అప్పు, లోటులతో దివాళా వాకిట అమెరికా ఆర్ధిక వ్యవస్ధ

ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అయిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా వాకిట నిలబడి ఉంది. 2007-08 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభం లాగానే మరో అర్ధిక సంక్షోభం ముంగిట వణుకుతూ నిలుచుంది. మరో ఆర్ధిక మాంద్యం (రిసెషన్) నుండి తప్పించుకోవడానికి అమెరికా కాంగ్రెస్, సెనేట్లలో రిపబ్లికన్లు, డెమొక్రట్లు సిగపట్లు పడుతున్నారు. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికీ, అప్పు పరిమితిని పెంచుకోవడానికి ఓ అంగీకారానికి రావడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. అప్పు పరిమితి పెంపుపై ఒబామా హెచ్చరికలు, బడ్జెట్ లోటు తగ్గింపుపై…

యూరోనుండి గ్రీసు తప్పుకుంటుందని పుకార్లు, యూరో విలువ పతనం

అప్పు సంక్షోభంలో ఉన్న గ్రీసు యూరోను ఉమ్మడి కరెన్సీగా రద్దు చేసుకుని స్వంత కరెన్సీ పునరుద్ధరించుకోనుందన్న పుకార్లు వ్యాపించడంతో యూరో విలువ ఒక శాతానికి పైగా పడిపోయింది. గత సంవత్సరం మే నెలలో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ ల నుండి 110 బిలియన్ యూరోల సహాయ ప్యాకేజిని అందుకున్న గ్రీసు ఆ ప్యాకేజీతో పాటు కఠినమైన షరతులను అమలు చేయాల్సి వచ్చింది. షరతుల్లో భాగంగా ప్రజలపైన భారం మోపుతూ పొదుపు విధానాలను అమలు చేయడం ప్రారంబించింది. అనేక ప్రభుత్వ…

ఐ.ఎం.ఎఫ్, ఇ.యుల బెయిలౌట్‌తో రిసెషన్‌లోకి జారనున్న పోర్చుగల్

గ్రీసు, ఐర్లండ్‌ దేశాల తర్వాత పోర్చుగల్ అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి విదితమే. ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్ధిక సహాయ నిధి నుండి బెయిలౌట్ ప్యాకేజి పొందే అవసరం లేదని పోర్చుగల్ మొదట చెప్పినప్పటికీ, పార్లమెంటులో బడ్జెట్ బిల్లు ఓడిపోయి ప్రభుత్వం కూలిపోవడంతో బాండ్ మార్కెట్లో పోర్చుగల్ సావరిన్ అప్పుపై వడ్డీ పెరిగిపోయి అప్పు సేకరించడం అసాధ్యంగా మారిపోయింది. దానితో అనివార్యంగా పోర్చుగల్ ఆపద్ధర్మ ప్రధాని జోస్ సోక్రటీసు గత నెల ప్రారంభంలో…

వరుసగా తొమ్మిదో రోజూ నష్టపోయిన ఇండియా షేర్ మార్కెట్

భారత ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు వరుసగా తొమ్మిదో రోజూ నష్టాలను చవి చూశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ వడ్డీరేట్లు పెంచడం, వడ్డీ రేట్ల పెంపుదల లాభాల తగ్గుదలకు దారీతీస్తుందన్న భయాలూ, వీటితో పాటు ఆయిల ధరలు అన్నీ కలిసి ఇండియా మార్కెట్లలొ షేర్ల అమ్మకాల వత్తిడి పెరగడానికి దారి తీశాయి. ద్రవ్య సంస్ధలు, టెక్నాలజీ షేర్లు ఎక్కువగా నష్యపోయాయి. ఎయిర్ టెల్ షేరు 3.2 శాతం నష్టపోయింది. ఎయిర్ టెల్ కి చెందిన…

ఆర్.బి.ఐ ద్రవ్యవిధానం దెబ్బకి భారీగా నష్టపోయిన ఇండియా షేర్‌మార్కెట్

భారత ద్రవ్య విధానం సమీక్షలో రెపో, రివర్స్ రెపో రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేరకు ఆర్.బి.ఐ పెంచడంతో ప్రధాన షేర్ మార్కెట్ సూచికలు భారీగా నష్టపోయాయి. బోంబే స్టాక్‌ ఎక్ఛేంజి (సెన్సెక్సు) 463.33 పాయింట్లు (2.44 శాతం) నష్టపోయి 18,534.69 వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజి 136.05 పాయింట్లు (2.39 శాతం) నష్టపోయి 5,565.25 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వరుసగా ఏడురోజుల పాటు నష్టపోవడం నవంబరు 2008 తర్వాత ఇదే మొదటిసారి అని…

