ్మకాలను అవమానపరిచాడు” జిల్లా ఎస్‌పి అని చెప్పాడు. “మునవర్ ఆరోజు అసలు షో మొదలు పెట్టకుండానే అరెస్ట్…

హిందూ దేశంగా మార్చుతామని ప్రతిజ్ఞ, పోలీసులకు ఫిర్యాదు

హిందూత్వ గణాలు దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతంలో చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ లోని గోవింద్ పురి మెట్రో స్టేషన్ సమీపంలో ‘హిందూ యువ వాహిని’ అనే సంస్ధ ఆద్వర్యంలో జరిగిన సదస్సు మరో విడత పరమత విద్వేష ప్రసంగాలకు, ప్రతిజ్ఞలకు వేదికగా నిలిచింది. ఈసారి భారత దేశం మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేందుకు చంపడానికి, చావడానికి కూడా సిద్ధమంటూ సభికుల చేత నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు. ముస్లింలు, క్రైస్తవులపై జీనోసైడ్ (సామూహిక హత్యాకాండ) జరపాలని, మాజీ ప్రధాని మన్మోహన్…

ఇది హిందూత్వ కాదు ‘చోర్ బజార్’! -శివ సేన

హిందూత్వను ఎవరు నిజాయితీగా ఆచరిస్తున్నారు అన్న అంశంలో బి‌జే‌పి, శివసేన పార్టీల మధ్య ఎప్పుడూ పోటీ నెలకొని ఉంటుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో కలిసి శివసేన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పోటీ మరింత తీవ్రం అయింది. బి‌జే‌పి తో స్నేహం విడనాడి లిబరల్ బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సి‌పి లతో జట్టు కట్టడమే హిందూత్వ సిద్ధాంతానికి ద్రోహం చెయ్యడంగా బి‌జే‌పి ఆరోపిస్తుంది. అసలు బి‌జే‌పి ఏనాడో హిందూత్వను వదిలి పెట్టి అవినీతికి,…

దళిత వంటను ఆ పిల్లలు ముట్టుకోలేదు, ఆమె ఉద్యోగం పోయింది!

భారత రాజ్యాంగం కుల వివక్షను రద్దు చేసింది. అలాగే అంటరానితనాన్ని కూడా రద్దు చేసింది. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 యేళ్ళు గడిచినా కూడా భారత సమాజం రాజ్యాంగంలో పొందు పరిచిన సామాజిక విలువలను గౌరవించేందుకు సిద్ధంగా లేదు. ఉత్తర ఖండ్ లోని ఒక స్కూల్ పిల్లలు దళిత మహిళ వంట చేసిందన్న కారణంతో ఆ స్కూల్ లో వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని తినడం మానేశారు. స్కూల్ భోజనం తినడానికి బదులు తమ ఇళ్ల నుండి…

రిపేర్ ఖర్చు పెట్టలేక టెస్లా ఎలక్ట్రిక్ కారు పేల్చేసిన ఓనర్!

ఇది ఫిన్లాండ్ దేశంలో జరిగింది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టింది పేరు. ఎలాన్ మస్క్ ఈ కంపెనీ వ్యవస్ధాపకుడు. టెస్లా కంపెనీకి సి‌ఈ‌ఓ ఆయనే.  ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం కంపెనీల యజమాని మార్క్ జుకర్ బర్గ్ వాట్సప్ ప్రైవసీ పాలసీలో మార్పులు చేశాక, వాట్సప్ ని మొబైల్ ఫోన్ల నుండి తీసేసి దాని బదులు సిగ్నల్ అప్లికేషన్ ను ఇన్స్టాల్ చేసుకోమని యూజర్లకు ట్విట్టర్ ద్వారా సలహా ఇవ్వడం లాంటి చర్యలు, ప్రకటనల ద్వారా…

కర్ణాటక: క్రైస్తవ పుస్తకాలు తగలబెట్టిన హిందుత్వ గ్రూపులు

ఇప్పుడిక క్రైస్తవుల వంతు వచ్చింది. దేశంలో ఓ పక్క ముస్లింలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలో ఏడాది నుండి క్రైస్తవుల పైనా చర్చిల పైనా వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కోలార్ జిల్లాలో శ్రీనివాస్ పురా లో హిందుత్వ కి చెందిన రైట్ వింగ్ గ్రూప్ కార్యకర్తలు నలుగురు క్రైస్తవ యువకుల పైన దాడి చేశారని ఇండియన్ ఎక్స్^ప్రెస్, NDTV తెలిపాయి. ఈ నలుగురు క్రైస్తవ మత పుస్తకాలను ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సంస్థల…

గుజరాత్ హైకోర్టు: జనం ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు?

ప్రజల ఆహార అలవాట్లపై నిర్బంధం విధించాలని ప్రయత్నిస్తున్న హిందూత్వ పాలకులకు గుజరాత్ హై కోర్టు కాస్త గడ్డి పెట్టింది. అహ్మదాబాద్ మున్సిపాలిటీలో మాంసాహారం అమ్ముతున్న తోపుడు బండ్ల ను మునిసిపాలిటీ స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రజలు ఏ ఆహారం తినాలో నిర్ణయించే అధికారం పాలకులకు లేదని తేల్చి చెప్పింది. స్వాధీనం చేసుకున్న తోపుడు బండ్లను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. “మీరు మాంసాహారం భుజించరు. అది మీ దృక్పధం. కానీ జనం ఏమి…

అంబేద్కర్ రచనల ప్రచురణ నిలిపివేత, సుమోటు కేసు నమోదు

మహారాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలను ప్రచురించే ప్రాజెక్టును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మహారాష్ట్ర ప్రాంతీయ పత్రిక లోక్ సత్తా ఒక వార్త ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు వార్తను పరిగణలోకి తీసుకున్న బొంబే హై కోర్టు, ప్రచురణ ప్రాజెక్టు నిలిపివేయడాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా సుమోటుగా డిసెంబర్ 1 న స్వీకరించింది. మరాఠీ పత్రిక లోక్ సత్తా నవంబర్ 24 తేదీన అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రచురణను నిలిపివేసిన…