లిబియా ప్రజలకు ‘నాటో’ ప్రసాదించిన ప్రజాస్వామ్యం -కార్టూన్

గడ్డాఫీని కూలదోసి లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు అనే గొప్ప ప్రజాస్వామ్య దేశాలు నడుం బిగించాయి. నాటో యుద్ధ విమానాలు లిబియాపై బాంబుదాడులు చేసి ప్రజలను చంపినా, అది వారిని కాపాడడానికే. గడ్డాఫీ బతికున్నంతవరకూ లిబియాను ఆయననుండి కాపాడ్డానికీ, లిబియా ప్రజలకు ప్రజాస్వామ్యం ప్రసాదించడానికి బాంబుదాడులు చేస్తూ ప్రజలు చంపుతూనే ఉంటాయట! కాని అది ప్రజలను గడ్డాఫీనుండి కాపాడ్డానికేనంటే నమ్మాలి మరి, తప్పదు! ఎందుకంటే చెప్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు గనక. అమెరికా,…

ఇరాన్, వెనిజులా సంబంధాలపై మితవాదుల అనుమానాలు -కార్టూన్

ఆర్ధిక సూత్రాలకు సంబంధించినంతవరకూ మితవాదులంటే ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ సౌకర్యాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలని గుదిబండలని చెబుతూ ప్రవేటోళ్ళకి అమ్మేయాలనడం, ప్రభుత్వం ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వనవసరం లేదనడం, ఒక పద్ధతిలో ఆర్ధిక వ్యవస్ధను నిర్వహించుకోవడాన్ని తిరస్కరిస్తూ అంతా మార్కెట్లో ఉండే ప్రవేటు బహుళజాతి గుత్త సంస్ధల ఇష్టాయిష్టాలకి వదిలేయాలని ప్రభోధించడం. ఒక్క ముక్కలో చెప్పాలంటె మితవాదం ప్రజల సుఖ సంతోషాలకు వ్యతిరేకం, కోటీశ్వరులు లేదా బిలియనీర్ల ధనదాహానికి అనుకూలం. చూశారా, చూశారా! ఇరాన్ ఇచ్చిన…

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లకు ఇరాన్ ఆయుధాల సరఫరా -అమెరికా

ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్‌లలో అమెరికా సైనికులపై పోరాటం చేస్తున్న వారికి ఇరాన్‌కి చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (ఐ.ఆర్.జి.సి) ఆయుధాలు, మందుగుండు సరఫరా చేస్తున్నదని అమెరికా శనివారం వెల్లడించింది. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లనుండి అమెరికా సేనలు త్వరగా వెళ్ళిపోవడానికి ఇరాన్ ఈ విధంగా చేస్తున్నదని అమెరికా అధికారులు చెప్పారు. అయితే ఇరాన్ ఈ సమాచారాన్ని కొట్టిపారేసింది. అమెరికా సైనికులను సుదీర్ఘకాలం పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో కొనసాగించాలని, అమెరికా భావిస్తోంది. దానికోసమే ఇరాన్‌పై ఇలాంటి కధలు ప్రచారం…

ఇండియా విదేశీ మారక ద్రవ్య నిల్వలు $309.02 బిలియన్లు

భారత దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 24 తో ముగిసిన వారంలో అంతకు ముందు వారం కంటె తగ్గిపోయాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. జూన్ 17 నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 310.562 బిలియన్ డాలర్లు ఉండగా జూన్ 24 నాటికి 309.020 బిలియన్ డాలర్లకు తగ్గాయని ఆర్.బి.ఐ శుక్రవారం తెలిపింది. విదేశీ మారక ద్రవ్యంలో ఐ.ఎం.ఎఫ్ లో ఇండియాకు ఉండే ఎస్.డి.ఆర్ హోల్డింగ్స్ కూడా కలిసి ఉంటాయి. విదేశీ మారక…

భారత దేశానికి ఆయిల్ సరఫరాలో ఆటంకాలు రానివ్వం -ఇరాన్

భారత దేశ ఆయిల్ రిఫైనరీలు పాత బాకీలు చెల్లించనట్లయితే వాటికి ఆయిల్ సరఫరాను ఆగష్టు నెలనుండి బంద్ చేస్తామని ప్రకటించిన ఇరానియన్ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ “నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ” (ఎన్.ఐ.ఒ.సి), భారత దేశానికి సరఫరా చేయడంలో ఆటంకాలు రానివ్వబోమని ప్రకటించింది. ఇండియా ఆయిల్ రిఫైనరీలు తమకు 2 బిలియన్ డాలర్లు బకాయి ఉన్నాయనీ అది చెల్లించడానికి తగిన మార్గాన్ని త్వరగా చూపనట్లయితే ఆయిల్ సరఫరా ఆపడం తప్ప మరొక మార్గం లేదని ఎన్.ఐ.ఒ.సి ప్రకటించిన…

అంతర్జాతీయ న్యాయస్ధానం నిర్ణయాన్ని తిరస్కరించిన లెబనాన్ హిజ్బొల్లా

లెబనాన్ మాజీ ప్రధాని రఫిక్ హరిరి హత్య కేసులో నలుగురు హిజ్బొల్లా నాయకులపై కోర్టు విచారణ జరగడానికి అంతర్జాతీయ న్యాయస్ధానం (ఐ.సి.సి) ఆమోదించడాన్ని హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా తిరస్కరించాడు. రఫిక్ హరీరి 2005లో బాంబు దాడిలో హత్యకు గురయ్యాడు. “గౌరవనీయులైన సోదరులను” ప్రపంచంలో ఏ శక్తీ అరెస్టు చేయలేదని నజ్రల్లా స్పష్టం చేశాడు. ఐ.సి.సి ట్రిబ్యునల్ విచారణకు నిర్ణయించిన నలుగురిని 30 రోజుల్లోగా అప్పగించాలని కోరింది. ఐక్యరాజ్య సమితి నియమించిన “లెబనాన్ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్”…