వడ్డీరేట్లు మళ్ళీ పెంచిన ఆర్.బి.ఐ, ద్రవ్యోల్బణం పైనే దృష్టి

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్కు వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. విశ్లేషకుల అంచనాల కంటే ఎక్కువగా పెంచడంద్వారా దేశంలో ద్రవ్యోల్బణం ప్రమాదకర స్ధాయిలో ఉన్న విషయాన్ని తెలియజెప్పింది. దాంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గించడమే తన ద్రవ్యవిధానం ప్రధాన కర్తవ్యమని చాటి చెప్పింది. ప్రతి సంవత్సరం ద్రవ్యవిధానాన్ని అర్.బి.ఐ నాలుగు సార్లు సమీక్షిస్తుంది. ద్రవ్యోల్బణం కట్టడి కావడానికి అవసరమైతే అంతకంటే ఎక్కువ సార్లు కూడా సమీక్షించడానికి ఆర్.బి.ఐ గత సంవత్సరం నిర్ణయించింది. తాజాగా మంగళవారం…

హాంకాంగ్‌లో మొట్టమొదటి సారిగా “కనీస వేతన చట్టం”

హాంకాంగ్‌లో మొదటిసారిగా కనీస వేతన చట్టం ప్రవేశపెట్టారు. 125 వ అంతర్జాతీయ కార్మిక దీక్షా దినోత్సవం రోజున హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌ను 1997 లో బ్రిటిష్ చేతినుండి చైనా ఆధీనంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య బ్రిటన్ పాలనలో శ్రమ చేసే ప్రజలకు కనీస వేతన చట్టం లేకపోవడంతోటే బ్రిటన్‌కి ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవం తెలుపుతోంది. ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేయాలని ఈ బ్రిటన్ లాంటి దేశాలు చైనాను డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో,…

యూరోజోన్ లోనూ దౌడు తీస్తున్న ద్రవ్యోల్బణం

17 యూరప్ దేశాల యూరోజోన్ లో ద్రవ్యోల్బణం మార్చి నెలకంటే మరికాస్త పెరిగింది. యూరోస్టాట్ అధికారిక అంచనా ప్రకారం యూరోజోన్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.7 శాతం నమోదు కాగా, అది ఏప్రిల్ నాటికి 2.8 శాతానికి పెరిగింది. మార్చితో పోలిస్తే ఏప్రిల్ పెరుగుదల స్వల్పంగా కనిపించినా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) విధించుకున్న పరిమితితో పోలిస్తే ఎక్కువే. ఇసిబి అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం 2 శాతానికి మించితే సమస్యలు తప్పవు. ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండటానికి ఈ…

చైనాలో ప్రైవేటురంగ ఆధిపత్యం ఒక మిధ్య

చైనా ఆర్ధిక వ్యవస్ధలో ఏ రంగ ఆధిపత్యం వహిస్తోంది? ప్రభుత్వ రంగమా? ప్రైవేటు రంగమా? గత 35 సంవత్సరాలనుండి చైనా సంస్కరణలను అమలు చేస్తున్నది గనక అక్కడ ప్రవేటు రంగానిదే ఆధిపత్యం అని అందరూ భావిస్తున్నారు. కాని వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చైనా ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తున్నమాట వాస్తవమె. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా పునరుద్ధరింపబడిన వార్తా వాస్తవమే. కానీ చైనాలో ఇంకా ప్రభుత్వ రంగ పెట్టుబడీదారీ విధానమే ఆధిపత్యంలో ఉందన్న విషయం చాలా…

ఆసియా దేశాల ఆర్ధికాభివృద్ధికి ఆహారధరలు ఆటంకం -ఏడిబి

ఇప్పటివరకు అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ఆర్ధికాభివృద్ధికి పెను సవాళ్ళు ఎదురు కానున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. ఆహార ధరలు అంతకంతకూ పెరుగుతు పోతుండడం వలన ఇప్పటికే బలహీనమైన కోలుగోలు శక్తితో దరిద్రం అనుభవిస్తున్న పేదల పరిస్ధితి మరింతగా దిగజారుతుందని ఎడిబి తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆసియా దేశాల జిడిపి కనీసం 1.5 శాతం మేర తగ్గే అవకాశం…

