2జి కుంభ కోణం: సుప్రీం కోర్టు తీర్పుకు అర్ధం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా పని చేసిన 2జి కుంభకోణంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. 2011 లో మొదటి అరెస్టు జరిగిన ఈ కేసు విచారణ 6 సంవత్సరాల లోనే పూర్తి కావడం బహుశా -భారతీయ కోర్టుల సంప్రదాయం ప్రకారం- ఒక రికార్డు కావచ్చుఁ.  2008 లో కాగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన 2జి కుంభకోణం 2009 – 10 నాటికి భారీ 1.76 లక్షల కోట్ల భారీ కుంభకోణంగా దేశ ప్రజల దృష్టికి…

పార్లమెంటుకి భారీ ముప్పు -కార్టూన్

రానున్న పార్లమెంటు సమావేశాలకు మరో భారీ ముప్పు పొంచి ఉంది. బడ్జెట్ సెషన్ రెండు విడత సమావేశాలను 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మరోసారి ముంచెత్తనుంది. కుంభకోణంపై చాసో నాయకత్వంలో ప్రభుత్వం నియమించిన జాయింట్ పార్లమెంటు కమిటీ (జె.పి.సి) తన నివేదిక ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టనుండడమే ఆ ముప్పు. అదీ కాక మిత్రుల దూరంతో బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం కాంగ్రెస్ కు కష్టం కావచ్చు. అందుకోసం కొన్ని లొంగుబాట్లు అవసరం పడవచ్చు. స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రధాని తప్పేమీ లేదని,…

వేలం పద్ధతే గీటురాయి కాదు, సహజ వనరుల దోపిడీకి సుప్రీం కోర్టు బాసట!

2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల రద్దు సందర్భంగా తానిచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పునర్నిర్వచించింది. 2జి తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకు మాత్రమే వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ పై తీర్పు చెబుతూ సుప్రీం కోర్టు గురువారం ఈ వివరణ ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఎస్.హెచ్.కపాడియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం గురువారం తన తీర్పు ప్రకటిస్తూ ‘సహజ వనరులను వేలం వేయాలన్న’ తన 2జి తీర్పు ఇతర సహజ…

2జి స్పెక్ట్రం: జనవరి 11 లోపు వేలం వేయండి, లేదా… -సుప్రీం కోర్టు

2జి స్పెక్ట్రమ్ వేలం వేయడాన్ని పదే పదే వాయిదా వేయడం పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆగస్టు 31 తో వేలం పూర్తి కావాలని సుప్రీం కోర్టు విధించిన గడువును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నిస్తూ జనవరి 11, 2013 లోపు వేలం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించింది. జనవరి 18 కల్లా వేలంలో విజయం సాధించిన కంపెనీల జాబితా తనకు సమర్పించాలని కోరింది. లేనట్లయితే సంబంధిత అధికారులపై…

2జి కుంభకోణం: లక్ష 76 వేల కోట్ల కాగ్ అంచనా కూడా తక్కువేనా?

సహజ వనరు అయిన 2జి స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా స్వదేశీ, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇష్టారీతిన పంచి పెట్టడం వలన భారత ప్రభుత్వ ఖజానాకు గరిష్టంగా 1,76,645 కోట్ల నష్టం వచ్చిందని ‘కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్’ (సి.ఎ.జి) 10 నవంబర్, 2010 తేదీన నివేదిక వెలువరించింది. కాగ్ నివేదిక అంచనా వేసిన మొత్తం భారీగా ఉండడంతో పత్రికలు దానిని సంచలనం చేశాయి. అప్పటి నుండీ ఏదో ఒక రూపంలో (కేసులు, ఖండన మండన ప్రకటనలు, నీరా…

2జి: కేంద్రం U-టర్న్ (గ్రాఫిక్)

2జి స్పెక్ట్రం కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం యు-టర్న్ తీసుకుంది. ప్రవేటు టెలికం కంపెనీలు అక్రమంగా పొందిన లైసెన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు తీర్పు పై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను ఉపసంహరించు కోవాలని నిర్ణయించింది. ప్రవేటు కంపెనీలు పొందిన 122 అక్రమ లైసెన్సులను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012 తేదీన ఇచ్చిన తీర్పులో రద్దు చేసింది. దేశ సహజ వనరుల విషయంలో మొదట వచ్చినవారికి మొదట లైసెన్సు లు కేటాయించే పద్ధతి…

అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ…

రాజీనామాకు సిద్ధపడిన హోం మంత్రి పి.చిదంబరం

2జి స్పెక్ట్రం కుంభకోణంపై జరుగుతునన్ విచారణ కాంగ్రెస్ పునాదులను పెకలిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్ధానాన్ని పొంది ఉన్న హోం మంత్రి పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. తమ నాయకురాలు సోనియా గాంధిని కలిసిన పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేస్తానని కోరినట్లుగా తెలుస్తొంది. టి.వి ఛానెళ్ళు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. సోనియాతో జరిగిన 20 నిమిషాల సమావేశంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా అవి ప్రసారం చేస్తున్నాయి. అయితే…

2జి స్పెక్ట్రం కుంభకోణంలో పీకలలోతుల్లో చిదంబరం?

కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం మెడ చుట్టూ 2జి స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల కేటాయింపు కుంభకోణం ఉరి బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రికి రాసిన నోట్‌ను బట్టి స్పెక్ట్రం ధరలను అతి తక్కువగా నిర్ణయించడంలో చిందంబరం పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు బలపడుతున్నాయి. ఆర్ధిక మంత్రిత్వ శాఖనుండి ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన రహస్య నోట్ పైన ఆధారపడి జనాతా పార్టీ నేత సుబ్రమణ్య స్వామి,…

2జి స్పెక్ట్రం కేటాయింపులపై చిదంబరం ప్రధానికి రాసిన నోట్ ఇదే

2జి స్పెక్ట్రం కేటాయిస్తూ అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా 122 లైసెన్సులు జారీ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు జారీ చేసిన ఐదు రోజుల తర్వాత చిదంబరం ప్రధానికి ఈ నోట్ పంపాడు. దానిలో జరిగింది వదిలేద్దామని, ఇక ముందు జాగ్రత్తపడదామనీ చిదంబరం, ప్రధానికి సూచించాడు. వాస్తవానికి అప్పటికి ప్రధాని, ఆర్ధిక మంత్రి తలచుకున్నట్లయితే ఎ.రాజా లైసెన్సులు జారీ చేయకుండా అడ్డుకోగల అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జనవరి 10 నాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్…

ఎ.రాజా 2జి స్పెక్ట్రం కేటాయింపులు చిదంబరం, మన్మోహన్‌లు తెలిసీ అమోదించారు

2జి స్పెక్ట్రం లైసెన్సులను అతి తక్కువ ధరలకు కేటాయించిన విషయం అప్పటి ఆర్ధిక మంత్రి, ప్రధాని మన్మోహన్ లకు తెలిసే జరిగిందని ఫస్ట్ పోస్ట్ వెల్లడించిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఆర్.టి.ఐ చట్టం ద్వారా ఫస్ట్ పోస్ట్ వెబ్ మ్యాగజైన్ ప్రధాన మంత్రికి 2జి కేటాయింపులపై చిదంబరం రాసిన నోట్‌ను సంపాదించింది. 122 2జి స్పెక్ట్రం లైసెన్సులను వివాదాస్పద రీతిలో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా కేటాయించిన ఐదురోజుల తర్వాత చిదంబరం ఒక నోట్ ను ప్రధానికి…

లేదు లేదంటూనే ప్రధాని, చిదంబరంలను మళ్ళీ కోర్టులో ప్రస్తావించిన ఎ.రాజా

సోమవారం కోర్టులో తాను ప్రధాని మన్మోహన్, మాజీ అర్ధిక మంత్రి, ప్రస్తుత హోం మంత్రి చిదంబరం లకు వ్యతిరేకంగా ఆరోపణలను చేశాననడం మీడియా సృష్టి అవి చెబుతూ, మీడియాను చేస్తే సరిగా రిపోర్టు చేయమనండి లేదా బైటికి పంపించండి అని మంగళవారం జడ్జిని కోరిన మాజీ టెలికం మంత్రి ఎ.రాజా, మళ్ళీ మన్మోహన్, చిదంబరం ల పేర్లను తన వాదనలో ప్రస్తావించాడు. సోమవారం కంటే ఈ సారి కాసింత నేరుగానే వారిపై ఆరోపణలు సంధించే ప్రయత్నం చేశాడు.…

2జి కుంభకోణం: మంత్రివర్గంలో రాలిపడే తదుపరి తల కపిల్ సిబాల్?

2జి స్పెక్ట్రం కుంభకోణం ఫలితంగా కేంద్ర మంత్రివర్గం నుండి దొర్లిపడే తదుపరి తల విద్యా, టెలికం శాఖల మంత్రి కపిల్ సిబాల్‌ది కావచ్చనడానికి తగిన పరిణామాలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. మాజీ టెలికం మంత్రి, డి.ఎం.కె పార్టీ నాయకుడు ఎ.రాజా, సి.బి.ఐ దర్యాప్తు ఫలితంగా జైలు పాలు కావడంతో ఆయన స్ధానంలో కపిల్ సిబాల్ టెలికం శాఖ బాధ్యతలు చేపట్టాడు. ఆయన వచ్చీ రావడంతోనే 2జి స్పెక్ట్రం కేటాయింపుల్లో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి) నివేదించినట్లు, కేంద్ర ప్రభుత్వం…

2జి కుంభకోణంలో రాలిపడిన రెండో తల, కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి దయానిధి మారన్ రాజీనామా

2జి స్పెక్ట్రం కుంభకోణంలో రెండో తలకాయ రాలిపడింది. బుధవారం సుప్రీం కోర్టుకి సి.బి.ఐ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖా మంత్రి దయానిధి మారన్ పాత్రపై వివరాలు పొందుపరిచిన సంగతి విదితమే. చెన్నైకి చెందిన శివరామ కృష్టన్, తన ఎయిర్ సెల్ కంపెనీ లోని మెజారిటీ షేర్లను మలేషియాకి చెందిన మేక్సిస్ కంపెనీకి అమ్మేలా ఒత్తిడి చేశాడనీ, తద్వారా మేక్సిస్ కంపెనీ చేత తన కుటుంబానికి చెందిన సన్ టి.వి లో 600 కోట్ల…