అమెరికా అంతటా విస్తరిస్తున్న వాల్‌స్ట్రీట్ వ్యతిరేక ఆందోళనలు

అమెరికాలొ వాల్‌స్ట్రీట్ కంపెనీల దోపిడికి, వాల్‌స్ట్రీట్ కంపెనీలకు సహకరిస్తున్న పాలకుల విధానాలకూ వ్యతిరేకంగా అమెరికన్లు సాగిస్తున్న ఆందోళనలు అక్టోబరు 4 తేదీతో 19 వ రోజుకి చేరుకున్నాయి. సెప్టెంబరు 17 తేదీన న్యూయార్క్ లో కొద్దిమందితో మొదలైన “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమించండి” ఉద్యమం, క్రమంగా ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. అస్ధిర ఆర్ధిక వ్యవస్ధపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కార్పొరేట్ కంపెనీల అత్యాశను నిరసిస్తూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల శాఖలను ప్రదర్శనలు, ఆందోళనలతో…

ఆ చట్టం ఆమోదిస్తే ‘వాణిజ్య యుద్ధం’ తప్పదు, అమెరికాకి చైనా హెచ్చరిక

చైనా కరెన్సీ విలువ పెంపుదలపై అమెరికా కాంగ్రెస్ చట్టం చేయాలని పూనుకోవడాన్ని చైనా తీవ్రంగా ఖంచించింది. చైనా కృత్రిమంగా తన కరెన్సీ యువాన్ విలువను అతి తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదని అమెరికా గత రెండు సంవత్సరాలుగా ఆరోపిస్తోంది. యూరప్, ఇండియాలు కూడా చైనాపైన ఇదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అమెరికా అంత దూకుడుగా వ్యవహరించడం లేదు. చైనా కరెన్సీ యువాన్ విలువను తక్కువ విలువ వద్ద ఉంచడం వలన చైనా సరుకుల ధరలు తక్కువగా ఉంటున్నాయని దానితో అది…

ఎస్.బి.ఐ డౌన్ గ్రేడ్ తో భారత షేర్ల పతనం

ఇండియా షెర్ మార్కెట్ సూచి బి.ఎస్.ఇ సెన్సెక్స్, గత ఐదు వారాల్లో మరోసారి 16,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మూడీస్ ఇన్‌వెస్టర్స్ సర్వీస్ సంస్ధ, దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటింగ్ తగ్గించడంతో దాని ప్రభావం షేర్లపై పడింది. వరుసగా మూడవరోజు పతనమైన సెన్సెక్స్ మంగళవారం 286.59 పాయింట్లు (1.77 శాతం) నష్టపోయి 15745.43 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 1.6 శాతం నష్టపోయి 4772.15 పాయింట్ల వద్ద ముగిసింది.…