ద్రవ్యోల్బణానికి కొత్త వైద్యం, ఇండియా ఆర్ధికవృద్ధిపై అంచనా తగ్గించుకున్న అంతర్జాతీయ సంస్ధలు

గత రెండు మూడేళ్ళుగా ఇండియాను పీడిస్తున్న ద్రవ్యోల్బణానికి ప్రభుత్వం కొత్త వైద్యం ప్రకటించింది. గతంలో ప్రకటించిన కారణాలు, వాటికి ప్రతిపాదించిన వైద్యాలు ఇప్పటివరకూ ఏవీ పని చేయలేదు. అదిగో తగ్గుతుంది, ఇదిగో తగ్గింది అనడమే తప్ప ద్రవ్యోల్బణం తగ్గించి ప్రజలకు సరుకులను అందుబాటులోకి తెచ్చే ఆచరణాత్మక కార్యక్రమం ఇంతవరకు చేపట్టింది లేదు. ఎంతసేపూ జిడిపి వృద్ధి రేటు తప్ప మరో ధ్యాస లేని ప్రభుత్వానికి ఆ జిడిపి వృద్ధి పైనే అంతర్జాతీయ సంస్ధలు భారత ప్రభుత్వానికి షాకిచ్చాయి.…

భారత్ ను భయపెడుతున్న ఆహార, ఆయిల్ ద్రవ్యోల్బణాలు

భారత దేశానికి ద్రవ్యోల్బణం బెడద మరో సంవత్సరం తప్పేట్టు లేదు. జి.డి.పి వృద్ధి రేటులో చైనా తర్వాత అత్యధిక వేగవంతమైన పెరుగుదలను నమోదు చేస్తున్న ఇండియాకు ద్రవ్యోల్బణం గత ఒకటిన్నర సంవత్సరం నుండి వెంటాడుతోంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం, ఆయిల్ (ఇంధనం) ద్రవ్యోల్బణంలు ఏప్రిల్ 9 తేదితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో పెరుగుదలను నమోదు చేసాయి. ద్రవ్యోల్బణం నియంత్రించడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ఎనిమిది సార్లు బ్యాంకు రేట్లను పెంచింది. మార్చితో ముగిసే…

అమెరికా అప్పు చెల్లింపు సామర్ధ్యంపై అనుమానాలు, అంచనా తగ్గించిన ఎస్ & పి

ప్రముఖ రేటింగ్ సంస్ధ అమెరికా అప్పు రేటింగ్ పై తన అంచనాను తగ్గించింది. ఇప్పటివరకు “స్ధిరం” గా ఉన్న అంచనాను “నెగటివ్” గా మార్చింది. దానర్ధం మరో రెండు సంవత్సరాల్లొ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని అర్ధం. అయితే ఆ లోపు పరిస్ధితి మారినట్లయితే అంచనాను మళ్ళీ “స్ధిరం” గా మారే అవకాశాలు లేకపోలేదు. అమెరికా ప్రభుత్వ ఖర్చును తగ్గిస్తూ పొదుపు చర్యలతో కూడిన బడ్జెట్ కోత బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించకపోవచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి.…

ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి…

బ్యాంకు రిజర్వు రేట్లను మళ్ళీ పెంచిన చైనా

చైనా మరోసారి రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును పెంచింది. ద్రవ్యోల్బణం రికార్టు స్ధాయిలో 5.4 శాతానికి చేరుకోవడంతో చైనా మార్కెట్ల్లొ చలామణీలో ఉన్న డబ్బును నియంత్రించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటివరకు 20 శాతంగా ఉన్న రిజర్వు రిక్వైర్ మెంట్ రేటును (ఆర్.ఆర్.ఆర్) 20.5 శాతానికి పెంచింది. వాణిజ్య బ్యాంకులు తాము సేకరించీన్ డిపాజిట్లలొ రిజర్వు డబ్బుగా అట్టి పెట్టవలసిన డబ్బు శాతాన్ని రిజర్వు రిక్వైర్ మెంటు శాతం అంటారు. ఇండియాలొ దీన్ని సి.ఆర్.ఆర్ (క్యాష్ రిజర్వు రేషియో)…